టీడీపీకి ఓటేయలేదని ఐదేళ్లుగా బహిష్కరణ..! | Dalit Family Social Boycott By TDP Leaders In East Godavari | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ

Published Tue, May 7 2019 7:43 PM | Last Updated on Tue, May 7 2019 7:54 PM

Dalit Family Social Boycott By TDP Leaders In East Godavari - Sakshi

ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఓటు వేసినా టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు వేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు.

సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత అబేంద్కర్‌ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛను హరించారు. గత (ఏపీ అసెంబ్లీ-2014) ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశారని ఓ దళిత కుటుంబంపై పచ్చనేతలు కన్నెర్రజేశారు. అగ్రకుల దరహంకారంతో ఆ కుటుంబాన్ని గత ఐదేళ్లుగా సామాజికంగా బహిష్కరించారు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆ కుంటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఓటు వేసినా టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు వేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు.  అయితే, పోలీసుల సహకారంతో ఆ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఊరొదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తుడంటంతో దిక్కుతోచని ఆ కుటుంబం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మంగళవారం కలిసింది. తమకు న్యాయం చేయాలని వారు సీఈఓకు విన్నవించుకున్నారు. ఇక స్థానిక అధికారులు టీడీపీ నేతల ఆగడాలకు సాక్షులుగా మాత్రమే మిగిలారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement