టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Sun, Dec 25 2016 7:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

today updates

  • నేడు బెంగళూరులో జరిగే 89వ భారత్‌ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
  •  

    • క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు

     

    • నేడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పార్టీ నేతలు

     

    • వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. నేడు జిల్లాలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న వైఎస్ జగన్

     

    • న్యూఢిల్లీ: నేటి నుంచి డిజిటల్ లక్కీ డ్రా ప్రారంభం. నేటి నుంచి 100 రోజులపాటు ప్రతిరోజు, ప్రతివారం లక్కీ డ్రాలు తీస్తారు

     

    • నేటి ఉదయం 11 గంటలకు రేడియో కార్యక్రమం మన్ కీబాత్‌లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

     

    • నేడు గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. పెదకాకాని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు

     

    • నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్న టీజేఏసీ నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై కార్యాచరణ ఉంటుందన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్
    • సిద్ధిపేట జిల్లాలో నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం. తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

     

    • నేడు క్రిస్మస్ పర్వదినం సదర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ

     

    • విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో కొనసాగుతోన్న కూచిపూడి నాట్యోత్సవాలు. నేడు ఏడు వేల మందితో మహా బృంద నాట్యం. 'జయము జయము' గీతానికి గిన్నిస్ రికార్డ్ దక్కే అవకాశం

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement