తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత | Tension Again In Tadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత

Published Fri, Nov 9 2018 11:29 AM | Last Updated on Fri, Nov 9 2018 11:37 AM

Tension Again In Tadepalligudem - Sakshi

తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను..

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(గురువారం) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధాన్ని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపించడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే  పైడికొండల మాణిక్యాల రావు పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement