మెరిసిన చంద్రలేఖ  | BCCI Senior Womens One Day League entry chandralekha | Sakshi
Sakshi News home page

మెరిసిన చంద్రలేఖ 

Dec 13 2018 1:34 AM | Updated on Dec 13 2018 1:54 AM

BCCI Senior Womens One Day League entry chandralekha - Sakshi

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌లో చంద్రలేఖ (101 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవడంతో ఆంధ్ర జట్టు నాలుగో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పై ఆంధ్ర జట్టు 62 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగింట గెలిచి 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది.

చంద్రలేఖ అర్ధసెంచరీకి తోడు హిమబిందు (67 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం ఆంధ్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి 3, కెప్టెన్‌ పద్మజ 2, ఝాన్సీ లక్ష్మి, పుష్పలత, మల్లిక ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై గోవా, విదర్భపై హరియాణా గెలిచాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement