హైదరాబాద్ బాలికలకు టైటిల్ | hyderabad girls wins throw ball title | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బాలికలకు టైటిల్

Oct 4 2016 11:41 AM | Updated on Sep 4 2018 5:24 PM

అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ రన్నరప్‌తో తృప్తిపడింది. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్ గ్రౌండ్‌‌సలో సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జిల్లా 15-8, 15-13తో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది.

 

దీంతో రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 15-11, 15-10తో ఖమ్మంపై నెగ్గింది. బాలుర విభాగంలో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ 15-12, 12-15, 15-5తో హైదరాబాద్‌ను కంగుతినిపించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15-13, 15-11తో రంగారెడ్డిపై నెగ్గింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రావెల్ పాయించ్‌ఆర్ సొల్యూషన్‌‌స మేనేజింగ్ డెరైక్టర్ ఖాజీ నజీముద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఎస్‌జీఎఫ్‌టీఎస్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పల్లవి స్కూల్ జీఎం గోపాల్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య, ఉమ, హన్నీ, రాము గౌడ్, రాజేంద్రప్రసాద్, జగన్‌మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement