మరోసారి తడబాటు | In second Test India 'A' team scored again stumbled | Sakshi
Sakshi News home page

మరోసారి తడబాటు

Published Sat, Aug 1 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

మరోసారి తడబాటు

మరోసారి తడబాటు

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 267/6
చెన్నై:
ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డారు. కంగారూల బౌలింగ్‌ను ఎదుర్కొలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అసాధ్యం. అభినవ్ ముకుంద్ (163 బంతుల్లో 59; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (66 బంతుల్లో 49; 8 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసింది.

అపరాజిత్ (28 బ్యాటింగ్), గోపాల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 53 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లలో పుజారా (11) మళ్లీ నిరాశపర్చాడు. వన్‌డౌన్‌లో కోహ్లి (94 బం తుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ నాయర్ (34 బంతుల్లో 31; 7 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. కీఫీ 3 వికెట్లు తీశా డు. అంతకుముందు 329/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 107.5 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 214 పరుగుల ఆధిక్యం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement