పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 2015లో భాగంగా బుధవారం జైపూర్ పింక్ పాంథర్స్ , పాట్నా పైరేట్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 26-24 తేడాతో పాట్నా పైరేట్స్, జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది.