Pro Kabaddi
-
ప్రదీప్ కూత ఘనం
హరియాణాలోని సోనీపత్.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ ఆటగాళ్లకు కేంద్రం. యోగేశ్వర్ దత్, రవి దహియా, సీమా అంటిల్ తదితర ఆటగాళ్లంతా అక్కడి నుంచి వచ్చినవాళ్లే. సోనీపత్లో ఉన్న క్రీడా వాతావరణం అక్కడి సమీప పట్టణాలు, గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులంతా కచ్చితంగా ఏదో ఒక ఆటను ఎంచుకొని అందులో కనీస స్థాయి వరకు రాణించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి గ్రామాల్లో ఒకటి.. సోనీపత్కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రింఢానా. సుమారు 7 వేల జనాభా గల ఈ ఊర్లో కబడ్డీ ఆటపై ప్రత్యేక ఆకర్షణ ఉంది. చిన్నా, పెద్దా ఒక చోట చేరితే కబడ్డీ కూత పెట్టాల్సిందే. అలాంటి ఊరు నుంచి వచ్చిన ఒక యువకుడు ఇప్పుడు భారత కబడ్డీలో తనదైన ముద్ర వేశాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్లో అద్భుత ప్రదర్శనతో ఆల్టైమ్ బెస్ట్ ప్లేయర్గా నిలిచిన అతనే ప్రదీప్ నర్వాల్. 11 సీజన్ల లీగ్లో పది సీజన్లే ఆడినా రికార్డు స్థాయిలో అత్యధిక పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.రింఢానాలో నర్వాల్ కుటుంబంలో చాలామందికి కబడ్డీ కూడా దినచర్యలో భాగమే. వాళ్లలో ప్రదీప్ బాబాయ్కి బెస్ట్ ప్లేయర్గా గుర్తింపు ఉంది. ఆయనను చూసే ప్రదీప్ కబడ్డీపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన ద్వారానే ఆ ఆటలో మెలకువలు నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రదీప్కి కబడ్డీ లోకమైపోయింది. ఎంతగా అంటే బ్యాగ్తో స్కూల్కు వెళ్లి అటెండెన్స్ అయిపోగానే గ్రౌండ్ వైపు పరుగెత్తేవాడు. బడిలో అతని షెడ్యూల్ అదేనని చాలారోజుల దాకా ఇంట్లో తెలీలేదు. పరీక్షల్లో కనీసం మార్కులు కూడా రాకపోయేసరికి సందేహించిన పెద్దలు ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. అయితే తాను ఆటవైపు పూర్తిస్థాయిలో మళ్లేందుకు అదే మలుపు అని చెబుతాడు ప్రదీప్. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లాడు బాగా చదవడం లేదని తిట్టలేదు. ఆటపై ఆసక్తి ఉంది, బాగా ఆడుతున్నాడు కాబట్టి అందులోనే భవిష్యత్తు వెతుక్కొమ్మంటూ ప్రోత్సహించారు. 11 ఏళ్ల వయసులో స్కూల్ టీమ్ తరఫున మొదటిసారి బరిలోకి దిగిన ప్రదీప్ ఆట అందరినీ ఆకట్టుకుంది. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం తల్లిదండ్రులు వెంటనే సోనీపత్లోని కబడ్డీ అకాడమీలో చేర్పించారు. అక్కడే అతని ఆట పదునెక్కింది. హ్యట్రిక్ టైటిల్స్ అందించి..హరియాణా రాష్ట్ర జట్టు తరఫున పలు టోర్నీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ప్రదీప్ కెరీర్ 18 ఏళ్ల వయసులో కీలక మలుపు తిరిగింది. 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ ఒక్కసారిగా దేశంలోని క్రీడా ప్రేమికుల దృష్టి కబడ్డీ వైపు మళ్లేలా చేసింది. కొత్త కొత్త హంగులు, సరికొత్త నిబంధనల మధ్య వచ్చిన ఈ లీగ్.. కబడ్డీ రూపురేఖలను మార్చింది. 2015 టోర్నీ కోసం లీగ్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ క్రమంలో కొందరు కోచ్లు, సీనియర్ ఆటగాళ్లు హరియాణాలో ప్రదీప్ ఆడిన మ్యాచ్లు చూశారు. వెంటనే మరో మాట లేకుండా అతడిని తమ లీగ్ కోసం ఎంచుకున్నారు. 2015లో తొలిసారి బెంగళూరు బుల్స్ తరఫున ప్రో కబడ్డీ లీగ్ ఆడే అవకాశం ప్రదీప్కు వచ్చింది. అతని రైడింగ్ నైపుణ్యం అన్ని జట్లనూ ఆకర్షించింది. దాంతో మరుసటి ఏడాది అతణ్ణి పట్నా పైరేట్స్ తమ టీమ్లోకి ఎంచుకుంది. తర్వాత నాలుగేళ్ల పాటు అతను లీగ్ను తన అద్భుత ఆటతో శాసించాడు. తన మెరుపు రైడింగ్తో రికార్డు పాయింట్లు సాధిస్తూ వరుసగా మూడేళ్లు పట్నా పైరేట్స్ను విజేతగా నిలబెట్టాడు. ఈ హ్యట్రిక్ టైటిల్స్ ప్రదీప్ స్థాయిని అమాంతం ఆకాశానికి పెంచేశాయి. ఆ తర్వాత రెండు సీజన్ల పాటు యూపీ యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రదీప్.. 2024లో మళ్లీ తన మొదటి జట్టు బెంగళూరుకు చేరాడు.రికార్డులే రికార్డులు..కబడ్డీ.. కబడ్డీ అని కూత పెడుతూ ప్రదీప్ నర్వాల్ ఒక్కసారి ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెట్టాడంటే పాయింట్ల వర్షం కురవాల్సిందే. తన చురుకైన కదలికలతో అటు వైపు ఆటగాడిని టచ్ చేస్తూనే కిందకు వంగుతూ డిఫెండర్లకు అందకుండా సురక్షితంగా లైన్ దాటడంలో అతనికి అతనే సాటి. నీటిలోకి దూకి బయటకు వెళుతున్నట్లుగా ఉండే ఆ ఆట శైలి వల్లే అభిమానులు ప్రదీప్కు డుబ్కీ కింగ్ అనే నిక్ నేమ్ పెట్టారు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పెద్ద సంఖ్యలో రికార్డులు అతని పేరిటే ఉండటం విశేషం. అత్యధిక సంఖ్యలో రైడింగ్ పాయింట్లు, అత్యధిక సూపర్ రైడ్లు, అత్యధిక సూపర్ 10 పాయింట్లు, సింగిల్ రైడ్లో అత్యధిక పాయింట్లు, ఒకే సీజన్లో అత్యధిక పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ముందుగా 1000 పాయింట్లు అందుకున్న ఆటగాడిగా మొదలై 1700 పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా అతను నిలిచాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న ఆటగాడికి మధ్య 200 పాయింట్లకు పైగా అంతరం ఉండటం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ ఆట ప్రదీప్కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ను తెచ్చిపెట్టింది. అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న కబడ్డీ ప్లేయర్ కూడా ప్రదీప్ నర్వాలే! గత ఎనిమిదేళ్లుగా భారత సీనియర్ కబడ్డీ సభ్యుడిగా కూడా పలు కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ∙ -
Pro Kabaddi 2024: అర్జున్ అదరహో
నోయిడా: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో విజృంభించడంతో... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. లీగ్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో పింక్ పాంథర్స్ 37–23 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్పై విజయం సాధించింది. జైపూర్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడితే... పుణేరి కేవలం రెయిడింగ్లోనే సత్తా చాటింది. ఈ మ్యాచ్లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్లో జైపూర్ 10 పాయింట్లు కొల్లగొట్టగా... పుణేరి 3 పాయింట్లకే పరిమితమైంది. జైపూర్ తరఫున అర్జున్ విజృంభించగా.. అతడికి నీరజ్ నర్వాల్ నుంచి సహకారం లభించింది. పుణేరి పల్టన్ తరఫున పంకజ్, మోహిత్ గోయట్ చెరో 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 13 మ్యాచ్లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు ఖతాలో వేసుకున్న జైపూర్ ఐదో స్థానానికి చేరింది. 42 పాయింట్లతో పుణేరి పల్టన్ నాలుగో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో యు ముంబా 34–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ (8 పాయింట్లు), అజిత్ చవాన్ (7 పాయింట్లు) రాణించగా... బెంగళూరు తరఫున సుశీల్ (8 పాయింట్లు), ప్రదీప్ నర్వాల్ (6 పాయింట్లు) సత్తాచాటారు. 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 45 పాయింట్లతో నిలిచిన యు ముంబా పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 14 మ్యాచ్ల్లో 12వ పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ 16 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 40-29తో బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్కుమార్(14), మన్దీప్సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్దీప్సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్ను నితీశ్కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్కు వెళ్లిన మన్దీప్సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్తో పాటు డిఫెన్స్లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వచ్చిన నితిన్కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్కు వచ్చిన మనిందర్సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్ను బెంగళూరు సబ్స్టిట్యూట్గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్దీప్సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
హర్యానాదే ఆల్రౌండ్ షో
హైదరాబాద్, నవంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మ్యాచ్లను రసవత్తరంగా సాగుతున్నాయి. పాయింట్ పాయింట్కు ప్లేయర్లు కసికొద్ది తలపడుతున్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 35-22తో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హర్యానా తరఫున వినయ్(9), మహమ్మద్ రెజా(6),సంజయ్(4) అదరగొట్టారు. వినయ్ రైడింగ్లో విజృంభిస్తే..రెజా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గుమన్సింగ్(11) ఒంటరిపోరాటం గుజరాత్ను గెలిపించలేకపోయింది. ఈ విజయంతో హర్యానా 21 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, గుజరాత్ జెయింట్స్(7) ఆఖరి స్థానానికి పరిమితమైంది.స్టీలర్స్ జోరు.. ప్రొ కబడ్డీ లీగ్లో ఓటములతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హర్యానా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. లీగ్లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన రెండు జట్లు అద్భుతంగా పోరాడుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన గుజరాత్పై హర్యానా ఒకింత ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ 19వ నిమిషంలో రోహిత్, నీరజ్, బాలాజీని ఔట్ చేయడం ద్వారా హర్యానాకు వినయ్ ఒకే రైడ్లో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు.ఓవైపు హర్యానాకు వినయ్ వరుస రైడ్లలో పాయింట్లు తీసుకొస్తే..మరోవైపు గుజరాత్ తరఫున గుమన్సింగ్ పాయింట్లు అందించాడు. అయితే 16వ నిమిషంలో రైడ్కు వెళ్లిన వినయ్ను గుమన్సింగ్ సూపర్ ట్యాకిల్తో కట్టడి చేశాడు. ఈ క్రమంలో మరింత పట్టు బిగించిన స్టీలర్స్ వరుస రైడ్లతో గుజరాత్ను ఒత్తిడిలోకి నెట్టింది. డూ ఆర్ డై రైడ్కు వచ్చిన నీరజ్కుమార్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి నిమిషంలో రైడ్కు వచ్చిన నవీన్..జితేందర్యాదవ్ను ఔట్ చేయడంతో 10వ నిమిషంలో గుజరాత్ ఆలౌటైంది. స్టీలర్స్ పక్కా వ్యూహాంతో గుజరాత్పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-13తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: తొలి అర్ధభాగంలో హర్యానాకు వినయ్, జయ పాయింట్ల వేటలో కీలకంగా వ్యవహరించగా, గుమన్సింగ్..గుజరాత్కు ఆయువుపట్టుగా నిలిచాడు. తొలిరైడ్కు వెళ్లిన గుమన్సింగ్..నవీన్ను ఔట్ చేసి జట్టులో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఓవైపు వినయ్ తనదైన దూకుడు కొనసాగిస్తే..అతనికి మహమ్మద్ రెజా జతకలిశాడు. వరుస రైడ్లలో పాయింట్లకు తోడు డిఫెన్స్లోనూ చెలరేగిన రెజా స్టీలర్స్కు కీలక పాయింట్లు అందించాడు. గుమన్సింగ్ ఒంటరి పోరాటం గుజరాత్ను ఒడ్డున పడేయలేకపోయింది. దీంతో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. -
బెంగళూర్ బుల్స్ రెండో విక్టరీ
4 నవంబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్ తలైవాస్పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్ తలైవాస్కు ఇది రెండో పరాజయం. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో అజింక్య పవార్ (6 పాయింట్లు), అక్షిత్ (6 పాయింట్లు), సురిందర్ దెహల్ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ తరఫున నరందర్ (6 పాయింట్లు), సచిన్ (5) రాణించారు. బెంగళూర్ పైచేయి : వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. సోమవారం తమిళ్ తలైవాస్తో మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్ తలైవాస్పై బెంగళూర్ బుల్స్ ఓ పాయింట్ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్, జై భగవాన్ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్ నందల్, సురిందర్ దెహల్ మెరుపు ట్యాకిల్స్ చేశారు. తమిళ్ తలైవాస్ సైతం రెయిడ్లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ 14-13తో పైచేయి సాధించింది.సెకండ్హాఫ్లో తమిళ్ తలైవాస్ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్ తలైవాస్ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్ తలైవాస్.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్ బుల్స్. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్ను ఆలౌట్ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్ బుల్స్ 36-32తో తమిళ్ తలైవాస్ను బోల్తా కొట్టించింది. -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11: ఎదురులేని పుణెరి పల్టన్
హైదరాబాద్, 4 నవంబర్ 2024 : డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.పల్టన్ వన్సైడ్ షో : వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్.. గుజరాత్ జెయింట్స్పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్ జెయింట్స్ను ఆలౌట్ చేసిన పుణెరి పల్టన్ 30-9తో వన్సైడ్ షో చేసింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహితె, మోహిత్ గోయత్లు కూతలో కేక పెట్టించారు. పంకజ్ మోహితె, మోహిత్ గోయత్లు కండ్లుచెదిరే సూపర్ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్లో గౌరవ్ ఖత్రి, ఆమన్ ట్యాకిల్స్ జెయింట్స్ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్ జెయింట్స్ పూర్తిగా తేలిపోయింది. గుమన్ సింగ్ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.గుజరాత్ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్ జోరు తగ్గలేదు. గుజరాత్ జెయింట్స్ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్ జెయింట్స్ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్ను ఆలౌట్ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ 21 పాయింట్లు దక్కించుకుంది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్, 2 నవంబర్ 2024 : తెలుగు టైటాన్స్ పంజా విసిరింది. బెంగళూర్ బుల్స్ను బోల్తా కొట్టించి సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజయ్ మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు), డిఫెండర్ అరుల్ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.తెలుగు టైటాన్స్ పంజా : ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. బెంగళూర్ బుల్స్పై ధనాధన్ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్లు కూతకెళ్లి బుల్స్ను ఆలౌట్ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్ ట్యాకిల్స్తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.బుల్స్ మెరుపు వేగంతో.. : విరామం అనంతరం బెంగళూర్ బుల్స్ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్ ఆలౌట్ చేసింది. మెరుపు ట్యాకిల్స్కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్ బుల్స్. స్టార్ రెయిడర్ పవర్ సెహ్రావత్ విఫలమైతే.. టైటాన్స్ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్కు పోటీ ఇచ్చిన బెంగళూర్ బుల్స్ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది. -
పట్నా పైరేట్స్ సూపర్ షో
హైదరాబాద్: పీకెఎల్ మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో యూపీ యోధాస్పై 42-37తో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది. రెయిడింగ్లో, డిఫెన్స్లో హవా చూపించిన పైరేట్స్ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్ రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. అయాన్ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్ ఆటగాళ్లలో గగన్ గౌడ (9 పాయింట్లు), భరత్ (6 పాయింట్లు) , సురేందర్ గిల్(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.పైరేట్స్ ముందంజ : యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ మ్యాచ్లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. పైరేట్స్ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్, డిఫెన్స్లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి. దీంతో ఇరు జట్లు ఆలౌట్ సైతం చవిచూశాయి. డిఫెన్స్లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుభమ్ షిండె మెరుపు ట్యాకిల్స్తో అదరగొట్టాడు. రెయిడర్ దేవాంక్ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.యోధాస్కు నిరాశ : ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్ రెయిడర్లు సురేందర్ గిల్, గగన్ గౌడ సహా ఆల్రౌండర్ భరత్ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్కు అయాన్ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్ పట్నా పైరేట్స్కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. -
హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం
హైదరాబాద్, 30 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ పీకెఎల్ 11వ సీజన్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిరాశపరిచిన హర్యానా స్టీలర్స్ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో సాధికారిక విజయాలు సాధించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్లో యూపీ యోధాస్పై 30-28తో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. నాలుగు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్కు ఇది మూడో విక్టరీ కాగా.. యూపీ యోధాస్కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో రెయిడర్ వినయ్ (8 పాయింట్లు), డిఫెండర్ సంజయ్ ధుల్ (6 పాయింట్లు) రాణించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ ( 9 పాయింట్లు), భరత్ (5 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.ప్రథమార్థంలోనూ యూపీ యోధాస్పై హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. తొలి అర్థభాగం ఆటలో ఇరు జట్లకు పాయింట్లు అంత సులువుగా దక్కలేదు. కూతలో హర్యానా, యూపీ నాలుగేసి పాయింట్లు సాధించాయి. కానీ స్టీలర్స్ డిఫెండర్ సంజయ్ ధుల్ మెరుపు ట్యాకిల్స్ చేశాడు. హర్యానా స్టీలర్స్కు డిఫెన్స్లో ఏడు పాయింట్లు అందించాడు. దీంతో తొలి 20 నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్ 11-9తో పైచేయి సాధించింది. విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ద్వితీయార్థంలో స్టీలర్స్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు ఐదు నిమిషాల్లో యూపీ యోధాస్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పాయింట్ల లోటు నెమ్మదిగా పూడ్చకుంటూ హర్యానాపై యోధాస్ ఒత్తిడి పెంచింది. హర్యానా 26-24తో ముందంజలో నిలువగా.. చివరి రెండు నిమిషాల ఆటలో ఇరు జట్లు ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చాయి. ఆఖరు వరకు రెండు పాయింట్ల ఆధిక్యత నిలుపుకున్న హర్యానా స్టీలర్స్ సీజన్లలో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. -
ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం. ప్రథమార్థం హోరాహోరీ : వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్తో మ్యాచ్లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది. పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్లో పైరేట్స్తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది. పుంజుకున్న టైటాన్స్ : విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్లు మెరవటంతో తెలుగు టైటాన్స్పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. -
తలైవాస్, పాంథర్స్ మ్యాచ్ టై
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు రెయిడ్ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్లో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఆటగాళ్లలో అర్జున్ (7 పాయింట్లు), వికాశ్ (6 పాయింట్లు), రెజా (3 పాయింట్లు), అంకుశ్ ( 4 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ శిబిరం నుంచి సచిన్ (11 పాయింట్లు), నరేందర్ (3 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్.. సచిన్ సూపర్ టెన్ షోతో ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. జైపూర్ చేజేతులా విజయాన్ని దూరం చేసుకోగా.. తలైవాస్ ఓటమి నుంచి తప్పించుకుంది.జైపూర్ సమిష్టిగా.. :గత మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓడిన జైపూర్ పింక్ పాంథర్స్.. తమిళ్ తలైవాస్తో మ్యాచ్ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి రెయిడింగ్లో, డిఫెన్స్లో పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం నిలుపుకుంది. తొలి 20 నిమిషాల ఆట అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ 21-16తో ముందంజ వేసింది. ఐదు పాయింట్లతో తలైవాస్పై పైచేయి సాధించింది. తలైవాస్ రెయిడర్లు సచిన్, నరేందర్లు మూడేసి బోనస్ పాయింట్లు సాధించగా జైపూర్కు పోటీ ఇవ్వగలిగింది. జైపూర్లో అర్జున్ దేశ్వాల్కు వికాశ్, రెజా, అంకుశ్లు సహకరించారు. దీంతో పింక్ పాంథర్స్ ప్రథమార్థంలో విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.పుంజుకున్న తలైవాస్ విరామ సమయం అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ నెమ్మదించగా.. తమిళ్ తలైవాస్ వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సచిన్ సూపర్ రెయిడ్కు తోడు విశాల్ సక్సెస్ఫుల్ రెయిడ్తో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 26-29తో పాయింట్ల అంతరాన్ని కుదించిన తమిళ్ తలైవాస్ ఆఖరు వరకు రేసులోనే నిలిచింది. ఆఖర్లో కూతలో, పట్టులో అదరగొట్టిన తలైవాస్ స్కోరు సమం చేసింది. సక్సెస్ఫుల్ రెయిడ్తో అంతరాన్ని ఓ పాయంట్కు కుదించి.. ఆఖరు కూతకు వచ్చిన జైపూర్ రెయిడర్ రెజాను అవుట్ చేసింది. దీంతో 30-30తో స్కోరు సమమైంది. -
PKL 2024: పుణెరి పల్టాన్ తీన్మార్
హైదరాబాద్, 25 అక్టోబర్ 2024 : మాజీ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో బెంగళూర్ బుల్స్పై పుణెరి పల్టాన్ 14 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. జట్టుగా రాణించటంలో పూర్తిగా విఫలమైన బెంగళూర్ బుల్స్ సీజన్లో వరుసగా నాల్గో మ్యాచ్లో చేతులెత్తేసింది. 36-22తో బెంగళూర్ బుల్స్పై పుణెరి పల్టాన్ ఏకపక్ష విజయం సాధించింది. పల్టాన్ తరఫున పంకజ్ మోహితె (6 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు) రాణించారు. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో పంకజ్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూర్ బుల్స్కు ఏదీ కలిసి రావటం లేదు. హ్య్రాటిక్ పరాజయాలు చవిచూసిన బుల్స్.. నాల్గో మ్యాచ్లోనూ ఏమాత్రం మారలేదు. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం పుణెరి పల్టాన్తో మ్యాచ్లో బుల్స్ పూర్తిగా తేలిపోయింది. తొలి అర్థభాగం ఆటలో ఆ జట్టు 11-18తో నిలిచింది. తొలి పది నిమిషాల ఆటలో ఆ జట్టు పాయింట్లు రెండెంకలకు చేరుకోలేదు. ప్రథమార్థంలో చివర్లో పంకజ్ మెరుపులతో బుల్స్ 11 పాయింట్ల వరకు చేరుకుంది. మరోవైపు పల్టాన్ ఆటగాళ్లు పంకజ్ మోహితె, మోహిత్ గోయత్లకు కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ (5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు), ఆమన్ (4 పాయింట్లు) జతకలిశారు. మ్యాచ్ రెండో అర్థభాగంలో బెంగళూర్ బుల్స్ ప్రదర్శన కాస్త మెరుగైనా.. ఏ దశలోనూ పుణెరి పల్టాన్కు పోటీ ఇవ్వలేకపోయింది. విరామం అనంతరం సైతం మెరుపు ప్రదర్శన పునరావృతం చేసిన పుణెరి పల్టాన్ చివరి 20 నిమిషాల ఆటలోనూ 18-11తో బుల్స్ను చిత్తు చేసింది. దీంతో పుణెరి పల్టాన్ 36-22తో బెంగళూర్పై అలవోక విజయం సాధించింది. సీజన్లలో పుణెరి పల్టాన్కు ఇది నాలుగు మ్యాచుల్లో మూడో విజయం. ఈ విక్టరీతో పీకెఎల్ 11 పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా నాల్గో పరాజయంతో బెంగళూర్ బుల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. -
PKL 2024: దేవాంక్ సూపర్ షో
హైదరాబాద్, పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్ దేవాంక్ కండ్లుచెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించిన దేవాంక్ ఒంటిచేత్తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్కు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం అందించాడు. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై పట్నా పైరేట్స్ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచి ఆధిక్యంలో కొనాసాగిన తమిళ్ తలైవాస్ హ్యాట్రిక్ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో తలైవాస్ను ఆలౌట్ చేసిన దేవాంక్.. పట్నా పైరేట్స్ను గెలుపు పట్టాలెక్కించాడు. పట్నా పైరేట్స్ తరఫున ఆల్రౌండర్ అనికెత్ (4 పాయింట్లు), గుర్దీప్ (2 పాయింట్లు), సందీప్ (2 పాయింట్లు) మెరిశారు. తమిళ్ తలైవాస్ రెయిడర్ నరేందర్ ఖండోలా (15 పాయింట్లు), సచిన్ (6 పాయింట్లు) సహా డిఫెండర్ నితేశ్ (4 పాయింట్లు) మెరిసినా.. ఆ జట్టుకు సీజన్లో తొలి పరాజయం తప్పలేదు.తలైవాస్ జోరు తమిళ్ తలైవాస్ వరుసగా మూడో మ్యాచ్లో జోరు చూపించింది. తలైవాస్, పట్నా పైరేట్స్ తొలి రెయిడ్లోనే పాయింట్ల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తలైవాస్ జొరందుకుంది. తలైవాస్ రెయిడర్లకు డిఫెండర్లు సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్కు చిక్కులు తప్పలేదు. తొలి 20 నిమిషాల ఆట అనంతరం తమిళ్ తలైవాస్ 5 పాయింట్ల ఆధిక్యం సాధించింది. నరేందర్ సూపర్ టెన్తో కూతలో చెలరేగగా.. డిఫెండర్ నితేశ్ నాలుగు ట్యాకిల్స్తో మెరిశాడు. దీంతో తలైవాస్ 23-18లో పట్నా పైరేట్స్పై పైచేయి సాధించింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 11 రెయిడ్ పాయింట్లతో మెరిసినా.. డిఫెన్స్లో పైరేట్స్ తేలిపోయింది. కూతలో తలైవాస్ కంటే మెరుగ్గా రాణించినా.. ట్యాకిల్స్లో వెనుకంజ వేయటంతో ఆధిక్యం కోల్పోవాల్సి వచ్చింది.పుంజుకున్న పైరేట్స్ ద్వితీయార్థంలోనూ తమిళ్ తలైవాస్ ఆధిక్యం కొనసాగించింది. కానీ ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాచ్ మలుపు తిరిగింది. కండ్లుచెదిరే కూతతో ఒంటరి పోరాటం చేసిన పైరేట్స్ రెయిడర్ దేవాంక్ 34వ నిమిషంలో సూపర్ రెయిడ్తో చెలరేగాడు. తలైవాస్ మ్యాట్పై నలుగురు ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు ఆ జట్టును ఆలౌట్ చేశాడు. దీంతో నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి పైరేట్స్ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు ఐదు నిమిషాల్లో ఆధిక్యం నిలుపుకున్న పైరేట్స్ సీజన్లో తొలి విజయం సాధించింది. మ్యాచ్లో మెజార్టీ భాగం ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ ఒక్క ఆలౌట్తో కుదేలైంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో మూడు మ్యాచుల్లో తలైవాస్కు ఇది తొలి పరాజయం. -
PKL 11: హర్యానా స్టీలర్స్ గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలి విజయం నమోదు చేసింది. గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్కు తొలి మ్యాచ్లో చుక్కెదురైనా.. రెండో మ్యాచ్లో గొప్పగా పుంజుకుంది. వరుస విజయాల ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్ను 37-25తో చిత్తు చేసి సీజన్లో తొలి విక్టరీ సాధించింది. కూతలో, పట్టులో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించటంతో పింక్ పాంథర్స్పై ఆ జట్టు 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెయిడర్లు వినయ్ (10), నవీన్ (6), శివం (4).. డిఫెండర్లు రాహుల్ (3), మహ్మద్రెజా (2) సూపర్ షోతో మెరిశారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ అభిజిత్ మాలిక్ (6) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెజా (2), అర్జున్ (3), శ్రీకాంత్ (2) నిరాశపరిచారు.స్టీలర్స్ షో : తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్.. రెండో మ్యాచ్లో పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ను నిలువరించి.. స్టీలర్స్ షో చేసింది. తొలి 20 నిమిషాల ఆటలోనే ఆధిపత్యం చూపించిన హర్యానా స్టీలర్స్ విజయానికి గట్టి పునాది వేసుకుంది. రెయిడింగ్, ట్యాక్లింగ్లో దుమ్మురేపిన స్టీలర్స్ ప్రథమార్థంలో 20-11తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడర్ వినయ్ సూపర్ టెన్తో చెలరేగగా.. నవీన్ సైతం అదరగొట్టాడు. డిఫెన్స్లో రాహుల్, మహ్మద్రెజా ఆకట్టుకున్నారు.మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమిష్టిగా రాణించటంలో విఫలమైంది. ఇటు కూతలో, అటు పట్టులో తేలిపోయింది. ప్రథమార్థంలో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ద్వితీయార్థంలో ఆ మాత్రం ప్రదర్శన సైతం చేయలేకపోయింది. ఆల్రౌండ్ షోతో చెలరేగిన హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం సాధించారు. ఈ సీజన్లో మూడు మ్యాచుల ఆడిన పింక్ పాంథర్స్కు ఇది తొలి పరాజయం. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
తెలుగు టైటాన్స్కు రెండో ఓటమి
హైదరాబాద్, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో డిఫెన్స్లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్లోనే టచ్ పాయింట్తో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూర్కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్ను ట్యాకిల్ చేసిన టైటాన్స్.. పవన్ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్ అభిజీత్ చేసిన సూపర్ రైడ్ ఆటను మలుపు తిప్పింది. బోనస్తో పాటు అంకిత్, పవన్, క్రిషన్లను ఔట్ చేసిన అభిజీత్ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.రెండో భాగంలో జైపూర్ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్ జైపూర్కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్ జైపూర్ ఆటగాడు రెజాను టచ్ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్లో అర్జున్.. విజయ్, సాగర్ను ఔట్ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్లో ఇటు పవన్, అటు అర్జున్ సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్ సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్ రైడ్స్తో సత్తా చాటగా.. పవన్ను అంకుష్ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్ను రెండోసారి ఆలౌట్ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్ సూపర్ రైడింగ్తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
PKL Season 11: పుణెరి పల్టాన్కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్తో పాటు డిఫెన్స్లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్లో యూపీ యోధాస్తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
దబాంగ్ ఢిల్లీపై యూపీ యోధాస్ అద్భుత విజయం
హైదరాబాద్,: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను యూపీ యోధాస్ జట్టు అద్బుత విజయంతో ఆరంభించింది. డిఫెన్స్లో గొప్ప ప్రదర్శన చేస్తూ రెండో భాగంలో గొప్పగా పుంజుకున్న యూపీ.. బలమైన దబాంగ్ ఢిల్లీ కేసీపై పైచేయి సాధించింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూపీ యోధాస్ 28–23 తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. యూపీ జట్టులో రైడర్లు భవానీ రాజ్పుత్ (7 పాయింట్లు), సురేందర్ గిల్ (4) ఆకట్టుకోగా.. డిఫెండర్ సాహుల్ కుమార్ 5 పాయింట్లతో హైఫైవ్ సాధించాడు. ఢిల్లీ జట్టులో కెప్టెన్, స్టార్ రైడర్ అషు మాలిక్ 15 రైడ్స్లో నాలుగే పాయింట్లు రాబట్టాడు. నవీన్ కుమార్ (4), ఆశీష్ (4) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతూ చెరో పాయింట్ సాధిస్తూ ముందుకెళ్లాయి. సురేందర్ గిల్ తెచ్చిన బోనస్తో యూపీ ఖాతా తెరవగా.. భరత్ను ట్యాకిల్ చేసిన యోగేశ్ ఢిల్లీకి తొలి పాయింట్ అందించాడు. డూ ఆర్ డై రైడ్కు వచ్చిన అషు సింగ్ సింగిల్ టయాకిల్ చేయగా.. భరత్ రెండోసారి ఢిల్లీ డిఫెండర్లకు దొరికిపోయాడు. ఈ దశలో అషు మాలిక్ వరుసగా రెండు రైడ్ పాయింట్లు రాబట్టాడు. మరోసారి రైడ్కు వచ్చిన అతడిని.. యూపీ ట్యాకిల్ చేయగా.. సురేందర్ గిల్ను యోగేశ్ నిలువరించాడు. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో డూ ఆర్ డై రైడ్లోనే ఢిల్లీ, యూపీ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేశాయి. దాంతో ఆట సమంగా సాగింది. విరామం ముంగిట చివరి రైడ్కు వచ్చిన అషు మాలిక్ను సుమిత్ ట్యాకిల్ చేయడంతో యూపీ 12–11తో ఒక పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కోర్టు మారిన తర్వాత యూపీ యోధాస్ పైచేయి సాధించింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ముందంజ వేసింది. విరామం నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్.. సాహుల్ కుమార్, అషు సింగ్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చి రెండు పాయింట్లు అందించాడు. ఆపై విక్రాంత్ను భరత్ ట్యాకిల్ చేయడంతో దబాంగ్ ఢిల్లీ 16–14తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలడంతో యూపీ ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది. కానీ, హితేశ్, మొహమ్మద్రెజా కలిసి ఢిల్లీ కెప్టెన్ అషు మాలిను సూపర్ ట్యాకిల్ చేయడంతో 16–16తో స్కోరు మరోసారి సమం అయింది. ఇక్కడి నుంచి యూపీ వేగం పెంచింది. భవాని రాజ్పుత్, సురేందర్ గిల్ చెరో రైడ్ పాయింట్ రాబట్టగా.. నవీన్, మోహిత్తో పాటు ఆశీష్ను యూపీ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో 33వ నిమిషంలో ఢిల్లీ ఆలౌట్ అయింది. దాంతో యోధాస్ 24–18తో ఆరు పాయింట్ల ఆధిక్యం అందుకుంది. చివర్లో దబాంగ్ ఢిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆ జట్టుకు యోధాస్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రైడింగ్లో భవనీ రాజ్పుత్, నితిన్ జోరు చూపెట్టగా.. అషు మాలిక్ను మరోసారి ట్యాకిల్ చేసిన సాహుల్ కుమార్ హైఫైవ్ సాధించాడు. దాంతో తన ఆధికాన్ని 27–20కి పెంచుకున్న యూపీ విజయం ఖాతాలో వేసుకుంది. -
బెంగాల్ వారియర్స్పై పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: కెప్టెన్, స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో ఆరంభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ 39–34తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. అర్జున్తో పాటు రైడర్ అభిజీత్ మాలిక్ (7 పాయింట్లు) జైపూర్ విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్ జట్టులో నితిన్ ధాంకర్ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో జైపూర్ తన ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్లో చివరకు బెంగాల్పై జైపూర్ పైచేయి సాధించింది. అర్జున్ దేశ్వాల్ను ట్యాకిల్ చేసిన నితేష్ కుమార్ జైపూర్కు తొలి పాయింట్ అందించగా.. వికాష్ ఖండోలా తన రైడ్లో నితేష్ను టచ్ చేసి బెంగాల్ ఖాతా తెరిచాడు. మరోసారి రైడ్కు వచ్చిన అర్జున్ను ఫజెల్ అత్రాచలి ట్యాకిల్ చేయగా.. మణిందర్ సింగ్ వరుసగా రెండు బోన్ పాయింట్లు తేవడంతో బెంగాల్ 5–2తో ఆరంభం ఆధిక్యం అందుకుంది. ఈ దశలో అర్జున్ దేశ్వాల్ ఒక్కసారిగా జోరు పెంచాడు.వరుసగా సక్సెస్ఫుల్ రైడ్లతో పాయింట్లు రాబట్టి 9–8తో పింక్ పాంథర్స్ను తొలిసారి ఆధిక్యంలోకి తెచ్చాడు. అతని దెబ్బకు బెంగాల్ కోర్టులో నితిన్ ధాంకర్ ఒక్కడే మిగిలిపోయాడు. నితిన్ను కూడా ట్యాకిల్ చేసి 11వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసిన జైపూర్ 12–9తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సుర్జీత్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చిన నితిన్ సూపర్ రైడ్ చేయడంతో బెంగాల్ 13–15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది. కానీ, మరోవైపు అర్జున్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. జట్టును 21–15తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, విరామానికి ముందు ఫజల్ అత్రాచలి సూపర్ ట్యాకిల్తో అర్జున్ను మరోసారి నిలువరించాడు. దాంతో తొలి అర్ధభాగాన్ని జైపూర్ 21–18తో మూడు పాయింట్ల ఆధిక్యంతో ముగించింది.రెండో భాగంలో బెంగాల్ డిఫెన్స్లో మెరుగైంది. ఆ జట్టు కెప్టెన్ ఫజల్ అత్రాచలి వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్తో సత్తా చాటడంతో 23–24తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, ఫజెల్ పోరాటం బెంగాల్ను మరో ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించలేపోయింది. 31వ నిమిషంలో బెంగాల్ను రెండోసారి ఆలౌట్ చేసిన జైపూర్ 29–25తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించుకుంది. కోర్టుపైకి పూర్తి జట్టు వచ్చిన తర్వాత బెంగాల్ పుంజుకుంది. రైడర్లు మణిందర్, నితిన్ తెలివిగా ఆడుతూ వరుసగా పాయింట్లు తీసుకొచ్చారు. అభిజీత్ మాలిక్ను ఔట్ చేసి నితిన్ సూపర్10 పూర్తి చేసుకోగా.. బెంగాల్ 30–32తో ముందుకొచ్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా నితిన్.. అర్జున్, లక్కీ శర్మను ఔట్ చేసి రెండు పాయింట్లు రాబట్టడంతో 34–35తో మ్యాచ్లో ఉత్కంఠ రేగింది. కానీ, మరోసారి రైడ్కు వచ్చిన నితిన్ సూపర్ ట్యాకిల్ చేసిన జైపూర్ విజయం సొంతం చేసుకుంది. -
PKL 11: ఆల్రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శుభారంభం చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచారు.. ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్లో పాటు డిఫెన్స్లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి. -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
పర్దీప్ నర్వాల్ టూ ఫజెల్ అత్రాచలి.. ప్రోకబడ్డీ లీగ్లో స్టార్స్ వీళ్లే
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ వేలం ముంబైలో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న జరిగిన వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. రాజస్తాన్కు చెందిన సచిన్ తన్వర్పై రూ. 2.15 కోట్లు వెచ్చించి మరి తమిళ్ తలైవాస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్రౌండర్ మొహమ్మద్ రెజాను రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ కైవసం చేసుకుంది. ఇక పీకేఎల్-2024వ సీజన్ ఆక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.పర్దీప్ నర్వాల్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) స్టార్ ప్లేయర్స్లో హర్యానాకు చెందిన రైడర్ పర్దీప్ నర్వాల్ ముందు వరుసలో ఉంటాడు. పీకేఎల్ 2024 వేలంలో బెంగళూరు బుల్స్ పర్దీప్ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 170 మ్యాచ్లు ఆడిన పర్దీప్.. 1690 పాయింట్లతో టాప్ రైడర్గా కొనసాగుతున్నాడు. పీకేఎల్లో 10 రైడ్ పాయింట్ల కంటే ఎక్కువ సగటుతో 1000 పాయింట్ల మార్కు స్కోర్ను అధిగమించిన మొదటి ఆటగాడిగా నర్వాల్ నిలిచిచాడు. అతడిని అభిమానులు ‘దుబ్కీ కింగ్’ పిలుస్తారు. గతంలో అతడు పాట్నా పైరేట్స్, యుపీ యోధాస్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.ఫజెల్ అత్రాచలిపీకేఎల్లో అద్భుతమైన డిఫెండర్లలో ఇరాన్కు చెందిన ఫజెల్ అత్రాచలి ఒకడు. పీకేఎల్ 2024 వేలంలో అత్రాచలిని బెంగాల్ వారియర్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు ఖాతాలో మొత్తం 486 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి. పీకేఎల్లో అత్యధిక ట్యాకిల్ పాయింట్ల చేసిన జాబితాలో ఫజెల్ అత్రాచలి అగ్రస్ధానంలో ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఫజెల్ ఉన్నాడంటే రైడర్స్ భయపడాల్సిందే. అతడు యూ ముంబా, పాట్నా పైరేట్స్ టైటిల్స్ సాధించడంలో ఫజెల్ది కీలక పాత్ర.సచిన్ తన్వార్..పీకేఎల్ 2024 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన సచిన్ తన్వర్.. తమిళ్ తలైవాస్ తరపున ఆడనున్నాడు. గత కొన్ని సీజన్లగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో తలైవాస్ అతడిపై భారీ మొత్తం వెచ్చించింది. అతడి ఖాతాలో మొత్తంగా 951 రైడ్ పాయింట్లు ఉన్నాయి. గత సీజన్లో మొత్తం 171 పాయింట్లు సాధించాడు. 7వ సీజన్లో పర్దీప్ నర్వాల్ ఫ్రాంచైజీ మారడంతో పట్నా పైరేట్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ను సచిన్ లీడ్ చేశాడు. గతంలో గుజరాత్ జెయింట్స్కు కూడా సచిన్ ఆడాడు.మణిందర్ సింగ్ (రైడర్)మణిందర్ సింగ్ మళ్లీ తన సొంతగూటకి చేరాడు. పీకేఎల్-2024 వేలంలో రూ.1.5 కోట్లకు మణిందర్ను బెంగాల్ వారియర్స్ దక్కించుకుంది. పీకేఎల్ చరిత్రలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యంత విజయవంతమైన రైడర్లలో మణిందర్ సింగ్ ఒకడు. ఈ ఆరు అడుగుల ఆజానుబాహుడు రైడ్కు వెళ్లడాంటే ప్రత్యర్ధి డిఫెండర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మణిందర్ సింగ్ ఖాతాలో 1,428 పాయింట్లు ఉన్నాయి. అతడి ఖాతాలో జైపూర్ పింక్ పాంథర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. -
ప్రొ కబడ్డీ లీగ్లో 118 మంది
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్ను దక్కించుకుంది. జై భగవాన్ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్రౌండర్ గుర్దీప్ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. -
PKL: సచిన్కు రూ. 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్కు చెందిన సచిన్ తన్వర్పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది. గత సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి. చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్రౌండర్ పవన్ సెహ్రావత్తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. -
దబంగ్ ఢిల్లీపై బెంగాల్ విజయం..
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్ తరఫున నితిన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ అషు మలిక్ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 34–30 తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్ నందల్, మోహిత్ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ తరఫున ఫజల్ అత్రచి, పార్తీక్ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్ చేయగా, దీపక్ సింగ్ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్లో 101 మ్యాచ్లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. చదవండి: IND vs ENG: అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్ -
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్ని లైవ్లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. -
యూపీ యోధాస్ను చిత్తు చేసిన తమిళ్ తలైవాస్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 44–44తో ‘డ్రా’ అయింది. ప్రస్తుతం పుణేరీ పల్టన్ (10 మ్యాచ్ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింగ్ పాంథర్స్, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
మాజీ ఛాంపియన్కు షాకిచ్చిన ఢిల్లీ.. సీజన్లో ఏడో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 40–34తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్లో దబంగ్ ఢిల్లీకిది ఏడో విజయం కావడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ జట్టు 40 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబాతో జరిగిన పోరులో ఢిల్లీ తరఫున అశు మలిక్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు. మంజీత్ ఆరు పాయింట్లు, యోగేశ్ నాలుగు పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 11 పాయింట్లు, గుమన్ సింగ్ 9 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 35–33తో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ తరఫున సచిన్ నర్వాల్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోరీ్నలో నాలుగో మ్యాచ్ ఆడిన జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. బుధవారం హోరాహోరీగా జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38–36 స్కోరుతో టైటాన్స్పై విజయం సాధించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రాబిన్ చౌదరి చెరో 7 పాయింట్లు సాధించారు. తలైవాస్ ఆటగాళ్లలో నరేందర్ 10, సాహిల్ 7 పాయింట్లతో జట్టు గెలిపించా రు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 32–30 తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. -
చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం..టైటిల్ మనదే
-
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్లో కబడ్డీ సందడి
-
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. వరుసగా ఎనిమిదో పరాజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. బెంగాల్ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 27–28తో ఓటమి చవిచూసింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్కిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్లను ‘టై’ చేసుకుంది. 12 పాయింట్లతో టైటాన్స్ జట్టు 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో చిట్టచివరి స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 50–40తో పుణేరి పల్టన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. -
‘టై’తో మొదలుపెట్టిన టైటాన్స్
బెంగళూరు: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ను ‘టై’తో ఆరంభించింది. బుధవారం టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 స్కోరుతో సమంగా ముగిసింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ 11 పాయింట్లు సాధించగా, డిఫెండర్లలో సందీప్ 5, రుతురాజ్, అరుణ్ మూడేసి పాయింట్లు తెచ్చి పెట్టారు. మ్యాచ్లో తలైవాస్ రైడర్ మన్జీత్ సత్తా చాటాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 3 బోనస్ పాయింట్లు సహా 12 పాయింట్లు స్కోరు చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ రైడర్ సిద్ధార్థ్, రజ్నీశ్ జట్టుకు వరుస పాయింట్లు సాధించిపెట్టారు. డిఫెండర్ సందీప్ కండోలా కూడా ప్రత్యర్థి రైడర్లను చేజిక్కించుకోవడంతో టైటాన్స్ జట్టు 8 నిమిషాల్లోనే తలైవాస్ను ఆలౌట్ చేసింది. అనంతరం తలైవాస్ రైడర్ మన్జీత్ దీటుగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మన్జీత్ చేసిన సూపర్ రైడ్ ఏకంగా 3 పాయింట్లు తెచ్చిపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఆధిక్యం మారిపోయింది. తొలి అర్ధ భాగం 23–21 వద్ద ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రమించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఒక దశలో ఇరు జట్ల రైడర్లు విఫలమైతే డిఫెండర్ల హవా కొనసాగింది. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేయడం ద్వారా తలైవాస్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే సిద్ధార్ధ్ దేశాయ్ కీలక దశలో రైడింగ్కు వెళ్లినప్పుడల్లా పాయింట్లు సాధించడంతో టైటాన్స్ పుంజుకుంది. ఇంకో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా తన రైడింగ్ పాయింట్తో తమిళ్ తలైవాస్ రెండోసారి ఆలౌటైంది. అక్కడే స్కోరు సమమైంది. టాకిల్తో సందీప్, రైడింగ్తో సిద్ధార్థ్ తెలుగు జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇతర మ్యాచ్లలో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్పై...బెంగాల్ వారియర్స్ 38–33తో యూపీ యోధపై గెలిచింది. సిద్ధార్థ్ దేశాయ్ -
ఒక్క క్లిక్తో నేటి క్రీడా వార్తలు
-
ఒక్క క్లిక్తో నేటి క్రీడా వార్తలు
ఎవరూ ఊహించని విధంగా డబుల్స్ విభాగంలో భారత్కు గొప్ప టైటిల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో చిరస్మరణీయ విజయం సాధించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్హిల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లి సేన డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం. -
దబంగ్ ఢిల్లీకి పదో విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో దబంగ్ ఢిల్లీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్లో 37–31తో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన దబంగ్ ఢిల్లీ తొలి సగం ముగిసే సమయానికి 20–14తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కనబరిచి చివరకు విజయం సాధించింది. ఢిల్లీ తరఫున మిరాజ్ షేక్ 13 పాయింట్లతో మెరవగా... బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ 9, భూపేందర్ 5 పాయింట్లు సాధించారు. లీగ్లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరుగనున్న మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో తమిళ్ తలైవాస్, బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
జైపూర్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ ‘డ్రా’
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 37–37తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి సగం ముగిసే సరికి దబంగ్ ఢిల్లీ 18–17తో నిలిచింది. జైపూర్ తరఫున సెల్వమణి 11, దీపక్ హుడా 8 పాయింట్లు సాధించగా... ఢిల్లీ తరఫున చంద్రన్ రంజిత్ 11, పవన్ 9 పాయింట్లు చేశారు. శుక్రవారం నుంచి పోటీలు కోల్కతా వేదికగా జరుగనున్నాయి. నేటి మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్, పుణేరీ పల్టన్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
పట్నాపై యూపీ విజయం
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్ జోన్ ‘బి’లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో యూపీ యోధా 47–31తో పట్నా పైరేట్స్పై గెలిచింది. యోధా తరఫున ప్రశాంత్ 10 పాయింట్లతో మెరవగా... పట్నా తరఫున మన్జీత్ 10 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 29–34తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. -
టైటాన్స్ తడాఖా.. హోరెత్తిన విశాఖ
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. కీలకమైన మ్యాచ్లో దుమ్ము రేపి ఇంకా నిలబడ్డామనిపించుకున్నారు. ప్లేఆఫ్కు బరిలో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో టైటాన్స్ విజృంభించారు. పాట్నా పైరేట్స్పై 41– 36 పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్నారు. జోన్ బిలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న ఇరు జట్ల మధ్య ఆధిక్యానికి పోరు జరగగా, అత్యవసర తరుణంలో టైటాన్స్ విజృంభించారు. రైడ్లో పైరేట్స్ 24–22 పాయింట్ల తేడాతో టైటాన్స్పై ఆధిక్యం కనబరిచినా టాక్లింగ్లో 14–10తో టైటాన్స్ ఆటగాళ్లు తమదే పైచేయనిపించుకున్నారు. సూపర్ రైడ్Š, ఎక్సట్రాలలో టైటాన్స్ ఒకో పాయింట్ సాధించారు. ఆలౌట్ ద్వారా పైరేట్స్ రెండు పాయింట్లు సాధిస్తే టైటాన్స్ నాలుగు పాయింట్ల సాధించారు. రైడ్తో టైటాన్ ఆటగాళ్లు రాహుల్ 11, నీలేష్ 6 పాయింట్లు రాబట్టారు. విదేశీ అటగాళ్లు మొహసిన్, ఫర్హాద్, అబ్జోర్ రాణించారు. విశాల్ టాక్లింగ్తో నాలుగు పాయింట్లు సాధించాడు. పైరేట్స్ తరపున పర్దీప్ రైడ్లో 10 పాయింట్లు తేగా జైదీప్, వికాశ్ టాక్లింగ్లో సత్తా చూపారు. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 24–37తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. నీలేశ్ 6 పాయింట్లు సాధిం చాడు. బుల్స్ తరఫున పవన్ 13 పాయింట్లతో మెరిశాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 47–37తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచ్లో నేడు పట్నా పైరేట్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. -
బెంగాల్ వారియర్స్ గెలుపు
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 26–22తో పుణేరీ పల్టన్స్పై గెలిచింది. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన బెంగాల్ ఈ మ్యాచ్లో చెలరేగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 18–19తో వెనుకబడి ఉన్న బెంగాల్... రైడర్ మణీందర్ (6 పాయింట్లు) చెలరేగడంతో అనూహ్యంగా పుంజుకొని గెలుపొందింది. పల్టన్స్ తరఫున జీబీ మోరె 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో టైగా ముగిసింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో యూపీ యోధా తలపడతాయి. -
పట్నా ఫైనల్కు...
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ మళ్లీ ఫైనల్ కూతకు సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకునేందుకు శనివారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో అమీతుమీకి సై అంటోంది. గురువారం జరిగిన రెండో క్వాలిఫయర్లో కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ ప్రతాపంతో బెంగాల్ వారియర్స్ను కంగుతింది. రెండు సార్లు చాంపియన్ అయిన పట్నా ఈ మ్యాచ్లో 47–44 స్కోరుతో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. చివర్లో నాటకీయ పరిణామాలు పైరేట్స్ శిబిరాన్ని కలవరపెట్టినా... చివరకు విజయం మాత్రం పట్నానే వరించింది. మ్యాచ్ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41–27తో విజయబావుటాకు సిద్ధమైపోయింది. కానీ చివరి క్షణాల్లో వారియర్స్ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు. ఇటు రైడింగ్లో... అటు టాకిల్లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46–43తో బెంగాల్ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పట్నా తెలివైన గేమ్ ప్లాన్తో ప్రత్యర్థి రైడర్కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్నే కోల్పో యింది. చివరి క్షణాల్లో ప్రదీప్ రైడింగ్కు వెళ్లి టైమ్పాస్ చేసి ఓ పాయింట్ తెచ్చాడు. అంతే మ్యాచ్ ముగిసింది. పైరేట్స్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్లో పట్నా పైరేట్స్ విజయ సారథి ప్రదీప్ 23 పాయిం ట్లు సాధించాడు. విజయ్, మోనూ గోయట్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 17, దీపక్ నర్వాల్ 10, రాణ్ సింగ్ 5 పాయింట్లు చేశారు. -
ప్రదీప్ 34... హరియాణా 30
ముంబై: రైడర్ ప్రదీప్ నర్వాల్ సంచలన ప్రదర్శనతో పట్నా పైరేట్స్కు ఎదురులేని విజయాన్నందించాడు. అతనొక్కడే 34 రైడ్ పాయింట్లతో పీకేఎల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తే... హరియాణా స్టీలర్స్ జట్టంతా కలిసి 30 పాయింట్లను మించి చేయలేకపోయింది. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో సోమవారం జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో పట్నా 69–30 స్కోరుతో హరియాణా స్టీలర్స్పై జయభేరి మోగించింది. 32 సార్లు రైడింగ్కు వెళ్లిన ప్రదీప్ నర్వాల్ 34 పాయింట్లు సాధించడం విశేషం. అతని జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటైంది. మోను గోయత్ 10, విజయ్ 5 పాయింట్లు చేయగా... టాకిల్లో జైదీప్ (7) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన తొలి ఎలిమినేటర్ పోరులో పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధపై గెలిచింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్, మూడో ఎలిమినేటర్ మ్యాచ్లో పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తలైవాస్పై పుణేరి పల్టన్ గెలుపు
చెన్నై: మ్యాచ్ ముగిసేందుకు మరో 10 నిమిషాలే మిగిలి ఉంది. పుణేరి పల్టన్ 16–15తో తమిళ్ తలైవాస్పై కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలోనే ఉంది. నిర్ణీత సమయం తర్వాత చూస్తే 33–20తో పుణేరి జయభేరి మోగించింది. ఒక్కసారిగా స్వల్ప వ్యవధిలో పుణేరి ఆటగాళ్లు చెలరేగారు. రెండు సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు. దీపక్ (6), రాజేశ్ (5), మోను (4) రాణించారు. తలైవాస్ తరఫున డాంగ్ లీ, అజయ్ 4 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 30–29తో పట్నా పైరేట్స్పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో పుణేరి పల్టన్తో యూపీ యోధ, తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
‘ఆ రెండు మ్యాచ్లు నిర్వహిస్తాం’
ముంబాయి: తొలి సీజన్ నుంచి ప్రొ కబడ్డీ అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. ముంబాయిలో వరదల కారణంగా మొదలు కాకుండానే రెండు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లు ఆగిపోయ్యాయి. కానీ ఆ రెండు మ్యాచ్లను రాంచీ, పూణెలలో నిర్వహిస్తామని టోర్నమెంట్ నిర్వహకులు బుధవారం తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం బెంగుళూరు బుల్స్, యూపీ యోధ మధ జరగాల్సిన మ్యాచ్ను సెప్టెంబర్ 20న రాంచీలోని హరివంశ్ తానా భగత్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుందన్నారు. అలాగే యూ ముంబా, గుజరాత్ ఫార్చూన్ జైంట్స్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 17న పూణెలో శ్రీ శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంపెక్స్లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ రెండు మ్యాచ్లు ముంబాయిలో వచ్చిన అకాల వరదల కారణంగా జనజీవనం స్ధంబించిపోవడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. తొలి సీజన్ నుంచి అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో ఈసారి ప్రైజ్మనీ కూడా భారీగా పెరిగింది. గత సీజన్లో రూ.6 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఈసారి రూ. 8 కోట్లకు పెరిగింది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్కు రూ. కోటీ 80 లక్షలు లభిస్తాయి. మూడో స్థానం పొందిన జట్టుకు రూ. కోటీ 20 లక్షలు అందజేస్తారు. ‘అత్యంత విలువైన ఆటగాడు’ అవార్డు పొందిన వారికి రూ.15 లక్షలు దక్కుతాయి. ఓవరాల్గా లీగ్లో 12 జట్ల మధ్య 138 మ్యాచ్లు జరుగుతాయి. అక్టోబరు 28న ప్రొ కబడ్డీ ఫైనల్ జరుగుతుంది. -
తెలుగు టైటాన్స్ ఓటమి
సాక్షి, కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం పుణేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–42 తేడాతో ఓడింది. ప్రారంభం నుంచే టైటాన్స్ వెనకబడిపోయి ఏ దశలోనూ ప్రత్యర్థిని అధిగమించలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల వరకు టైటాన్స్ జట్టు ఖాతా తెరవకపోవడం గమనార్హం. అప్పటికి పుణేరి పల్టన్ 18 పాయింట్లతో ముందంజలో ఉంది. దీంతో ప్రథమార్ధం ముగిసేసరికి పుణేరి జట్టు 26–12తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ జట్టు ఓ మాదిరి పోరాటం కనబర్చడంతో ఓటమి వ్యత్యాసాన్ని కాస్త తగ్గించుకోగలిగింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 9 రైడింగ్ పాయింట్లు సాధించగా... పుణేరి నుంచి దీపక్ హుడా కూడా 9 పాయింట్లతో నిలిచాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 31–31తో టైగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్; గుజరాత్ సూపర్ జెయింట్స్తో యూపీ యోధ తలపడతాయి. -
ప్రొకబడ్డీ బ్రాండ్ అంబాసిడర్గా బడా హీరో..
పెరంబూరు: ప్రస్తుతం క్రికెట్ తర్వాత అత్యధిక ప్రాధ్యానత సంతరించుకున్న క్రీడల్లో కబడ్డీ ఒకటి. సీజన్ సీజన్ కు ప్రేక్షక ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకూ ప్రొకబడ్డీ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని 5వ సీజన్ కు రెడీ అయిపోయింది. ఈ కబడ్డీ 5వ సీజన్ కు తమిళ్ తలైవాస్ జట్టుకు విశ్వనటుడు కమలహాసన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్,మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅరవింద్,అల్లుఅర్జున్, రామ్చరణ్తేజ, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి బడా సెలబ్రేటీలు భాగస్తులైన్నారు. కమల్ అంబాసిడర్ గా నియమించబడటం నిజంగా విశేషమే అవుతుంది. తమ జట్టుకు అంబాసిడర్ కావడం ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిర్వాహకుల్లో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు.ఎన్నో ఛాలెంజ్లను ఆత్మ విశ్వాసంతో, నిబద్దతతో కూడిన ప్రవర్తనతో కమల్ ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి తమిళ్ తలైవాస్ జట్టుకు మార్గదర్శి అవుతారనే ప్రగాఢ నమ్మకం తమకు ఉందన్నారు. కళారంగంలో తన సాధనలతో భారత దేశానికి కీర్తిని ఆపాదించిన నటుడు కమలహాసన్ అని ఆయన పేర్కొన్నారు. కమల్ తమ క్రీడాసక్తిని తన చిత్రాలలోనే కాకుండా నిజ జీవితంలోనూ చూపారని అన్నారు. నాలుగో సీజన్ ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పై పాట్నా పైరేట్స్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. మరీ 5వ సీజన్ అతి త్వరలో ప్రేక్షకులను అలరించాడానికి సిద్ధమౌతోంది. గౌరవంగా భావిస్తున్నాను.. ప్రొకబడ్డీ పోటీల్లో తమిళ్ తలైవాస్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించటాన్ని గౌరవంగా భావిస్తున్నానని కమలహాసన్ పేర్కొన్నారు. మన సంప్రదాయ క్రీడ ప్రొకబడ్డీ పోటీల్లో తానూ ఒక భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పొంగే ఉత్సాహంతో ఈ క్రీడల్లో విజయ సాధించి మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టాలని తమిళ తలైవాస్ జట్టుకు కమల్ ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు. -
బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా రోహిత్
బెంగళూరు: త్వరలో ఆరంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ కు సంబంధించి బెంగళూరు బుల్స్ కెప్టెన్ గా స్టార్ రైడర్ రోహిత్ కుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం జట్టును ప్రకటించిన బెంగళూరు బుల్స్ యాజమాన్యం.. కెప్టెన్ గా రోహిత్ ను, వైస్ కెప్టెన్ గా రవీందర్ పాహల్ ను నియమించింది. బెంగళూరు బుల్స్ జట్టు కోచ్ గా మాజీ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు రణధీర్ సింగ్ ను తిరిగి ఎంపిక చేసింది. జూలై 28వ తేదీన ప్రొ కబడ్డీ-5వ సీజన్ ఆరంభం కానుంది. ఈ లీగ్ లో బెంగళూరు జట్టు కొత్త జెర్సీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బెంగళూరు బుల్స్ జట్టు ఇదే.. రోహిత్ కుమార్(కెప్టెన్), రవీందర్ పాహల్(వైస్ కెప్టెన్), హరిష్ నాయక్, గురివిందర్ సింగ్, అంకిత్ సాంగ్వాన్, మహేందర్ సింగ్, ప్రీతమ్ చిల్లార్, అమిత్, రోహిత్, అశిష్ కుమార్, సచిన్ కుమార్, అమిత్ షిరాన్, కనేషరాజ్, ప్రదీప్, అజయ్ కుమార్, సునీల్, సుమిత్, అంజయ్ శ్రేష్ట, కులదీప్ సింగ్ -
ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్కు సతీష్కుమార్ ఎంపిక
► రూ.12 లక్షలకు కొనుగోలు చేసిన జట్టు యాజమాన్యం ►జూలైలో జరిగే ఐదో సీజన్లో పాల్గొనే అవకాశం కొడవలూరు (కోవూరు) : ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్ జట్టుకు కోవూరుకు చెందిన పూనుగుంట సతీష్కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో ముంబైలో జరిగిన బహిరంగ ఆక్షన్లో పాట్నా పైరేట్స్ జట్టు యాజమాన్యం రూ.12 లక్షలకు సతీష్ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగే ఐదో సీజన్ ప్రొకబడ్డీ పోటీల్లో పాల్గొనే పాట్నా జట్టుకు డిఫెండర్గా సతీష్ ఎంపికయ్యారు. నాలుగో సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సతీష్ ఈసారి పాట్నా పైరేట్స్ జట్టు నుంచి బరిలో దిగుతున్నాడు. సతీష్ 20కి పైగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొని బహుమతులు సాధించాడు. జూనియర్స్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. క్రీడా కోటాలో రైల్వేలో టీటీఐ ఉద్యోగం సాధించిన సతీష్కుమార్ ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు ఎనిమిదిసార్లు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సతీష్కుమార్ సాక్షితో మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఈ ప్రభాకర్, వీర్ల వెంకయ్యల ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కాగా సతీష్ ఎంపిక పట్ల క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పోటీల్లో రాణించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. -
'వారికి ప్రొ కబడ్డీ ఆహ్వానం లేదు'
కరాచీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మరొకసారి స్పష్టం చేశారు. వచ్చే నెల్లో భారత్ లో ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేసిన క్రమంలో వారికి ఎటువంటి ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. ' ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ దాన్ని ఆపేంత వరకూ వారితో క్రీడా సంబంధాలు సాగించే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే జూన్ 25 నుంచి ఆరంభమయ్యే ప్రొ కబడ్డీకి సైతం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఒకవేళ ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లు ఇక్కడకు వచ్చినా ఆడే అవకాశం ఉండదు. పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ లో ఆడాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తో క్రీడా సంబంధాలు సాధ్యం కావు'అని గోయల్ తెలిపారు. -
హరియాణా స్టీలర్స్గా జిందాల్ జట్టు
ముంబై: ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్డబ్ల్యూ కొనుగోలు చేసిన జట్టు ‘హరియాణా స్టీలర్స్’గా ప్రొ కబడ్డీ లీగ్లో బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మరో నాలుగు జట్లను చేర్చడంతో సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్ ద్వయం తమిళనాడు ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం 12 జట్ల మధ్య జూలై నుంచి అక్టోబర్ వరకు లీగ్ సుదీర్ఘంగా జరగనుంది. సోమ, మంగళవారాల్లో ఆటగాళ్ల వేలం జరుగుతుంది. -
సచిన్ తొడ కొడితే...
-
సచిన్ తొడ కొడితే...
►నిమ్మగడ్డ ప్రసాద్తో కలిసి చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు ►12 జట్లతో ఈ సీజన్ ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో లీగ్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటికే ఫుట్బాల్లో కేరళ బ్లాస్టర్, బ్యాడ్మింటన్లో బెంగళూరు బ్లాస్టర్లకు యజమాని అయిన సచిన్ తాజాగా ప్రొ కబడ్డీలో కూతపెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలుగు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో కలిసి చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ సీజన్ను 12 జట్లకు పెంచడంతో తమిళ ఫ్రాంచైజీని సచిన్–నిమ్మగడ్డ ద్వయం చేజిక్కించుకోగా... మరో తెలుగు పారిశ్రామికవేత్త గ్రంథి మలికార్జున రావు ఆధ్వర్యంలోని జీఎంఆర్ గ్రూప్ లక్నో జట్టును దక్కించుకుంది. జీఎంఆర్ సంస్థ ఇప్పటికే ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టును కలిగివున్న సంగతి తెలిసిందే. ప్రొ కబడ్డీలో మిగతా రెండు కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్ (గుజరాత్)ను అదాని గ్రూప్, హరియాణాను జేఎస్డబ్ల్యూ గ్రూప్ కొనుగోలు చేశాయి. ఐపీఎల్ తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన ఈ లీగ్ ఇప్పుడు 12 జట్లతో 130 పైచిలుకు మ్యాచ్లతో ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ ఐదో సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రొ కబడ్డీలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు భాగం కావడం పట్ల స్టార్ ఇండియా చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రొ కబడ్డీ లీగ్ ఇంతగా విజయవంతం కావడానికి స్టార్ నెట్వర్కే కారణమని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్సింగ్ గెహ్లాట్ అన్నారు. -
ప్రొ కబడ్డీ టైటిల్ స్పాన్సర్గా ‘వివో’
జూలై 5న ఐదో సీజన్ ప్రారంభం న్యూఢిల్లీ: ఐపీఎల్ తర్వాత అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్గా ఘనతకెక్కిన ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ను చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ ‘వివో’ చేజిక్కించుకుంది. ఐదేళ్ల పాటు ‘వివో’ టైటిల్ స్పాన్సర్గా కొనసాగనుంది. జూలై 5న ఐదో సీజన్ లీగ్ ఆరంభమవుతుంది. కొత్తగా నాలుగు ప్రాంచైజీలు పెరగడంతో మొత్తం 12 జట్లు ఇందులో తలపడనున్నాయి. దీంతో 13 వారాలపాటు 130 మ్యాచ్లు జరుగనున్నాయి. ‘వివోతో భాగస్వామ్యం కావడం అనందంగా ఉంది. ఆట ఆదరణకు మేం మరింత కృషి చేస్తాం’ అని స్టార్ స్పోర్ట్స్ ఎండీ సంజయ్ గుప్తా అన్నారు. ‘కబడ్డీ లీగ్ బాగా ఆదరణ పొందింది. అలాంటి లీగ్తో జతకట్టడం గర్వంగా ఉంది’ అని ‘వివో’ భారత సీఈఓ కెంట్ చెంగ్ వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత కబడ్డీ స్టార్స్ అనూప్ కుమార్, రాహుల్ చౌదరీలతోపాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు బ్రెట్ లీ, మాథ్యూ హేడెన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రో కబడ్డీ లీగ్: ఇక ఐదో సీజన్ పండగే
ముంబై: భారత దేశ సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామలకే పరిమితమైన ఈ ఆట ప్రో కబడ్డీ లీగ్ పేరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గత నాలుగు సీజన్లతో ప్రో కబడ్డీ లీగ్ కబడ్డీ అభిమానులను అలరించింది. ఈ ఎడాది జులైలో ఐదో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ లీగ్లో 8 జట్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో నాలుగు జట్లు కొత్తగా చేరుతున్నాయి. ఈ విషయాన్ని పీకేఎల్ అధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. కొత్తగా తమిళనాడు, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలనుంచి నాలుగు జట్లు ఐదో సీజన్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ఉన్న జట్లు బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ, కొల్కత, జైపూర్, పట్నా నగరాల పేర్లతో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రోకబడ్డీ లీగ్లో కొత్తగా నాలుగు జట్లు చేరడంతో ఐదో సీజన్లో ఎక్కువ మ్యాచ్లు జరుగనున్నాయి. మరో 11 రాష్ట్రాలకు ఈ లీగ్ విస్తరించనుందని, సుమారు 130 పైగా మ్యాచ్లు జరుగుతాయని లీగ్ అధికారులు పేర్కొన్నారు. కబడ్డీలీగ్ను మరింత విస్తరించాలని వాటాదారులంతా నిర్ణయించుకున్నట్లు స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ తెలిపారు. సంప్రదాయ క్రీడలను ఆధునిక లీగ్ల పేర్లతో ఆదరణ కల్పించవచ్చనేదానికి ప్రో కబడ్డీ లీగ్ ఒక మంచి ఉదాహారణ అని అంతార్జాతీయ కబడ్డీ సంఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లాట్ అభిప్రాయపడ్డాడు. -
ఆకట్టుకుంటున్న ప్రొకబడ్డీ గణేశ్లు
హైదరాబాద్: నగరంలోని భక్తులను ప్రొ కబడ్డీ గణేశ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్ మారేడుపల్లి నెహ్రూనగర్ పార్కు వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణేశ్ విగ్రహాలను చూసేందుకు భక్తులు అసక్తి చూపుతున్నారు. తెలుగు టైటన్స్, పాట్నా పైరేట్స్ టీమ్ల మద్య జరిగిన ఫైనల్ పోరును గణేశ్ రూపంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. కబడ్డీ కోర్టులో రెండు వైపులా ఒకొక్క టీమ్ లో ఏడుగురు క్రీడాకారులను ఏర్పాటు చేశారు. మధ్యలో రిఫరీగా శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ వినాయక విగ్రహాలను దర్శించుకునేందుకు నగరవాసులు బారులు కడుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్తదనంతో గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఫ్రెండ్స్ యూత్ అసోషియేషన్ సభ్యులు నిఖిల్, వివేక్, ప్రశాంత్ వెల్లడించారు. -
కబడ్డీకి పెరిగిన ప్రేక్షకాదరణ
న్యూఢిల్లీ: కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏటికేడు టీవీ వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచుకుంటోంది. తాజాగా ముగిసిన నాలుగో సీజన్ కబడ్డీ లీగ్ను సగటున కోటి మంది వీక్షించినట్లు అంచనా. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ -1 నుంచి సీజన్-4 ముగిసే సరికి వీక్షకుల సంఖ్య 51 శాతం పెరిగింది. పురుషులతో పాటు మహిళా కబడ్డీకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు అక్టోబర్లో కబడ్డీ ప్రపంచకప్ను భారత్లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 12 దేశాలు తలపడతాయి. ‘ పురుషుల, మహిళల కబడ్డీకి భారత్లో గొప్ప ఆదరణ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ప్రేక్షకాదరణతో స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఏటికేడు స్పాన్సర్షిప్ పెరుగుతుండటం సంతోషకరం’ అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా అన్నారు. -
ప్రొ కబడ్డీ ఫైనల్ విజేత
-
కబడ్డీ ‘క్వీన్స్’
ప్రొ కబడ్డీ మహిళల విజేత స్ట్రామ్ క్వీన్స్ ఫైనల్లో ఫైర్బర్డ్స్పై సంచలన విజయం చివరి సెకన్లలో డ్రామా హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ మహిళల విభాగంలో విజయ ‘తుఫాను’ రేగింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్వీన్స్ 24-23 పాయింట్ల తేడాతో ఫైర్ బర్డ్స్పై విజయం సాధించింది. చివరి సెకను వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడినా... ఆఖరి క్షణంలో తేజస్వినీ బాయి అద్భుత రైడింగ్తో రెండు పాయింట్లు సాధించి క్వీన్స్ను గెలిపించింది. స్ట్రామ్ జట్టు తరఫున సాక్షి కుమారి ఆరు రైడింగ్ పాయింట్లు సహా మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోర్ చేసింది. బర్డ్స్ మహిళలలో సబ్స్టిట్యూట్గా వచ్చిన కె.రింజు ఏడు పాయింట్లతో ఆకట్టుకుంది. ఫైర్ కెప్టెన్ మమతా పుజారి పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 10-8తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన బర్డ్స్ చివరకు మ్యాచ్ కోల్పోయింది. సెకన్ల వ్యవధిలో....: మహిళల ఫైనల్లో చివరి నిమిషంలో డ్రామా చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కో పాయిట్ కోసం పోరాడుతూ చివరి వరకు సమంగా నిలుస్తూ వచ్చాయి. 29వ నిమిషం ముగిసేసరికి 22-17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ఉన్న క్వీన్స్ విజయానికి చేరువైంది. అయితే 30వ నిమిషంలో బర్డ్ రైడర్ రింజు 3 పాయింట్లు కొల్లగొట్టింది. అయితే ఈ దశలోనూ క్వీన్స్ 22-20తో ముందంజలో ఉంది. ఆ వెంటనే బర్డ్స్ కెప్టెన్ మమతా పూజారి తర్వాతి రైడింగ్లో మరో 3 పాయింట్లు రాబట్టడంతో జట్టు 23-22తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు ఖాయమైందని భావించిన అమ్మాయిలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ మరో రెండు సెకన్లలో మ్యాచ్ ముగిసే సమయంలో స్ట్రామ్ కెప్టెన్ తేజస్వినీ బాయి ప్రత్యర్థి కోర్టులోకి దూసుకుపోయింది. బర్డ్స్ కోలుకునే లోపే రెండు పాయింట్లు స్కోర్ చేసి తమ జట్టును విజేతగా నిలిపింది. క్వీన్స్ ఆనందంతో గంతులు వేయగా, బర్డ్స్ మహిళలు నిరాశలో మునిగారు. -
పైరేట్స్ మళ్లీ కొల్లగొట్టారు...
ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా వరుసగా రెండోసారి టైటిల్ సొంతం ఫైనల్లో జైపూర్ చిత్తు టైటాన్స్ నాలుగో స్థానంతో సరి హైదరాబాద్: ప్రొ కబడ్డీలో వరుసగా రెండో ఏడాది బిహారీ జట్టు హవా కొనసాగింది. సీజన్-4లో ఆది నుంచి తొడగొట్టి ఆధిక్యం ప్రదర్శించిన పట్నా పైరేట్స్ లీగ్ చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. రెండోసారి టైటిల్ చేజిక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పైరేట్స్ 37-29 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తు చేసింది. గత సీజన్లో విజేతగా నిలిచిన పట్నా డిఫెండింగ్ చాంపియన్గా తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చింది. అద్భుత ప్రదర్శన చేసిన పర్దీప్ నర్వాల్ 16 రైడింగ్ పాయింట్లతో పట్నా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాంథర్స్ తరఫున కెప్టెన్ జస్వీర్ (13 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. విజేతగా నిలిచిన పైరేట్స్కు రూ. 1 కోటి, రన్నరప్ జైపూర్కు రూ. 50 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. సెమీస్ వరకు దూసుకొచ్చిన తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్లో పుణేరీ పల్టన్ చేతిలో 35-40తో ఓడి నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది. పర్దీప్ జోరు... ఫైనల్ ఆరంభం నుంచి పైరేట్స్ ముందంజలో నిలిచింది. సీజన్ ఆసాంతం పైరేట్స్ తరఫున చెలరేగిన పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్లోనూ అదే జోరు ప్రదర్శిస్తూ కీలక సమయాల్లో పాయింట్లు రాబట్టాడు. డిఫెన్స్లో హాది రాణించడంతో జైపూర్కు పట్టు చిక్కలేదు. అయితే జస్వీర్ మెరుగైన రైడింగ్తో ఆ జట్టు కోలుకుంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పైరేట్స్ 19-16తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో జైపూర్ డిఫెన్స్ పూర్తిగా విఫలం కాగా... పట్నా తమ ఆధిక్యం కోల్పోకుండా జాగ్రత్త పడింది. హాది రెండుసార్లు సూపర్ టాకిల్తో జైపూర్ పని పట్టాడు. 33వ నిమిషంలో 31-22తో ముందుకు దూసుకుపోయిన పైరేట్స్కు ఆ తర్వాత పాంథర్స్ పోటీ ఇవ్వలేకపోయింది. జస్వీర్ కూడా చివర్లో వరుస రైడ్లలో విఫలం కావడంతో పైరేట్స్ రెండోసారి టైటిల్ను ఖాయం చేసుకుంది. మరోసారి తడబడ్డారు... సొంతగడ్డపై ప్లే ఆఫ్ మ్యాచ్లో విజయం సాధించి మూడో స్థానంలో నిలవాలనుకున్న తెలుగు టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. హోరాహోరీగా సాగిన పోరులో చివరి క్షణాల్లో టైటాన్స్ పట్టు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. రాహుల్ చౌదరి (18 రైడింగ్ పాయింట్లు) మరోసారి వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన పుణేరీ 10-3తో దూసుకుపోయింది. అయితే రాహుల్ వరుస పాయింట్లు రాబట్టడంతో జట్టు కోలుకుంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పల్టన్ 17-14తో ముందంజలో నిలిచింది. ఆ వెంటనే పుణేను టైటాన్స్ ఆలౌట్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఆధిపత్యం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. ఒక దశలో 30-34తో వెనుకబడిన టైటాన్స్ రాహుల్ చలవతో 35-36తో ప్రత్యర్థి స్కోరుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో రైడింగ్ వెళ్లిన దీపక్ హుడా ఒకే సారి రాహుల్, విశాల్, రూపేశ్లను అవుట్ చేయడంతో 39-35తో ముందుకెళ్లిన పల్టన్, మరో పాయింట్ను సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. పుణే ఆటగాళ్లలో దీపక్ హుడా 17 పాయింట్లు సాధించడం విశేషం. 500 ప్రొ కబడ్డీ లీగ్లో నాలుగు సీజన్లు కలిపి మొత్తం 500 రైడింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్ చౌదరి నిలిచాడు. విజేత: పట్నా పైరేట్స్... రూ. కోటి రన్నరప్: జైపూర్ పింక్పాంథర్స్... రూ. 50 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు: పర్దీప్ నర్వాల్ (పట్నా) రూ. 10 లక్షలు డిఫెండర్ ఆఫ్ ది టోర్నీ: ఫజల్ అత్రాచల్ (పట్నా) రూ. 5 లక్షలు రైడర్ ఆఫ్ ది టోర్నీ: రాహుల్ చౌదరి (టైటాన్స్) రూ. 5 లక్షలు రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీ: అజయ్ కుమార్ (జైపూర్) రూ. 1 లక్ష -
యు ముంబా జోరు
దబాంగ్ ఢిల్లీపై విజయం ప్రొ కబడ్డీ లీగ్ జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో యు ముంబా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో జరిగిన ఉత్కంఠ పోరులో 27-25 స్వల్ప తేడాతో యు ముంబా నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ 14-12తో కాస్త పైచేయిలోనే ఉంది. అయితే ద్వితీయార్ధంలో ముంబా తమ వ్యూహాలను మార్చుకుని సత్తా చాటింది. 28వ నిమిషం వరకు 15-16తో వెనుకబడి ఉన్నా ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచింది. ఈ సమయంలో రిషాంక్ దేవడిగ (8 రైడింగ్ పాయింట్లు) సూపర్ రైడ్తో మూడు పాయింట్లు తేవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబా వైపు తిరిగింది. ఢిల్లీ నుంచి కెప్టెన్ కశిలింగ్ అడికే 6, సెల్వమణి 5 రైడింగ్ పాయింట్లు సాధించారు. దీపక్ నర్వాల్ తన 11 రైడింగ్ ప్రయత్నాల్లో ఒక్క పాయింట్ మాత్రమే తేవడం జట్టు ఫలితాన్ని ప్రభావితం చేసింది. జైపూర్దే విజయం: నువ్వా.. నేనా అనే రీతిలో సాగిన మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 36-33 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిక్యం ఇరు జట్ల మధ్య మారుతూ వచ్చింది. అయితే కెప్టెన్ జస్వీర్ సింగ్ మరోసారి సూపర్ ఆటతో 13 రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. బెంగాల్ నుంచి నితిన్ మదానే, మోను గోయట్ ఎనిమిదేసి పాయింట్లు సాధించారు. ప్రొ కబడ్డీలో నేడు దబాంగ్ ఢిల్లీ కేసీ గీ బెంగళూరు బుల్స్ రాత్రి 8 గంటల నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ గీ పుణెరి పల్టాన్ రాత్రి 9 గంటల నుంచి -
పల్లెలకూ పాకిన బెట్టింగ్ భూతం
జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కొంతకాలం క్రితం వరకు క్రికెట్కే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం కబడ్డీ, ఫుట్బాల్, ఇతర పోటీలపైనా సాగుతోంది. పోలీసుల వరుస దాడులతో కొంతకాలం క్రితం తగ్గుముఖం పట్టినా ఇటీవల మళ్లీ విజృభిస్తోంది. ఏలూరు: జిల్లాలో బెట్టింగ్ మాఫియా క్రమేపీ మళ్లీ పుంజుకుంటోంది. కొంతకాలం క్రితం పోలీసుల దాడులతో కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ కోరలు చాస్తోంది. క్రికెట్తో మొదలైన బెట్టింగ్ ఝాఢ్యం మెల్లమెల్లగా అన్ని క్రీడలకూ పాకుతోంది. క్రీడతో సంబంధం లేకుండా ఏ పోటీలైనా బెట్టింగ్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యూరో కప్ ఫుట్బాల్, కోపా అమెరికన్ ఫుట్బాల్ టోర్నీ, ప్రొ కబడ్డీ పోటీలపై కూడా జూదం జోరుగా సాగుతోంది. గతంలో ఏలూరు నగర పరిధిలోని వన్టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పెదవేగి మండల పరిధిలోని వేగివాడలో ఒక కేసు నమోదుకావడం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెలకూ ఈ మాఫియా విస్తరించిందనడానికి నిదర్శనం. పోలీసుల నిఘా కారణంగా ఎక్కువ మంది బుకీలు ఫోన్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన అమిరంలో బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన పోలీసులు భారీస్థాయిలో నగదుతో పాటు నిందితులను పట్టుకున్నారు. కాదేదీ బెట్టింగ్కు అనర్హం నిమ్మకాయలు విసిరే పందాల నుంచి మోటార్ వాహనాల టోటల్ ఎంత అంటూ నంబర్ల మొత్తాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. క్రికెట్ పోటీలు జరిగితే బెట్టింగ్ నిర్వాహకులకు పండగే. ఒక వేళ ఎక్కడా క్రికెట్ పోటీలు లేకపోతే ఇతర క్రీడలపై పందేలు వేస్తున్నారు. ఏవీ లేకపోతే గ్రామ ముఖద్వారంలో నిలబడి రాబోయే మోటారు వాహనం టోటల్ ఎంత ఉంటుందనేది కూడా పందెం వేసుకుంటున్నారు. జేబులు గుల్ల బెట్టింగ్కు అలవాటు పడిన యువతలో చాలామంది చిరువ్యాపారులు, తల్లిదండ్రుల చాటు బిడ్డలు కావడంతో బెట్టింగ్లో వేలు గడించాలనే దురాశతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు వారికి ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. దీంతో వారి వ్యాపారు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. బెట్టింగ్ నివారణకు చర్యలు తీసుకున్నాం ఏలూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే బెట్టింగ్ల నిరోధానికి చర్యలు తీసుకున్నాం. త్వరలో ప్రొ కబడ్డీ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించాం. బెట్టింగ్ బుకీలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. గతంలో బుకీలు, బెట్టింగ్లకు డబ్బులు వడ్డీకి అప్పులిచ్చే వ్యాపారులపైనా నిఘా కొనసాగిస్తున్నాం. బెట్టింగ్లపై ప్రజల వద్ద సమాచారం ఉంటే నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం. - ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు -
మోత వేస్తున్న కూత
గ్రామీణ క్రీడ కబడ్డీకి రెండు దశాబ్దాలుగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. తన ఉనికినీ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఈ తరుణంలో ప్రవేశించిన ప్రో కబడ్డీ ఈ క్రీడ దశాదిశను మార్చేంది అమలాపురం. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ పొందిన్న క్రీడలో కబడ్డీ తొలిస్థానానికి చేరింది. క్రీడాకారులను, క్రీడాభిమానులే కాదు.. చిన్నపిల్లలనూ ఇది అమితంగా ఆకర్షిస్తోంది. క్రీడాకారులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రో కబడ్డీ భరోసా కల్పించింది. ఒకప్పుడు భారత జట్టు ఏషియాడ్ క్రీడల్లో కబడ్డీ విభాగంలో గోల్డ్మెడల్ సాధించినా ఆ జట్టులోని సభ్యులు ఎవరో పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు ప్రో కబడ్డీ(ప్రొఫెషనల్ కబడ్డీ) పుణ్యమా అని మన దేశ కబడ్డీ క్రీడాకారులకు ఎనలేని గుర్తింపు, వాణిజ్య ప్రకటల్లో అవకాశాలు వస్తున్నాయి. తమకు ఇంతగా గుర్తింపు తెచ్చింది ప్రో కబడ్డీయేనని క్రీడాకారులు, న్యాయనిర్ణేతలు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో గురువారం నుంచి ఆరంభమైన జాతీయ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు వచ్చిన కోచ్లు, క్రీడాకారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. -
చాంపియన్ యు ముంబా
-
ప్రొ కబడ్డీ విజేత యూ ముంబా జట్టు
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా యూ ముంబాయి జట్టు నిలిచింది. రెండో సీజన్లో ముంబయిలో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై యూ ముంబా జట్టు ... ఘనవిజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడి 35-29 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఆ జట్టుదే పై చేయికాగా, రెండో అర్థభాగంలో బెంగళూరు బుల్స్ కాస్త పుంజుకున్నట్లుగా అనిపించింది. బెంగళూరు బుల్స్ కెప్టెన్ మంజిత్ చిల్లార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ సందర్భంలో యుముంబాకు సమానమైన పాయింట్లు సాధించాడు. అదే క్షణంలో అతడు కాస్త తొందరపడటంతో యు ముంబాకు కలిసి వచ్చింది. చివరి నాలుగు రైడింగ్లలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. ట్రోఫీ యూముంబాను వరించింది. రెండో స్థానంలో బెంగళూరు బుల్స్ నిలిచింది. -
టైటాన్స్ తొడగొడుతుందా!
-
ప్రొ కబడ్డీ: జైపూర్పై పాట్నా పైరేట్స్ గెలుపు
పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 2015లో భాగంగా బుధవారం జైపూర్ పింక్ పాంథర్స్ , పాట్నా పైరేట్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 26-24 తేడాతో పాట్నా పైరేట్స్, జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. -
ప్రొ కబడ్డీ: జైపూర్పై బెంగాల్ వారియర్స్ గెలుపు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 37-39 తేడాతో జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. -
జైపూర్ పింక్ పాంథర్స్ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో దబాంగ్ ఢిల్లీతో మ్యాచ్లో.. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు గెలిచింది. సోమవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన ఆటలో 21-51 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ గెలిచింది. తొలి అర్ధ భాగం నుంచే జైపూర్ జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. అదే ఫామ్ ను రెండో అర్ధ భాగంలో కూడా కాపాడుకుంది. ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా కనిపించలేదు. ఆది నుంచే జైపూర్ ఆటగాళ్లు తమ ప్రతిభను కనబరుస్తూ గెలుపు దిశగా సాగారు. -
ఆరంభం ఉత్కం‘టై’
♦ హైదరాబాద్లో అదిరిపోయిన ప్రొ కబడ్డీ ఆరంభం ♦ తెలుగు టైటాన్స్, పింక్ పాంథర్స్ మ్యాచ్ డ్రా సాక్షి, హైదరాబాద్ : తారళ తళుకులు... మిరుమిట్లు గొలిపే కాంతులు... నరాలు తెగే ఉత్కంఠతో ఆట... వెరసి హైదరాబాద్లో ప్రొ కబడ్డీ లీగ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే గెలుపు అవకాశాన్ని ఆతిథ్య టైటాన్స్ జట్టు చేజార్చుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్తో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ను 39-39తో డ్రాగా ముగించింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి. మరో మ్యాచ్లో యు ముంబా 29-25 పాయింట్ల స్కోరుతో ఢిల్లీ దబాంగ్స్ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ జోరు పింక్ పాంథర్స్తో మ్యాచ్లో తొలి అర్ధభాగం తెలుగు జట్టు అద్భుతంగా ఆడి ఆకట్టుకుంది. దీపక్ తొలి పాయింట్ అందించగా... సుకేశ్ హెగ్డే సూపర్ రైడ్తో ఒకేసారి మూడు పాయింట్లు తెచ్చాడు. ఇదే జోరులో జైపూర్ను ఆలౌట్ చేసి 10-2 ఆధిక్యంలోకి వెళ్లారు. మరోవైపు పాంథర్స్ ఆటగాడు రాజేశ్ నర్వాల్ వరుసగా రైడింగ్ పాయింట్లు తెస్తూ ఆ జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. తొలి అర్ధభాగంలో తెలుగు జట్టు 20-12తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో కోలుకున్న జైపూర్: మ్యాచ్ ద్వితీయార్ధంతో పాంథర్స్ ఆటగాడు సోనూ నర్వాల్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా పాయింట్లు కొల్లగొట్టాడు. వరుసగా ఆరు రైడ్లలో అతను ఆరు పాయింట్లు సాధించడం విశేషం. డిఫెన్స్లో కూడా ఆ జట్టు అద్భుతంగా ఆడటంతో ఒక్కసారిగా పాయింట్ల తేడా తగ్గుతూ వచ్చింది. మరో 10 నిమిషాలు మ్యాచ్ మిగిలి ఉన్న దశలో టైటాన్స్ 29-21తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత జైపూర్ ఏకంగా 18 పాయింట్లు కొల్లగొట్టింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి పాంథర్స్ దూకుడు ప్రదర్శించింది. 35వ నిమిషంలో స్కోరు సమం చేసిన జైపూర్... ఆ వెంటనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టైటాన్స్ రెండో సారి ఆలౌట్ అయింది. 37-39తో వెనుకబడిన దశలో రాహుల్ వరుసగా రెండు రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును రక్షించాడు. చివరి నిమిషంలో రైడ్కు వెళ్లిన జైపూర్ ఆటగాడు జస్వీర్ ప్రత్యర్థి ఆటగాడిని తాకినట్లుగా గట్టిగా వాదించినా అంపైర్లు ఆ పాయింట్లు తిరస్కరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తెలుగు టైటాన్స్ జట్టులో రాహుల్ చౌదరి 14, సుకేశ్ హెగ్డే 9 పాయింట్లు స్కోర్ చేయగా...జైపూర్ తరఫున సోనూ నర్వాల్ 13, రాజేశ్ నర్వాల్ 7 పాయింట్లు సాధించారు. అర్జున్ జాతీయ గీతాలాపన ప్రొ కబడ్డీ లీగ్లో మ్యాచ్లు ఏ నగరంలో జరిగినా ప్రతి రోజూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. హైదరాబాద్లో తొలి రోజు సినీ హీరో, తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్య క్రమంలో సినీ నటుడు శ్రీకాంత్, తెలుగు టైటా న్స్ యజమాని శ్రీనివాస్, జాతీయ కబడ్డీ సం ఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లోట్ పాల్గొ న్నారు. పలువురు సెలబ్రిటీలు, భారీ సంఖ్యలో అభి మానులు మ్యాచ్ చూడటానికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్లో నేడు తెలుగు టైటాన్స్ ఁ బెంగాల్ వారియర్స్ రా. గం. 8.00 నుంచి స్టార్స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
తెలుగు టైటాన్స్ జోరు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్లో తెలుగు టైటాన్స్ మరో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గురువారం పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ జట్టు 34-22 తేడాతో సునాయాసంగా నెగ్గింది. దీంతో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్లో టైటాన్స్ నాలుగు సార్లు పట్నాను ఆలౌట్ చేయగా... సుకేశ్ హెగ్డే, ప్రశాంత్ రాయ్లు అద్భుతంగా ఆడి చెరో 8 రైడింగ్ పాయింట్లు సాధించారు. ప్రథమార్ధంలో పట్నా ఆటగాళ్లు టైటాన్స్కు గట్టిపోటీనే ఇచ్చారు. ఫలితంగా 13-12తో తెలుగు జట్టు స్వల్ప ఆధిక్యంతో ముగించింది. ద్వితీయార్ధంలో ఒక్కసారిగా పుంజుకున్న టైటాన్స్ ఏ దశలోనూ పట్నాను కోలుకోనీయలేదు. 30-18తో స్పష్టమైన ఆధిక్యం సాధించి... చివర్లో చకచకా పాయింట్లు సాధిస్తూ ఘన విజయం సాధించింది. ప్రశాంత్ రాయ్కు బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్, సందీప్కు బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. -
కేక పుట్టిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్