ఆసియా టీమ్‌ స్నూకర్‌ రన్నరప్‌ భారత్‌  | Asian Snooker Runner Up India | Sakshi
Sakshi News home page

ఆసియా టీమ్‌ స్నూకర్‌ రన్నరప్‌ భారత్‌ 

Jun 29 2019 9:41 AM | Updated on Jun 29 2019 9:41 AM

Asian Snooker Runner Up India - Sakshi

దోహా: ఆసియా టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్, ఆదిత్య మెహతాలతో కూడిన భారత్‌ 2–3 (1–79, 1–71, 58–18, 67–39, 9–69) ఫ్రేమ్‌ల తేడాతో పాకిస్తాన్‌–2 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో టీమిండియా 3–2 (95–46, 55–42, 28–74, 43–51, 69–29) ఫ్రేమ్‌ల తేడాతో మయన్మార్‌ జట్టును ఓడించింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 3–0 (98–0, 74–22, 68–17) ఫ్రేమ్‌లతో పాకిస్తాన్‌–1 జట్టుపై విజయం సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement