
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. నికోలస్ పూరణ్ (37 బంతుల్లో 58; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ కరన్ 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ జానీ బెయిర్స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), జో డెన్లీ (29 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment