Jyoti
-
భార్యను వదిలేసి పరారీ..
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడొక భర్త. తనకోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు ఆరు రోజులుగా నిరీక్షిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్కు చెందిన లక్ష్మణ్ బిచ్కుందలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈనెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఇసుక డంప్పై ఆమెను పడుకోబెట్టి, తెల్లారి వస్తానని చెప్పి, మూడు నెలల బాబును మాత్రం తీసుకుని వెళ్లాడు. తెల్లారి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి.. చలిలో ఇసుకపైనే గడుపుతోంది. అక్కడ ఉన్న స్థానికులు దీనిని గమనించి రోజూ అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయతి్నంచామని, కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జ్యోతిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి ఆశతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది. -
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్రూంకు పంపించడంలో స్టాఫ్నర్సులు, ఎఫ్ఎన్వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు. కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిని బతికించాలని చూశాంజ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్బేగం, హెచ్వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి -
బాలింతకు నరకయాతన..
అనంతగిరి (అరకులోయ రూరల్): పచ్చి బాలింతరాలు.. పైగా, సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగి వారం రోజులే అయింది.. క్షేమంగా ఆమెను ఇంటి వద్దకు చేర్చాల్సిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది ఆమెను నిర్లక్ష్యంగా, నిర్దయగా గ్రామానికి 3 కి.మీ. దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామర్ల జ్యోతి(32)ని ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్లో వారం కిందట చేర్చారు. కాన్పు ఇబ్బంది కావడంతో శస్త్రచికిత్స చేశారు. పండంటి ఆడ శిశువు పుట్టింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. వాజంగిలోని బాలింత ఇంటి వరకు రావాల్సిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే వారిని దింపేసి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న తాను మరో దారిలేక కష్టంగా కాలినడకన ఇంటికి చేరాల్సి వచ్చిందని బాలింత జ్యోతి, ఆమె బంధువు రవికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స కుట్లు ఇంకా పచ్చిగానే ఉండటంతో గ్రామానికి చేరేందుకు నరకయాతన చూడాల్సి వచ్చిందని బాధితు రాలు వాపోయింది. వాహన సిబ్బంది కనీస మానవత్వం చూపలేదని, తామింక రాలేమని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె ఆరోపించింది. -
ఈమె.. డ్రోనాచార్యులే
‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’తో ఎంటర్ప్రెన్యూర్గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్ప్రెన్యూర్లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. హరియాణాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మాలిక్ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్’ జ్యోతి మాలిక్కు మైక్రో–ఎంటర్ప్రెన్యూర్గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్.అమృత్సర్లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్ సంధూకు కల్పనా చావ్ల రోల్ మోడల్. రాకెట్లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్. ది రిమోట్ పైలట్ సర్టిఫికెట్(ఆర్పీసీ), అగ్రికల్చర్ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి. ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్ప్రెన్యూర్గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్ ఆన్ ది స్ట్రీట్’ నినాదంతో ‘ఏవీపీఎల్’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్’ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు.‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్ వెంచర్లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్.‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్ పైలట్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్ ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్’ కో–ఫౌండర్, సీయీవో ప్రీత్ సంధూ. -
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్తో మొదలు.. అథ్లెటిక్స్లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్పుట్లో తజిందర్ పాల్సింగ్ తూర్, ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్తో హీట్స్లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్లో ఈ రౌండ్ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
మహిళా వలంటీర్పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
యెచోన్ (దక్షిణ కొరియా): కొత్త సీజన్లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్ క్వాలిఫయింగ్లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
సెర్టోహన్బాష్ (నెదర్లాండ్స్): కొత్త సీజన్ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్ గేమ్స్లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్ గేమ్స్ వరల్డ్ అథ్లెటిక్స్లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్ (నెదర్లాండ్స్; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్ బాస్ట్ (నెదర్లాండ్స్; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్ ప్రకారం జ్యోతికి ఒలింపిక్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధిస్తారు. -
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్లు ఆదివారం జరుగుతాయి. -
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 155–151తో బెసెరా–మెండెజ్ (మెక్సికో) జంటను ఓడించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత (భారత్) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో ధీరజ్ –అంకిత 0–6తో లిమ్ సిహైన్–కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ మూడో రౌండ్లో 4–6 తో కెన్ సాంచెజ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్కే చెందిన తరుణ్దీప్ రాయ్ క్వార్టర్ ఫైనల్లో 3–7తో టెమినో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లో 6–4తో జెన్ హన్యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీఫైనల్ చేరింది. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
స్పెయిన్లో శిక్షణకు జ్యోతి యర్రాజీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్పెయిన్లో 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. జ్యోతికి సంబంధించి విమాన ప్రయాణాలు, వసతి, శిక్షణ ఇతరత్రా ఖర్చులన్నీ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) భరిస్తుందని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ సహా, ఈ సీజన్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు ఎంఓసీ పథకంలో ఆమెతో పాటు పలువురు అథ్లెట్లకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. వైజాగ్కు చెందిన 24 ఏళ్ల జ్యోతి గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్లో రజత పతకం గెలిచింది. మరో తెలుగుతేజం, స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు కూడా మరింత మెరుగైన శిక్షణ కోసం ఆరి్థక సాయం అందించే ప్రతిపాదనకు ఎంఓసీ ఆమోదం తెలిపింది. -
భారత ఆర్చరీ జట్టులో ధీరజ్, జ్యోతి సురేఖ
ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో హరియాణాలోని సోనీపట్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ట్రయల్స్లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా దక్కించుకున్నాడు. ధీరజ్తోపాటు తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మృణాల్ చౌహాన్ భారత రికర్వ్ జట్టులో చోటు సంపాదించారు. భారత మహిళల రికర్వ్ జట్టులో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత, కోమలిక ఎంపికయ్యారు. మరోవైపు ఒలింపిక్ ఈవెంట్కాని కాంపౌండ్ విభాగంలో భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతోపాటు అదితి స్వామి, పర్ణీత్ కౌర్, అవనీత్ కౌర్ చోటు సంపాదించారు. పురుషుల కాంపౌండ్ జట్టులో ప్రథమేశ్, అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, ప్రియాంశ్ ఎంపికయ్యారు. ప్రపంచకప్ తొలి టోర్నీకి ఏప్రిల్ 23 నుంచి 28 వరకు షాంఘై ఆతిథ్యమిస్తుంది. ప్రపంచకప్ రెండో టోర్నీ మే 21 నుంచి 26 వరకు యోచోన్లో, ప్రపంచకప్ మూడో టోర్నీ జూన్ 18 నుంచి 24 వరకు అంటాల్యాలో జరుగుతాయి. -
వేలెడంత.. బారెడంత..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి.. ఇద్దరూ ఒకచోట చేరితే.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇతడి పేరు సుల్తాన్ కోసెన్.. వయసు 41 ఏళ్లు.. టర్కీకి చెందిన కోసెన్ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు.. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు..ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం రెండు అడుగులే. ఇద్దరి మధ్య తేడానే ఆరు అడుగులకన్నా ఎక్కువ. సుమారు ఆరేళ్ల కింద ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫొటోషూట్ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మళ్లీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫొటో షూట్ కోసం వారిద్దరూ కలిశారు. అక్కడ తీసిన చిత్రాలే ఇవి. అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే.. పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్తో గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్ ఇలా భారీగా ఎదిగిపోయాడు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి భువనేశ్వర్లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ఈ చాంపియన్షిప్లో శనివారం మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్పుట్లో తజీందర్పాల్ సింగ్ తూర్ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్మిలన్ బైన్స్ కనకం మోగించింది. రేస్ను హర్మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది -
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్హోల్డర్స్కు సంబంధించి ఎన్నో మీటింగ్లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ
ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, ధీరజ్ బొమ్మదేవర ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బ్యాంకాక్లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో సురేఖ 144–141తో ప్రతుమ్సువన్ (థాయ్లాండ్)పై గెలిచింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ధీరజ్ 6–4తో తై యు సువాన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. -
ఆసియా క్రీడల్లో సత్తా చాటారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీకి 11 పతకాలు.. ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో!
తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జ్యోతి సురేఖకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్చరీ విజేత వెన్నం జ్యోతి సురేఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఆమె బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల బెర్లిన్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్, పారిస్లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. సీఎం జగన్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రదర్శనతో సురేఖ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని ప్రశంసించారు. ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సురేఖ తనకు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తండ్రి వెన్నం సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
హీట్స్లోనే జ్యోతి నిష్క్రమణ
బుడాపెస్ట్ (హంగేరి): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో పోటీపడ్డ భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఒత్తిడికిలోనై నిరాశపరిచింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి హీట్స్ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్ లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి ప్రపంచ చాంపియన్షిప్ లో మాత్రం ఓవరాల్గా 29వ స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. నాలుగో హీట్లో పోటీపడ్డ జ్యోతి 13.05 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో ర్యాంక్ లో నిలిచింది. మొత్తం ఐదు హీట్స్ జరగ్గా... ఒక్కో హీట్లో టాప్–4లో నిలిచిన వారు నేరుగా సెమీఫైనల్కు చేరారు . మిగిలిన వారిలో బెస్ట్–4 టైమింగ్ నమోదు చేసిన అథ్లెట్లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జ్యోతి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (12.78 సెకన్లు) సమయాన్ని ఇక్కడ పునరావృతం చేసి ఉంటే ఆమెకు సెమీఫైనల్ బెర్త్ కచి్చతంగా ఖరారయ్యేది. ఎందుకంటే ఇక్కడ 12.92 సెకన్ల సమయం నమోదు చేసిన మేకీ జిన్లిమ్ (నెదర్లాండ్స్)కు చివరిదైన 24వ సెమీఫైనల్ బెర్త్ లభించింది. ‘సూపర్’ షకేరీ... మహిళల 100 మీటర్ల స్ప్రింట్లో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన 23 ఏళ్ల షకేరీ రిచర్డ్సన్ 10.65 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ప్రపంచ చాంపియన్షిప్ లో పాల్గొన్న తొలిసారే షకేరీ స్వర్ణ పతకం సాధించడం విశేషం. షకేరీ ధాటికి ఐదుసార్లు 100 మీటర్ల వరల్డ్ చాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 10.77 సెకన్లు) మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
కాంస్యంతో జ్యోతి జాతీయ రికార్డు
చెంగ్డూ (చైనా): భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరో ఘనత సాధించింది. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి 12.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 12.82 సెకన్లతో గత ఏడాది తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. గత నెలలో ఆసియా చాంపియన్గా నిలిచిన జ్యోతి తదుపరి ఈనెల మూడో వారంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిలో పోటీపడుతుంది. అథ్లెటిక్స్లో శుక్రవారమే భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్ బొర్గోహైన్ కాంస్య పతకం సాధించాడు. అమ్లాన్ 20.55 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టు 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
భారత్ బాణం బంగారం.. ఈ పతకం ఎంతో ప్రత్యేకం
బెర్లిన్లో భారత మహిళల బృందం అద్భుతం చేసింది. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్ కౌర్లతో కూడిన భారత జట్టు ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో తొలిసారి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు 1931లో మొదలుకాగా భారత ఆటగాళ్లు మాత్రం 1981 నుంచి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. తాజా పసిడి పతక ప్రదర్శనకంటే ముందు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు 11 పతకాలురాగా అందులో తొమ్మిది రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఈ పతకాల సరసన తొలిసారి పసిడి పతకం వచ్చి చేరింది. బెర్లిన్ (జర్మనీ): ఎట్టకేలకు భారత ఆర్చరీ పసిడి కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో ఎంతోకాలంగా ఊరిస్తున్న స్వర్ణ పతకం మన దరి చేరింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి, పంజాబ్ క్రీడాకారిణి పర్ణీత్ కౌర్ బాణాల గురికి భారత్ ఖాతాలో బంగారు పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి, పర్ణిత్లతో కూడిన భారత జట్టు 235–229 పాయింట్ల తేడాతో డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. 2017, 2021 ప్రపంచ చాంపియన్షిప్లలో ఫైనల్ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకోగా... మూడో ప్రయత్నంలో మాత్రం పసిడి స్వప్నాన్ని సాకారం చేసుకుంది. భారత బృందం స్వర్ణం నెగ్గడంలో సీనియర్ జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. తొమ్మిదోసారి ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పాల్గొంటున్న 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తోంది. మెక్సికోతో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నాలుగు సిరీస్లలోనూ పైచేయి సాధించింది. ఒక్కో సిరీస్లో జట్టులోని ముగ్గురు సభ్యులు రెండు బాణాల చొప్పున మొత్తం ఆరు బాణాలు సంధిస్తారు. తొలి సిరీస్లో భారత్ 59–57తో, రెండో సిరీస్లో 59–58తో... మూడో సిరీస్లో 59–57తో.. నాలుగో సిరీస్లో 58–57తో ఆధిక్యం సంపాదించి చివరకు 235–229తో విజయం సాధించింది. నేడు జరిగే వ్యక్తిగత విభాగం నాకౌట్ దశ మ్యాచ్ల్లో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి పోటీపడనున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో పర్ణిత్తో జ్యోతి సురేఖ, సాన్ డి లాట్ (నెదర్లాండ్స్)తో అదితి ఆడతారు. గెలిస్తే జ్యోతి, అదితి సెమీఫైనల్లో తలపడతారు. 12 ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. ఇందులో ఒక స్వర్ణం, తొమ్మిది రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. 7 ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ పోటీల్లో జ్యోతి సురేఖ గెలిచిన మొత్తం పతకాలు. 2021లో మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో 3 రజత పతకాలు. 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఒక రజతం. 2019లో మహిళల టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో 2 కాంస్య పతకాలు... 2023లో మహిళల టీమ్ విభాగంలో ఒక స్వర్ణం. ఈ పతకం ఎంతో ప్రత్యేకం ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో వచ్చాం. గతంలో రజత, కాంస్య పతకాలు గెలిచా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్లో మరిన్ని పసిడి పతకాలు సాధిస్తాం. తొలి స్వర్ణం కావడంతో ఈ పతకం నాతోపాటు నా సహచరులకు ఎంతో ప్రత్యేకం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పలు పతకాలు నెగ్గినా స్వర్ణం మాత్రం దక్కలేదు. ఈసారి బంగారు పతకం సాధించడంతో ఎంతో ఆనందంగా ఉన్నాను. నేడు వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను. ఇందులోనూ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం. నేనీస్థాయికి చేరుకోవడానికి ఎల్లవేళలా మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. –జ్యోతి సురేఖ -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్షిప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్షిప్లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్షిప్లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్షిప్లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్షిప్లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్షాట్ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్కుమార్, రాజేష్లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్కు పంపించారు. లవర్కు రూ.40 లక్షలు నజరానా హేమంత్కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్లను పట్టుకుని.. శరత్ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్కుమార్, రాజేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్షాక్కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్లో పనిచేస్తున్నాను. కేఫ్లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్గర్ల్గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్లోని లెమన్ కేఫ్కి మేనేజర్గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
బిగ్ బాస్ ఫేం జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్.. రచ్చ మాములుగా లేదుగా..!
-
‘మాస్టర్’ మనసున్న మారాజు
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ భారత్లో క్రికెట్ దేవుడు. అంతేకాదు అతను మనసున్న మారాజు అని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా మళ్లీ ‘మాస్టర్’ తన పెద్ద మనసు చాటుకున్నాడు. మహిళా క్షురకులతో షేవింగ్ చేయించుకొని వారి ఆర్థిక అవసరాల కోసం స్కాలర్షిప్ అందజేశాడు. ఉత్తరప్రదేశ్లోని బన్వారితొల గ్రామానికి చెందిన నేహా, జ్యోతి క్షురకులు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణార్థం ఆయన వృత్తిని ఈ యువతులిద్దరు చేపట్టారు. భారత్లాంటి సంప్రదాయ దేశంలో కట్టుబాట్ల కంచెను దాటుకొని మహిళలు క్షౌరం చేయడం మామూలు విషయం కాదు. దీంతో బయటివారే కాదు సొంత బంధువుల నుంచే ఛీత్కారాలు ఎదురవుతుంటాయి. అలాంటి గేళి, ఎగతాళి చేసే దేశంలో జన్మనిచ్చిన తండ్రి కోసం నేహా, జ్యోతి 2014 నుంచి క్షురక వృత్తి చేపట్టారు. ఈ వార్తను తెలుసుకున్న సచిన్ వాళ్లిద్దరితో షేవింగ్ చేయించుకొని ‘జిల్లెట్’ సంస్థ ద్వారా స్కాలర్షిప్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ దిగ్గజం తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్లో పోస్ట్ చేశాడు. బయట షేవ్ చేసుకోవడం తనకిదే తొలిసారి అని చెప్పిన మాస్టర్, ఆ అవకాశం నేహా, జ్యోతిలకు దక్కిందని పోస్ట్ చేశాడు. -
ప్రపంచ ఆర్చరీ పోటీలకు జ్యోతి సురేఖ
సాక్షి, విజయవాడ: వచ్చే నెలలో కొలంబియాలో, ఆ తర్వాత టర్కీలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. భువనేశ్వర్లో జరిగిన ట్రయల్స్లో ఈ విజయవాడ ఆర్చర్ నంబర్వన్గా నిలిచింది. తద్వారా రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లతో పాటు జూన్లో నెదర్లాండ్స్ ఆతిథ్యమిచ్చే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా ఈ తెలుగు అమ్మాయి భారత్ జట్టులో బెర్త్ సంపాదించింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 2880 పాయింట్లకుగాను 2801 పాయింట్లు స్కోరు చేసింది. -
నాన్నకు వారసులు
దీపక్, రాజు అని పేర్లు మార్చుకుని, మగవాళ్లలా హెయిర్ కట్ చేసుకుని, ప్యాంటు షర్ట్ వేసుకుని జ్యోతి, నేహ చేస్తున్న జీవిత పోరాటం అసాధారణం మాత్రమే కాదు.. సాహసవంతమైన జీవన విన్యాసం కూడా! అమ్మానాన్న, ఇద్దరమ్మాయిలు. ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు మాది’.. అన్నట్లే వాళ్లది ముచ్చటైన కుటుంబం. ఆ ముచ్చట అలాగే కొనసాగితే ఆ ఇద్దరు అమ్మాయిలు అందరు అమ్మాయిల్లాగే ఉండేవాళ్లు.అబ్బాయిలుగా వారే వాళ్లే కాదు. ‘మారడం’ అంటే.. అబ్బాయిలుగా నటించాల్సి రావడం. ఆ నటన కూడా వెండి తెర మీదో, రంగస్థలం మీదో కాదు, నిత్య జీవితంలో! తెర మీద నటిస్తే చప్పట్లు కొడతారు. హర్షిస్తారు. నిజ జీవితంలో నటిస్తే అవేం ఉండవు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. జీవితంలో నటించక తప్పని ఆ ఇద్దరు అమ్మాయిల్ని సమాజం గౌరవించింది. ప్రభుత్వం కూడా వాళ్లను సత్కరించింది. ఆ గౌరవాన్ని, ఆ సత్కారాన్ని అందుకున్న అమ్మాయిలే జ్యోతికుమారి, నేహ. షాపు తెరిచారు.. వేషం మార్చారు జ్యోతి కుమారి వయసు 18, నేహకు పదహారేళ్లు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నగరానికి దగ్గరగా ఉన్న భన్వారీతోలి వాళ్లుండే గ్రామం. వాళ్ల నాన్న ధృవ నారాయణ. సెలూన్ నడిపేవాడు. నాలుగేళ్ల కిందటి వరకు ఆయన సెలూన్ నడుపుతూనే ఇంటిని పోషించాడు. పిల్లలిద్దరినీ చదివించాడు. 2014లో ఉన్నట్లుండి అనారోగ్యం పాలయ్యాడు. మంచం మీద నుంచి లేచి సెలూన్కు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి.సెలూన్ మూతపడింది. అతడు మంచాన పడటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ఇల్లు జరగాలంటే సెలూన్ తెరవాలి. తెరిచినా సెలూన్లో పని ఎవరు చేయాలి? ఇంట్లో ఒక్క మగపిల్లాడు కూడా లేడు. ధృవ నారాయణ భార్యకు భర్తను చూసుకోవడంతోనే సరిపోతోంది. పైగా సెలూన్ అన్నది ఆడపిల్లలు చేసే పని కాదు. మరి.. ఇల్లు గడవాలంటే, ఆ ఇద్దరే ఏదో ఒక పని చేయాలి. వేరే మార్గం లేదు. బాగా ఆలోచించాక ఓ రోజు.. అక్కాచెల్లెళ్లిద్దరూ వెళ్లి సెలూన్ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. నాన్న పని చేసేటప్పుడు చూసిన అనుభవం తప్ప స్వయంగా చేసిన అనుభవం లేదు. ‘సవ్యంగా చేస్తారా ఈ ఆడపిల్లలు’ అని సెలూన్కి వచ్చే మగవాళ్లకు భయం. ‘‘జాగ్రత్తగా చేస్తాం’’ అని బతిమిలాడి వచ్చిన వాళ్లకు హెయిర్కటింగ్లు, షేవింగ్లు చేశారు. ‘ఫర్వాలేదు, పిల్లలకు పని సులువుగానే పట్టుపడింది’ అనుకున్న పెద్దవాళ్లు భరోసాగా వీళ్ల సెలూన్కు రావడం మొదలు పెట్టారు. కొత్త వాళ్లు సెలూన్ వరకు వచ్చి అమ్మాయిలను చూసి వెనుదిరిగి వెళుతున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటే, ‘ఈ సెలూన్లో అయితే అమ్మాయిలు షేవ్ చేస్తార్రా’ అని వచ్చే పోకిరీ కుర్రాళ్లతో వాళ్లకు కష్టాలొచ్చిపడ్డాయి. హెయిర్ కటింగ్ చేసేటప్పుడు, షేవ్ చేసేటప్పుడు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసేవాళ్లు. అప్పుడు తీసుకున్నారా అమ్మాయిలు ఓ నిర్ణయం. సెలూన్కి వచ్చిన వాళ్ల హెయిర్ కట్ చేయడం కాదు, ముందు తమ హెయిర్ కట్ చేసుకోవాలని. ఒకరికొకరు హెయిర్ కట్ చేసుకుని, జీన్స్, టీ షర్టులు వేసుకున్నారు. రాజు, దీపక్ అని పేర్లు పెట్టుకున్నారు. ఊరికి దూరంగా హైవేకు దగ్గరగా ఉన్న సెలూన్ కావడంతో కస్టమర్లలో సొంతూరి వాళ్లకంటే బయటి వాళ్లే ఎక్కువ. అమ్మాయిలే అబ్బాయిలుగా మారారనే వాస్తవం త్వరగానే మరుగున పడిపోయింది. ఊర్లో ఉన్న వంద కుటుంబాల వాళ్లకూ వీళ్లు అబ్బాయిలు కాదు అమ్మాయిలని తెలుసు. ఆ నిజాన్ని పనిగట్టుకుని సెలూన్కి వచ్చే వాళ్లకు చెప్పి ఆడపిల్లల పొట్టకొట్టే అనైతికానికి ఎవరూ పాల్పడలేదు. చదువును కుంటుపడనివ్వలేదు దీపక్, రాజు (జ్యోతి, నేహ)ల సంపాదన రోజుకు నాలుగు వందలు. ఇంట్లో నలుగురూ కడుపు నిండా తింటున్నారు, ధృవ నారాయణకు మందులకూ డబ్బులు ఉంటున్నాయి. ఇదే మాట చెబుతూ ‘‘ఆడపిల్లలను సెలూన్కి పంపించేటప్పుడు మనసు మెలిపెట్టినట్లయింది. ఇప్పుడు నా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. సెలూన్ నడుపుతూ మమ్మల్ని పోషించడమే కాదు, వాళ్లు చదువుకుంటున్నారు కూడా’’ అని సంతోషిస్తున్నారు ధృవ నారాయణ. జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. నేహ ఉదయం కాలేజీకెళ్లి, మధ్యాహ్నం నుంచి సెలూన్లో పని చేస్తుంది. ‘‘మగవాళ్లకు హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నామని, మగవాళ్లలాగ హెయిర్ కట్ చేసుకుని, షర్టు–ప్యాంటు వేసుకుంటున్నామని మమ్మల్ని వెక్కిరించిన వాళ్లున్నారు. వాళ్లు వెక్కిరించారని పని మానుకునే పరిస్థితి కాదు మాది. అందుకే ఎవరు ఏమన్నా ఈ పనిని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మేము ఎవరికీ భయçపడటం లేదు. ధైర్యంగా పని చేసుకుపోతున్నాం. మాకు అబ్బాయిల్లా నటించాల్సిన అవసరం కూడా లేదిప్పుడు. మేము అమ్మాయిలం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అక్క కూడా జుట్టు పెంచుకుంటోందిప్పుడు’’ అంటోంది నేహ. వీళ్లకు ఒక అవార్డు కూడా వచ్చింది! ఆ వివరాలు చెబుతూ ‘‘ఓ రోజు గోరఖ్పూర్ నుంచి ఓ విలేఖరి ఇటువైపు వచ్చినప్పుడు మా సెలూన్కొచ్చారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా మా వివరాలడిగారు. మా కథనాన్ని పత్రికలో రాశారు. ఆ క«థనాన్ని చూసిన ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అభినందించారు.అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అంటోంది జ్యోతి.ఆర్థిక అవసరాలు వెంటాడినప్పుడు మహిళలు ఇంటి అవసరాలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. గ్రామాల్లో పొలం పనులకు పోతుంటారు.ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అనగానే కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ అనే అనుకుంటాయి. ఈ అమ్మాయిలు వాళ్ల ఇంటి వృత్తిలోనే ఉపాధి పొందుతున్నారు. తండ్రికి వారసులుగా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాన్ని నిర్మించుకున్నారు. చేసింది చిన్న యుద్ధం కాదు జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను మించిన శత్రువులుండరు. ఆ శత్రువుతో పోరాడాలంటే దృఢమైన సంకల్పబలం ఉండాలి. టీనేజ్ దాటని ఈ అమ్మాయిలు చేసిన యుద్ధం చిన్నది కాదు. స్ఫూర్తిదాయకమైన ఈ సిస్టర్స్ గురించి సమాజానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. – అభిషేక్ పాండే, అవార్డును అందజేసిన ప్రభుత్వాధికారి – మంజీర అవార్డు అందుకుంటున్న అక్కచెల్లెళ్లు : నేహ (ఎడమ), జ్యోతి -
ఉప్పుతిప్పలు
నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులవి. మాది ఒక గవర్నమెంట్ హైస్కూల్. సుమారు పది ఎకరాల స్థలంలో బ్రిటిష్కాలంలో కట్టించిన స్కూల్ అది. స్కూలు ప్రాంగణంలో రకరకాల చెట్లు, అక్కడక్కడా పాడుబడిన కట్టడాలు, కాడమల్లె, పొగడమల్లె పూలచెట్లు, చింత, తాటి, మామిడి, రేగు వంటి పండ్ల చెట్లు, పెద్ద ఊడల మర్రిచెట్లు, పెద్ద బావి ఉండేవి. సువిశాలమైన మా స్కూలు ప్రాంగణం చిన్నసైజు పల్లెటూరిలా ఉండేది. మా స్కూలు ప్రాంగణం లోపల కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉండేవి. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితులు జ్యోతి, నాగలక్ష్మి; రాఘవ, బషీరు క్లాసులో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లం. మా క్లాసులో ఒక విరిగిపోయిన కిటికీ ఒక మనిషి పట్టేంత సైజులో ఉండేది. ఆ కిటికీకి కొంచెం దూరంలోనే ఎడంగా కొన్ని కుటుంబాలు నివసించేవి. మా క్లాసులోని అమ్మాయిలు, అబ్బాయిలు కలసి రకరకాల ఆటలు ఆడుకొనేవాళ్లం. అబ్బాయిలు మాకోసం మామిడి కాయలు, రేగుపళ్లు, రకరకాల పండ్లు కోసుకొచ్చి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక మేం చాలా ఎంజాయ్ చేస్తూ వాటిని తినేవాళ్లం.ఒకరోజు మాక్లాసు అబ్బాయిలు బోలెడు చింతకాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. నాకు చింతకాయలంటే చాలా ఇష్టం. అయితే అవి వట్టిగా తినలేంకదా. ఉప్పు రాసుకుని తింటే మరింత రుచిగా ఉంటాయని ఉప్పు కోసం వెతికాము. అయితే ఇంటి దగ్గ్గర నుంచి మజ్జిగ కోసం తెచ్చుకున్న ఉప్పు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తే మాఫ్రెండ్ జ్యోతి ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే పక్కనే ఇళ్ళు ఉన్నాయి కదా వాళ్లని అడిగి తెచ్చుకుందాం అని.ఈ ఐడియా మాకు బాగా నచ్చింది.అయితే అప్పటికే ఇంటర్వెల్ టైం అయిపోయింది. క్లాసు టీచర్ వచ్చేస్తారు. కానీ చింతకాయల మీదకు మనసు లాగేస్తుంది ఎలా?? మా అబ్బాయిలను వెళ్ళమంటే ‘‘మేము వెళ్లము మీరే తెచ్చుకోండి’’ అనేశారు. ఇక సరే అని మేము ఆగలేక క్లాసు డోర్ నుంచి బయటకు వెళితే ఎక్కడ టీచరుకి దొరికిపోతామో అని మాక్లాసులో ఉన్న కిటికీ నుంచి ఒకళ్ల తరువాత ఒకళ్లం బయటకు దూకేశాము. నేను, రాఘవ, జ్యోతి, బషీరు, నాగలక్ష్మి మేము ఐదుగురం ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ ఇళ్ళు చాలా అందంగా రకరకాల పూలమొక్కలు, పందిళ్లు, చెట్లతో తాటాకు ఇళ్ళు అయినా చూడ్డానికి బొమ్మరిళ్లలా ఉండేవి. మేము ఒకపెద్ద నారింజ చెట్టు ఉన్న ఇంటికి వెళ్ళాము.ఆ చెట్టుకు పెద్దపెద్ద నారింజకాయలు మాకు అందేంత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూడగానే మా జ్యోతికి నోరూరింది. ఇంతలో మేము ఇంట్లో వాళ్లని పిలిచాము ‘‘ఆంటీ.. అంకుల్’’ అని. ఇంటి లోపల నల్లగా లావుగా కుర్చీలో కూర్చున్న ఒక ఆకారం మాకు కనపడింది. ‘‘ఏమికావాలి?’’ అని అడిగాడాయన. వెంటనే మేము‘‘కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తారా’’ అని అడిగాము. వెంటనే ఆయన ఒక అమ్మాయిని పిలిచి సాల్ట్ ఇమ్మని పురమాయించాడు. బయట ఉన్న మాకు ఆయన కనిపించట్లేదు. ఆకారం మాత్రమే కనిపిస్తోంది. ఇంతలో మా జ్యోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ‘‘ఒసేయ్! మీరు మాకు అడ్డుగా ఉండండి. నేను, బషీరు కాయలను కోసి స్కర్టులో వేసుకుంటాం. లోపల ఉన్న ఆయనకు మనం కనపడం’’ అని చెప్పింది. మేము ‘‘వద్దే బాబూ! ఎందుకు రిస్క్’’ అని చెప్పినా వినకుండా కాయలను కోసేసింది. అంతలో ఇంటి లోపల ఉన్న ఆయన ‘‘ఏం చేస్తున్నారు మీరు’’ అని కేకలేస్తూ బయటికొచ్చాడు. ఆ దెబ్బతో మా జ్యోతి భయపడిపోయి కోసిన కాయలను పక్కింట్లోకి విసిరేసింది. మేము ‘‘ఏమీ లేదు అంకుల్’’ అంటే ఆయన గబగబా వచ్చేసి ‘‘కాయలను ఎందుకు కోశారు? నన్ను అడిగితే ఇవ్వనా? అలా దొంగతనంగా కోయొచ్చా? ఉండండి ఈ విషయం మీ హెడ్మాస్టర్గారితో చెప్తాను’’ అని అన్నాడు. వెంటనే మా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘‘సారీ అంకుల్ ఏదో తెలీక చేశాము’’ అని చెప్పినా అయన వినిపించుకోలేదు. అంతలో లోపల నుంచి సాల్ట్ తీసుకొస్తున్న అమ్మాయిని ఆపి ‘‘సాల్ట్ లేదు ఏమీ లేదు వెళ్లిపోండి’’ అని గద్దించే సరికి దెబ్బతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం. జ్యోతిని ‘‘ఇదంతా నీవల్లే అయింది. ఇంకెప్పుడూ ఇలాంటి చెత్తపనులు చేయకు’’ అని తిట్టాము. ట్విస్ట్ ఏమిటంటే మేము ఒక లాజిక్ మిస్ అయ్యాము. చీకట్లో ఉన్నది ఆయనని మేము కాదని బయట ఎండలో వెలుతురులో నించున్న మమ్మల్ని ఆయన స్పష్టంగా చూడగలడని మా మట్టిబుర్రలకు తట్టలేదు. ఆయన అంత సీరియస్గా ఉంటే నేను మళ్లీ సాల్ట్ కోసం అడగడం ఇంకా విచిత్రం. మా స్కూల్లో ప్రతి ఉదయం అసెంబ్లీ జరుగుతుంది. స్కూలుకి సంబంధించింది లేదా మరి ఏ ఇతర విషయాలైనా అసెంబ్లీలో చెప్పేవారు. ఆ సంఘటన జరిగిన వారంరోజుల వరకు మేమెవరం స్కూలుకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ ఆయన మా సంగతి మా హెడ్మాస్టరుతో చెప్తాడో ఆ విషయం అసెంబ్లీలో చెప్పి మమ్మల్ని తిడుతారన్న భయంతో స్కూలుకి డుమ్మా కొట్టేశాం. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూనే ఉంటాను. – ఎం.సుధా మాధురి, కాకినాడ -
దొంగను పట్టేశారు
జీన్స్, టీ షర్ట్, స్కూటీ, మెడలో ఓ స్లిమ్ బ్యాగ్ లేదా హెవీగా బ్యాక్ప్యాక్... ఇదీ ఈ తరం కాలేజీ అమ్మాయిల డ్రెసింగ్. ఇలాంటి అమ్మాయిలే పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్లు. వీళ్లను చూసిన ఓ జేబుదొంగకు ‘వీళ్లేంటి ఆఫ్ట్రాల్ అమ్మాయిలే కదా’ అనుకున్నాడు. ‘మేము అమ్మాయిలమే కానీ, ఆఫ్ట్రాల్ అమ్మాయిలం కాదు’ అని నిరూపించారీ ఇద్దరమ్మాయిలు. వీళ్ల ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తికి అల్వార్ జిల్లా ఎస్పీ కూడా ముచ్చటపడ్డాడు. వాళ్లను పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇద్దరికీ పూలబొకేలు ఇచ్చి మరీ అభినందించారు. చెరో వెయ్యి రూపాయలిస్తూ... ‘ఆడపిల్లలు ఇలా ఉంటే సమాజంలో సమస్యలు అన్నీ వాటికవే సర్దుకుంటాయి. ఆకతాయిలు, చిల్లర దొంగలకు మీరొక పాఠం కావాలి. దొంగతనం చేయాలని చాచిన చేతులు మిమ్మల్ని చూసి జంకుతో వెనక్కి వెళ్లిపోవాలి’ అంటూ అమ్మాయిలను ప్రశంసల్లో ముంచెత్తారు. వాళ్లు చేసిందేమిటి? అది రాజస్తాన్లోని ఆల్వార్ నగరం. పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్ గడచిన శనివారం సాయంత్రం కోచింగ్ సెంటర్ నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నారు. పూనమ్ బండి నడుపుతోంది, జ్యోతి వెనుక ఉంది. ఒక ఆకతాయి బైక్ మీద వీళ్లను వెంబడించాడు. స్కూటీకి దగ్గరగా వచ్చి జ్యోతి చేతిలోని స్మార్ట్ ఫోన్ లాక్కుని తన బైక్ వేగం పెంచి ముందుకు వెళ్లిపోయాడు. క్షణకాలంలోనే తేరుకున్నారీ అమ్మాయిలు. దొంగతనం జరినట్లు చుట్టు పక్కల వాళ్ల దృష్టిలో పడేటట్లు పెద్దగా అరుస్తూనే అతడి బైక్ను అనుసరించారు. బైక్ మీదున్న వ్యక్తిని రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. జిడి గర్ల్స్ కాలేజ్ రోడ్డులోకి వెళ్లింది బైక్. కాలేజ్ దగ్గర ఆ రోడ్డు ఎండ్ అవుతుంది. డెడ్ఎండ్ కారణంగా బైక్ ముందుకు వెళ్లడానికి దారి లేదు, వెనక్కు తిరగడానికి వీల్లేకుండా స్థానిక ఇళ్లలోని వాళ్లంతా గుమిగూడిపోయారు. వాళ్లలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే ఆ అమ్మాయిలు స్థానికుల సహాయంతో బైక్ మీదున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పౌరులే పోలీసులు ఇదంతా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ ప్రకాశ్... ఫోన్ అపహరణకు పాల్పడిన ఇక్బాల్ను అదుపులోకి తీసుకుని... పూనమ్, జ్యోతిల ధైర్యసాహసాలకు గాను వారిని స్టేషన్కి పిలిపించి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి చొరవ తీసుకోవాలని చెప్పారు రాహుల్ ప్రకాశ్. ప్రతి ఒక్కరిలో పోలీస్ ఉంటాడు. తమలోని పోలీసింగ్ నైపుణ్యాన్ని నిద్రపుచ్చకుండా చైతన్యంగా ఉంచుకోవాలి. నిజానికి పౌరులే మంచి పోలీసులు. ఈ అమ్మాయిలు చూపించిన ధైర్యం, చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి’ అని సందేశమిచ్చారు. – మంజీర -
‘ప్రేమజ్యోతి’ని ఆర్పేశాడు
వాకతిప్ప (కపిలేశ్వరపురం): ప్రేమగా అందరినీ పలకరించే ‘జ్యోతి’ ఆరిపోయింది. కట్టుకున్న భర్తే గొంతు నులిమి చంపేశాడు. ఏమీ తెలియనట్టు పరారయ్యాడు. అందరినీ కలచి వేసిన ఈ ఘటన కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో ఆదివారం జరిగింది. అంగర పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. వాకతిప్ప గ్రామానికి చెందిన దోమల ప్రేమజ్యోతి (25)ని ఎనిమిదేళ్ల క్రితం మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన దోమల మనోహర్కు ఇచ్చి వివాహం చేశారు. తరచూ గొడవలు పడుతుండడంతో దగ్గరుంటే జాగ్రత్తగా ఉంటారనుకుని భావించి ప్రేమ జ్యోతి కుటుంబ సభ్యులు వాకతిప్పలోని ఇంటికి తీసుకొచ్చారు. మనోహర్ కూడా ప్రేమజ్యోతితోపాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఎంత సేపటికీ నిద్ర లేవకపోవడంతో మధ్యాహ్న సమయంలో కదిపి చూడగా ప్రేమ జ్యోతి చనిపోయి ఉంది. ఆమె సోదరుడు గురజ శ్రీను ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, మండపేట రూరల్ సీఐ లక్షణరెడ్డి, అంగర ఎస్సై రాజేష్కుమార్లు ఘటనా స్థలాన్ని సందర్శించి శవపంచనామా చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్టు భర్త మనోహరే గొంతు నులిమి చంపేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మారకపోగా మనిషినే చంపేశాడు.. తరచూ వివాదపడడాన్ని చూసి మనిషి మారతాడన్న భావనతో ప్రేమజ్యోతిని కుటుంబ సభ్యులు అమ్మగారి ఊరులోనే ఉంచుకున్నారు. మారకపోగా మనిషినే చంపేశాడంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అమ్మ ప్రేమకు దూరమైన ప్రేమజ్యోతి ఆరేళ్ల కుమార్తె అమూల్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాన్నే అమ్మ చావుకు కారణం కావడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. -
అగ్ని ప్రమాదంలో బాలిక సజీవదహనం
కొల్లూరు (గుంటూరు): అగ్ని ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటన జిల్లాలోని కొల్లూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి కుమార్తె జ్యోతి (4) పిల్లలతో ఆడుకుంటూ తన మేనత్త అయిన చొప్పర శేషమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన జ్యోతి బయటకు వచ్చేలోపే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లోమంటలు చెలరేగాయి. బాలిక ఇంట్లో చిక్కుకుంది, మంటలు ఒక్కసారిగా ఇల్లంతా వ్యాపించడంతో స్థానికులు ఇంటి గోడను కూలగొట్టారు. అప్పటికే బాలిక పూర్తిగా మంటల్లో కాలిపోయి మృతి చెందింది. -
కి'లేడీ' క్షణాల్లో దోచేస్తుంది
⇔పోలీసులకు చిక్కిన కిలేడీ ⇔మూడేళ్లలో 24 దొంగతనాలు ⇔63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు అపహరణ ⇔33 తులాల ఆభరణాలు, రూ.27వేలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ⇔వివరాలు వెల్లడించిన క్రైం డీసీపీ రవికుమార్ మూర్తి పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): షాపింగ్ మాల్స్, దేవాలయాలు, బస్సులు, ఆటోలు... ఎక్కడైనా జనసంచారం ఉంటే చాలు. క్షణాల్లో మహిళల మెడలోని ఆభరణాలు, వారి హ్యాండ్ బ్యాగుల్లోని విలువైన వస్తువులు దొంగలించేస్తోంది ఓ కిలేడీ. మూడేళ్లలో 24 దొంగతనాలకు పాల్పడి 63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు అపహరించుకుపోయిందంటే ఎంతటి గజదొంగో అర్థం చేసుకోవచ్చు. దొంగలించిన సొత్తుతో కొంత స్థలం, కారు, ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న శ్రావణజ్యోతిని, ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని నగర క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవికుమార్ మూర్తి వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి దొంగతనాల బాట గోపాలపట్నం లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన కాండ్రేగుల శ్రావణ జ్యోతి (25) దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయింది. 2002లో తండ్రి కుటుంబ సభ్యులను విడిచి వెళ్లిపోవడంతో తల్లితో కలిసి జీవించేది. ఈ క్రమంలో 2007 నుంచి దొంగతనాల బాటపట్టింది. పదో తరగతి వరకు చదువుకున్న జ్యోతి జన సంచారం అధికంగా ఉన్న షాపింగ్ మాల్స్, దేవాలయాలు, బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తూ మహిళల మెడలో ఉన్న గొలుసులు, వారి హ్యాండ్ బ్యాగ్లలోని విలువైన వస్తువులు దొంగిలించడంలో సిద్ధహస్తురాలిగా తయారయింది. ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పిరాది హరికుమార్ను 2010లో పెళ్లి చేసుకుంది. జ్యోతి నిజస్వరూపం తెలిసినప్పటికీ విలాసవంతమైన జీవితం గడిపేందుకు హరికుమార్ ఆమెను వివాహం చేసుకన్నాడని, అనంతరం కలిసే దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది. కొన్నాళ్ల తర్వాత కుమారుడు పుట్టడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో భర్త హరికుమార్పై 2015లో మహిళా పోలీస్ స్టేషన్లో శ్రావణ జ్యోతి ఫిర్యాదు చేసింది. 8 స్టేషన్లలో 24 కేసులు 2014–16 సంవత్సరాల మధ్య జ్యోతి 24 దొంగతనాలకు పాల్పడింది. ఆమెపై ఇప్పటి వరకు గోపాలపట్నం పీఎస్లో 7, ఎయిర్పోర్ట్ పీఎస్లో 6, రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 4, పెందుర్తి పీఎస్లో 3, ఎంఆర్పేట, ద్వారకానగర్, కంచరపాలెం, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యయి. ఆయా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన శ్రావణజ్యోతి సుమారు 63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు దొంగిలించింది. తాను దొంగలించిన బంగారాన్ని గోపాలపట్నం గణేష్నగర్కు చెందిన కొత్తల బుల్లేశ్వరరావు ద్వారా విక్రయించేంది. బంగారు ఆభరణాల తయారీ పనిచేసే బుల్లేశ్వరరావు దొంగ సొత్తును సులువుగా మారకం చేసేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడంతో దొంగ సొత్తునంతటినీ బుల్లేశ్వరరావు వద్దే ఉంచేది. ఆయనతోపాటు జ్యోతికి సహకరించిన కురుపాం మార్కెట్ పప్పుల వీధికి చెందిన అబ్దుల్ లతీఫ్ ఖాన్ (34), టౌన్హాలు ప్రాంతానికి చెందిన గౌరిప్పాడు రవికుమార్ (40)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యోతి నుంచి 33 తులాల బంగారు ఆభరణాలు, రూ.27వేల నగదు, దొంగలించిన సొత్తుతో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం, కారు, ఓ స్థలానికి చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రవికుమార్ మూర్తి వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి మరింత చోరీ సొత్తు రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏడీసీపీ(క్రైం) వరదరాజులు, క్రైం ఏసీపీలు ఫల్గుణరావు, గోవిందరావు, సీఐలు సూర్యనారాయణ, పైడపు నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న జ్యోతి(8) వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదిలాబాద్ రిమ్స్లో ఆదివారం చేర్పించగా పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయింది. -
రెక్కలు విరిగిన ఆకాశం
చంటి పిల్లాణ్ణి గట్టు మీద పడుకోబెట్టి, మరోకొడుకును వాడికి కాపలాగా పెట్టివరి పొలం కోసుకుంటున్న ఈ మహిళ.. బాపనయ్య మొతుకుంట తాండకు చెందిన మాలోతు లక్ష్మి. ఆకాశంలోకి చూస్తే.. గల్ఫ్ కనిపించదు.గల్ఫ్ని గుర్తుకుతెచ్చే విమానం కనిపిస్తుంది! వచ్చే ప్రాణం, పోయే ప్రాణంలా... అది వచ్చే విమానమో, పోయే విమానమో? మేఘాల్లోంచి పొలాల్లోకి జారి పడుతున్న వాన చుక్కలా... ఏ గల్ఫ్ విమానంలోంచైనా... భర్త దిగిరాకపోతాడా అని ఒకే ఒక్క ఆశ! ఆకాశమంత ఆశ!! రెక్కలు ముక్కలు చేసుకున్నా కష్టాలు తీరక... ఎడారుల్లోకి వెళ్లి తడారిపోయిన మెతుకుసీమ బతుకులివి. విరిగిన ఆకాశం అతుకులివి! ‘‘పెద్దపిల్ల పెండ్లికి ఎదిగింది. ఆయనేమో దేశం నుంచి ఒచ్చేటట్టు లేడు. ఆడపిల్ల ఉట్టిగ పోతదా. పెండ్లిజేసి పోదువు రావయ్యా అంటే కంపినోళ్లు ఒదిలి పెట్టరే అని ఒక్కటే గుంజాతి పడుతుండు. ఇంటి మొగోడు లేకుండా పిల్ల పెండ్లి జేస్తే నలుగురు ఏమనుకుంటరు. ఇన్ని కష్టాలల్ల బిడ్డ పెండ్లెట్ట జెయ్యాల్నో తెల్వక తండ్లాడుతన్న’. గుండె లోతుల్లో దిగమింగుకున్న ఆవేదనను వెళ్లగక్కింది జ్యోతి. రామాయంపేట మండలం కాశీంపేట తాండా ఆమెది. ఆమె భర్త మంగ్యా నాయక్. మస్కట్ పోయి నాలుగేళ్లు అవుతోంది. ‘‘పిట్రోలు బాయిల పనికి కుదిరిండట. ఆరు నెలలకు రూ 10 వేలో.. రూ 15 వేలో పంపుతడు. అయి దేనికయిత బిడ్డా.. మిత్తీలకు కూడా సరిపోవు. ఇక్కడ చేసుకుందామంటే కాలం పాడుగాను కాలం పోయింది. పోనీ మస్కట్ల అయినా నాలుగు పైసలు సంపాయిస్తరా అంటే అదీ లేకపాయ..’’ అని జ్యోతి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. అమీనా ఓ గిరిపుత్రిక. రామాయంపేట మండలం బాపనయ్య మొతుకుంట తాండ. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు. అత్తమామలు అనురాగాన్ని, భర్త ప్రేమను పంచాడు. రెండు నెలలకు అమీనా గర్భం దాల్చింది. అమ్మ కాబోతున్న ఆమె ఆనందంలో కరువు రాక్షసి నిప్పులు పోసింది. వరుస కరువుతో ఎద్దు.. ఎవుసం పోయింది. కడుపులో బిడ్డతోపాటు అప్పులు పెరిగాయి. అమీనాకు మూడోనెల పడ్డప్పుడు... ఆమె భర్త జగన్ బతుకు తెరువునును వెతుక్కుంటూ మస్కట్ వెళ్లిపోయిండు. మళ్లీ రాలేదు. ఇప్పుడామె రెండేళ్ల బిడ్డకు తల్లి, రూ 5.50 లక్షల అప్పులకు పూచీ. బిడ్డను సాకలేక, అప్పులోళ్ల బాధతో వేగలేక రోజూ చస్తూ బతుకుతోంది. తిండి గింజల కోసం దొరికిన పని చేస్తూ, తునికాకులు ఏరుకొని కాలం వెళ్లదీస్తోంది. వానొస్తే వలవల కురిసే గుడిసెలో కాలం నెట్టుకొస్తోంది. మస్కబారిన బతుకు నుంచి వెలుగులు నింపే మొగుడు ఎప్పుడొస్తాడోనని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తోంది. యాదమ్మ 17 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి. ఈమెది గజ్వేల్ మండలం దాచారం. భర్త వల్లపు కిష్టయ్య(35) కౌలు రైతు. కౌలు భూమిలో రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కాలం లేక పత్తి పంటపోయింది. మస్కట్ పోతే అప్పులు తీరుతాయి అనుకున్నడు. కానీ వీసాలో మోసం జరిగింది. కిష్టయ్య గుండె ధైర్యం సడలింది. భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్న అర్ధరాత్రి వేళ ఇంటి దూలానికి ఉరేసుకొని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. కుటుంబ భారం యాదమ్మ మీద పడింది. ఏ పని చేయాలో తెలియని ఆమె ఉప్పరి పనిలో కర్పూరంలా కరిగిపోతోంది. అయినా అప్పులోళ్లు ఆగలేదు, ఆమె ఇంటి మీద పడుతున్నారు. వీళ్ల నుంచి తప్పించుకునేందుకు తెల్లారక ముందే ఇంత సద్ది కట్టుకొని పొరుగు ఊరికి వెళ్లిపోతే రాత్రైతేనే ఇంటికి వస్తోంది. సాగుజూదం, గల్ఫ్గాయంతో ఇలా రైతు భార్య బతుకంతా చీకటైపోయింది. మెతుకూ లేదు... బతుకూ లేదు! మెతుకు సీమ అంటే బువ్వ పెట్టే ప్రాంతం. అమ్మతనానికి.. ఐదోతనానికి నెలవులు ఈ సీమలోని పల్లెలు. నుదుటకుంకుమ.. కాళ్లకు పారాణి ఇక్కడి మహిళల సంస్కృతి. ఇదంతా గతం. ఇప్పుడు మెదక్లోని ఏ పల్లెలోకి తొంగి చూసినా.. తాళిబొట్టు తెగిపోయి బొట్టు చెరిగిపోయి, వైధవ్యం పొందిన ఆడబిడ్డల ఘోష, భర్త జాడ లేక బతుకు మీద ఆశలు పోయి కొడిగట్టిన కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమీనాల గల్ఫ్ గోసలే కనిపిస్తున్నాయి. వృత్తులు పోయి, ఉపాధి వెతుక్కుంటూ లక్షల మంది యువత పల్లె వదిలి... దేశం విడిచి... ఎల్లలు దాటి వెళ్లిపోతున్నారు. పోయిన పోకడే కానీ ఇప్పటి వరకు వాళ్లు తిరిగి రాక.. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు ఎదురుచూస్తున్నారు. విధిలేక గల్ఫ్కు వలస సాగుకు తెచ్చిన అప్పులు.. ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిలు.. మైక్రోఫైనాన్స్ రుణాలు... అప్పులు తీర్చే హామీ ఇవ్వలేని ఉపాధి ఒకదానికొకటి పురి వేసుకొని యువతను, రైతును ఊరి నుంచి తరిమేస్తున్నాయి. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు చిట్టీలు ఎత్తి డబ్బు తీసుకొని చిట్టీ వాయిదా కట్టడం కోసం మైక్రో ఫైనాన్సియర్ల దగ్గర చిల్లర అప్పులు చేసి.. వాటిని తీర్చడం కోసం వడ్డీ వ్యాపారుల వద్ద పొలం తాకట్టు పెట్టి... ఇలా సాలెగూడు లాంటి అప్పుల వలయంలో చిక్కుకుపోతున్న రైతుకుటుంబాలు విధిలేక గల్ఫ్కు పయనం అవుతున్నాయి మెదక్ జిల్లా నుంచి 75 వేల మందికి పైగా దుబాయ్, మస్కట్ లాంటి దేశాలకు వెళ్లిపోయారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా వాళ్ల జాడ లేదు. ఒకవేళ జాడ తెలిసినా, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక్కడి వ్యవసాయ కుటుంబ స్త్రీలలో సగటున ప్రతి 100 మందిలో 25 మంది మహిళలు గల్ఫ్ పోయిన భర్తల జాడకోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నవారే కావడం విషాదం. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఎప్పుడొస్తవ్ పెనిమిటీ?! ‘‘ పెళ్లయి నాలుగేండ్లు అయింది. అమ్మానాయిన.. అత్తామామా లేరు. ఈడు జోడు ముద్దుగుందని ఊరంత అనుకుంటంటే ఇంతకంటే ఏం కావాలని మురిసి పోయిన. మంచిగ జూసుకునే భర్త దొరికిండు ఈ జన్మకు ఇది చాలు అనుకున్న. కష్టం, సుఖం అన్నీ నా భర్తే అనుకున్న. మా మావ సంపాయించి ఇచ్చిన మూడెకరాల్లో ఇద్దరం కష్టం చేసుకునేటోళ్లం. పెండ్లైన ఏడాదికి కొడుకు పుట్టిండు. సుకంగానే కాలం గడిచిపోతోంది. ఇంతలోనే ఆ దేవునికి కన్ను కుట్టినట్టుంది. విత్తనం వేసుడే కానీ పంట తీసింది లేదు. అప్పుకు మిత్తి పెరిగింది. బరువు అలివిగానిదైపోయింది. ఇగ తప్పదని అరెకరా ఉంచుకోని రెండున్నర ఎకరాలు అమ్ముకుని అప్పులు కట్టినం. ఇంకో రూ 80 వేలు అప్పు జేసి ఆయన దుబాయ్ పోయిండు. ఆయనకు వీసా వచ్చినప్పుడే రెండోకొడుకు కడుపుల పడిండు. ఇప్పుడు వానికి ఏడాది. ఇంతవరకు మా ఆయన కొడుకును జూసుకోలే. పోయినోడు పోవుడేగానీ ఇప్పటిదాకా జాడ లేకపాయ. ఎన్నికష్టాలు పడుతుండో...ఎంత బాధ పడుతుండో.. ఇంటికైతే ఇప్పటిదాకా రూపాయి పంపలే. మా బావ పనికి కుదిరిన దుబాయ్ సేటు మంచోడు కాదని అక్కడోళ్లు చెప్తుంటే పానం విలవిలలాడి పోతంది. ఆయన ఫోన్ చేస్తే ‘ఏం తింటున్నవ్ బావా... ఎప్పుడొస్తవ్ బావా’ అని అడగాలని ఉంది. ‘కలిసి ఇక్కడనే ఉండి కలోగంజో తాగి బతుకుదాం రా బావ’ అని పిలవాలని ఉంది. ఆర్నెల్ల కింద ఒకసారి...మూడు నెలల కింద ఇంకోసారి మా ఇంటి దగ్గర వాళ్ల పిల్లగానికి ఫోన్ చేశాడట గాని నేను కూలి పనికి పోయిన. నాకు సెల్లు లేదు. బావ ఫోన్ సేసిండు అన్న రోజున కన్నీళ్ల్లు ఆగవు. కంటికి పుట్టెడు శోకమే. ఇద్దరు పిల్లలను తీసుకొని కూలికి పోతన్న. సంటోన్ని గట్టు మీద పడుకోబెట్టి పెద్దోన్ని (రెండేళ్ల వయసు) కావలి పెట్టి కూలి పనులు చేసుకుంటా. అర ఎకరంలో వరి పెడితే నీళ్లు లేక ఎండిపోయింది. బొంది కోస్తన్నా. రూ 80 వేలకు మిత్తీ జత అయింది. అప్పులు ఇచ్చినోళ్లు ఊకుంటరా. పోయినేడాది ఇంట్లే రెండు దూడ పెయ్యలు ఉంటే అమ్మిన, ఆన్నో.. ఈన్నో తండ్లాట బడి ఇంకిన్ని రూపాయలు కలేసి మనిషింత మిత్తి కట్టిన. ఈయేడు తలుసుకుంటెనే పానం పోయినంత పనైతంది. పిలగానికి బడీడచ్చింది. ఆన్ని బడికి పంపితే సిన్నోన్ని పట్టుకునేటోళ్లు లేరు. బావ ఎప్పుడొస్తడో, ఏం తెస్తడో తెల్వదు’’. - మాలోతు లక్ష్మి, బాపనయ్య మొతుకుంట తాండ -
వివాహిత అనుమానాస్పద మృతి
ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితులో మృతి చెందింది. భర్త, అతడి కుటుంబ సభ్యులే హతమార్చారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని మార్కెట్ కమిటీ సమీపంలో ఇస్లావత్ జ్యోతి (37) ఇంట్లో ఉరికి వేలాడుతుండగా ఆదివారం తెల్లవారుజామున గుర్తించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులే జ్యోతిని హతమార్చారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. -
బ్రెయిలీ దీపాలు
పుట్టుకతోనే అంధత్వం ఉన్న జగదీశ్బాబు పట్టుబట్టి డిగ్రీ పూర్తి చేశారు. అదే పట్టుదలతో టీచర్ వృత్తిని ఎంచుకున్నారు. అంతటితో తన కష్టాలు గట్టెక్కాయని కదా అని ఆయన ఊరుకోలేదు. తోటి అంధ టీచర్లకు తను ఏ విధంగా ఉపయోగపడగలనని ఆలోచించారు. ఆ ఆలోచనకు కార్యరూపమే ఈవారం మన ‘మిణుగురులు’. -నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి జగదీశ్బాబు స్వస్థలం విశాఖపట్నం పద్మనాభ మండలంలోని రెడ్డిపల్లి. తండ్రి శ్యామలరావు, తల్లి నిర్మల. ముగ్గురు కుమారులలో రెండవ సంతానం జగదీశ్బాబు. మేనరికం కారణంగా జగదీశ్తో పాటు పెద్దబ్బాయి రవి శంకర్ కూడా అంధుడుగానే జన్మించాడు. జగదీశ్బాబు రెడ్డిపల్లిలోనే ప్రైమరీ పాఠశాలలో టీచర్గా విధులను నిర్వర్తిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అంధులైన టీచర్లు చదవలేరు. అలాంటప్పుడు విద్యార్థులకు సరైన బోధన అందదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువదించి, వాటిని ప్రింట్ చేయించి, అంధులైన టీచర్లకు ఉచితంగా అందజేయాలనుకున్నారు జగదీశ్. అయితే, అది అంత సులువైన పని కాదు. ఎంతో సమయం, మరెంతో డబ్బు అవసరం అవుతాయి. ఇందుకోసం కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. కొంద రు పెద్దల సాయం తీసుకున్నారు. తనే స్వయంగా పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువ దించారు. వాటిని ప్రింట్ చేయించారు. ‘‘ఇప్పటివరకు 5,436 మంది అంధ ఉపాధ్యాయులకు బ్రెయిలీ లిపిలోకి మార్చిన పుస్తకాలను అందజేశాను. 2010 నుంచి ఈ పనిని ఓ యజ్ఞంలా చేపట్టాను. రెండేళ్ల పాటు అనువదించాను. ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతి పుస్తకాలు మారుతుంటాయి. అలా మారిన కొత్త పుస్తకాలను అనువదించాల్సిందే! డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఒకరిని నియమించుకొని ఈ పని చేస్తున్నాను’’ అని వివరించారు జగదీశ్బాబు. వీటితో పాటూ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అంధ విద్యార్థుల కల నిజం చేయాలనే సంకల్పంతో వారికి కావల్సిన మెటీరియల్ను సీడీల రూపంలోనూ ఉచితంగా అందజేస్తున్నారు జగదీశ్. అలాగే ‘ఆసరా’ అనే స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవాకార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. వచ్చే జీతం నుంచే... సంపాదించిన మొత్తాన్ని సమాజసేవకు ఉపయోగించాలనుకునేవారు చాలా తక్కువమంది. అయితే జగదీశ్బాబు తనకు నెలనెలా వచ్చే జీతంలో నుంచే ఈ సేవా కార్యక్రమాలన్నీ చేయడం విశేషం. ఇందుకు ముందుగా అమ్మానాన్నల అనుమతి తీసుకున్నారు జగదీశ్బాబు. ‘‘నాకు నెలకు 26 వేల రూపాయల జీతం వస్తుంది. బ్రెయిలీ ప్రింటర్ కొనుగోలుకు బ్యాంక్ లోను తీసుకున్నాను. లోనుకు 3000లు పోగా మిగిలే 23,000 ఈ పనికోసం పెడుతున్నాను. అమ్మనాన్న, నా కుటుంబం, అన్నయ్య కుటుంబం అంతా కలిసే ఉంటాం. ‘వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం మన తిండికి, బట్టకు ఎలాగూ సరిపోతుంది. నా జీతాన్ని సేవాకార్యక్రమాలకు ఉపయోగించుకునే అవకాశమివ్వ’మని కోరాను. అందుకు అమ్మానాన్న ఒప్పుకున్నారు. ఐదేళ్ల క్రితం పెళ్లయింది. మా పోషణ కూడా అమ్మనాన్నలే చూస్తున్నారు. అందుకు వారికి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను’’ అని చెప్పారు జగదీష్. మానేసినవారిని... మళ్లీ బడికి... ఆర్థికస్థోమత లేని కారణంగా అర్థంతరంగా చదువులు మానేసే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తగినంత ఆర్థికసాయం చేస్తూ తిరిగి వారిని బడిలో చేర్పిస్తున్నారు జగదీశ్. ‘‘ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలలో కొందరు పెన్సిల్ కూడా కొనలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పిల్లలు స్కూల్ నుంచి డ్రాపవుటవుతుంటారు. వారికి యూనిఫామ్లు, ఫీజులు, స్కాలర్షిప్లు ఇచ్చి తిరిగి స్కూల్లో చేర్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇందుకు టీచర్ ఉద్యోగం చేస్తున్న అన్నయ్య రవిశంకర్, బెంగుళూర్లో ఉద్యోగం చేస్తున్న మా తమ్ముడు కిశోర్ కొంత సాయం చేస్తుంటారు. మా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. అతని నుంచి కొంత సాయం తీసుకుంటాను. పేద పిల్లలను చదివించమని స్థితిమంతులను వేడుకుంటాను. అలా కొందరు పిల్లల విద్యాబుద్ధుల బాధ్యత తీసుకున్నవారూ ఉన్నారు’’ అని వివరించారు జగదీశ్. ఆశయానికి ఊతం జగదీష్ బాబు అర్ధాంగి జ్యోతి కూడా అతని ఆశయంలో తోడుగా నిలిచింది. ఈ విషయం గురించి చెబుతూ - ‘జ్యోతి మాకు దూరపు బంధువే! అయితే పెళ్లయ్యేంతవరకు ఆ విషయం తెలియదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. తను డిగ్రీ వరకు చదువుకుంది. బ్రెయిలీ ప్రింటింగ్ను జ్యోతి మానిటర్ చేస్తుంది. ఎన్ని బుక్స్ తయారవుతున్నాయి, ఎవరెవరికి పంపించాలి అనే వన్నీ తనే చూస్తుంది. మాకో పాప. నా ఆశయానికి సహకరించే ఇల్లాలు దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటాను’’ అన్నారు జగదీష్. కంటి చూపు లేకపోయినా సమాజం పట్ల కనీస బాధ్యతతో ఉన్న జగదీష్బాబు లాంటివారంతా దివ్యదృష్టి ఉన్నవారే! నా భర్త చేస్తున్న సమాజ సేవ గురించి నాకు పెళ్లికి ముందే తెలుసు. నలుగురికి సాయపడాపలనే తపన గల కుటుంబం వారిది. అలాంటి కుటుంబంలో నేను ఆనందంగా ఉంటాను అనిపించింది. అందుకే ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాను. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఆయనకు సహాయంగా ఉంటున్నాను. - జ్యోతి, జగదీశ్ బాబు భార్య -
‘108’ మానవీయత
ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యానికి దూరమైన బాలింత 108 సిబ్బంది మానవీయతతో ప్రాణాలతో బయట పడిన బాధితురాలు 108 అంబులెన్స్ సిబ్బంది మానవీయత ప్రదర్శించడంతో నిండు బాలింత ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి 108 సిబ్బం ది ఆ గ్రామంలో చందా వసూలు చేసింది. ఆమెకు సకాలంలో వైద్య ం అందేలా చేసింది. వారు సేకరించిన డబ్బుతో వైద్యం సేవలు పొందిన ఆమె.. కోలుకొని శుక్రవా రం సాయంత్రం సొంత గ్రామానికి చేరుకుంది. - కోలారు కోలార్ తాలూకాలోని యలవార గ్రామానికి చెందిన జ్యోతి ఐదు రోజుల క్రితం ప్రసవమై బిడ్డ మరణించింది. ప్రసవం అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంది. అయితే రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఎస్ఎన్ఆర్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. ఎస్ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా మెరుగైన చికిత్స కోసం జ్యోతిని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స చేసినా మెరుగైన వైద్యం కోసం జ్యోతి ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. అయితే కూలి పని చేసుకుని జీవనం సాగించే జ్యోతి కుటుంబానికి అప్పటికే చేతిలో డబ్బులు ఖాళీ కావడంతో నేరుగా ఇంటికి వచ్చింది. కానీ రక్తం 2 హెచ్.బి.కి పడిపోవడంతో జ్యోతి ఆచేతనావస్థలోకి వెళ్లింది. జ్యోతి పరిస్థితిని గుర్తించిన ఆశా కార్యకర్త శారదమ్మ, ఏఎన్ఎం వరలక్ష్మిలు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి తదితరులు గ్రామానికి చేరుకున్నారు. అయితే తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జ్యోతి తన చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చికిత్సకు ససేమిరా అంది. అంతటితో ఊరుకోని 108 సిబ్బంది మానవీయతను ప్రదర్శించారు. గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులతో చందా వసూలు చేశారు. ఆశా కార్యకర్త శారదమ్మ రెండు వేల రూపాయల సహాయం చేసింది. ఇలా మొత్తం రూ. 15 వేలు జమ కావడంతో 108 సిబ్బంది జ్యోతిని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో జ్యోతికి ఎనిమిది బాటిళ్ల రక్తం ఎక్కించడంతో కోలుకుంది. జ్యోతి ఆర్థిక స్థితిని గుర్తించిన 108 సిబ్బంది శ్రీనివాసమూర్తి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ శ్రీరాములుకు పరిస్థితిని వివరించగా.. జ్యోతికి ఉచిత చికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స దొరకడంతో జ్యోతి పూర్తిగా కోలుకుంది. అదే 108 అంబులెన్స్లో జ్యోతిని సిబ్బంది గ్రామంలో శుక్రవారం సాయంత్రం దిగబెట్టారు. 108 సిబ్బంది మాన వీయతను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. -
వెలుగు పూల పరిమళాల వేళ...
దీపావళి రోజున ఇంటింటా దీపం వెలిగించడం ఆచారం. భారతీయ సంప్రదాయం ప్రకారం చెప్పాలంటే... దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ॥ దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి... నిదర్శనంగా భావిస్తారని పండితులు చెబుతారు. ఇలా దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పూర్వం ఒకసారి దుర్వాస మహామునికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి సత్కారానికి దుర్వాసుడు పరమానందం చెంది, ఇంద్రుడికి మహిమాన్విత హారాన్ని ప్రసాదించాడు. అయితే అహంకారంతో నిండిన ఇంద్రుడు ఆ హారాన్ని తిరస్కార భావంతో చూసి, తన దగ్గరున్న ఐరావతం మెడలో వేశాడు. ఏనుగు ఆ హారాన్ని తన కాలితో తొక్కేసింది. ఆ సంఘటన చూసిన దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో దేవేంద్రుడిని శపించాడు. ఆ శాప ఫలంగా దేవేంద్రుడు రాజ్యం, సర్వ సంపదలు కోల్పోయి, దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థించాడు. విషయం గ్రహించిన శ్రీమహావిష్ణువు, దేవేంద్రునితో- ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. శ్రీహరి సూచనను తుచ తప్పకుండా పాటించాడు ఇంద్రుడు. దేవేంద్రుని భక్తికి సంతుష్టి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడిని అనుగ్రహించింది. ఆమె కరుణతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలనూ పొందాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీహరి చెంతనే ఉన్న శ్రీలక్ష్మితో ‘‘తల్లీ నీవు కేవలం శ్రీహరి దగ్గరే ఉండటం న్యాయమా! నీ భక్తులను కరుణించవా?’’ అని దేవేంద్రుడు ప్రశ్నించాడు. అందుకు లక్ష్మీదేవి, ‘‘దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ప్రసన్నురాలనవుతాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, జయాన్ని కాంక్షించే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, భక్తుల సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలవుతాను’’ అని వరమిచ్చింది. అందుకే, దీపావళి నాడు దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలూ చేకూరతాయని పెద్దల మాట. పురాణాల మాటెలా ఉన్నా, జీవితంలోని చీకటినీ, దుఃఖాన్నీ పారదోలేం దుకు వెలుగు పూల పరిమళాలను పంచే దీపాలను మించినవి ఏముంటాయి! - డా. పురాణపండ వైజయంతి -
కన్నీళ్లకే కన్నీరొచ్చే..
వీడని పేదరికం వెంటాడిన వ్యాధులు వేధించిన భర్త తాగుడు పిల్లలతో సహా కాలువలో దూకిన తల్లి మండ్య : ఎంత శ్రమించిన పూట గడవడమే కష్టం... దీనికి తోడు ఎంత ఖర్చు పెట్టినా నయం కాని దీర్ఘకాలిక వ్యాధులు! మరో వైపు భర్త తాగుడు వెరసి జీవితంపై విరక్తి పెంచుకున్న ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నెలమనె సమీపంలో ఉన్న హనుమంత నగరకు చెందిన రాము, కెంపమ్మ(31) దంపతులు. వీరికి విజయ్ (3), జ్యోతి(6), పల్లవి(7) పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు దంపతులిద్దరూ కూలీ పనులు చేసేవారు. కెంపమ్మకు చాలా కాలంగా చర్మ, మూర్ఛ వ్యాధులతో బాధపడుతోంది. ఈ వ్యాధుల బారిన పిల్లలు కూడా పడ్డారు. ఎందరు డాక్టర్లకు చూపినా వ్యాధులు నయం కాలేదు. రోజురోజుకూ మందుల ఖర్చుల ఎక్కువవుతోంది. సంపాదన మాత్రం పెరగలేదు. వ్యాధి తీవ్రత ఉన్న సమయంలో కెంపమ్మ పనికి వెళ్లలేకపోయేది. ఆ సమయంలో ఆ కుటుంబానికి ఒక పూట మాత్రమే భోజనం దక్కేది. కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకున్న భర్త మద్యానికి బానిసై తన సంపాదన మొత్తాన్ని తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు. ఆ వ్యసనాన్ని వీడి కుటుంబ పోషణకు సహకరించాలని పలుమార్లు భార్య వేడుకున్నా ఫలితం లేకపోయింది. వ్యాధి తీవ్రత ఎక్కువై భరించలేని స్థితికి చేరుకుంది. వైద్యం చేయించుకునేందుకు డబ్బు ఇచ్చి సహకరించాలని తన తల్లి జయమ్మను కెంపమ్మ వేడుకుంది. మూడ్రోజుల్లో డబ్బు సర్దుతానని ఆమె చెప్పడంతో కెంపమ్మకు దిక్కుతోచలేదు. చర్మ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక చిన్నారులు ఏడుస్తుంటే తల్లి హృదయం తల్లడిల్లింది. ఆదివారం సాయంత్రం సీడీఎస్ కాలువను చేరుకుని పిల్లలతో సహ దూకింది. సోమవారం ఉదయానికి పాండవపుర తాలూకాలోని దేవెగౌడనకొప్పలు - చిక్కాడ సమీపంలో విజయ్ మృతదేహం తేలింది. మధ్యాహ్నానికి కొడలకుప్పె సమీపంలో దొడ్డబట్ట వద్ద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పి భూషన్ జి.బోరసే, సీఐ దీపక్, ఎస్ఐ బి.జి.కుమార్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బంధువుల నుంచి ప్రాణభయం
శ్రీకాకుళం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉందని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన కోరాడ సురేష్, జ్యోతి శనివారం డీఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కులాలకు చెందిన తాము గత కొంత కాలం ప్రేమించుకున్నామని, తమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. తమకు వేరే సంబధాలు చూస్తుండడంతో మేజర్లయిన తాము ఈనెల 17న హైదరాబాద్ వెళ్లామన్నారు. అక్కడి షాపూర్నగర్ సమీపంలోని హెచ్ఎంటీ కాలనీ సీతారామ ఆలయ దేవస్థానంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులైన కోరాడ సతీష్, పల్లి రమణ, చిట్టి రామకృష్ణలు తమ ను బెదిరించి తీసుకువెళ్లారన్నారు. గ్రామంలో రాజకీయ కక్షల్లో భాగంగా ఒక వర్గానికి చెందిన వారు ఈ నెల 20న కోరాడ రమణయ్య, కోరాడ సతీష్, కోరాడ నరేష్ల ప్రోత్సాహంతో దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులకు తెలిపామన్నారు.గ్రామంలోనికి రానీయకుండా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మనీ ‘ఫండి’స్తున్నారు...
భారతదేశంలో రెండవ మహిళా ఫండ్ మేనేజర్. 1998లో ఫండ్ మేనేజర్గా యూటీఐలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఈమె నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.7,000 కోట్లుపైనే ఉంది. యూటీఐ మాస్టర్ షేర్, ఎంఎన్సీ, ట్యాక్స్ సేవింగ్, టాప్ 100, డివిడెండ్ ఈల్డ్ వంటి ప్రధానమైన ఫండ్స్ను ఈమే నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగంపై మహిళలు ఆసక్తి చూపుతున్నారనేది స్వాతి మాట. పేరు: స్వాతి కులకర్ణి(48) హోదా: యూటిఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ: రూ. 7,000 కోట్లు రీసెర్చ్ ఎనలిస్ట్గా 1995లో కెరీర్ ప్రారంభించారు. 2007లో ఎస్బీఐలో రీసెర్చ్ హెడ్ అయ్యారు. 2010లో ఫండ్ మేనేజర్గా పదోన్నతి. ప్రస్తుతం ఈమె ఎస్బీఐ బ్లూచిప్, వన్ ఇండియాకి చెందిన రూ.1,200 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు. ‘‘ఈ కెరీర్లో చాలా సవాళ్లున్నాయి. ఒక షేరును అంతా ఎగబడి కొంటున్నప్పుడు నేనైతే దానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతా. అవసరమైతే ఆ లాభం పోగొట్టుకోవటానికైనా సిద్ధమే’’ అంటారు సొహిని. పేరు: స్వాతి42) హోదా: ఎస్బీఐఎంఎఫ్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.1,200కోట్లు అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మేనేజర్గా... రూ.8,000 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు జ్యోతి వాశ్వాని. తాను పనిచేసిన జేఎం క్యాపిటల్, జేఎం షేర్ బ్రోకర్స్, ప్రభుదాస్ లీలాధర్ వంటి ప్రతిచోటా ఆమె పురుషులతో పోటీపడి వారికంటే ముందుండేవారు. ‘‘నేను 1995లో కెరీర్ ప్రారంభించినప్పుడు ఈ రంగంపై మహిళలకు ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఫండ్ మేనేజర్లుగా రాణించడానికి చక్కటి వాతావరణం ఉంది’’ అంటారు జ్యోతి. పేరు: జ్యోతి వాశ్వాని (43) హోదా: అవైవా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.8,000 కోట్లు {ఫాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫండ్ మేనేజర్గా రూ.2,500 కోట్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్నారు రోషి జైన్. 1998 సీఏ ఎగ్జామ్స్లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన జైన్... గోల్డ్మాన్ శాక్స్లో ఎనలిస్ట్గా వృత్తిని ప్రారంభించారు. సీఏ చేస్తుండగానే స్టాక్ మార్కెట్పై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారీమె. కెరీర్ కోసం పెళ్లికాకుండా ఒంటరిగా మిగిలిపోయినా... తనకు ఎలాంటి బాధా లేదంటున్నారీమె. పేరు: రోషి జైన్ (36) హోదా: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్