![Pawan Kalyan Comments On Handing over of Preethi case to the CBI - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/20/PAWAN-KALYAN-5.jpg.webp?itok=zLhCpB3O)
సాక్షి, అమరావతి: కర్నూలుకు చెందిన ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుందని పవన్ పేర్కొన్నారు. కాగా గురువారం పవన్కల్యాణ్ ఢిల్లీ వెళ్లుతున్నారని.. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి తాను ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని ఆయన సైనిక అధికారులకు అందజేస్తారని జనసేన పార్టీ వేరొక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment