
సాక్షి, విజయవాడ: వచ్చే నెలలో కొలంబియాలో, ఆ తర్వాత టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. భువనేశ్వర్లో జరిగిన ట్రయల్స్లో ఈ విజయవాడ ఆర్చర్ నంబర్వన్గా నిలిచింది.
తద్వారా రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లతో పాటు జూన్లో నెదర్లాండ్స్ ఆతిథ్యమిచ్చే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా ఈ తెలుగు అమ్మాయి భారత్ జట్టులో బెర్త్ సంపాదించింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 2880 పాయింట్లకుగాను 2801 పాయింట్లు స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment