under 19
-
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్తో పాటు లెగ్ స్పిన్నర్గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది. బౌలింగ్లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
Gongadi Trisha: మహిళల క్రికెట్లో రైజింగ్ స్టార్
బ్యాటింగ్లో నిలకడ, షాట్లలో కచ్చితత్వం, క్రీజులో నిలిస్తే చక్కని ఇన్నింగ్స్లు ఆడగలిగే నేర్పరితనం... ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆటద్వారా చాటి చెప్పుకుంటున్న టీనేజ్ సెన్సేషన్ గొంగడి త్రిష, తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష ఆదివారం మలేసియాలో ముగిసిన ఆసియా అండర్–19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలకపాత్ర పోషించింది. దొరై రాజ్ (మిథాలీ రాజ్), హర్మేందర్ సింగ్ భుల్లర్ (హర్మన్ప్రీత్ కౌర్), శ్రీనివాస్ మంధాన (స్మృతి), ఇవాన్ రోడ్రిగ్స్ (జెమీమా), సంజీవ్ వర్మ (షఫాలీ వర్మ) వీరంతా తమ గారాల తనయల కోసం తపించారు. భారత్ క్రికెట్లో భాగమయ్యేందుకు కుమార్తెలతో పాటు కలలు కని శ్రమించి సాధించారు. వీరిలాగే తెలంగాణకు చెందిన గొంగడి రామిరెడ్డి కూడా తన ఒక్కగానొక్క బిడ్డ (త్రిష) కోసం పుట్టిన గడ్డ (భద్రాచలం)ను వీడి హైదరాబాద్ వచ్చారు. క్రికెట్లో ఓనమాలు మొదలు అకాడమీలో శిక్షణ కోసం తన స్తోమతకు మించే ఖర్చు చేశారు. తండ్రి కష్టం చూసిన తనయ త్రిష ఆ కళ్లలో ఆనందం నింపాలని నెట్స్లో సాధన చేసింది. క్రికెట్లో రాటుదేలింది. మైదానంలో రాణిస్తోంది. తాజాగా కౌలాలంపూర్లో బంగ్లాదేశ్తో ఆదివారం జరిగిన ఆసియా అండర్–19 మహిళల టి20 టోర్నీ ఫైనల్లో త్రిష (47 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో అదరగొట్టి భారత జట్టును విజేతగా నిలిపింది.అంతేకాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు సొంతం చేసుకుంది. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్–19 మహిళల తొలి టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టులోనూ త్రిష సభ్యురాలిగా ఉంది. భద్రాచలంలో ఓ ఫిట్నెస్ ట్రెయినర్గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లికి మకాం మార్చారు. అక్కడ్నుంచి కోచింగ్ సెంటర్కు తీసుకెళ్లడం... ఆమె ఆటపై పట్టుదల కనబరచడం, క్రమంగా ప్రతిభగల క్రికెటర్గా మారడం సజావుగా జరిగిపోయాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న డబ్ల్యూపీఎల్ వేలమే ఆ తండ్రిని కాస్త నిరాశపరిచింది. క్రితంసారి మెగా వేలంలో అన్సోల్డ్ క్రికెటర్గా మిగిలిపోవడం... ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ ఫ్రాంచైజీలు త్రిషను మరోసారి విస్మరించడంతో నిరుత్సాహం కలిగింది. అయితే త్రిష నిలకడగా ఆడుతున్న తీరును బట్టి భవిష్యత్లో ఆమెపై ఫ్రాంచైజీలు తప్పకుండా దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ఆమె అచిరకాలంలోనే పిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర అండర్–19 జట్టు తరఫున స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీల్లో రాణించిన ఆమె కీలక బ్యాటింగ్ ఆల్రౌండర్గా రాణించింది. 2014–15 సీజన్లో హైదరాబాద్ అండర్–19 తరఫున ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో పాల్గొంది. అక్కడి నుంచి హైదరాబాద్, సౌత్జోన్ అండర్–19 జట్లలో రెగ్యులర్ ప్లేయర్గా మారింది.గత రెండేళ్లుగా భారత అండర్–19 జట్టులో ఓపెనర్గా రాణిస్తోంది. టాపార్డర్ బ్యాటర్ అయిన త్రిష లెగ్స్పిన్ బౌలర్ కూడా! క్రమం తప్పకుడా బౌలింగ్ కూడా వేస్తుంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన తుదిపోరులో వికెట్ తీయకపోయినా (3–0–10–0)తో కుదురుగా బౌలింగ్ చేసింది. 2023లో అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న త్రిష దురదృష్టవశాత్తూ మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల కంటబడటం లేదు. గతేడాది ఆమెను మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. మొన్న మినీ వేలంలోనూ విస్మరించారు. అయినా... త్రిష నిరాశలో కూరుకుపోలేదు. తనపని తాను చేసుకుపోతోంది. రైజింగ్ స్టార్గా ఎదుగుతున్న త్రిష హైదరాబాద్ నుంచి మరో మిథాలీ రాజ్ కావాలని ఆశిద్దాం. – సాక్షి క్రీడా విభాగం -
ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టిన భారత స్పిన్నర్
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలుపు దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా మరో 85 పరుగులు చేస్తే విజయతీరాలకు చేరుతుంది. భారత్ చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ (1), విహాన్ మల్హోత్రా (11), నిత్య పాండ్యా (51), కేపీ కార్తికేయ (35), సోహమ్ పట్వర్ధన్ (10) ఔట్ కాగా.. అభిగ్యాన్ కుందు (11), నిఖిల్ కుమార్ (1) క్రీజ్లో ఉన్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి భారత జట్టు స్కోర్ 127/5గా ఉంది. ఆసీస్ బౌలర్లలో ఎయిడెన్ ఓ కాన్నర్, విశ్వ రామ్కుమార్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. థామన్ బ్రౌన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టిన మొహమ్మద్ ఎనాన్అంతకుముందు యువ స్పిన్నక్ మొహమ్మద్ ఎనాన్ ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. ఎనాన్ ఆరు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. సోహమ్ పట్వర్ధన్ 3, ఆదిత్య సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో రిలే కింగ్సెల్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు.సూర్యవంశీ సుడిగాలి శతకంఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సుడిగాలి శతకంతో (62 బంతుల్లో 104) విరుచుకుపడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులు చేసింది. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (76) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో విశ్వ రామ్కుమార్ 4, థామస్ బ్రౌన్ 3, అడ్డిసన్ షెరిఫ్ 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (53), ఎయిడెన్ ఓ కాన్నర్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఎనాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా..ఆదిత్య రావత్ 2, ఆదిత్య సింగ్, సోహమ్ పట్వర్దన్ తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా -
Ind vs Aus: భారత బ్యాటర్ రికార్డు.. ప్రపంచంలోనే తొలిసారి
U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది. 293 పరుగులకు ఆసీస్ ఆలౌట్టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది. వైభవ్ రికార్డు అర్ధ శతకం అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.సమిత్ ద్రవిడ్కు గాయం భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవల యూత్ వన్డే సిరీస్కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్లో ఆడే అర్హత కోల్పోయాడు. -
ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు
ఆస్ట్రేలియా మహిళల అండర్-19 జట్టుకు ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు (రిబ్యా స్యాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్) ఎంపికయ్యారు. ఈ ముగ్గురు న్యూజిలాండ్, శ్రీలంక అండర్-19 జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్లో పాల్గొననున్నారు. టీ20, వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. 14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్లో మూడు జట్లు నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడతాయి. ఈ టోర్నీల కోసం 15 మంది సభ్యుల రెండు వేర్వేరు జట్లను ఆస్ట్రేలియా యూత్ సెలెక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఈ జట్లకు ఆసీస్ మాజీ ప్లేయర్ క్రిస్టెన్ బీమ్స్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు.రిబ్యా స్యాన్- బౌలింగ్ ఆల్రౌండర్ సమారా దుల్విన్- బ్యాటర్హస్రత్ గిల్- బౌలర్ -
సీఎం జగన్ను కలిసిన టీమిండియా అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రషీద్ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు. చదవండి: ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్ -
అండర్–19 జట్టుపై ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
ఆసియా కప్లో విజేతగా నిలువడం ద్వారా అండర్–19 ప్రపంచకప్కు ముందు యువ భారత జట్టుకు కావాల్సినంత విశ్వాసం లభించిందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆసియా కప్కు సరైన సన్నాహాలు లేకుండానే యువ భారత్ వెళ్లిందని... నిలకడగా రాణించి విజేతగా అవతరించదని లక్ష్మణ్ కొనియాడాడు. అండర్–19 ప్రపంచకప్ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో జరుగుతుంది. కాగా, శ్రీలంక అండర్–19 జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసి టైటిల్ చేజిక్కించుకుంది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. (చదవండి: భారత యువ ఆటగాళ్లకిది ఎనిమిదోసారి...) -
మద్యం సేవించేందుకు వెళ్లడంతో...
బీజింగ్: కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనల్ని ఉల్లంఘించిన ఆరుగురు జాతీయ అండర్–19 క్రీడాకారులపై చైనీస్ ఫుట్బాల్ సంఘం (సీఎఫ్ఏ) సస్పెన్షన్ వేటు వేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి మ్యాచ్ల్లో పాల్గొనకుండా వారిపై నిషేధం విధించింది. నిబంధనల్ని తుంగలో తొక్కుతూ జాతీయ శిక్షణా శిబిరం నుంచి అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా మద్యం సేవించేందుకు బయటకు వెళ్లిన ఆరుగురు ప్లేయర్ల చర్యను సీఎఫ్ఏ తీవ్రంగా పరిగణించింది. ‘ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన. వారి చర్య కారణంగా మొత్తం జట్టుకు చెడ్డ పేరు వచ్చింది. అందుకే వారిని నవంబర్ 30 వరకు సస్పెండ్ చేస్తున్నాం’ అని సీఎఫ్ఏ పేర్కొంది. షాంఘైలో మే 17న ప్రారంభమైన జాతీయ ఫుట్బాల్ శిబిరం శనివారంతో ముగిసింది. కరోనా నేపథ్యంలో 35 మంది యువ ఫుట్బాలర్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీఎఫ్ఏ పలు నిబంధనలు విధించింది. -
యువ భారత్ హ్యాట్రిక్ విజయం
డర్బన్: మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ జట్టు అండర్–19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో భారత్ 120 పరుగులతో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్ ఆరు పాయింట్లతో ఫైనల్కు చేరింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ రెండేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా ఈనెల 9న భారత్తో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే, న్యూజిలాండ్ మూడో స్థానం కోసం తలపడతాయి. న్యూజిలాండ్తో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓపెనర్ తిలక్ వర్మ (59; 8 ఫోర్లు, సిక్స్), సిద్ధేశ్ వీర్ (71; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు తొలి వికెట్కు 135 పరుగులు జోడించారు. అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సుశాంత్ మిశ్రా (3/35), అథర్వ (3/16), విద్యాధర్ పాటిల్ (2/31) న్యూజిలాండ్ను దెబ్బతీశారు. -
భారత అండర్–19 జట్ల శుభారంభం
తిరువనంతపురం: నాలుగు జట్ల అండర్–19 వన్డే సిరీస్లో ఆతిథ్య భారత్ ‘ఎ’... ‘బి’ జట్లు శుభారంభం చేశాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత అండర్–19 ‘ఎ’ జట్టు 157 పరుగుల తేడాతో... అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత ‘బి’ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ బృందం సరిగ్గా 50 ఓవర్లలో 251 పరుగులు సాధించింది. కమ్రాన్ ఇక్బాల్ (60; 3 ఫోర్లు), శాశ్వత్ రావత్ (64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 35.4 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్ష దూబే మూడేసి వికెట్లు తీశారు. అఫ్గానిస్తాన్తో పోరులో భారత ‘బి’ జట్టు 107 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హైదరాబాద్ ఆటగాడు, ఓపెనర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ (70 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ చంద్రోల్ (51 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో... తిలక్ వర్మ, రాహుల్ క్రీజులో నిలదొక్కుకొని అభేద్యంగా 102 పరుగులు జోడించి భారత్ విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు అఫ్గానిస్తాన్ జట్టు 47.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత ‘బి’ బౌలర్లలో పూర్ణాంక్ త్యాగి (4/36), ప్రయాస్ రే బర్మన్ (3/10), అథర్వ (2/18) ఆకట్టుకున్నారు. -
ఇన్నింగ్స్లో 10 వికెట్లు
సాక్షి, అనంతపురం: బీసీసీఐ దేశవాళీ అండర్–19 టోర్నీ (కూచ్ బెహర్ ట్రోఫీ)లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్కుమార్ సింగ్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇక్కడి ఆర్డీటీ మైదానంలో అరుణాచల్ప్రదేశ్తో బుధవారం ముగిసిన మ్యాచ్లో రెక్స్ ఈ రికార్డు సాధించాడు. 9.5 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన రెక్స్ 10 వికెట్లు తీశాడు. వీటిలో 6 మెయిడెన్లు ఉన్నాయి. అతని ధాటికి అరుణాచల్ తమ రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కూడా కూడా రెక్స్ 5 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి ఇన్నింగ్స్ 138కే ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో 122కే ఆలౌటై 16 పరుగుల ఆధిక్యం కోల్పోయిన మణిపూర్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసి విజయాన్నందుకుంది. -
15 ఏళ్ల తర్వాత 'తొలి మ్యాచ్'!
సిడ్నీ: ఆస్ట్రేలియా అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడటానికి సన్నద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు.. సఫారీ, ఇంగ్లండ్ జట్లతో ట్రై సిరీస్లో తలపడనుంది.దాంతో 15 ఏళ్ల విరామానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు ఫుల్స్టాప్ పెట్టనుంది. చివరిసారి 2003లో స్వదేశంలో ఇంగ్లండ్తో తలపడగా, ఆపై ఇంతకాలాని 'తొలి అంతర్జాతీయ మ్యాచ్'ను ఆడటానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు సన్నద్ధమైంది. మరొకవైపు ఆసీస్ అండర్ 19 మహిళలకు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం ఇక్కడ విశేషం. ఇందులో 50 ఓవర్ల ట్రై సిరీస్తో పాటు, రెండు టీ 20 మ్యాచ్ల్లో ఆసీస్ జట్టు పాల్గొనుంది. ఈ మేరకు 14 మంది మహిళా క్రికెటర్లతో కూడిన ఆసీస్ జట్టును ప్రకటించారు. ఆసీస్ అండర్ 19 మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్గా 16 ఏళ్ల రాచెల్ ట్రెనామన్ను ఎంపిక చేయగా, టీ 20 జట్టుకు సారథిగా సస్కియా హార్లీని నియమించారు. -
అందుకే ద్రవిడ్ అంటే ఇష్టం: కేటీఆర్
హైదరాబాద్: భారత యువ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్. ఒక క్రికెటర్గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకు కారణం ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్లో భారత క్రికెట్ జట్టును విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వాలంటూ రాహుల్ ద్రవిడ్ కోరడమే. ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తూ శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్తపై కేటీఆర్ స్పందిస్తూ... ఒక క్రికెటర్గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని ట్వీట్ చేశారు. ప్రపంచకప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. This is why Rahul Dravid is not only my favourite cricketer but also my favourite person as well 🙏 https://t.co/xsSas8wdSV — KTR (@KTRTRS) 26 February 2018 -
అండర్ 19 క్రికెటర్ అరెస్ట్
లండన్: బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఎదుట అభ్యంతకరంగా ప్రవర్తించిన ఇంగ్లండ్ అండర్ -19 క్రికెటర్ శివ్ థాకూర్ను అరెస్ట్ చేశారు. ఈ జూన్ నెలలో వరుస వేర్వేరు ఘటనల్లో శివ థాకూర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు వచ్చాయి. ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రదేశాల్లో శివ్ థాకూర్ అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం ఆ యవ క్రికెటర్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో డెర్బీషైర్ ఒక ప్రకటన చేసింది.'అతను మా క్లబ్ కు గతంలో ఆడిన మాట వాస్తవమే. ఇప్పుడు సదరు క్రికెటర్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను మా క్లబ్ తరపును ఆడటం లేదు' అని తెలిపింది. 2014 నుంచి 2016 వరకూ సదరు యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు. -
ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ఎటువంటి ఇంటర్వ్వూలో నిర్వహించకుండానే అతన్ని ఎంపిక చేయాలని చూస్తున్నారు. భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
అండర్–19 క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి 20 వరకు నిర్వహించే జిల్లాస్థాయి క్రీడా పోటీలకు మండలస్థాయి అండర్–19 క్రీడా జట్ల ఎంపికలు గురువారం స్థానిక కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గోనే బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ శంకరన్న, పీఈటీలు వేణుగోపాల్, చంద్రశేఖర్, డీఎస్ఏ సిబ్బంది మనోహర్రెడ్డి, ఇస్మాయిల్, అనిల్, మంజుల, వాసంతి, శిరీష, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు కబడ్డీలో బాలురు : సురేష్, పృథ్వీ, కె.భరత్, మహమ్మద్రఫీ, సలీమ్మాలిక్ (ఎస్ఎస్బీఎన్), భరత్, కృష్ణ (ప్రభుత్వ పాలిటెక్నిక్), పవన్కుమార్, రాజు, షాకీర్, ఎస్.మహమ్మద్రఫీ, శర్మాస్వలీ(జెడ్పీ ఉన్నత పాఠశాల పాపంపేట), యశ్వంత్, పవన్కుమార్ (శ్రీ చైతన్య) బాలికలు : లక్ష్మీ, మానస, హరిత, రాజ్యలక్ష్మీ, లత, అనిత, దివ్య, వసంత, తేజస్విణి, పావని, భారతి, వైజయంతి (కేఎస్ఆర్ అనంతపురం), వై.తేజస్విణి, శివపార్వతి(ఎస్ఎస్బీఎన్) హ్యాండ్బాల్ : రవి, బాలరాజు, ఆసిఫ్, జాఫర్, అరుణ్కుమార్, మెహరాజ్, మహేష్బాబు, సన్నీ, ఆదిల్, యోగేంద్రరెడ్డి (ప్రభుత్వ ఉన్నత పాఠశాల అనంతపురం) అథ్లెటిక్స్ బాలురు : షాట్పుట్– సలీమ్, డిస్కస్త్రో–వినోద్, లాంగ్జంప్–అల్తాఫ్, 100మీ–మెహరాజ్, జావలిన్ త్రో–మహేష్బాబు, 400 మీ–రవి, 200మీ–లక్ష్మీనారాయణ బాలికలు : డిస్కస్త్రో–సుజాత, లాంగ్జంప్–అనిత, 100 మీ–గౌతమి, జావలిన్త్రో–రాజ్యలక్ష్మీ, 200 మీ–భార్గవి, 400 మీ–తేజస్విణి -
‘అండర్–19’ విజేత నారాయణ
ఒంగోలు: అండర్–19 సెంట్రల్ జోన్ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్ జోన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒంగోలు నారాయణ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో కందుకూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసి టీఆర్ఆర్ జట్టు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నారాయణ జట్టు 11 ఓవర్లలో లక్షా్యన్ని ఛేదించి జయకేతనం ఎగురవేసింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లను ఆర్ఐఓ రమేశ్బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు. అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం హరనాథబాబు, ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ దయానందం, ఫిజికల్ డైరెక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసింహారావు, ఏబీఎం జూనియర్ కాలేజీ పీడీ కే డేవిడ్రాజు, రాజు, కాశీరత్నం పాల్గొన్నారు. -
హైదరాబాద్కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 సౌత్జోన్ వన్డే లీగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ విజయాల బోణీ చేసింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయిన హైదరాబాద్... కర్ణాటకతో శుక్రవారం స్థానిక జింఖానా మైదానంలో జరిగిన నాలుగో మ్యాచ్లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 248 పరుగులు సాధించింది. పి. సారుు వికాస్ రెడ్డి (99 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... షేక్ సొహైల్ (50) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం కర్ణాటక జట్టు సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. దేవ్ పడికల్ (60), నికిన్ జోస్ (61), జయేశ్ (58) అర్ధ సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ (3/42), వినీత్ (2/36) రాణించారు. ఆంధ్ర గెలుపు తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు 34 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట ఆంధ్ర జట్టు 40 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ కుమార్ రెడ్డి (58), గిరినాథ్ (63) అర్ధ సెంచరీలు సాధించారు. తమిళనాడు 43.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి మూడు వికెట్లు, ఆశిష్, ధ్రువ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం హైదరాబాద్ ఖాతాలో నాలుగు, ఆంధ్ర ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
హైదరాబాద్ బాలికలకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ రన్నరప్తో తృప్తిపడింది. సికింద్రాబాద్లోని పల్లవి మోడల్ స్కూల్ గ్రౌండ్సలో సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జిల్లా 15-8, 15-13తో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. దీంతో రంగారెడ్డి జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో వరంగల్ 15-11, 15-10తో ఖమ్మంపై నెగ్గింది. బాలుర విభాగంలో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ 15-12, 12-15, 15-5తో హైదరాబాద్ను కంగుతినిపించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15-13, 15-11తో రంగారెడ్డిపై నెగ్గింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రావెల్ పాయించ్ఆర్ సొల్యూషన్స మేనేజింగ్ డెరైక్టర్ ఖాజీ నజీముద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఎస్జీఎఫ్టీఎస్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పల్లవి స్కూల్ జీఎం గోపాల్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య, ఉమ, హన్నీ, రాము గౌడ్, రాజేంద్రప్రసాద్, జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ అండర్-19 జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సౌత్జోన్ అండర్-19 ‘వినూ మన్కడ్’ ట్రోఫీలో పాల్గొనే జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సోమవారం ప్రకటించింది. హైదరాబాద్లో అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్టుకు మైకేల్ జైశ్వాల్ కెప్టెన్గా... నితీశ్ రెడ్డి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. అబ్దుల్ బరీ వహాబ్ కోచ్గా వ్యవహరిస్తారు. జట్టు: మైకేల్ జైశ్వాల్, కె. నితీశ్ రెడ్డి, జి. వినీత్ రెడ్డి, ఎంఎస్ఆర్. చరణ్, అయూబ్, పి. సారుు వికాస్ రెడ్డి, అబ్దుల్ ఆల్ ఖురేషీ, చందన్ సహాని, టి. సంతోష్ గౌడ్, కె. భగత్ వర్మ, పి. నీలేశ్, రాజమణి ప్రసాద్, మొహమ్మద్ అజర్ అలీ (వికెట్ కీపర్), సోహైల్, అలంకృత్ అగర్వాల్, శ్రీచరణ్. -
సాఫ్ట్బాల్ పోటీలకు 13 మంది ఎంపిక
భాకరాపేట : అండర్ 19 బాలికల సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా నుంచి 13 వుందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజర్ ఎ.జయరామయ్య తెలిపారు. బుధవారం చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 వుంది బాలికలను రాష్ట్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. వారిలో ఎన్.పవనకువూరి(పీలేరు), ఎ.అఖిల(ఎస్పీడబ్ల్యూ), ఎస్.అనూష(చిత్తూరు), సీ.ఆదిలక్ష్మి(నగరి), పీ.హేవూవతి(పుత్తూరు), ఎం.నందిని(అంగళ్లు), ఎన్.స్వాతి(ఎస్పీడబ్ల్యూ), కె.విజయదుర్గ(పెనువుూరు), ఎం.జ్యోత్సS్న (చిన్నగొట్టిగల్లు), వి.భారతి (చిన్నగొట్టిగల్లు), ఎ.రోజా(పీలేరు), కె. వెంకటరవుణవ్ము (ఎస్పీడబ్ల్యూ), ఎ.రాశి(ఎస్పీడబ్ల్యూ) ఉన్నారు. ఈ కార్యక్రవుంలో చిన్నగొట్టిగల్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.సిద్దవుుని, పీ.డీ షాజహాన్, పీఈటీలు రావుకష్ణ రంగన్న, అన్సర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గుంటూరుపై కృష్ణా జట్టు విజయం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్–19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యా^Œ ల్లో రెండో రోజైన బుధవారం గుంటూరుపై కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు–కృష్ణా జిల్లా జట్ల మధ్యన జరిగిన తొలిరోజు మ్యాచ్లో గుంటూరు జట్టు 29.1 ఓవర్లకు 78 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్ను కొనసాగించి మొత్తం 375 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 45.3 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కొనసాగుతున్న వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల పోరు వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల మధ్యన పోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొలిరోజు మ్యాచ్లో పశ్చిమగోదావరి జట్టు 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వైఎస్సార్ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆటను కొనసాగించి మొత్తం 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. గురువారం ఆట కొనసాగనుంది. -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
వెంకటగిరి : పట్టణంలోని తారక రామా క్రీడాప్రాంగణంలో గురువారం జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. గురువారం కర్నూలు, కృష్ణా జట్లు మధ్య జరిగిన పోటీల్లో కృష్ణా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 43 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు కంటే కృష్ణా జిల్లా జట్టు 86 పరుగుల ఆధిక్యత సాధించింది. శుక్రవారం మ్యాచ్ కొనసాగనుంది. తూర్పుగోదావరి, ప్రకాశం జట్లు మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.2 ఓవర్లల్లో 82 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రకాశం జట్టు ఆటముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. శుక్రవారం ఆట కొనసాగించనున్నారు. -
క్రికెట్ మ్యాచ్లకు అంతరాయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్ 29 పరుగులు చేయగా మహీప్ 72 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్ ముగిసింది. కొనసాగుతున్నకడప బ్యాటింగ్.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్ 1 వికెట్ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. -
క్రికెట్ మ్యాచ్లకు అంతరాయం
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ గ్రూపు క్రికెట్ పోటీలకు వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మ్యాచ్లను మధ్యాహ్నం తర్వాత ప్రారంబించారు. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో సాయంత్రం 4.05 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. 92 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు 36 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులోని నోవా 39, ప్రణీత్ 29 పరుగులు చేయగా మహీప్ 72 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. అనంతపురం బౌలర్లు గిరినాథ్, ముదాసిర్, సాంబశివా తలా ఒక వికెట్ తీశారు. దీంతో మూడోరోజు మ్యాచ్ ముగిసింది. కొనసాగుతున్నకడప బ్యాటింగ్.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కడప–విశాఖ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. 20 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కడప జట్టు 63 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. జట్టులోని నూర్బాషా 52 పరుగులు చేశాడు. విశాఖ బౌలర్లు వంశీ 3, ప్రశాంత్ 1 వికెట్ తీశారు. దీంతో మూడోరోజు ఆట ముగిసింది. కాగా వర్షం తగ్గుముఖం పడితే శనివారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. -
'మన్కడింగ్'తో క్వార్టర్స్ బెర్త్!
అండర్-19 ప్రపంచకప్లో క్వార్టర్స్కు చేరిక చిట్టగాంగ్: అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టు అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్కు చేరింది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఎవరు నెగ్గితే వారు క్వార్టర్స్కు చేరతారు. అయితే 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చివరి ఓవర్లో విజయానికి మూడు పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే విండీస్ బౌలర్ కీమో పాల్ నాన్ స్ట్రయిక్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మన్ మటిగిమును మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. మటిగిము బ్యాట్ క్రీజులో కాకుండా లైన్ పైన ఉండడంతో మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారం అవుట్గా ప్రకటించారు. దీంతో జింబాబ్వేకు ఊహించని షాక్ తగలగా... విండీస్ 2 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 226 పరుగులు చేసింది. స్ప్రింగర్ (71 బంతుల్లో 61; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మగరిరాకు మూడు, మధెవెరెకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 49 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్నిడెర్ (71 బంతుల్లో 52; 9 ఫోర్లు), కీఫే (47 బంతుల్లో 43; 5 ఫోర్లు) బ్యాటింగ్తో జట్టు విజయం వైపు పయనించినా చివర్లో దురదృష్టం వెంటాడింది. జోసెఫ్కు నాలుగు, స్ప్రింగర్కు రెండు వికెట్లు వచ్చాయి. భారత్ ప్రత్యర్థి నమీబియా అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ ‘డి’లో టాపర్గా నిలిచిన భారత్... క్వార్టర్ ఫైనల్లో నమీబియాతో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఈ జట్టు రెండో స్థానంలో నిలిచింది. శనివారం ఫతుల్లాలో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆడుతుంది. -
బంగ్లా స్పిన్నర్ బౌలింగ్ పై వేటు
ఢాకా: బంగ్లాదేశ్ అండర్ -19 జట్టులో కీలక స్పిన్నరైన సంజిత్ సాహా బౌలింగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. సంజిత్ సాహా బౌలింగ్ వివాదాస్పదంగా ఉన్న కారణంగా అతని బౌలింగ్ ను నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ ఆదివారం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో సంజిత్ బౌలింగ్ కు దూరంగా ఉండనున్నాడు. బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సంజిత్ సాహా బౌలింగ్ అనుమానంగా ఉండటంతో ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన అనంతరం అతని బౌలింగ్ ను నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. అతను నిబంధనలను ఉల్లంఘించి బౌలింగ్ చేసినట్లు తెలిపింది. -
వరల్డ్ కప్ లో యువ భారత్ జోరు
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. గ్రూప్-డిలో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో యువ భారత్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆ తరువాత కివీస్ ను పేక మేడలా కూల్చేసింది. దీంతో యువ భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్ విసిరిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 31.3 ఓవర్లలో 138 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి చెందింది. కివీస్ ఆటగాళ్లలో లియోపార్డ్ (40), అలెన్(29), పారిక్(26), స్కాట్(29)లు మాత్రమే ఫర్వాలేదనిపించగా, మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలం చెందారు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో లామ్రోర్ ఐదు, అవిష్ ఖాన్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, అన్సారీకి ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(4), రికీ భూయి(1)మరోసారి నిరాశపరిచినప్పటికీ, రిషబ్ పాంట్(57), సర్ఫరాజ్ ఖాన్(74), ఆర్మాన్ జాఫర్(46),లామ్రోర్(45) లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. -
అదరగొట్టిన యువ భారత్
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా గురువారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు అదరగొట్టి 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (74),వాషింగ్టన్ సుందర్(62)లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా, రికీ భూయి(39),జీషన్ అన్సారీ (36) ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ 50.0ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. అనంతరం 269 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు టెక్టార్(1), దోహ్నీ(4)లు నిష్ర్కమించడంతో ఐర్లాండ్ కష్టాల్లో పడింది. ఆ తరువాత డెన్నిసన్(20), గారీ మెక్ క్లింటాక్(17)లు అవుట్ కావడంతో ఐర్లాండ్ 46 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విలియమ్ మెక్ క్లింటాక్(58),టక్కర్(57)లు రాణించినా ఐర్లాండ్ ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఈ జోడీ ఐదో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం మినహా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. దీంతో ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. భారత బౌలర్లలో రాహుల్ బాథమ్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
దుమ్ము రేపిన సర్ఫరాజ్, ఖలీల్
సావర్(బంగ్లాదేశ్): అండర్-19 వరల్డ్ కప్ సన్నాహక ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో యువ భారత్ దుమ్మురేపుతోంది. సోమవారం పాకిస్థాన్ తో జరిగిన వార్మప్ వన్డే మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ ను ఖలీల్ అహ్మద్ కుప్పకూల్చగా, ఆ తరువాత బ్యాటింగ్ లో సర్పరాజ్ ఖాన్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ ను ఎదుర్కోలేక డీలా పడిన పాకిస్తాన్ రెండొందల పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. ఖలీల్ అహ్మద్ 8.0 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 44.1 ఓవర్లలో 197 పరుగులకే చాపచుట్టేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ ఉమర్(36), సల్మాన్ ఫయ్యాజ్(29), గౌహార్ హాఫీజ్(25), హాసన్ మొహ్ సిన్(33) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో సర్పరాజ్ ఖాన్ తనదైన శైలిలో బ్యాట్ ను ఝుళిపించాడు. 68 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 81 పరుగులు చేసి ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్(28 నాటౌట్),లామ్రోర్(22) మరో వికెట్ పడకుండా భారత్ కు ఘన విజయాన్ని అందించారు. -
కుమ్మేసిన యువ టీమిండియా
సావర్(బంగ్లాదేశ్): అండర్ -19 వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో భాగంగా ఇక్కడ కెనడాతో జరిగిన వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత యువ జట్టు కుమ్మేసింది. కెనడాను ఓ ఆటాడుకున్న భారత్ 372 పరుగులతో తేడాతో భారీ విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీల సాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. యువ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషాన్(138 రిటైర్డ్ హర్ట్; 86 బంతుల్లో16 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా, అతనికి జతగా ఓపెనర్ గా వచ్చిన ఆర్ ఆర్ పాంట్(62) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం రికీ భుయీ(115; 71 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.ఆపై సర్ఫరాజ్ ఖాన్(48), ఆర్మాన్ జాఫర్(36), లామ్రోర్ (55నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో యువ భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 485 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కెనడా 31.1 ఓవర్లలో 113 పరుగులకే చాపచుట్టేసింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆ తరువాత కెనడాను పేకమేడలా కూల్చేసింది. కెనడా ఆటగాళ్లలో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్కును చేరుకోలేకపోవడం గమనార్హం. కెనడా ఇన్నింగ్స్ లో మిడిల్ ఆర్డర్ ఆటగాడు హెచ్ ధాకర్(25) చేసిన పరుగులే అత్యధిక స్కోరు. యువ భారత బౌలర్లలో లామ్రోర్ కు మూడు వికెట్లు లభించగా, మావి, జీషన్ అన్సారీలకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు. సోమవారం ఇక్కడ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33.5 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(56), రిషాబ్ పాంట్(35) శుభారంభాన్నివ్వగా, అనంతరం రికీ భుయ్(29), కెప్టెన్ ఇషాన్ కిషన్(12)లు మిగతా పనిని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో దమిత్ సిల్వా మూడు వికెట్లు తీశాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని 47.2 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక ఆటగాళ్లలో విషాద్ రందికా డిసిల్వా(58) హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. భారత్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, మయాన్ దాగర్ లు కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇదిలా ఉండగా, ముక్కోణపు టోర్నీలో ఒక మ్యాచ్ ల్లో కూడా ఓటమి చెందంకుండా ట్రోఫీని అందుకున్న యువ భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అభినందించింది. -
భారత్ జైత్రయాత్ర
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గురువారం ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో తన చివరి లీగ్ ను ఘనంగా ముగించిన భారత్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో కవీన్ బండారా(74), కిమిందు మెండిస్(65)లు రాణించగా, కెప్టెన్ చరితా అసలంకా(22) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు సాధించి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. శ్రీలంక చివరి ఆరు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత యువజట్టు 47.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(61), విరాట్ సింగ్(60 నాటౌట్) లు మరోసారి ఆకట్టుకుని జట్టు గెలుపులో సహకరించారు. -
అండర్-19 సింగిల్స్ విజేత వృశాలి
- సాత్విక్-కృష్ణప్రసాద్లకు డబుల్స్ టైటిల్ జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ జైపూర్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాద్ క్రీడాకారులు వృశాలి మెరిసింది. టాప్సీడ్గా బరిలోకి దిగిన వృశాలి అండర్-19 బాలికల సింగిల్స్లో టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 21-15, 18-21, 21-19తో రెండోసీడ్ శ్రేయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్, బాలుర డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్) టైటిల్స్ గెలిచాడు. బాలుర అండర్-17 డబుల్స్ తుదిపోరులో సాత్విక్ సాయిరాజ్-కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) ద్వయం 21-23, 21-19, 21-12తో ధ్రువ్ కపిల-సాయిపవన్ జంటపై విజ యం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్-అహిల్యా హర్జాని (మహారాష్ట్ర) జంట 21-13, 21- 13తో బాలరాజ్ కజియా-మిథుల జోడి (కర్ణాటక)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి తనిష్క్ బాలికల అండర్-17 సింగిల్స్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 13-21, 17-21తో వైదేహి చౌదరి (మహారాష్ర్ట) చేతిలో ఓడింది. -
ద్రవిడ్ సర్ మా కోచ్ అంటే నమ్మకంగా లేదు..
కోల్ కతా:'ద్రవిడ్ సర్ మా కోచ్ అంటే నమ్మశక్యంగాలేదు. నేను ఇప్పటికీ ద్రవిడ్ సర్ శిక్షణలో పని చేస్తున్నానన్న నమ్మకం కల్గడం లేదు. ద్రవిడ్ సెంచరీలు చేయడాన్ని టీవీల్లో చూసేవాణ్ని. ఇప్పుడు ఆయన జట్టుకు కోచ్ గా పనిచేస్తూ మా పక్క గదిలో ఉంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది' అని అండర్-19 ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్ జరిగిన తుదిపోరులో సర్ఫరాజ్ (59; 27 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు) వీర విహారం చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిలో భాగంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ.. అండర్ 19 జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. ద్రవిడ్ సెంచరీలు చేయడాన్ని టీవీల్లో తిలకించిన తనకు ఆయనతో అనుభవాలను పంచుకోవడం గర్వంగా ఉందని సర్ఫరాజ్ స్పష్టం చేశాడు. వచ్చే వరల్డ్ కప్ కు ద్రవిడ్ అనుభవం తమ జట్టుకు ఎంతోగాను ఉపయోగపడుతుందన్నాడు. గత మూడు మ్యాచ్ ల్లో తాను పేలవంగా ఆడినా .. ద్రవిడ్ సర్ ఏమీ అనలేదన్నాడు. సహజసిద్ధంగా ఆడమని మాత్రమే ద్రవిడ్ సర్ తనకు చెప్పారన్నాడు. అదే ఈరోజు మ్యాచ్ లో ఉపయోగపడిందన్నాడు. ద్రవిడ్ సర్ ప్రశాంతంగా ఉంటూ జట్టు సభ్యులకు అమూల్యమైన సలహాలను ఇస్తుంటారని సర్ఫరాజ్ తెలిపాడు. ఒక బ్యాటింగ్ లెజెండ్ తో కలిసి పనిచేయడాన్ని తమ జట్టు సభ్యులు ఆస్వాదిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
సర్ఫరాజ్ వీర విహారం:భారత్దే టైటిల్
కోల్ కతా: అండర్-19 ముక్కోణపు క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ వీరవిహారం చేశాడు. 26 నిమిషాలు పాటు క్రీజ్ లో అజేయంగా ఉన్న సర్ఫరాజ్ 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడు. దీంతో ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన అండర్ -19 ముక్కోణపు సిరీస్ తుదిపోరులో యువ భారత్ ఘన విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. సర్ఫరాజ్ దాటిగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లా విసిరిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు భారత్ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ (12) నిరాశపరచగా, రిషబ్ పాంట్(26) ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రికీ భూయి(20), సర్ఫాజ్ ఖాన్(59) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉండి భారత్ కు విజయాన్నందించారు. వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పి బంగ్లాపై అద్భుతమైన గెలుపుకు సహకరించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 36.5 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటయ్యింది. బంగ్లా ఆటగాళ్లలో నజ్ముల్లా హుస్సేన్ (45) జోయ్ రాజ్ షేక్(28),జాకెర్ అలీ(24) మినహా ఎవరూ రాణించలేదు. ఎనిమిది మంది బంగ్లా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్లలో మయాంక్ దాగర్ మూడు వికెట్లు సాధించగా, శుభం మావి, లామ్రోరర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. -
ఆఫ్ఘాన్ పై బంగ్లా గెలుపు
కోల్ కతా: అండర్-19 ముక్కోణపు సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ జట్టులో ఓపెనర్లు హజ్రాతుల్లా(34), ఇస్మానుల్లా(14) మాత్రమే రెండంకెల మార్కును చేరుకున్నారు. అనంతరం తొమ్మిదిమంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆఫ్ఘాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో సాలేహ్ అహ్మద్ షావోన్ ఆరు వికెట్లు తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించాడు. కాగా, స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ పోరాడి గెలిచింది. సైఫ్ హసన్(32), హుస్సేన్ శాంతో(19), జాకీర్ హసన్(13)లు ఫర్వాలేదనిపించడంతో బంగ్లా గట్టెక్కింది. ఈ మ్యాచ్ లో విజయంతో బంగ్లాకు ఐదు పాయింట్లు లభించాయి. -
మరోసారి అదరగొట్టిన భారత్
కోల్ కతా: అండర్-19 ముక్కోణపు సిరీస్ లో భారత కుర్రాళ్లు మరోసారి అదరగొట్టారు. శనివారం ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో భారత్ 33 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘానిస్థాన్ పోరాడి ఓడింది. ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో ఓపెనర్లు హజర్ తుల్లా (21), ఇస్మాతుల్లా(25) ఫర్వాలేదనించగా, చివర్లో రషిద్ ఖాన్(43), మహ్మద్ సర్దార్(33) లు ఆకట్టుకున్నారు. కాగా, మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో ఆఫ్ఘాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా, ప్రమాణిక్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 236 పరుగులు చేసింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పాంట్ (87), మహిపాల్ లామ్రోర్ (43)లు బ్యాట్ ఝుళిపించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
తొలి మ్యాచ్ లో భారత్ ఘనవిజయం
కోల్ కతా: అండర్-19 ట్రై సిరీస్ లో భారత్ బోణి కొట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది. భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(34), అమూల్ ప్రీత్ సింగ్(28), జిషన్ అన్సారీ(34), అవిష్ ఖాన్(25)లు ఓ మోస్తరుగా రాణించారు. దీంతో భారత్ 45.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సైఫ్ హసన్(0), పినాక్ ఘోష్(1) పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ వరుస వికెట్లను చేజార్చుకుంది. 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఇక తేరుకోలేదు. బంగ్లా ఆటగాళ్లలో షఫిల్ హయత్(26), సయిద్ సర్కార్(13)లు రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అవిష్ ఖాన్ బంగ్లా పతనాన్ని శాసించాడు. అవినాష్ ఆరు ఓవర్లు బౌలింగ్ వేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండటం విశేషం. అతనికి జతగా కేకే సేథ్, జిషన్ అన్సారీలకు తలో రెండు వికెట్లు లభించాయి.