
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను ఇకపై పూర్తిగా ఉద్యోగినులే నిర్వహించనున్నారు. స్త్రీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ స్టేషన్లో టికెట్ తనిఖీ, ఆర్పీఎఫ్, రిజర్వేషన్ కార్యాలయం తదితర అన్ని విభాగాల్లోని ఉద్యోగాల్లోనూ మొత్తం మహిళలనే నియమించినట్లు వాయవ్య రైల్వే అధికారి చెప్పారు. శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్లను ఈ స్టేషన్లో ఏర్పాటు చేశారు. గాంధీనగర్ స్టేషన్ గుండా రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.