‘ఆ మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది’ | IPAC Condemn That News Spread By TV5 Channel | Sakshi
Sakshi News home page

‘ఆ మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది’

Published Mon, Mar 18 2019 11:31 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

IPAC Condemn That News Spread By TV5 Channel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అనుకూల మీడియా మరీ దిగజారిపోయింది. తప్పుడు సర్వేల పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐప్యాక్‌) టీడీపీకి అనుకూలంగా సర్వే చేసినట్టు ఓ మీడియా కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన ఐప్యాక్‌ సంస్థ ఆ వార్తలను ఖండించింది. ఆ మీడియా ప్రచురించిన కథనాలు ఊహాజనితమైనవని ఐప్యాక్‌ సంస్థ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. ఆ మీడియా ప్రచారం చేసిన వార్తల్లో ఎటువంటి నిజాలు లేవని, ఆధారంలేని వార్తలను ప్రసారం చేస్తున్నారని ఐప్యాక్‌ మండిపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement