భారత్‌కు నాలుగు పతకాలు | India has four medals | Sakshi
Sakshi News home page

భారత్‌కు నాలుగు పతకాలు

Sep 19 2017 12:27 AM | Updated on Sep 19 2017 4:44 PM

ఆసియా ఇండోర్, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడల్లో భారత్‌ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది

అష్గబాత్‌ (తుర్క్‌మెనిస్తాన్‌): ఆసియా ఇండోర్, మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడల్లో భారత్‌ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల పెంటాథ్లాన్‌ ఈవెంట్‌లో పూర్ణిమా హెంబ్రామ్‌ బంగారు పతకం నెగ్గింది.

ఐదు ఈవెంట్ల ఈ పోటీలో ఆమె 4,062 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్‌ పాల్‌ సింగ్, మహిళల 3000 మీ. పరుగులో సంజీవని జాదవ్‌ చెరో రజతం గెలిచారు. మహిళల లాంగ్‌ జంప్‌లో నీనా వారకిల్‌ కాంస్యం నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement