
భారత్ x మలేసియా
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. ఫామ్లో ఉన్న ఆకాశ్దీప్ సింగ్, సునీల్, రమణ్దీప్ సింగ్ మళ్లీ రాణిస్తే భారత్కు సెమీఫైనల్ బెర్త్ కష్టమేమీ కాదు.