Top Stories
ప్రధాన వార్తలు
![Tmc Mp Kalyan Banerjee Comments On Ap Cm Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/chandrababu2.jpg.webp?itok=wKjk-eJR)
లోక్సభ: చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
సాక్షి, ఢిల్లీ: లోక్సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఈడీ, సీబిఐ ఎందుకు అరెస్టు చేయలేదు.. ఆయన అవినీతిపరుడు కాదా ? అంటూ ప్రశ్నించారు. ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? అంటూ నిలదీశారు.ప్రభుత్వం ఏర్పాటు కోసం అవినీతిపరులతో చేతులు కలిపారు. చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటివారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను వాషింగ్ మిషన్లో వేసినట్లేనా?. బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీపరులుగా మారిపోయారా ?’’ అంటూ దుయ్యబట్టారు.‘‘బీజేపీకి 400 సీట్లు దాటుతాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు. టీడీపీ అగ్రనేత ఒకేరోజులో రూ.521 కోట్ల రూపాయలు సంపాదించారు.ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలి’’ అని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు.
![Mla Kolikapudi Srinivas Demolished Ysrcp Mpp Building](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/protest6.jpg.webp?itok=JTVEIUKk)
తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి అరాచకం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దుశ్చర్యకు తెరతీశారు. ఏ.కొండూరు మండలం కంభంపాడులో వైఎస్సార్సీపీ ఎంపీపీకి చెందిన భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి జేసీబీతో కూల్చేయించారు. తిరువూరు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే కొలికపూడి దిగారు. కారు ఎక్కి, హడావుడి చేస్తూ జేసీబీతో భవనాన్ని కూల్చివేయించారు.చెన్నారావు బిల్డింగ్ను కూల్చేసేందుకు బుల్డోజర్తో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సహా రోడ్డెక్కారు. బుల్డోజర్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, టీడీపీ శ్రేణులు.. పోలీసులను పక్కకు నెట్టేశారు. కొలికపూడి శ్రీనివాస్.. దగ్గరుండి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోని కొంత భాగాన్ని కూల్చివేయించారు. అధికారులు నోటీసులు కూడా ఇవ్వని భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే ధ్వంసం చేయించారు.
![CM Revanth Reddy Comments On Drug Control](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Revanthreddy_2.jpg.webp?itok=DqyDnyLI)
అలా చేస్తేనే.. సినీ ఇండ్రస్ట్రీకి సహకరిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో మాత్రమే నేరగాళ్లతో కాదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో నార్కోటిక్, సైబర్ సెక్యూరిటీ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. అనంతరం టీజీ న్యాబ్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలీస్ వ్యవస్థలో అనేక విభాగాలు ఉన్నాయి. నేరగాళ్లు ఆలోచన కూడా సాంకేతికంగా మారింది. నేరాలను నియంత్రించే క్రమంలో పోలీసులకు అన్ని వసతులు ఉండాలన్నారు.ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ సైబర్ క్రైం. రేప్లు, మర్డర్లు కంటే పెద్ద క్రైమ్గా సైబర్ క్రైం, డ్రగ్స్ మారాయి. గత 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల గల్లీ గల్లీకి గంజాయి పాకింది. కాలేజీలలో విచ్చలవిడిగా గoజాయి దొరుకుతుంది. వీటిని నియత్రించేందుకు అధికారులకు అన్ని అధికారులు ఇచ్చాం. మధ్య తరగతి పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు.సైబర్ క్రైమ్, డ్రగ్స్ కేసుల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి నగదు బహుమానంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించండి. సినిమా షూటింగ్ పర్మిషన్లకు మా దగ్గర వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు టికెట్ ధరల పెంపు కోసం మా దగ్గరకు వస్తున్నారు. డగ్స్ర్ నియంత్రణ, సైబర్ క్రైం నియంత్రణ కోసం సినిమా రంగం పని చేయాలి. థియేటర్ యజమానులు కూడా సినిమాకు ముందు డ్రగ్స్, సైబర్ క్రైంపై యాడ్స్ ప్రదర్శించాలి. అవగాహన వీడియోలు తీసి ఇస్తేనే మా తరపున సహకారం ఉంటుంది’’ అని రేవంత్ అన్నారు.
![YSRCP MP YV Subba Reddy Voice On AP Special Status In Rajya Sabha](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/YSRCP-MP-YV-Subba-Reddy.jpg.webp?itok=aBa1PPSt)
ఇది డిమాండ్ కాదు ఏపీ ప్రజల హక్కు
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను వెంటనే పూర్తి చేయాలి👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలిఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ
![Samson, Dube and Jaiswal Released From ZIM Squad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/india_0.jpg.webp?itok=hFWalnRh)
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పులు! సంజూ, దూబే ఔట్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేకు పయనమైంది.భారత జట్టులో కీలక మార్పులు..ఇక ఈ సిరీస్కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వరల్డ్కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబేలను జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రానా, సాయిసుదర్శన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా
![Maya Neelakantan: 11 Year Old Indian Rockstar Mesmerises Americas Got Talent](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/maya.jpg.webp?itok=nJc6a7fI)
11 ఏళ్లకే గిటార్తో ప్రదర్శన.. అమెరికా ప్రముఖ షోని మెస్మరైజ్ చేసింది!
జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు. Oh My GodMaya Neelakantan is only 10 years old. 10! Yes, Simon, she’s a Rock Goddess. From the land of Goddesses. We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024మాయ నీలకంఠన్ నేపథ్యం.. 11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు. ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న. (చదవండి:
![KSR Comments On Telangana Chief Minister Revanth Reddy's Speech](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Revanth_CBN.jpg.webp?itok=EUW7iH9S)
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?
రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![Rs 25 Lakh Contract: Bishnoi Gang Plan To Kill Salman Khan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/salman_0.jpg.webp?itok=o5QLyblq)
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది.
![Actor Brahmaji Praises On Kalki 2898 AD Movie Director Nag Ashwin](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Tollywood.jpg.webp?itok=VOD_FOH6)
నాగ్ అశ్విన్.. మీ చెప్పులిస్తే ముద్దు పెట్టుకుంటా: బ్రహ్మాజీ
నాగ్ అశ్విన్.. మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తప్పితే..పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది. యావత్ సినీ ప్రపంచం అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దానికి కారణంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.(చదవండి: కల్కి దెబ్బకు 'షారుఖ్ ఖాన్' రికార్డ్ బద్దలైంది) నాగ్ అశ్విన్ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడని పొగిడేస్తున్నారు. సామాన్యులు మొదలు..స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ‘కల్కి 2898 ఏడీ’పై రివ్యూ ఇస్తూ.. నాగ్ అశ్విన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన శైలీలో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్పై ప్రశంసలు జల్లు కురిపించారు. (చదవండి: ఆ సంఘటనతో భయమేసింది: నాగ్ అశ్విన్)ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డాడు. ఆ విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తూ రిలీజ్ రోజు అరిగిపోయిన చెప్పులను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో సినిమా తీసే డైరెక్టర్ ఎంత సింపుల్ ఉంటాడో చూడండి అంటూ.. ఆయన చెప్పుల ఫోటోలను వైరల్ చేశారు నెటిజన్స్. దానికి సింక్ ఆయ్యేలా బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. తెలుగు సినిమా అనుకొంటే వరల్డ్ సినిమా తీశారు . నాగ్ అశ్విన్ గారు.. మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటా. థ్యాంక్యూ ప్రియాంక ,స్వప్న (నిర్మాతలు). మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అని బ్రహ్మాజీ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు .@nagashwin7 గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను ❤️..thank యూ ప్రియాంక ..స్వప్న ..మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష 🙏🏼 .#Kalki2808AD 🔥@VyjayanthiFilms 🙏🏼— Brahmaji (@actorbrahmaji) July 1, 2024
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి: రాష్ట్రపతికి అరకు ఎంపీ ఫిర్యాదు
ప్రభాస్కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్కి పంపాడు: హంసనందిని
అందుకే పిచ్లోని మట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్ శర్మ
బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లోక్సభ: చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి: రాష్ట్రపతికి అరకు ఎంపీ ఫిర్యాదు
ప్రభాస్కి చాలా సిగ్గు.. టికెట్ కొనిచ్చి థియేటర్కి పంపాడు: హంసనందిని
అందుకే పిచ్లోని మట్టిని తిన్నా.. అసలు కారణమిదే: రోహిత్ శర్మ
బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లోక్సభ: చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఫైర్
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సినిమా
![Actor And Director Samuthirakani Rare Old Pic News](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Samuthirakani.jpg.webp?itok=XwElFrPG)
ఇతడు ప్రముఖ నటుడు, దర్శకుడు.. మీకు బాగా తెలుసు.. గుర్తుపట్టారా?
ఒకప్పుడు నటులు, దర్శకులు ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ దర్శకులు.. పూర్తిస్థాయి నటులుగా మారిపోతున్నారు. కుర్ర హీరోలు చాలామంది డైరెక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే పైన ఉన్నది అలాంటి యాక్టర్ కమ్ డైరెక్టరే. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఇతడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు సముద్రఖని. అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. ఈ మధ్య కాలంలో వరసగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నది ఇతడే. అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, హనుమాన్.. ఇలా విలన్ అనే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)నటుడిగా ఇంత పేరు తెచ్చుకున్నాడు గానీ సముద్రఖని కెరీర్ దర్శకత్వ శాఖలో మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడు అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే తొలుత తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశాడు. ఎప్పుడైతే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడో అప్పటి నుంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని పలు హిట్ సినిమాలు తీశాడు.2001 నుంచి తమిళంలో నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. 'అల వైకుంఠపురములో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా 'బ్రో' మూవీ డైరెక్ట్ కూడా చేశాడు. యాక్టింగ్, డైరెక్షన్తో పాటు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం లాంటి కళలు కూడా ఉన్నాయి. ఇకపోతే సముద్రఖని పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్నది ఈ ఫొటోనే ఇది చూసి మీరు గుర్తుపట్టడమైతే కష్టం. మరి మీలో ఎంతమంది గుర్తుపట్టారు?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్)
![Armaan Malik's Wife Payal Malik Comments On Bigg Boss OTT 3](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/armaan-malik-payal-bigg-bos.jpg.webp?itok=0WhKJ1BV)
రెండు కాదు.. నా భర్తకు మూడుసార్లు పెళ్లయింది!
బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ ప్రస్తుతం హిందీలో జరుగుతోంది. రీసెంట్గా ఈ షో వార్తల్లో నిలిచింది. ఓ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి ఇందులో అడుగుపెట్టడమే కారణం. పలువురు ఈ విషయమై గట్టిగానే విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లని చూపించి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ట్రోల్స్ చేశారు. తాజాగా యూట్యూబర్ భార్యల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రావడమే లేటు షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)ఇకపోతే అర్మాన్కి మూడుసార్లు పెళ్లయిందట కదా అనే ప్రశ్నకు కూడా పాయల్ మాలిక్ బదులిచ్చిది. 'అవును.. నా భర్తకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కాకపోతే ఒకటి బాల్య వివాహం. హర్యానాలో కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతుంటాయి. కానీ నన్ను వివాహం చేసుకునే సమాయానికి అర్మాన్.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆర్థికంగానూ ఆమెకు అండగా నిలిచాడు. ఇప్పుడు ఆమె వేరే పెళ్లి కూడా చేసుకుని హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా పుట్టారనుకుంటాను' అని పాయల్ మాలిక్ చెప్పుకొచ్చింది.అలానే తను ఇంత త్వరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాననుకోలేదని, మా ముగ్గురిని వేర్వేరు కంటెస్టెంట్స్గా కాకుండా ఒక్కటిగానే చూస్తున్నారని, బహుశా ఇందువల్లే ఎలిమినేట్ అయిపోయింటానని అభిప్రాయం వ్యక్తం చేసింది. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ ప్రస్తుతం తన భార్య కృతికతో కలిసి హౌస్లో ఉన్నాడు. మరి ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)
![Sirish Bharadwaj Mother Comments On Srija](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Sirish-Bharadwaj-Mother.jpg.webp?itok=wR7a36fZ)
శిరీష్ భరద్వాజ్ మరణానికి కారణం చెబుతూ తల్లి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతి గురించి పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఆమె అమ్మగారు పలు ఆసక్తికరమైన విషయలాను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ వల్ల చనిపోయారని వచ్చని రూమర్స్లో నిజం లేదని ఆమె తెలిపారు.శిరీష్ భరద్వాజ్ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) వల్ల చనిపోయాడని ఆమె ఇలా తెలిపారు. 'కొన్నేళ్లుగా మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం. చికిత్స కోసం శిరీష్ భరద్వాజ్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేరిపించాం. మే 13న భరద్వాజ్ పుట్టినరోజు ఉంది. సెలబ్రేషన్ చేసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీంతో మే 17న అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. సుమారు 30రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల జూన్ 19న మరణించాడు. కానీ, కొన్ని మీడియా సంస్థలు భరద్వాజ్ మరణం గురించి తప్పుగా రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు.శ్రీజ ఎలా ఉంటుందంటే..2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా శ్రీజ గురించి భరద్వాజ్ అమ్మగారు ఇలా చెప్పారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి. అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారి పెళ్లి జరిగి చాలా ఎళ్లు అయింది. వాళ్లు ఎందుకు విడిపోయారు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ, శ్రీజ- భరద్వాజ్లకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రి మాదిరే పోలికలు ఉన్నాయి. ఆ పాపను చూస్తే చాలు భరద్వాజ్ను చూసినట్లే ఉంటుంది. భరద్వాజ్ మరణం తర్వాత మెగాస్టార్ కుటుంబానికి సమాచారం ఇచ్చాం. కానీ, వారిలో ఎవరూ అంత్యక్రియలకు కూడా రాలేదు. నా వరకు అయితే నా మనవరాలిని (నివృత్తి) చూడాలని ఉంటుంది. వారు పెద్దవాళ్లు కదా..! వాళ్ల ఇష్టం ఆ అవకాశం కల్పిస్తారో లేదో.. అందరి మాదిరి నా మనవరాలిని చూడాలని నాకు ఉంటుంది. నా భర్త లాయర్గా పనిచేసేవారు. 2016లో ఆయన కూడా మరణించారు. ఇప్పుడు నేను చిన్న అబ్బాయితో ఉంటున్నాను.మాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదుశ్రీజ నుంచి భరద్వాజ్ రూ. 33 కోట్లు తీసుకున్నట్లు ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అంశంపై ఆమె ఇలా స్పందించారు. 'మా కుటుంబంలో ఎవరూ డబ్బు తీసుకోలేదు. అంత డబ్బు తీసుకుంటే.. మేము అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాం..? దానిని చాలామంది తప్పుగా చెప్పుతున్నారు. ఆ కుటుంబం నుంచి మాకు డబ్బు ఇస్తామని చెప్పిన మాట నిజమే.. కానీ, మేము వద్దని చెప్పాం. ఆ డబ్బును మా మనవరాలు (నివృత్తి) కోసం ఉపయోగించమని చెప్పాం.' అంటూ భరద్వాజ్ అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయినట్లు ఆమె అన్నారు. వారి మనవరాలు నివృత్తిని చూడలనే కోరిక ఉన్నట్లు ఆమె పదేపదే ఎమోషనల్గా చెప్పారు.
![Actress Harshika Poonacha Pregnancy News](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Actress-Harshika.jpg.webp?itok=3GenWEvY)
గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్
మరో యంగ్ హీరోయిన్ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటోతో సహా రివీల్ చేసింది. అయితే ఈ ఫొటోలో భర్తతో కలిసి డిఫరెంట్ ఔట్ఫిట్లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)కర్ణాటకకు చెందిన హర్షిక.. 15 ఏళ్ల నటిగా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. హీరోయిన్గా చేస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీ కూడా ఈమెకు ఉంది. ఇందులో హర్షిక పార్ట్నర్ నటుడు భువన్ పొన్నాన.ఇలా బిజినెస్ పార్ట్నర్స్ కాస్త గతేడాది ఆగస్టులో జీవిత భాగస్వామ్యలు అయ్యారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే పలువురు వీళ్లకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial)
ఫొటోలు
![Tollywood Beauty Kajal Aggarwal Looks Amazing In Black Dress](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Kajal-Aggarwal.jpg.webp?itok=geCupKIW)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Kajal-Aggarwal.jpg.webp?itok=geCupKIW)
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
![Hansika Motwani Stunning Looks With Mesmerizing Charm](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Hansika-Motwani.jpg.webp?itok=cYzRVFMI)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Hansika-Motwani.jpg.webp?itok=cYzRVFMI)
బ్లాక్ డ్రెస్లో హన్సిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
![Actress Shriya Saran Looks Beautiful In White Saree](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Shriya-Saran-Saree-Photos.jpg.webp?itok=m7QjPN-I)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Shriya-Saran-Saree-Photos.jpg.webp?itok=m7QjPN-I)
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
![Cricketer Smriti Mandhana Visit Tirumala Tirupati Temple With Family Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Cricketer%20Smriti%20Mandhana%20Visit%20Tirumala%20Tirupati%20Temple%20With%20Family%20Photos%20%2817%29.jpg.webp?itok=Mpv0-Wfy)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Cricketer%20Smriti%20Mandhana%20Visit%20Tirumala%20Tirupati%20Temple%20With%20Family%20Photos%20%2817%29.jpg.webp?itok=Mpv0-Wfy)
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకున్న స్టార్ క్రికెటర్ స్మృతి మందాన (ఫొటోలు)
![శ్రియా పిల్గొంకర్](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Shriya-Pilgaonkar.jpg.webp?itok=zX3-E5g0)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Shriya-Pilgaonkar.jpg.webp?itok=zX3-E5g0)
'మీర్జాపుర్' బ్యూటీ.. ధగధగా మెరిసిపోతూ మరింత అందంగా (ఫొటోలు)
క్రీడలు
![17 Year Old Chinese Player Died With Cardiac Arrest During A Badminton Match In Indonesia](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ss_0.jpg.webp?itok=3lNb0bfr)
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024
![Team India Leave For Zimbabwe For T20I Series](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Untitled-9_2.jpg.webp?itok=ABv4TK7g)
"ఆల్ ద బెస్ట్ టీమిండియా".. జింబాబ్వే పర్యటనకు బయల్దేరిన శుభ్మన్ గిల్ సేన
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నిన్న (జులై 1) సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ప్రపంచకప్తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.Team India off to Zimbabwe via Emirates flight from Mumbai. 🇮🇳- Good luck, boys! pic.twitter.com/0yJdocApUX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2024సీనియర్లకు విశ్రాంతిఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.TEAM INDIA HAS LEFT FOR ZIMBABWE FOR THE T20I SERIES.- Good luck, Team India. 🇮🇳 pic.twitter.com/iiQUVjlIKA— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ఈ సిరీస్కు వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. వరల్డ్కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకన్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే
![Jimmy Anderson To Become England Bowling Consultant After Test Retirement](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/sadc.jpg.webp?itok=Zc-Pc8N_)
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ మెంటార్గా జేమ్స్ ఆండర్సన్
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్.. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆండర్సన్ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ను ఫాస్ట్ బౌలింగ్ మెంటార్గా నియమించింది. తన చివరి టెస్ట్ ముగిసిన వెంటనే ఆండర్సన్ కొత్త బాధ్యతలు చేపడతాడు.ఇంగ్లండ్.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్లు మొదలవుతాయి. లార్డ్స్, ట్రెంట్బ్రిడ్జ్, ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. లార్డ్స్లో జరుగబోయే టెస్ట్తో ఆండర్సన్ రిటైర్ కానున్నాడు. ఆండర్సన్ బౌలింగ్ మెంటార్గా తన ప్రస్తానాన్ని విండీస్తో రెండో టెస్ట్ నుంచి మొదలుపెడతాడు.జట్ల వివరాలు..ఇంగ్లండ్ (తొలి రెండు టెస్ట్లకు): హ్యారీ బ్రూక్, జో రూట్, డేనియల్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్, జేమ్స్ ఆండర్సన్ (తొలి టెస్ట్కు మాత్రమే), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డిల్లన్ పెన్నింగ్టన్, మ్యాట్ పాట్స్వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), కవెమ్ హాడ్జ్, అలిక్ అథనాజ్, జకరీ మెక్క్యాస్కీ, జేసన్ హోల్డర్, కిర్క్ మెక్కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్ ఇమ్లాక్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, మిఖైల్ లూయిస్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జెర్మియా లూయిస్
![LPL 2024: Shanaka Shines, Mark Chapman Heroics Fall Short As Kandy Falcons Prevail In The Opener](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/cb.jpg.webp?itok=_vtcswOP)
షనక ఊచకోత.. చాప్మన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్లో దంబుల్లా సిక్సర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.లీగ్లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి.
బిజినెస్
![Indian Army introduced first indigenous chip based 4G station procured from Signaltron](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/defence02.jpg.webp?itok=Je7OXiMo)
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్వర్క్ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్వర్క్ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్ప్లేస్లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్ట్రాన్ ఈ బిడ్ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు.
![Predicting Telecom Company Profits with Tariff Hikes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/688_1_0.jpg.webp?itok=C9444hC5)
టారిఫ్ల పెంపుతో టెల్కోలకు అధిక లాభాలు
న్యూఢిల్లీ: టారిఫ్ల పెంపుతో దేశీయంగా టాప్ మూడు టెలికం కంపెనీలకు ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) 15 శాతం పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20–22 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. స్పెక్ట్రం కొనుగోలు, 5జీ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ పెట్టుబడులపై రాబడి పొందడానికి తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది సానుకూలంగా పరిణమించగలదని కేర్ రేటింగ్స్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 191గా ఉన్న ఏఆర్పీయూ ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధితో రూ. 220కి చేరవచ్చని విశ్లేషించింది. ప్రతి రూ. 1 ఏఆర్పీయూ పెరుగుదలతో పరిశ్రమ నిర్వహణ లాభాలు రూ. 1,000 కోట్ల స్థాయిలో పెరుగుతాయని తెలిపింది. ఏఆర్పీయూ, లాభాల పెరుగుదలతో టెక్నాలజీలను అప్గ్రేడ్ చేసుకునేందుకు, నెట్వర్క్ను విస్తరించుకునేందుకు టెల్కోలకు వెసులుబాటు లభించగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రుణ భారం కొంత దిగి వస్తుందని నివేదిక తెలిపింది. ఇటీవల జూన్లో ముగిసిన స్పెక్ట్రం వేలంలో టెల్కోలు పెద్దగా పాల్గొనకపోవడంతో .. రాబోయే రోజుల్లో రుణ భారం క్రమంగా మరింత తగ్గగలదని పేర్కొంది.
![Stock Market Rally On Today Opening](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Market01.jpg.webp?itok=tud1ybsp)
కొత్త గరిష్ఠాలను చేరుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 24,188కు చేరింది. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 79,645 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.27 శాతం, నాస్డాక్ 0.83 శాతం లాభపడ్డాయి.స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయులు నమోదు చేస్తున్నాయి. అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐలు డెరివేటివ్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 83 శాతం నెట్ లాంగ్ పొజిషన్లను కలిగి ఉన్నారు. గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపితే మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.జూన్ జీఎస్టీ వసూళ్లు మే నెలతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. జూన్లో రూ.1.74లక్షల కోట్లు వసూళయ్యాయి. జూన్ నెలలో ఆటో కంపెనీల వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మొత్తం జూన్లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3,28,710 యూనిట్లు విక్రయించారు. 3.67 శాతం వృద్ధి మాత్రమే నమోదైనట్లు డేటా ద్వారా తెలిసింది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
![Manufacturing activity rises to 58.3 in June](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/665.jpg.webp?itok=-9W3WHmL)
తయారీకి ‘ఆర్డర్ల’ జోష్..
న్యూఢిల్లీ: సానుకూల డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో జూన్లో తయారీ రంగ ఉత్పత్తి పెరిగింది. దీంతో ఉద్యోగాల కల్పన కూడా గణనీయంగా మెరుగుపడింది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సూచనగా గత నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్లో 58.3కి పెరిగింది. మే నెలలో ఇది 57.5గా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. కొత్త ఆర్డర్ల రాకతో కంపెనీలు రిక్రూట్మెంట్ను కూడా పెంచుకుంటున్నట్లు హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఎకానమిస్ట్ మైత్రేయి దాస్ తెలిపారు. 2005 మార్చిలో దీనికి సంబంధించిన డేటాను సేకరించడం మొదలుపెట్టిన తర్వాత గత 19 ఏళ్లలో ఉద్యోగాల కల్పన రేటు ఇంత వేగవంతంగా ఉండటం ఇదే తొలిసారని వివరించారు. జూన్లో సిబ్బంది వ్యయాలతో పాటు ముడి వస్తువులు, రవాణాపై ఖర్చులు పెరగడంతో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు దాస్ చెప్పారు.
వీడియోలు
![Chandrababu Naidu Conspiracy Acts On AP Pensioners](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ch_2.jpg.webp?itok=G2L-NtTZ)
![Chandrababu Naidu Conspiracy Acts On AP Pensioners](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ch_2.jpg.webp?itok=G2L-NtTZ)
పెన్షన్ దారులకు వెన్ను పొట్లు బాబు మార్క్ కుట్ర
![TDP MLA Kolikapudi Srinivasa Rao Faction Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/f_1.jpg.webp?itok=Ph0HqLgA)
![TDP MLA Kolikapudi Srinivasa Rao Faction Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/f_1.jpg.webp?itok=Ph0HqLgA)
కొలికపూడి కక్ష రాజకీయం పోలీసులను తోసేసి మరి...
![MP YV Subba Reddy Speech in Rajya Sabha](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ha_0.jpg.webp?itok=UBsZyY4k)
![MP YV Subba Reddy Speech in Rajya Sabha](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ha_0.jpg.webp?itok=UBsZyY4k)
రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా డిమాండ్..
![Harish Rao Comments On Rural Development In Congress Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ru.jpg.webp?itok=WjBDU4is)
![Harish Rao Comments On Rural Development In Congress Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ru.jpg.webp?itok=WjBDU4is)
పల్లెలను పొడుచుకు తింటుంది ఈ కాంగ్రెస్ అభివృద్ధి శూన్యం
![CM Revanth Reddy Condition to Film Heroes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/aw.jpg.webp?itok=YTbTxYQi)
![CM Revanth Reddy Condition to Film Heroes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/aw.jpg.webp?itok=YTbTxYQi)
మీ సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే..హీరోలకు రేవంత్ రెడ్డి ప్రీ కండిషన్
![Komatireddy Rajagopal Reddy Trying For Minister Post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/rv.jpg.webp?itok=D-Ujp3Rp)
![Komatireddy Rajagopal Reddy Trying For Minister Post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/rv.jpg.webp?itok=D-Ujp3Rp)
రాజగోపాల్ రెడ్డి మంత్రి అయ్యేనా?
![BRS MLA Padi Kaushik Reddy Protest Against Karimnagar District Collector Pamela Satpathy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ka.jpg.webp?itok=-oCFLJ_v)
![BRS MLA Padi Kaushik Reddy Protest Against Karimnagar District Collector Pamela Satpathy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ka.jpg.webp?itok=-oCFLJ_v)
కలెక్టర్ కి అడ్డుపడి ధర్నాకు కూర్చున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
![TDP Corruption in Pension Distribution](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/th_3.jpg.webp?itok=PeLOtdI2)
![TDP Corruption in Pension Distribution](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/th_3.jpg.webp?itok=PeLOtdI2)
500 ఇస్తేనే పెన్షన్ .. మళ్లీ మొదలైన అవినీతి
![Srikakulam RIMS Hospital Employees Protest](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ki.jpg.webp?itok=8aBPa5Qx)
![Srikakulam RIMS Hospital Employees Protest](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/ki.jpg.webp?itok=8aBPa5Qx)
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
![CM Revanth Reddy Comments on YSRCP Defeat](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/re_0.jpg.webp?itok=50RSSb7a)
![CM Revanth Reddy Comments on YSRCP Defeat](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/re_0.jpg.webp?itok=50RSSb7a)
YSRCP ఓటమిపై పిచ్చి కూతలు.. రేవంత్ రెడ్డికే భారీ నష్టం
ఫ్యామిలీ
![Skin Care and Beauty tips In Rainy Season](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Beautycaretips_monsoon.jpg.webp?itok=3o4-J5S-)
వర్షాకాలంలో చర్మ, ముఖ సౌందర్యం: ఈ పనులు అస్సలు చేయకండి!
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్లేవాళ్లు, గొడుగు, రెయిన్కోట్ లాంటివి కచ్చితంగా తీసుకెళ్లాలి. ఈ సీజన్లో కూడా మాయిశ్చరైజర్ వాడాలా? నీళ్లు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ , కన్సీలర్ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్. టాక్సిన్స్ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్ని వాడాలి.మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్స్క్రీన్ని ఉపయోగించాలి.చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్ను ఎంచుకోండి.తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్ని ఉపయోగించండి.అలాగే సున్నితమైన క్లెన్సర్ లేదా మేకప్ రిమూవర్ సాయంతో రాత్రి పడుకునేందుకు మేకప్ను పూర్తిగా తొలగించండి. లేదంటే ముఖంపై ఉన్న మేకప్ చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు రావచ్చు. అందుకే తేనె వంటి ఇతర సహజ మాయిశ్చరైజర్ పదార్ధాలు ఉన్న సీరమ్ను ఎంచుకుంటే మంచిది.
![This Indian Curry Was Named Among World 50 Best Seafood Dishes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/france.jpg.webp?itok=toFvpVbC)
ది బెస్ట్ సీఫుడ్ డిష్గా ఈ భారతీయ కర్రీకి చోటు!..ఎన్నో స్థానం అంటే..?
భారతదేశంలోని తీర ప్రాంతాలు సీఫుడ్కి పేరుగాంచినవి. మన దేశంలో సముద్రపు ఆహారానికి సంబంధించిన అనేక ఐకానిక్ కూరలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ వెజ్ కర్రీ, బెస్ట్ స్వీట్స్,బెస్ట్ రెస్టారెంట్స్ వంటి జాబితాను అందించింది.అలానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ సీఫుడ్స్ డిష్ల జాబితాను విడుదల చేసింది.భారతదేశంలోని తీరప్రాంతాలు మంచి రుచికరమైన సీఫుడ్లను అందించడంలో అపారమైన పాక నైపుణ్యం కలిగి ఉంది. ఇవి ఎల్లప్పుడు ది బెస్ట్ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును కూడా దోచుకుంటాయి. అయితే టేస్ట్ అట్లాస్ ఇచ్చిన ది బెస్ట్ సీ ఫుడ్ జాబితాలో మన భారతీయ సీఫుడ్ కర్రీకి స్థానం దక్కడం విశేషం. జూలై 2024న విడుదల చేసిన ర్యాంకింగ్లలో మన భారతదేశంలోని బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీ 31వ స్థానంలో నిలిచింది. ఇది మంచి ఘుమఘమలాడే రొయ్యల కర్రీ. దీన్ని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మాసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి, అల్లం పేస్టు, దాల్చిన చెక్కె, చక్కెర, ఏలుకులు చేర్చి.. చిక్కటి గ్రేవితో సర్వ్ చేశారు. ఇది దశల వారీగా ఓపికతో తయారు చేయాల్సిన రుచికరమైన వంటకం. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?)
![Water fasting Man loses 13kgs in 21 days new trend and is it safe](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/costaricaman-waterfasting.jpg.webp?itok=pmm0WRtj)
Water Fasting : 21 రోజుల్లో 13 కిలోలు తగ్గాడు! ఇది సురక్షితమేనా?
బరువు తగ్గించుకోవడంకోసం ఉపవాసాలు, వ్యాయామాలు అంటూ ఊబకాయులు చాలా కష్టపడుతుంటారు. అయితే కోస్టా రికాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో బరువు తగ్గాడు. 21 రోజుల్లో కేవలం నీరు మాత్రమే తాగి 13.1 కిలోల దాకా బరువు తగ్గాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అడిస్ మిల్లర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వీడియో ద్వారా తన వాటర్ఫాస్టింగ్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. కోస్టా రికాలో 21 రోజుల పాటు నీటి ఉపవాసం (ఎలాంటి ఆహారం, ఉప్పు లేకుండానే) పాటించి 13.1 కేజీల బరువు తగ్గాడట. 6శాతం కొవ్వు తగ్గిందని అడిస్ వెల్లడించాడు. ఇప్పటికే సన్నగా ఉన్న మనిషి మరింత సన్నగా మారాడు. అయితే ఇది అందరూ ఆచరించవచ్చా? దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?నీటి ఉపవాసం సురక్షితమేనా?“నీటి ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలి. 24 గంటలమొదలు, కొన్ని రోజులు లేదా వారాల వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో ఇతర ద్రవాలు లేదా ఆహారాలు తీసుకోకూడదు. బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ ,మెరుగైన మానసిక స్పష్టత, దీర్ఘాయువుతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. .నీటి ఉపవాసం సమయంలో, శరీరం కాలేయం , కండరాల కణజాలంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్తో సహా నిల్వలపై ఆధారపడుతుంది.నిపుణుల సమక్షంలో మాత్రమేఅయితేఇది అంత సురక్షితం కాదనీ, సరైన వైద్య నిపుణుల సమక్షంలో మాత్రమే చెప్పాలని చెపుతున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు. నీటి ఉపవాసం ప్రమాదాలు:పోషకాహార లోపాలు: విటమిన్లు, మినరల్స్ , ఎలక్ట్రోలైట్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో లోపం ఏర్పడుడుతంది. ఫలితంగా బలహీనత, మైకం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.హైడ్రేషన్కు నీరు చాలా అవసరం అయితే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది.జీవక్రియపై ప్రభావం : సుదీర్ఘ ఉపవాసం జీవక్రియను నెమ్మదిస్తుంది. ఉపవాసం ముగిసిన తర్వాత తిరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది.మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు నీటి ఉపవాసం జోలికి వెళ్లకుండా ఉండాలి. లేదా నిపుణులైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.నీటి ఉపవాసానికి ప్రత్యామ్నాయం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా అడపాదడపా ఉపవాసాలను ఎంచుకోవచ్చు. ఎంత బరువు ఉండాలి అనేది నిర్ధారించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం బరువు తగ్గాలి. నిరంతర వ్యాయామం, జీవనశైలి మార్పులు, పిండి పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు, చక్కని పోషకాహారం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.
![Monsoon Seasonal & Delicious Fruits Of India: See Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/2/Monsoon%20Fruits.jpg.webp?itok=pTfs_Roz)
అటు వర్షాలు.. ఇటు కమ్మని ఫలాలు (ఫొటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/6885.jpg.webp?itok=v9_Qnsu1)
ఏకే 47, మోడల్స్తో రీల్స్ హంగామా
బనశంకరి: పేద్ద బంగళాలు, ఏకే 47 తుపాకులతో గార్డుల పహరా, అందమైన భామలు, కార్లు.. ఇవన్నీ హైఫై బాలీవుడ్ సినిమాలో కనిపించే సీన్లే కాదు. బెంగళూరులో కొందరు సోషల్ మీడియాప్రియులు ఎంతో ఖర్చు పెట్టి మరీ ఇటువంటివి సమకూర్చుకుని రీల్స్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చి ఏమిటని విమర్శలువచ్చినా పట్టించుకోరు. తుపాకులతో గార్డులు, మోడల్స్ మధ్య రీల్స్ చేసిన అరుణ్ కటారె అనే బెంగళూరువాసిని కొత్తనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Arun Kathare (@arun_kathare) కళ్లు చెదిరేలా పోజులుఅరుణ్ కటారె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. బడా సంపన్నుడిలా పోజులిస్తుంటాడు. కొత్త రీల్ చేయాలని చేతిలో ఏకే 47 ఉత్తుత్తి గన్లు పట్టుకుని రోడ్డులో షో చేస్తూ ఒంటిపై కేజీలకొద్దీ నకిలీ బంగారు ఆభరణాలు ధరించాడు. పైగా బాడీగార్డులు కూడా ఉన్నారు. ఈ హంగామాతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తనూరు పోలీసులు వచ్చి అరుణ్ను అరెస్ట్చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఏకే 47 తుపాకులు, అనుచరులను వెంటేసుకుని స్థానికంగా హవా సృష్టించడానికి ఇలాంటి షో చేసినట్లు వెలుగుచూసింది. ఇతడు, గార్డులపై కేసు నమోదు చేసి పరప్పన జైలుకు పంపించారు. View this post on Instagram A post shared by Arun Kathare (@arun_kathare)
![ఘరానా పోలీస్](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/01blr41-600670_mr-1719859598-0.jpg.webp?itok=KeT-nPRy)
ఘరానా పోలీస్.. భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం..
సాక్షి, బళ్లారి: చట్టాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసు వృత్తిలో ఉండి భార్యా పిల్లలకు అన్యాయం చేశాడు. వారిని వదిలేసి మరో మహిళతో జీవిస్తుండడంపై అతని భార్య నిరసనకు దిగింది. తనకు భర్త కావాలని పిల్లలతో సహా భార్య ఽబైఠాయించిన ఘటన సోమవారం బళ్లారి నగరంలోని రామ్నగర యసోజీ కాలనీలో జరిగింది. నగరంలో కానిస్టేబుల్గా పని చేస్తున్న బోనిబసప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య సౌమ్య మెట్టినింటి ముందు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013లో తమకు వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. అయితే గత కొన్నేళ్లుగా దావణగెరెకు చెందిన వేరే మహిళతో అతడు సహజీనవం సాగిస్తున్నాడని తెలిపింది. గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి కేసు పెట్టినట్లు తెలిపింది. తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని, పిల్లల చదువులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని భోరుమని విలపించింది. తన భర్త తనకు కావాలని, పరసీ్త్ర నుంచి అతన్ని విడిపించాలని మొరపెట్టుకుంది.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/6858.jpg.webp?itok=fuK6ydtg)
భార్యను కత్తితో పొడిచిన కానిస్టేబుల్
దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. దంపతుల మధ్య గత నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం మమత ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. దీంతో ఆగ్రహం పట్టలేని లోకనాథ్ భార్యపై కత్తితో దాడిచేసి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల క్రితం హాసన్ శివారులోని చెన్నపట్టణ కాలసీ నివాసి అయిన మమతను కేఆర్పుర నివాసి లోకనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కట్నం కింద అరకేజీ బంగారం, రూ.50 లక్షలు నగదు ఇచ్చినా లోకనాథ్ తరచూ అదనపు కట్నం కోసం మమతను వేధించేవాడని, అయితే ఆమె కట్నం తీసుకురావడానికి నిరాకరించేదని అందుకే లోకనాథ్ ఈ హత్యకు పాల్పడ్డాడని మమత తల్లిదండ్రులు ఆరోపించారు. హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ ఆఫీసులోనే, పోలీసు హత్య చేయడంపై విమర్శలు వెల్లువత్తాయి.
![అయ్యో](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/1/30plnr32-300034_mr-1719778945-0.jpg.webp?itok=FT7SBXBr)
అయ్యో..తల్లీ!
భర్త అడిగిన మాటలతో విసిగిపోయింది. తన తల్లిదండ్రులపై కోప్పడ్డ తీరు కుంగదీసేలా చేసింది. దీనికితోడు పుట్టింట్లో రెండు రోజుల పాటు జరిగే జాతరకు కూడా వెళ్లొద్దంటూ హుకుం జారీ చేయడం మనసును కకావికలం చేసింది. ఎలాగోలా ఇద్దరు ఆడ బిడ్డలను తీసుకుని పొద్దుపోయాక పుట్టింటికి చేరింది. రాత్రంతా భర్త అడిగిన మాటలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పొద్దున్నే బిడ్డలిద్దర్నీ నిద్రలేపి మసకమసక చీకట్లో గ్రామ సమీపంలోని బావి వద్దకు చేరింది. ముందుగా తన ఇద్దరి బిడ్డలను బావిలో తోసి.. తర్వాత తనూ దూకి తనువు చాలించింది. ఈ ఘటన ఆదివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో విషాదాన్ని నింపింది.పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, పట్రపల్లెలో ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. మెట్టినింటి నుంచి జాతరకని పుట్టింటికొచ్చిన ఓ వివాహిత తన ఇద్దరు ఆడబిడ్డలను బావిలో తోసి తనూ దూకి తనువు చాలించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. మండలంలోని పట్రపల్లె గ్రామానికి చెందిన వెంకట్రామయ్య, కృష్ణమ్మ దంపతుల కుమార్తె కె.రాణి (30)కి పెద్దపంజాణి మండలం, రాయలపేటకు చెందిన దిలీప్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి (8), హిమశ్రీ (6) ఇద్దరు కుమారైలు ఉన్నారు. తరచూ భార్యాభర్తలు గొడవపడేవారు. దిలీప్ తల్లిదండ్రులు కూడా రాణిని మానసికంగా వేధించేవారు.ముగ్గుర్ని బలితీసుకున్న జాతర చిచ్చుగత వారం రాయలపేటలో జాతర నిర్వహించారు. ఆ జాతరకు రావాలని రాణి తల్లిదండ్రులకు అల్లుడు దిలీప్ కబురు పంపాడు. కానీ పనుల ఒత్తిడితో వారు రాలేకపోయారు. ఇదిలావుండగా శని, ఆదివారాల్లో రాణి సొంతూరు పట్రపల్లెలో ఆవులపల్లె జాతర జరిగింది. ఈ జాతరకు రాణి తల్లిదండ్రులు అల్లుడు దిలీప్కు కబురు పంపారు. కానీ అతను రాకపోగా.. భార్య రాణిని కూడా వెళ్లొద్దంటూ గొడవపడ్డాడు. ఆపై కోపోద్రిక్తుడైన దిలీప్ భార్య చేతిలో ఉన్న సెల్ఫోన్ను నేలకేసి కొట్టాడు. దీంతో రాణి మానసికంగా కుంగిపోయింది. శనివారం సాయంత్రం పొద్దుపోయాక రాయలపేట నుంచి పుట్టింటికి చేరింది. రాత్రంతా భర్త అడిగిన మాటలు తలుచుకుని కన్నీటిపర్యంతమైంది. ఇక భర్తతో ఇమడలేనని నిశ్చయించుకుంది. తను దూరమైతే బిడ్డలు అనాథలైపోతారని.. వారిని కూడా తీసుకెళ్లాలని భావించింది. ఆదివారం ఉదయాన్నే ఇద్దరు బిడ్డలను తీసుకుని గ్రామ సమీపంలోని బావిలో తోసి తనూ దూకి తనువు చాలించింది. రాణి, పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. బావిలో మృతదేహాలను పశువుల కాపర్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీసి బోరున విలపించారు.వేధింపులే కారణమా?రాణి మృతికి భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ తమ కుమా ర్తెను చులకనగా మాట్లాడుతూ మానసికంగా కుంగదీశారని పేర్కొన్నారు. వారి వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు.శోకసంద్రంలో రాయలపేటపెద్దపంజాణి: తల్లి, కుమార్తెల మృతితో మండలంలోని రాయలపేట శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన పటాలమ్మగుడి పూజారి ఆంజప్ప పెద్ద కుమారుడు దిలీప్ కార్పెంటర్. సోమల మండలం, పట్రపల్లికి చెందిన రాణితో పదేళ్ల క్రితం పెద్దలు నిశ్చయించి పెళ్లి చేశారు. శనివారం పుట్టింట్లో జరిగే గంగజాతరకు వెళ్లిన రాణి, ఇద్దరు కుమార్తెలు శవాలై తిరిగి రావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కలచివేసింది. అందరితో కలివిడిగా మాట్లాడే రాణి విగత జీవిగా చేరుకోవడంతో బంధువులు గుండెలవిసేలా రోధించారు. అనంతరం అశ్రునయనాల మధ్య తల్లిబిడ్డల అంత్యక్రియలు పూర్తిచేశారు.