
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇదే విషయాన్ని అందరూ కలసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ నేతలకు శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.