పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ | will not leave tax evaders at any cost, say narendra modi | Sakshi
Sakshi News home page

పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ

Published Sat, Nov 12 2016 1:15 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ - Sakshi

పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ

ఇన్నాళ్లుగా దోపిడీ చేసిన సొమ్మును ఇప్పుడు తిరిగి రాబడుతున్నామని, ఇప్పటివరకు రూ. 45 వేల కోట్ల నగదు డిపాజిట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జపాన్‌లోని కోబె నగరంలో ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నవారందరికీ సెల్యూట్ అని చెప్పారు. ఇది ఎవరినో ఇబ్బందిపెట్టడానికి తీసుకున్న నిర్ణయం కాదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మాత్రం సహకరిస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని చాలా రహస్యంగా ఉంచామన్నారు. పన్ను ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదని, నిజాయితీపరులను రక్షించడం మాత్రం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇన్నాళ్లూ గంగానదితో పుణ్యానికి ఒక్క రూపాయి కూడా వేయనివాళ్లు సైతం ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లు విసిరేస్తున్నారంటూ చమత్కరించారు. 
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement