patna Pirates
-
ప్రొ కబడ్డీ లీగ్-2024 ఛాంపియన్స్గా హరియాణా స్టీలర్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ ఛాంపియన్స్గా హరియాణా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో పాట్నా పైరేట్స్ను 32-23 తేడాతో చిత్తు చేసిన హరియాణా.. తొలిసారి పీకేఎల్ ట్రోఫీని ముద్దాడింది.హరియాణా విజేతగా నిలవడంలో శివం పటారే కీలక పాత్ర పోషించాడు. శివం పటారే ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. 21 ఏళ్ల పటారే నాలుగు టాకిల్స్ పాయింట్స్, ఐదు టచ్ పాయింట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మొహమ్మద్రెజా షాడ్లోయ్ 5 టాకిల్స్తో ప్రత్యర్ధి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. మరోవైపు రన్నరప్గా నిలిచిన పాట్నా పైరేట్స్లో రైడర్ దేవాంక్(5 టచ్ పాయింట్లు), గురుదీప్ సింగ్(6 టాకిల్ పాయంట్లు) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఇక టోర్నీ అసాంతం హరియాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్లో 22 మ్యాచ్లు ఆడిన హరియాణా 16 విజయాలు సాధించగా.. ఆరింట ఓటమి చవిచూసింది. ప్రొ కబడ్డీ లీగ్-2024 సీజన్ ఆరంభం నుంచి ఆఖరి వరకు టేబుల్ టాపర్గానే హరియాణా(84 పాయింట్లు) కొనసాగింది. Presenting to you the 🌟 #𝐏𝐊𝐋𝟏𝟏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🌟@HaryanaSteelers win their maiden #ProKabaddi title 🏆💙#ProKabaddiOnStar #LetsKabaddi #PKLFinal #HaryanaSteelers #PatnaPirates pic.twitter.com/m5xDX2QJlW— ProKabaddi (@ProKabaddi) December 29, 2024 -
టైటిల్ వేటలో...
పుణే: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా... హరియాణా స్టీలర్స్తో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్ కోసం తలపడనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్... ఇప్పటికే మూడుసార్లు టైటిల్ ముద్దాడిన పట్నా మధ్య రసవత్తర పోరు ఖాయమే. తొలిసారి చాంపియన్గా నిలవాలనుకుంటున్న హరియాణా స్టీలర్స్కు జైదీప్ సారథ్యం వహిస్తుండగా... మన్ప్రీత్ సింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నేరుగా సెమీఫైనల్కు చేరిన స్టీలర్స్... తుదిపోరులోనూ అదే జోరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. స్టీలర్స్ తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీ యోధాస్తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్లోనూ రాణించాలని స్టీలర్స్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. డిఫెన్స్లో రాహుల్, సంజయ్ కీలకం కానున్నారు. మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు పీకేఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న పట్నా... ఇప్పుడు నాలుగో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. యువ ఆటగాళ్లు దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్కు చేరిన పైరేట్స్.. అదే జోష్లో టైటిల్ పట్టాలని చూస్తోంది. -
టైటిల్ పోరుకు హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా స్టీలర్స్ 28–25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. తాజా సీజన్లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన హరియాణా స్టీలర్స్ సెమీస్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి హరియాణా 12–11తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి స్టీలర్స్ తుదిపోరుకు చేరింది. హరియాణా తరఫున శివమ్ పతారె 7, వినయ్ 6 రెయిడ్ పాయింట్లు సాధించారు. రాహుల్ సత్పాల్ (5 పాయింట్లు) ట్యాక్లింగ్లో అదరగొట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్టీలర్స్ 15 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 18 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే డిఫెన్స్లో మెరుగైన ప్రదర్శన చేసిన స్టీలర్స్ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు మరో రెండు ఎక్స్ట్రా పాయింట్లు సాధించి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున స్టార్ రెయిడర్ గగన్ గౌడ 10 పాయింట్లతో పోరాడగా... భవానీ రాజ్పుత్, హితేశ్ చెరో 5 పాయింట్లు సాధించారు. రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్ 32–28 పాయింట్ల తేడాతో మరో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖర్లో ఒత్తిడిని అధిగమించిన పైరేట్స్ విజయతీరానికి చేరింది. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 8 పాయింట్లు సాధించగా... శుభమ్ షిండే (5 పాయింట్లు), అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. ఢిల్లీ జట్టు తరఫున అశు మలిక్ (9 పాయింట్లు), మోహిత్ దేశ్వాల్ (7 పాయింట్లు) పోరాడారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ తలపడనుంది. -
సెమీస్లో యూపీ యోధాస్, పట్నా పైరేట్స్
పుణే: గత ఏడాది ప్రొ కబడ్డీ లీగ్లో 11వ స్థానంతో సరిపెట్టుకున్న యూపీ యోధాస్ ఈసారి మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ యోధాస్ 46–18 పాయింట్ల తేడా మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును చిత్తుగా ఓడించింది. రెయిడర్ భవానీ రాజ్పుత్ 12 పాయింట్లతో మెరిసి యూపీ యోధాస్ను సెమీఫైనల్కు చేర్చాడు. హితేశ్ 6 పాయింట్లు రాబట్టగా... గగన్ గౌడ, సుమిత్ 5 పాయింట్ల చొప్పున సాధించారు. భవానీ రాజ్పుత్ 14 సార్లు రెయిడింగ్కు వెళ్లాడు. 9 సార్లు పాయింట్లతో తిరిగి వచ్చాడు. రెండుసార్లు దొరికిపోగా, మూడుసార్లు పాయింట్ సాధించకుండానే వెనక్కి వచ్చాడు. మరోవైపు పింక్ పాంథర్స్ జట్టు సమష్టిగా విఫలమైంది. ఆ జట్టు రెయిడర్లుగానీ, డిఫెండర్లుగానీ ఆకట్టుకోలేకపోయారు. డిఫెండర్ రెజా మీర్బాఘేరి ఐదు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ కేవలం రెండు రెయిడింగ్ పాయింట్లు సాధించి నిరాశపరిచాడు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 31–23 పాయింట్ల తేడాతో మాజీ విజేత యు ముంబా జట్టును ఓడించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్లు దేవాంక్ 8 పాయింట్లు, అయాన్ 10 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆల్రౌండర్ గుర్దీప్ ఐదు పాయింట్లతో రాణించాడు. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు... అజిత్ చౌహాన్ 5 పాయింట్లు సాధించారు.నేడు జరిగే సెమీఫైనల్స్లో హరియాణా స్టీలర్స్తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి), దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్లో, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్లో పట్నా పైరేట్స్తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్తో పాటు శివమ్ చౌధరీ యోధాస్కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్లో తలపడనున్నాయి. -
పట్నా, గుజరాత్ మ్యాచ్ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో భాగంగా శనివారం పట్నా పైరెట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 10 పాయింట్లతో సత్తా చాటగా... సుధాకర్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 9 పాయింట్లు సాధించగా... గుమన్ సింగ్, జితేందర్ యాదవ్ చెరో 8 పాయింట్లతో మెరిశారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో పట్నా 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... గుజరాత్ 18 రెయిడ్ పాయింట్లకు పరిమితమైంది. ట్యాక్లింగ్లో వెనుకబడిన పట్నా 11 పాయింట్లతో సరిపెట్టుకోగా... గుజరాత్ 20 ట్యాకింగ్స్తో సత్తాచాటింది. ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు చివరకు సమంగా ముగిసింది. పట్నా జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరడంతో పాటు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... గుజరాత్ 21 మ్యాచ్లాడి 5 విజయాలు, 13 పరాజయాలు, 3 ‘టై’లతో 38 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 33–31 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అశు మాలిక్ 12 పాయింట్లతో రాణించగా... జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. ఢిల్లీ, జైపూర్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్, యూపీ యోధాస్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో పట్నా పైరేట్స్, యూపీ యోధాస్ జట్లు ప్లేఆఫ్స్కు దూసుకెళ్లాయి. లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 41–37 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్పై విజయం సాధించింది. తద్వారా 20 మ్యాచ్ల్లో 13 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 73 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పైరేట్స్... పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు 21 మ్యాచ్ల్లో 11 విజయాలు, 10 పరాజయాలతో 61 పాయింట్లతో ఉన్న తెలుగు టైటాన్స్ పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కీలక పోరులో పట్నా పైరేట్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో విజృంభించగా... దీపక్, అంకిత్ చెరో ఆరు పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. టైటాన్స్ తరఫున పవన్ సెహ్రావత్, విజయ్ మలిక్ చెరో 9 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా యూపీ యోధాస్ కూడా ప్లేఆఫ్స్లో అడుగు పెట్టింది. యోధాస్ బుధవారం బరిలోకి దిగకపోయినా... లీగ్లో 20 మ్యాచ్లాడి 11 విజయాలు, 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ జట్టు 31 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తలైవాస్ 60–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను మట్టికరిపించింది. తలైవాస్ తరఫున మోయిన్, హిమాన్షు చెరో 13 పాయింట్లతో చెలరేగారు. ఈ ఇద్దరూ సూపర్ రెయిడ్లతో విజృంభించడంతో తలైవాస్ ఏకపక్ష విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో యూపీ యోధాస్; యు ముంబాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
పుణే: స్టార్ రెయిడర్ దేవాంక్ దలాల్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ పదో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 38–28 పాయింట్ల తేడాతో మాజీ విజేత జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే దేవాంక్ తన రెయిడింగ్తో వరుస పాయింట్లు కొల్లగొట్టగా... అతడికి అయాన్ (6 పాయింట్లు), దీపక్ (5 పాయింట్లు), అంకిత్ (5 పాయింట్లు) సహకరించారు. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లతో పోరాడాడు. తాజా సీజన్లో 17 మ్యాచ్లాడిన పట్నా పైరేట్స్ 10 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 58 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 17 మ్యాచ్ల్లో 8 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 49 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ఏడో స్థానంలో ఉంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34–33 పాయింట్ల తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ సుంగ్రోయా చెరో 10 పాయింట్లతో సత్తాచాటారు. యు ముంబా జట్టు తరఫున అజిత్ చవాన్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
PKL 11: దుమ్ములేపిన దబాంగ్ ఢిల్లీ.. తమిళ్ తలైవాస్ చిత్తు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్పై దబంగ్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లతో సత్తా చాటడంతో.. ఆదివారం జరిగిన పోరులో దబంగ్ 32–21 పాయింట్లతో తలైవాస్ను చిత్తు చేసింది. ఢిల్లీ జట్టు తరఫున నవీన్ కుమార్, ఆశు మలిక్ (5 పాయింట్లు) రాణించారు.ఇక తలైవాస్ తరఫున మోయిన్ (8 పాయింట్లు) పోరాడినా లాభం లేకపోయింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ 18 రెయిడ్ పాయింట్లు, 12 ట్యాకిల్ పాయింట్లు సాధించగా... తలైవాస్ ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది.తాజా సీజన్లో 15 మ్యాచ్లాడిన ఢిల్లీ 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లు నమోదు చేసుకుంది. 48 పాయింట్లతో ఢిల్లీ మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 15 మ్యాచ్ల్లో 9వ పరాజయం మూటగట్టుకున్న తలైవాస్ 33 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.బెంగాల్ వారియర్స్పై పట్నా గెలుపుమరోవైపు... హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–35 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో ఆకట్టుకోగా... వారియర్స్ తరఫున మణిందర్ సింగ్ 11 పాయింట్లతో పోరాడాడు. ఇరు జట్లు అటు రెయిడింగ్, ఇటు ట్యాక్లింగ్లో సమంగా నిలిచినా... ఎక్స్ట్రాల రూపంలో 4 పాయింట్లు సాధించిన పైరేట్స్ మ్యాచ్లో విజేతగా నిలిచింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం నుంచి పుణే వేదికగా పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలుత బెంగళూరు బుల్స్తో గుజరాత్ జెయింట్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడతాయి. చదవండి: బిగ్బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్ -
PKL 11: ప్రొ కబడ్డి లీగ్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్ పోరు జరుగనుంది. ఈసారి లీగ్ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.ఇక.. డిసెంబర్ 3 నుంచి మూడో అంచె మ్యాచ్లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న బ్యాడ్మింటన్ హాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.డిసెంబర్ 29నఇక గ్రూప్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్లో తలపడతాయి. కాగ.. డిసెంబర్ 26న రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు... డిసెంబర్ 27న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 29న ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది.ఎనభై మ్యాచ్లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..1. హర్యానా స్టీలర్స్: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 562. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 453. దబాంగ్ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 434. తెలుగు టైటాన్స్: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 435. పట్నా పైరేట్స్: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 436. పుణెరి పల్టన్: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 427. జైపూర్ పింక్ పాంథర్స్: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 408. యూపీ యోధాస్: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 389. తమిళ్ తలైవాస్: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 3310. బెంగాల్ వారియర్స్: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 2511. గుజరాత్ జెయింట్స్: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 2512. బెంగళూరు బుల్స్: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ -
పట్నా ఫటాఫట్
నోయిడా: స్టార్ రెయిడర్లు దేవాంక్, అయాన్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పట్నా పైరెట్స్ 54–31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన పట్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. దేవాంక్ 16 పాయింట్లు, అయాన్ 12 పాయింట్లతో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్ తరఫున అక్షిత్ ధుల్ (7 పాయింట్లు) కాస్త పోరాడాడు. స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ ఒక్క పాయింట్కే పరిమితమయ్యాడు. ఓవరాల్గా పట్నా 32 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... బెంగళూరు జట్టు 13కే పరిమితమైంది. ప్రత్యరి్థని మూడుసార్లు ఆలౌట్ చేసిన పైరేట్స్... తాజా లీగ్లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో పట్నా పైరెట్స్ మూడో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు బుల్స్ వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. పుణేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్పుత్ 10 పాయింట్లు సాధించగా... పల్టన్ తరఫున పంకజ్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్లో భాగంగా నేడు దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
దేవాంక్ ధమాకా
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. 9 మ్యాచ్లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’ షో
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 37–32 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. లీగ్లో హరియాణా జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా... 36 పాయింట్లు ఖాతాలో వేసుకున్న స్టీలర్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరింది. హరియాణా తరఫున వినయ్, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లతో సత్తా చాటారు. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 47–28 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది. తాజా సీజన్లో గుజరాత్కు ఇది రెండో విజయం కాగా... బెంగాల్కు మూడో పరాజయం. లీగ్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), తమిళ్ తలైవాస్తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
పట్నా పైరేట్స్ ప్రతాపం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ 10 పాయింట్లతో టాపర్గా నిలవగా... దేవాంక్ (6 పాయింట్లు), సందీప్ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు. గుమన్ సింగ్, పార్తీక్ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్లో నెగ్గిన గుజరాత్ టీమ్కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్... పుణేరీ పల్టన్తో దంబగ్ ఢిల్లీ తలపడతాయి. హరియాణా స్టీలర్స్ హ్యాట్రిక్ మరోవైపు హరియాణా స్టీలర్స్ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్ నంబర్వన్గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్రౌండర్ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. రెయిడర్ అజిత్ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
జైపూర్పై పట్నా పైరేట్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లో పట్నా పైరేట్స్ జట్టు నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జైపూర్ పింక్ పాంథర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 43–41 తేడాతో పింక్ పాంథర్స్ ను ఓడించింది. పట్నా తరఫున అయాన్ 14 పాయింట్లతో సత్తా చాటగా... మరో రెయిడర్ దేవాంక్ కూడా 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. జైపూర్ జట్టులో కెప్టెన్, స్టార్ రెయిడర్ అర్జున్ దేశాల్ 20 పాయింట్లతో విజృంభించినా జట్టును గెలిపించలేకపోయాడు. హోరాహోరీ పోరుపోటాపోటీగా సాగిన తొలి అర్ధభాగంలో తొలుత జైపూర్ పైచేయి సాధించినా.. చివరకు పట్నా ఆధిక్యంలోకి వచ్చింది. రెయిడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్ ఆరంభం నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. బోనస్తో తమ జట్టు ఖాతా తెరిచిన అతను వరుస టచ్ పాయింట్లతో చెలరేగాడు. అటువైపు పట్నా ఆటగాళ్లు దేవాంక్, అయాన్ కూడా విజయవంతమైన రెయిడ్స్తో ఆకట్టుకున్నారు. దాంతో తొలి ఐదు నిమిషాలు ఆట హోరీహోరీగా సాగింది.కానీ, డిఫెండర్లు ఆశించిన మేర రాణించలేకపోవడంతో పట్నా వెనుకబడింది. దీన్ని జైపూర్ సద్వినియోగం చేసుకుంది. కోర్టులో మిగిలిన అయాన్ను ఔట్ చేసి పదో నిమిషంలోనే పట్నాను ఆలౌట్ చేసి 14–10తో ముందంజ వేసింది. ఆపై అర్జున్ సూపర్ రైడ్తో పాటు సూపర్10 పూర్తి చేసుకున్నాడు. దాంతో జైపూర్ ఆధిక్యం 19–13కి పెరిగింది. ఈ దశలో పట్నా అనూహ్యంగా పుంజుకుంది. దేవాంక్, అయాన్ రెయిండింగ్లో జోరు కొనసాగించడగా... డిఫెన్స్లోనూ మెరుగైంది. అర్జున్ను ట్యాకిల్ చేసి కోర్టు బయటకి పంపించింది.దాంతో 19–19తో స్కోరు సమం చేసింది. ఆవెంటనే కోర్టులో మిగిలిన అభిజీత్ను ట్యాకిల్ చేసి జైపూర్ను ఆలౌట్ చేసిన పట్నా 22–20తో ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేసిన ఆ జట్టు 25–21తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఆఖర్లో పట్నా మ్యాజిక్ రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జైపూర్ మళ్లీ జోరు పెంచింది. ముఖ్యంగా అర్జున్ దేశ్వాల్ చెలరేగిపోయాడు. ఒకే రెయిడ్లో ఏకంగా ఐదుగురు పట్నా ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన మరో రైడ్లో కోర్టులో మిగిలిన అక్రమ్ షేక్ను కూడా టచ్ చేసి వచ్చాడు. దాంతో 24వ నిమిషంలో పట్నాను రెండోసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 27–25తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది.అయినా పట్నా వెనక్కు తగ్గలేదు. అయాన్ రెయిడింగ్లో హవా చూపెట్టగా.. డిఫెండర్లు కూడా పట్టుదలగా ఆడారు. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేశాడు. నీరజ్ను సూపర్ ట్యాకిల్ చేసి మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 40–40తో స్కోరు సమం చేసింది. ఈ దశలో రెయిడ్ కు వెళ్లిన అర్జున్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. కానీ, పట్నా డిఫెండర్ లైన్ దాటడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఆపై, డూ ఆర్ డై రెయిడ్లో దేవాంక్ బోనస్ సాధించడంతో పట్నా 42–41తో ఒక పాయింట్ అధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ చివరి రెయిడ్ కు వచ్చిన సోంబీర్ ను ట్యాకిల్ చేసిన పట్నా మూడు రెండు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
పట్నా పైరేట్స్ సూపర్ షో
హైదరాబాద్: పీకెఎల్ మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో యూపీ యోధాస్పై 42-37తో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది. రెయిడింగ్లో, డిఫెన్స్లో హవా చూపించిన పైరేట్స్ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్ రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. అయాన్ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్ ఆటగాళ్లలో గగన్ గౌడ (9 పాయింట్లు), భరత్ (6 పాయింట్లు) , సురేందర్ గిల్(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.పైరేట్స్ ముందంజ : యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ మ్యాచ్లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. పైరేట్స్ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్, డిఫెన్స్లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి. దీంతో ఇరు జట్లు ఆలౌట్ సైతం చవిచూశాయి. డిఫెన్స్లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుభమ్ షిండె మెరుపు ట్యాకిల్స్తో అదరగొట్టాడు. రెయిడర్ దేవాంక్ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.యోధాస్కు నిరాశ : ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్ రెయిడర్లు సురేందర్ గిల్, గగన్ గౌడ సహా ఆల్రౌండర్ భరత్ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్కు అయాన్ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్ పట్నా పైరేట్స్కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. -
ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం. ప్రథమార్థం హోరాహోరీ : వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్తో మ్యాచ్లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది. పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్లో పైరేట్స్తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది. పుంజుకున్న టైటాన్స్ : విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్లు మెరవటంతో తెలుగు టైటాన్స్పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. -
PKL 2024: దేవాంక్ సూపర్ షో
హైదరాబాద్, పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్ దేవాంక్ కండ్లుచెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించిన దేవాంక్ ఒంటిచేత్తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్కు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం అందించాడు. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్పై పట్నా పైరేట్స్ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచి ఆధిక్యంలో కొనాసాగిన తమిళ్ తలైవాస్ హ్యాట్రిక్ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో తలైవాస్ను ఆలౌట్ చేసిన దేవాంక్.. పట్నా పైరేట్స్ను గెలుపు పట్టాలెక్కించాడు. పట్నా పైరేట్స్ తరఫున ఆల్రౌండర్ అనికెత్ (4 పాయింట్లు), గుర్దీప్ (2 పాయింట్లు), సందీప్ (2 పాయింట్లు) మెరిశారు. తమిళ్ తలైవాస్ రెయిడర్ నరేందర్ ఖండోలా (15 పాయింట్లు), సచిన్ (6 పాయింట్లు) సహా డిఫెండర్ నితేశ్ (4 పాయింట్లు) మెరిసినా.. ఆ జట్టుకు సీజన్లో తొలి పరాజయం తప్పలేదు.తలైవాస్ జోరు తమిళ్ తలైవాస్ వరుసగా మూడో మ్యాచ్లో జోరు చూపించింది. తలైవాస్, పట్నా పైరేట్స్ తొలి రెయిడ్లోనే పాయింట్ల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తలైవాస్ జొరందుకుంది. తలైవాస్ రెయిడర్లకు డిఫెండర్లు సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్కు చిక్కులు తప్పలేదు. తొలి 20 నిమిషాల ఆట అనంతరం తమిళ్ తలైవాస్ 5 పాయింట్ల ఆధిక్యం సాధించింది. నరేందర్ సూపర్ టెన్తో కూతలో చెలరేగగా.. డిఫెండర్ నితేశ్ నాలుగు ట్యాకిల్స్తో మెరిశాడు. దీంతో తలైవాస్ 23-18లో పట్నా పైరేట్స్పై పైచేయి సాధించింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 11 రెయిడ్ పాయింట్లతో మెరిసినా.. డిఫెన్స్లో పైరేట్స్ తేలిపోయింది. కూతలో తలైవాస్ కంటే మెరుగ్గా రాణించినా.. ట్యాకిల్స్లో వెనుకంజ వేయటంతో ఆధిక్యం కోల్పోవాల్సి వచ్చింది.పుంజుకున్న పైరేట్స్ ద్వితీయార్థంలోనూ తమిళ్ తలైవాస్ ఆధిక్యం కొనసాగించింది. కానీ ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాచ్ మలుపు తిరిగింది. కండ్లుచెదిరే కూతతో ఒంటరి పోరాటం చేసిన పైరేట్స్ రెయిడర్ దేవాంక్ 34వ నిమిషంలో సూపర్ రెయిడ్తో చెలరేగాడు. తలైవాస్ మ్యాట్పై నలుగురు ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు ఆ జట్టును ఆలౌట్ చేశాడు. దీంతో నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి పైరేట్స్ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు ఐదు నిమిషాల్లో ఆధిక్యం నిలుపుకున్న పైరేట్స్ సీజన్లో తొలి విజయం సాధించింది. మ్యాచ్లో మెజార్టీ భాగం ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ ఒక్క ఆలౌట్తో కుదేలైంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో మూడు మ్యాచుల్లో తలైవాస్కు ఇది తొలి పరాజయం. -
PKL Season 11: పుణెరి పల్టాన్కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్తో పాటు డిఫెన్స్లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్లో యూపీ యోధాస్తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. -
PKL 10: ‘ప్లే ఆఫ్స్’ చేరిన పుణేరి పల్టన్
PKL 10- న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్ కెప్టెన్ అషు మలిక్ 8 పాయింట్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం 17 మ్యాచ్ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) రాణించాడు. ఇదిలా ఉంటే.. జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పాంథర్స్ తర్వాత టాప్-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్ సీరియస్ Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s — ProKabaddi (@ProKabaddi) February 5, 2024 సహజ సంచలన విజయం ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్ నంబర్ 92, టాప్ సీడ్ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్లో 2 ఏస్లు కొట్టిన సహజ 4 డబుల్ఫాల్ట్లు చేసింది. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్కు షాక్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్కు షాక్ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్లో ఆ జట్టు తమిళ్ తలైవాస్ చేతిలో 25-41 తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో పట్నాకు ఇది ఏడో పరాజయం. తలైవాస్ తరఫున అజింక్య పవార్ 10 పాయింట్లు, అభి 7 పాయింట్లు, నరేందర్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సుధాకర్ 8 పాయింట్లు సాధించాడు. -
PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. ఉత్కంఠ పోరులో విజయం
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx — ProKabaddi (@ProKabaddi) December 22, 2023 టాప్లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర ఇక పీకేఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. చదవండి: విండీస్దే టి20 సిరీస్ తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో రోవ్మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. -
జైపూర్ పింక్పాంథర్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 29–28తో గెలిచింది. జైపూర్ తరఫున అజిత్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేశాడు. -
గుజరాత్పై పట్నా పైచేయి
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ జెయింట్స్ జట్టుకు పట్నా పైరేట్స్ బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 33–30 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. ఈ లీగ్లో పట్నాకిది వరుసగా రెండో విజయంకాగా... గుజరాత్ జట్టుకిది తొలి పరాజయం. గుజరాత్తో మ్యాచ్లో పట్నా సమష్టి ఆటతో రాణించింది. పట్నా పైరేట్స్ తరఫున సుధాకర్ (6 పాయింట్లు), సచిన్ (4), నీరజ్ కుమార్ (4), అంకిత్ (4), సందీప్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. గుజరాత్ తరఫున రాకేశ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా ఫలితం లేకపోయింది. అంతకుముందు బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. బెంగాల్ తరఫున శ్రీకాంత్ జాదవ్ (7), నితిన్ కుమార్ (5), మణీందర్ సింగ్ (4)... జైపూర్ తరఫున భవాని రాజ్పుత్ (10) అర్జున్ దేశ్వాల్ (6) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్తో దబంగ్ ఢిల్లీ; పుణేరి పల్టన్తో యు ముంబా తలపడతాయి. -
తెలుగు టైటాన్స్కు నిరాశ
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెపె్టన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57–27తో హరియాణా స్టీలర్స్పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున సురేందర్ 13 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు స్కోరు చేశారు. -
PKL 2022: సెమీస్లో జైపూర్, పుణె.. పట్నాకు పరాభవం!
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్పై గెలిచాయి. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు. కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్ల్లో తలపడతాయి. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB — ProKabaddi (@ProKabaddi) December 5, 2022 -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం మూడు మ్యాచ్లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నాతో మ్యాచ్లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్తో మ్యాచ్లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్తో మ్యాచ్లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2022: తొలిసారి చాంపియన్స్గా దబంగ్ ఢిల్లీ
Pro Kabaddi League 2022 Finals: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్ ఫైనల్లో దబంగ్ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్గా నిలిచిన పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. ఫైనల్లో ఢిల్లీ తరఫున రెయిడర్లు నవీన్ కుమార్, విజయ్ మలిక్ అద్భుత ప్రదర్శన చేశారు. విజయ్ 14 పాయింట్లు, నవీన్ 13 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకేఎల్ ఎనిమిదో సీజన్లో నవీన్ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా... మోహిత్ గోయట్ (పుణేరి పల్టన్; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా... మొహమ్మద్ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ డిఫెండర్’గా... పవన్ సెహ్రావత్ (బెంగళూరు బుల్స్; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ రెయిడర్’గా అవార్డులను సొంతం చేసుకున్నారు. -
PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్లు ఆడిన పట్నా 14 మ్యాచ్ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
బెంగాల్ వారియర్స్కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓవరాల్గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
ప్రదీప్ ప్రతాపం
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్ వారియర్స్పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్ కున్ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో నీరజ్ కుమార్ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్కు వెళ్లిన ప్రదీప్... ఏకంగా ఆరుగురిని ఔట్ చేసి రైడింగ్లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. బెంగాల్ తరఫున సౌరభ్ (11 పాయింట్లు), రాకేశ్ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్గా ప్రదీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్కు యు ముంబా
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్కు చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబా జట్టు 30–26తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5), ఫజల్ అత్రాచలి (4) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 59–36తో హరియాణా స్టీలర్స్పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
టైటాన్స్కు మరో ‘టై’
పుణే: ప్రత్యర్థిని పట్టేయాలన్న టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గెలవాల్సిన మ్యాచ్ను టైటిల్ తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన టైటాన్స్, పట్నా పైరేట్స్ మ్యాచ్ 42–42తో ‘డ్రా’గా ముగిసింది. స్పష్టమైన ఆధిక్యాన్ని రెండు సార్లు చేజార్చుకున్న టైటాన్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 17 పాయింట్లు సాధించిన పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ జట్టుకు పరాభవాన్ని తప్పించాడు. ఏకంగా మూడు సూపర్ రైడ్లతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), రజ్నీశ్ (10 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 42–38తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
పట్నా, బెంగాల్ విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. -
ప్రదీప్ 26, తలైవాస్ 25
కోల్కతా: పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 51–25తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 33–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
గట్టెక్కిన పట్నా పైరేట్స్
ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ నమోదైంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ ముందు తలవంచింది. సోమవారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్లో పట్నా పైరేట్స్ 24–23 తేడాతో తమిళ్ తలైవాస్పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వరుసగా తానాడిన రెండు మ్యాచ్లలో విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో తలైవాస్ డీలా పడింది. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు కీలక సమయంలో రైడ్కు వెళ్లి రెండు బోనస్ పాయింట్లు తెచ్చి హీరోగా నిలిచాడు. మోను 5 పాయింట్లతో అతనికి తన వంతు సాయం చేశాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు. తడబడి నిలబడి... పట్నా పైరేట్స్ ఆటను అంత గొప్పగా ఆరంభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4–0తో అధిక్యంలోకెళ్లింది. అయితే తరువాతి నిమిషంలో రాహుల్ని సూపర్ టాకిల్ చేసిన పట్నా రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే రైడ్కు వెళ్లిన ఇస్మాయిల్ రాన్ సింగ్ను ఔట్ చేయడంతో పాటు బోనస్ పాయింట్ను సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు సమానంగా పాయింట్లను సంపాదించడంతో విరామ సమయానికి 11–11తో సమంగా నిలిచాయి. చివరి మూడు నిమిషాల్లో... ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తలైవాస్ 18–22తో వెనుకబడింది. ఈ దశలో రాహుల్, రాన్ సింగ్లు తమ రైడ్లతో మూడు పాయింట్లు తెచ్చారు. అదే సమయంలో పైరేట్స్ రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21–24కు వెళ్లింది. చివరి రైడ్కు వెళ్లిన ప్రదీప్ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్కు రెండు పాయింట్లు వచ్చినా అది విజయాన్ని అందించలేకపోయింది. బెంగాల్ ఘనవిజయం రెండో మ్యాచ్లో బెంగాల్వారియర్స్ 43–23తో పుణేరి పల్టన్ను బోల్తా కొట్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో బెంగాల్ ముందు పుణేరి ఏమాత్రం నిలబడలేకపోయింది. బెంగాల్ తరపున మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో అదరగొట్టాడు. అతనికి ఇస్మాయిల్ నబీబ„Š (8 పాయింట్లు) సహకారం తోడవడంతో బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పుణేరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో యూపీ యోధ తలపడతాయి. ప్రొ కబడ్డీలో 900 పాయింట్లను సాధించిన తొలి రైడర్గా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. మంజీత్ చిల్లర్ 300 టాకిల్ పాయింట్ల మార్క్ను అందుకున్నాడు. అజయ్ ఠాకూర్ రైడింగ్లో 600 పాయింట్లను సాధించాడు. -
తమిళ్ తలైవాస్కు పట్నా షాక్
ముంబై : దబాంగ్ ఢిల్లీపై విజయంతో మంచి జోరు మీదున్న తమిళ్ తలైవాస్కు పట్నా పైరేట్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఒక్క పాయింట్ తేడాతో తమిళ్ తలైవాస్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్ ఠాకూర్(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తమిళ్ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది. ఇరుజట్టు ఆది నుంచి ఆచితూచి ఆడాయి. దీంతో పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. తొలి అర్దభాగం ముగిసే సరికి 11-11తో సమంగా నిలిచాయ. అయితే రెండో అర్దభాగం మొదట్లో తమిళ్ జట్టు పొరపాట్లు చేయడంతో మూల్యం చెల్లించుకుంది. ఇక చివర్లో తమిళ్ జట్టు పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాక ఓటమిచవిచూసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్(1)ను కట్టడి చేసిన తమిళ్ ఢిఫెండర్లు.. జైదీప్(7)ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో పట్నా 7 రైడ్, 17 టాకిల్ పాయింట్లను సాధించగా.. తమిళ్ తలైవాస్ 9 రైడ్, 10 టాకిల్ పాయింట్లను సాధించింది. ఇరుజట్లు చెరో నాలుగు ఎక్సట్రా పాయింట్లను సాధించాయి. -
టైటిల్ కూత ఎవరిదో?
ముంబై: ఎన్నో ఉత్కంఠ పోరాటాలు... మరెన్నో అనూహ్య ఫలితాలు. మేటి జట్లు ముందే బరిలో నుంచి తప్పుకుంటే... అనామక జట్లు మెరుపులు మెరిపించాయి. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ గ్రూప్ దశలోనే వెనుదిరగ్గా... గతేడాది రన్నరప్తో సరిపెట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ చివరి దశకు చేరింది. బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య నేడు జరిగే ఫైనల్తో లీగ్ ఆరో సీజన్కు తెరపడనుంది. రైడింగ్లో బలంగా ఉన్న బెంగళూరు బుల్స్... దుర్భేద్యమైన డిఫెన్స్తో ఆకట్టుకున్న గుజరాత్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు జట్లలో ఎవరు గెలిచినా... తొలిసారి టైటిల్ హస్తగతమవుతుంది. 2015లో బెంగళూరు బుల్స్ ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. విజేతకు రూ.3 కోట్లు... రన్నరప్ జట్టుకు రూ.1.80 కోట్లు ప్రైజ్మనీగా లభించనుంది. ఇరుజట్ల మధ్య చివరగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో బెంగళూరు గెలిచింది. ఈ సీజన్లో బెంగళూరు రైడర్స్ 521 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 460 పాయింట్లతో గుజరాత్ రైడర్లు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ట్యాక్లింగ్ విషయానికొస్తే 266 పాయింట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలవగా... 223 పాయింట్లతో బుల్స్ ఆరోస్థానంలో ఉంది. గుజరాత్కు సచిన్, ప్రపంజన్, సునీల్... బెంగళూరుకు కెప్టెన్ రోహిత్, పవన్ కీలకం. -
పట్నా బెర్త్ యూపీ చేతిలో...
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ చతికిలపడింది. ఉత్కంఠరేపిన మ్యాచ్లో పట్నా 29–37తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28–30తో వెనుకంజలో ఉన్న పట్నా ఆ తర్వాత మరిన్ని పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ రెండు సార్లు ఔటవడం ఫలితంపై ప్రభావం చూపింది. పట్నా తరఫున ప్రదీప్ 10 పాయింట్లు సాధించగా... గుజరాత్ తరఫున రోహిత్ 9, అజయ్ 8 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 37–31తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్తో యూపీ యోధా తలపడనున్నాయి. జోన్ ‘బి’లో నిర్ణీత 22 మ్యాచ్లు పూర్తి చేసుకున్న పట్నా ప్రస్తుతం 55 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 52 పాయింట్లతో యూపీ యోధ నాలుగో స్థానంలో ఉంది. నేడు బెంగాల్ వారియర్స్తో జరిగే మ్యాచ్లో యూపీ యోధ గెలిస్తే 57 పాయింట్లతో ‘ప్లే ఆఫ్’ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. యూపీ యోధ ఓడిపోతే పట్నా పైరేట్స్ ‘ప్లే ఆఫ్’కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... ఇరు జట్లు 55 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు పాయింట్ల తేడా కీలకం కానుంది. ప్రస్తుతానికి పాయింట్ల తేడా పరంగా పట్నా మెరుగ్గా ఉంది. -
పట్నాపై యూపీ విజయం
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్ జోన్ ‘బి’లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో యూపీ యోధా 47–31తో పట్నా పైరేట్స్పై గెలిచింది. యోధా తరఫున ప్రశాంత్ 10 పాయింట్లతో మెరవగా... పట్నా తరఫున మన్జీత్ 10 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 29–34తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది. -
టైటాన్స్ తడాఖా.. హోరెత్తిన విశాఖ
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. కీలకమైన మ్యాచ్లో దుమ్ము రేపి ఇంకా నిలబడ్డామనిపించుకున్నారు. ప్లేఆఫ్కు బరిలో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో టైటాన్స్ విజృంభించారు. పాట్నా పైరేట్స్పై 41– 36 పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్నారు. జోన్ బిలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న ఇరు జట్ల మధ్య ఆధిక్యానికి పోరు జరగగా, అత్యవసర తరుణంలో టైటాన్స్ విజృంభించారు. రైడ్లో పైరేట్స్ 24–22 పాయింట్ల తేడాతో టైటాన్స్పై ఆధిక్యం కనబరిచినా టాక్లింగ్లో 14–10తో టైటాన్స్ ఆటగాళ్లు తమదే పైచేయనిపించుకున్నారు. సూపర్ రైడ్Š, ఎక్సట్రాలలో టైటాన్స్ ఒకో పాయింట్ సాధించారు. ఆలౌట్ ద్వారా పైరేట్స్ రెండు పాయింట్లు సాధిస్తే టైటాన్స్ నాలుగు పాయింట్ల సాధించారు. రైడ్తో టైటాన్ ఆటగాళ్లు రాహుల్ 11, నీలేష్ 6 పాయింట్లు రాబట్టారు. విదేశీ అటగాళ్లు మొహసిన్, ఫర్హాద్, అబ్జోర్ రాణించారు. విశాల్ టాక్లింగ్తో నాలుగు పాయింట్లు సాధించాడు. పైరేట్స్ తరపున పర్దీప్ రైడ్లో 10 పాయింట్లు తేగా జైదీప్, వికాశ్ టాక్లింగ్లో సత్తా చూపారు. -
టైటాన్స్ను గెలిపించిన రాహుల్ చౌదరి
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై చివరి మ్యాచ్ను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 41–36తో పట్నా పైరేట్స్పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో చెలరేగగా... నీలేశ్ 9, మోసిన్ 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ తరఫున ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. జోన్ ‘బి’లో ఇప్పటివరకు 19 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 8 మ్యాచ్ల్లో గెలిచి 50 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. వైజాగ్లో మ్యాచ్లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి. -
పట్నా పైరేట్స్ గెలుపు
అహ్మదాబాద్: ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ ఏడో విజయం నమోదు చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 45–27తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ప్రదీప్ నర్వాల్ 13, దీపక్ నర్వాల్ 10 పాయింట్లతో సత్తా చాటారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పైరేట్స్ 16–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. తమిళ్ తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 8 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో మన్జీత్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–35తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడనుంది. -
పట్నా పైరేట్స్ గెలుపు
ముంబై: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ (16 పాయింట్లు) చెలరేగడంతో పట్నా పైరేట్స్ ఆరో విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–35తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. ప్రదీప్తో పాటు మన్జీత్ 8 పాయింట్లతో రాణించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్లో యు ముంబా 36–22తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్తో యూపీ యోధా తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ నాలుగో విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్కు నాలుగో విజయం...! జోన్ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 29–27తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. దీంతో సొంత గడ్డపై చివరి మ్యాచ్ను విజయంతో ముగించింది. పట్నా కెప్టెన్, ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ గాయంతో బెంచ్కే పరిమితమైన ఈ మ్యాచ్లో దీపక్ నర్వాల్ 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. ట్యాక్లింగ్లో జైదీప్ (5 పాయింట్లు) రాణించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున రాన్సింగ్ 7, మహేశ్గౌడ్ 6, జాంగ్ కున్ లీ 5 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఇరు జట్లు 25–25తో నిలిచాయి. ఈ దశలో నర్వాల్ రైడింగ్లో పాయింట్ సాధించడం, ఆ వెంటనే కున్ లీ ఔట్ కావడంతో దక్కిన 2 పాయింట్ల ఆధిక్యాన్ని పట్నా కొనసాగించి గెలుపొందింది. శుక్రవారం యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడతాయి. -
పుణేరీ పల్టన్ ఆరో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పుణేరీ పల్టన్ ఆరో విజయం సొంతం చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరు లో పుణేరీ పల్టన్ 31–27తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. పుణేరీ తరఫున జీబీ మోరె 5, దీపక్ దహియా 4 రైడ్ పాయింట్లతో సత్తాచాటగా... ట్యాక్లింగ్లో సందీప్ నర్వాల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఓ దశలో 8–10, 9–13తో వెనుకబడిన పుణేరీ పల్టన్... మోనూ ‘సూపర్ రైడ్’తో చెలరేగడంతో 13–13తో స్కోరు సమం చేసింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ చివరకు విజయం సొంతం చేసుకుంది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 43–41తో పట్నా పరేట్స్పై గెలిచింది. నేడు బెంగాల్ వారియర్స్తో పట్నా పైరేట్స్, యూపీ యోధాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్ పరాజయం
పట్నా: ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ చెలరేగినా... ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో పట్నా పైరేట్స్ పరాజయం పాలైంది. శనివారం యు ముంబాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి వరకు రేసులో నిలిచిన పట్నా ఆఖరకు 39–40తో ఓడింది. పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 17 రైడ్ పాయింట్లతో దుమ్మురేపాడు. ట్యాక్లింగ్లో జైదీప్ (5 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14, రోహిత్ 11 రైడ్ పాయింట్లతో చెలరేగారు. ట్యాక్లింగ్లో ఫజల్ (6 పాయింట్లు) సత్తాచాటాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 39–28తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధా, పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్ ఆడతాయి. -
పట్నా పైరేట్స్ విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన పట్నా పైరేట్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 41–30తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలిచింది. కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11, మన్జీత్ 10 రైడ్ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో వికాస్ కాలె (5 పాయింట్లు) సత్తా చాటడంతో పట్నా పైరేట్స్ సునాయాసంగా గెలుపొందింది. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున దీపక్ 7 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో సునీల్ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 36–25తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్తో యు ముంబా తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్కు మూడో గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ మూడో విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35–31తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 14–17తో వెనుకబడింది. రెండో సగంలో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చెలరేగడంతో టైటాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా... తెలుగు టైటాన్స్ 30–31తో వెనుకంజలో ఉంది. ఆ సమయంలో రైడింగ్కు వచ్చిన పట్నా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ను టైటాన్స్ ఆటగాళ్లు పట్టేయడంతో 32–31 తో నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కాపాడు కుంటూ జాగ్రత్తగా ఆడి విజయం సొంతం చేసుకుంది. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి (7 పాయింట్లు), నీలేశ్ (5 పాయింట్లు) రైడింగ్లో సత్తా చాటగా... ట్యాక్లింగ్లో విశాల్ (6 పాయింట్లు) రాణించా డు. మరో మ్యాచ్లో పుణేరీ పల్టన్ 29–25తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, పుణేరీ పల్టన్తో యు ముంబా తలపడనున్నాయి. -
పట్నా పైరేట్స్కు షాక్
చెన్నై: ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. క్షణాల్లో ఆధిపత్యం చేతులు మారే ఈ ఆటలో తొలి మ్యాచ్లోనే సంచలన ఫలితం నమోదైంది. అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని తమిళ్ తలైవాస్ 42–26తో ప్రదీప్ నర్వాల్ సారథ్యంలోని పట్నా పైరేట్స్ను బోల్తా కొట్టించింది. తమిళ్ తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ 14 పాయింట్లతో సత్తాచాటగా... ట్యాక్లింగ్లో అమిత్ హుడా రాణించాడు. పట్నా పైరేట్స్ తరఫున కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. పుణేరీ పల్టన్, యు ముంబాల మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32 వద్ద ‘డ్రా’గా ముగిసింది. రెండు జట్లు ప్రతీ పాయింట్కు తీవ్రంగా పోరా డాయి. ఫలితంగా పోరు చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పుణేరీ పల్టన్స్ తరఫున నితిన్ తోమర్ 15 రైడ్ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్లో గిరీశ్ మారుతి ఆకట్టుకున్నాడు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 14 పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్లో కెప్టెన్, ఇరాన్ ప్లేయర్ ఫజల్ సత్తాచాటాడు. నేడు జరుగనున్న లీగ్ మ్యాచ్ల్లో హరియాణా స్టీలర్స్తో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లు రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
పర్దీప్ నర్వాల్ 'ట్రిపుల్ సెంచరీ'
ముంబై:ప్రొ కబడ్డీ సీజన్-5 సీజన్ లో పట్నా పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారిన దుబ్కీ కింగ్ పర్దీప్ తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మంగళవారం రాత్రి హరియాణా స్టీలర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కడే 34 పాయింట్లతో సత్తా చాటాడు. తద్వారా ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యధిక పాయింట్లను సాధించిన రైడర్ గా పర్దీప్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే సీజన్ -5లో 300 రైడ్ పాయింట్లతో అత్యధిక రైడ్ పాయింట్లను సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉంచితే, హరియాణా స్టీలర్స్ ను ఆలౌట్ చేసిన క్రమంలో తొమ్మిది పాయింట్లను సాధించడం మరో విశేషం. ఆట 33వ నిమిషంలో రైడ్ కు వెళ్లిన పర్దీప్ ఒకేసారి ఆరుగురి ఆటగాళ్లను అవుట్ చేశాడు. అదే సమయంలో ఒక బోనస్ ను కూడా సాధించాడు. దాంతో మొత్తం తొమ్మిది పాయింట్లను ఒక రైడ్ ద్వారా సాధించినట్లయ్యింది. రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో పట్నా 69–30 స్కోరుతో హరియాణా స్టీలర్స్పై జయభేరి మోగించింది. పర్దీప్ జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటై భారీ ఓటమిని మూట గట్టుకుంది. -
ప్రదీప్ 34... హరియాణా 30
ముంబై: రైడర్ ప్రదీప్ నర్వాల్ సంచలన ప్రదర్శనతో పట్నా పైరేట్స్కు ఎదురులేని విజయాన్నందించాడు. అతనొక్కడే 34 రైడ్ పాయింట్లతో పీకేఎల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తే... హరియాణా స్టీలర్స్ జట్టంతా కలిసి 30 పాయింట్లను మించి చేయలేకపోయింది. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో సోమవారం జరిగిన రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో పట్నా 69–30 స్కోరుతో హరియాణా స్టీలర్స్పై జయభేరి మోగించింది. 32 సార్లు రైడింగ్కు వెళ్లిన ప్రదీప్ నర్వాల్ 34 పాయింట్లు సాధించడం విశేషం. అతని జోరుకు ప్రత్యర్థి జట్టు ఏకంగా ఐదు సార్లు ఆలౌటైంది. మోను గోయత్ 10, విజయ్ 5 పాయింట్లు చేయగా... టాకిల్లో జైదీప్ (7) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన తొలి ఎలిమినేటర్ పోరులో పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధపై గెలిచింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్, మూడో ఎలిమినేటర్ మ్యాచ్లో పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
పట్నా పైరేట్స్ ఖాతాలో ఐదో ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు ఐదో ‘టై’ నమోదు చేసింది. బెంగళూరు బుల్స్, పట్నా జట్ల మధ్య బుధవారం జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్ 29–29 పాయింట్లతో సమంగా ముగిసింది. జోన్ ‘ఎ’ మ్యాచ్లో పుణేరి పల్టన్ 38–15తో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; గుజరాత్ జెయింట్స్తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
పట్నా పైరేట్స్ గెలుపు
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్ 41–39తో తమిళ్ తలైవాస్ను ఓడించగా... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–23తో యు ముంబాపై గెలిచింది. నేడు జైపూర్ పింక్ పాంథర్స్తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తలైవాస్పై పట్నా పైచేయి
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 35–24తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే పట్నా ఆటగాళ్లకు తలైవాస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మోను 11, అజయ్ ఠాకూర్ 10 రైడింగ్ పాయింట్లతో విజయంలో కీలకంగా నిలిచారు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 26–24 తేడాతో యు ముంబాపై గెలిచింది. -
పట్నాపై పుణేరి పల్టన్ పైచేయి
ప్రొ కబడ్డీ లీగ్ లక్నో: పట్నా పైరేట్స్ రైడర్ పర్దీప్ నర్వాల్ అద్భుతంగా రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో పుణేరి పల్టన్ 47–42 స్కోరుతో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. ఈ లీగ్లో పుణేరి జట్టుకిది నాలుగో విజయం. రైడింగ్లో అదరగొట్టిన పట్నా... డిఫెండర్ల వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. పర్దీప్ 24 సార్లు రైడింగ్కు వెళ్లి 19 పాయింట్లు తెచ్చిపెట్టాడు. ఓవరాల్గా ఇరు జట్లు రెండు సార్లు ఆలౌటయ్యాయి. అయితే పుణేరి పల్టన్ ఆటగాళ్లు టాకిల్లో రాణించడంతో విజయం దక్కింది. టాకిల్లో పట్నా 6 పాయింట్లు సాధిస్తే... పల్టన్ జట్టు 12 పాయింట్లు చేసింది. ఇదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. రైడింగ్లో పుణేరి (29)తో పోలిస్తే... పట్నా (31)దే పైచేయి. పల్టన్ ఆటగాళ్లలో డిఫెండర్ జియావుర్ రెహమాన్ (6) ఆకట్టుకున్నాడు. రైడింగ్లో రాజేశ్ మోండల్ 10 పాయింట్లు చేశాడు. దీపక్ హుడా 9, సందీప్ నర్వాల్ 5, మోను 5 పాయింట్లు సాధించారు. అనంతరం జరిగిన హోరాహోరీ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 24–22తో యూపీ యోధపై గెలిచింది. నేడు లీగ్కు విశ్రాంతి రోజు. మంగళవారం గుజరాత్ జెయింట్స్తో పుణేరి పల్టన్, యూపీ యోధతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
పట్నా చేతిలో టైటాన్స్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం తమిళ్ తలైవాస్పై నెగ్గిన తెలుగు టైటాన్స్ అదే జోరును రెండో మ్యాచ్లో పునరావృతం చేయలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 29–35తో ఓడిపోయింది. పైరేట్స్ సారథి పర్దీప్ నర్వాల్ (15 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. సొంత ప్రేక్షకుల మద్దతుతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ... ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. రాహుల్ చౌదరీ 7 పాయింట్లు సాధించగా, నీలేశ్ 6, వికాస్, విశాల్ చెరో ఐదు పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ జట్టు 30–26తో జైపూర్ పింక్పాంథర్స్పై గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి. -
ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్కు సతీష్కుమార్ ఎంపిక
► రూ.12 లక్షలకు కొనుగోలు చేసిన జట్టు యాజమాన్యం ►జూలైలో జరిగే ఐదో సీజన్లో పాల్గొనే అవకాశం కొడవలూరు (కోవూరు) : ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్ జట్టుకు కోవూరుకు చెందిన పూనుగుంట సతీష్కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో ముంబైలో జరిగిన బహిరంగ ఆక్షన్లో పాట్నా పైరేట్స్ జట్టు యాజమాన్యం రూ.12 లక్షలకు సతీష్ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగే ఐదో సీజన్ ప్రొకబడ్డీ పోటీల్లో పాల్గొనే పాట్నా జట్టుకు డిఫెండర్గా సతీష్ ఎంపికయ్యారు. నాలుగో సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సతీష్ ఈసారి పాట్నా పైరేట్స్ జట్టు నుంచి బరిలో దిగుతున్నాడు. సతీష్ 20కి పైగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొని బహుమతులు సాధించాడు. జూనియర్స్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. క్రీడా కోటాలో రైల్వేలో టీటీఐ ఉద్యోగం సాధించిన సతీష్కుమార్ ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు ఎనిమిదిసార్లు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సతీష్కుమార్ సాక్షితో మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఈ ప్రభాకర్, వీర్ల వెంకయ్యల ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కాగా సతీష్ ఎంపిక పట్ల క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పోటీల్లో రాణించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. -
ఎదురులేని టైటాన్స్
ఆఖరి లీగ్ మ్యాచ్లో పట్నాపై విజయం ముంబై: వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా తెలుగు టైటాన్స్ తమ లీగ్ మ్యాచ్లను ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో పటిష్ట పట్నా పైరేట్స్పై 46-25 తేడాతో రాహుల్ బృందం ఘనవిజయాన్ని అందుకుంది. మూడు వరుస పరాజయాలతో లీగ్ను ఆరంభించిన టైటాన్స్ పాయింట్ల పట్టికలో 50 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో పట్నా, మూడో స్థానంలో జైపూర్ ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో జరిగే సెమీఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఇక పట్నాతో జరిగిన మ్యాచ్లోనూ రాహుల్ చౌధరి చెలరేగి 11 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకోగా సందీప్ నర్వాల్ ఆరు ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పట్నా నుంచి అబోల్ఫజల్ 9 పాయింట్లు సాధించాడు. పుణెరి సెమీస్ ఆశలు సజీవం మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ 39-34 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీపై నెగ్గి తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీపక్ నివాస్ హుడా అత్యధికంగా 17 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టి జట్టును గెలిపించాడు. నేడు (బుధవారం) ఢిల్లీతో జరిగే మ్యాచ్లో యు ముంబా ఓడిపోవడంతో పాటు తమ చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరుపై నెగ్గితే పుణెరి జట్టు సెమీస్ చేరుతుంది. -
పట్నా కూడా సెమీస్లోకి..
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ కూడా సెమీఫైనల్లోకి చేరింది. శనివారం పుణెరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 31-28 తేడాతో నెగ్గడమే కాకుం డా 47 పాయింట్లతో జైపూర్ను వెనక్కినెట్టి టాప్కు చేరింది. పట్నా ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్రదీప్ నర్వాల్ అద్భుత రైడింగ్తో 12 పాయింట్లు సాధించగా భాజీరావ్ హొడగే ఓ సూపర్ ట్యాకిల్ సహా ఐదు పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర వహించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించిన పట్నా ప్రథమార్ధాన్ని 15-10తో ముగించింది. ఓ దశలో నర్వాల్ విజయవంతమైన రైడ్స్తో పట్నా 22-12తో భారీ తేడా చూపించింది. ఇదే జోరు చివరి వరకు సాగగా పట్నా విజయం సులువైంది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 28-27తో ఆఖరి నిమిషంలో యు ముంబాపై గెలిచింది. -
ఢిల్లీకి తెలుగు టైటాన్స్ షాక్
* పట్నాకు రెండో పరాజయం * ప్రొ కబడ్డీ లీగ్ పట్నా: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన తెలుగు టైటాన్స్ జట్టు... ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 28-23తో దబాంగ్ ఢిల్లీ కేసీపై గెలిచింది. టైటాన్స్ తరఫున రైడింగ్లో నీలేశ్ సలాంకే (7), రాహుల్ చౌదరి (5)లు... క్యాచింగ్లో సందీప్ (6), జస్మేర్ సింగ్ (2), సందీప్ నర్వాల్ (2)లు ఆకట్టుకున్నారు. ఢిల్లీ ఆటగాళ్లు సచిన్ (6), అనిల్ (4), సెల్వమణి (3) మినహా మిగతా వారు విఫలమయ్యారు. పట్నాను ఓడించి సూపర్ ఫామ్లో ఉన్న ఢిల్లీని టైటాన్స్ డిఫెన్స్తో పడగొట్టింది. ఆరంభంలో రాహుల్ చౌదరి రైడింగ్తో పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. అయితే 5వ నిమిషంలో చౌదరిని చాకచక్యంగా ట్యాకిల్ చేసి ఢిల్లీ ఖాతా తెరిచింది. ఏడు నిమిషాల వరకు ఢిల్లీ ఆటగాళ్లు రైడింగ్లో పాయింట్లు సాధించలేకపోయారు. చివరకు తొమ్మిదో నిమిషంలో తొలి రైడింగ్ పాయింట్ రాబట్టుకుంది. 11వ నిమిషంలో చౌదరి రెండు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఆధిక్యం 7-3కు చేరింది. తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 21-26తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. పట్నాకు ఇది వరుసగా రెండో పరాజయం. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్; పుణెరి పల్టన్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఎదురులేని పట్నా పైరేట్స్
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 35-21తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. దీంతో వరుసగా ఐదో విజయంతో 25 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. సూపర్ రైడింగ్తో చెలరేగిన పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్లు సాధించాడు. రాజేశ్ మోండల్ (5) ఫర్వాలేదనిపించాడు. అయితే ట్యాక్లింగ్లో అద్భుత నైపుణ్యం చూపెట్టిన ధర్మరాజు 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫజెల్ మూడు పాయింట్లతో సహకారం అందించాడు. రైడింగ్లో విఫలమైన వారియర్స్ తొలి అర్ధభాగానికే వెనుకబడింది. నితిన్ (7), విశాల్ (4), మోను (3) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో పట్నా రైడింగ్లో 17, ట్యాక్లింగ్లో 15 పాయింట్లు గెలిస్తే... బెంగాల్ 13, 8 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. పట్నాకు రెండు ఆలౌట్ పాయింట్లు కూడా లభించాయి. మరో మ్యాచ్లో యు ముంబా 24-23తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. ప్రస్తుతం యు ముంబా 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. యు ముంబా కెప్టెన్ అనుప్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగాడు. రాకేశ్, సునీల్ చెరో మూడు పాయింట్లతో రాణించారు. శనివారం జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో పుణెరి పల్టన్; పట్నా పైరేట్స్తో ఢిల్లీ దబంగ్ తలపడతాయి. -
పట్నా పట్టేసింది...
► ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్ ► ఫైనల్లో యు ముంబా ఓటమి ► విజేతకు రూ. కోటి ప్రైజ్మనీ ► రన్నరప్కు రూ.50 లక్షలు ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నూతన చాంపియన్గా పట్నా పైరేట్స్ అవతరించింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పట్నా జట్టు 31-28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను ఓడించింది. సూపర్ రైడింగ్తోనే కాకుండా అద్భుత డిఫెన్స్తో దుమ్ము రేపిన పట్నా పైరేట్స్కు ఇది తొలి టైటిల్. విజేతకు రూ.కోటి ప్రైజ్మనీ లభించగా... రన్నరప్గా నిలిచిన ముంబాకు రూ.50 లక్షలు అందాయి. ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ ఉన్నా... పట్నా మాత్రం తన దూకుడును తగ్గించుకోలేదు. తొలి పాయింట్ ముంబా సాధించినా ఆ తర్వాత పట్నా జోరు సాగించింది. 7వ నిమిషంలోనే ఆ జట్టును ఆలౌట్ చేయగలిగింది. 17వ నిమిషంలో రోహిత్ కుమార్ సూపర్ రైడ్తో మూడు పాయింట్లు సాధించాడు. అయితే ఆ వెంటనే తన మరో రైడ్లో మాత్రం ముంబా కోర్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు సూపర్ టాకిల్తో పట్టేసి రెండు పాయింట్లు సాధించారు. ఇక అప్పటి నుంచి ప్రథమార్ధం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ముంబా ఆటగాళ్లు అద్వితీయ ఆటను ప్రదర్శించారు. 6-19తో వెనుకబడిన ఈ దశ నుంచి వరుసగా 5 పాయింట్లు సాధించి 11-19కి ఆధిక్యం తగ్గించారు. ఇక ద్వితీయార్ధం ఆట ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఆరంభంలో పట్నా పాయింట్లు సాధించినా ఒక్కసారిగా ముంబా పుంజుకుని 29వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేసింది. దీంతో 20-24 స్కోరుతో పట్నాపై ఒత్తిడి పెరిగింది. చివరి ఐదు నిమిషాల్లో అయితే ఈ రెండు ఉత్తమ డిఫెన్స్ జట్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు కనిపించింది. స్టార్ రైడర్ రోహిత్పై దృష్టి పెట్టిన ముంబా సఫలం కావడంతో పట్నా ఇబ్బంది పడింది. 39వ నిమిషంలో అనూప్ కుమార్ పాయిం ట్తో ముంబా 28-28తో స్కోరును సమం చేసి ఉత్కంఠను పెంచింది. అయితే దీపక్ నర్వాల్ పట్నాకు పాయింట్ అందించగా స్కోరు 29-28కి పెరి గింది. మరోవైపు ముంబా కెప్టెన్ అనూప్ ఫౌల్ కావడంతో పాటు చివరి సెకన్లలో సందీప్ నర్వాల్ పాయిం ట్తో పట్నా 31-28తో విజయం అందుకుంది. పుణెరికి మూడో స్థానం ఫైనల్కు ముందు జరిగిన వర్గీకరణ మ్యాచ్లో పుణెరి పల్టన్ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. పుణెరి 31-27తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పుణెరికి రూ.30 లక్షల ప్రైజ్మనీ, బెంగాల్కు రూ.20 లక్షలు దక్కాయి. దీపక్ హుడా 8, అజయ్ ఠాకూర్ 4 పాయింట్లు సాధించారు. బెంగాల్ నుంచి జాంగ్ కున్ లీ 8, మహేంద్ర గణేష్ 5 పాయింట్లు సాధించారు. -
యు ముంబా జోరు
జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్లో తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ యు ముంబా ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో యు ముంబా 30-17 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. తద్వారా ఈ లీగ్లో వరుసగా ఐదో విజయాన్ని, ఓవరాల్గా ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మొదలైన తొలి క్షణం నుంచే ముంబా జట్టు తమ పట్టు బిగించింది. ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 10-2తో ముందంజ వేసి తమ ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది. విరామ సమయానికి 17-6తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు చివరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించి వారియర్స్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ముంబా జట్టులో రిషాంక్, ఫాజిల్ ఆరేసి పాయింట్లు సాధించగా... అనూప్ కుమార్ ఐదు పాయింట్లు సంపాదించాడు. బెంగాల్ జట్టులో జాంగ్ కున్ లీ ఒక్కడే కాస్త రాణించి నాలుగు పాయింట్లు స్కోరు చేశాడు. పట్నా చేతిలో జైపూర్ చిత్తు సొంత వేదికపై మ్యాచ్లను జైపూర్ పింక్ పాంథర్స్ హ్యాట్రిక్ పరాజయాలతో ముగించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 47-24 తేడాతో జైపూర్ను చిత్తుగా ఓడించింది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో జైపూర్ ఒక్కటి మాత్రమే నెగ్గింది. లీగ్లో టేబుల్ టాపర్గా ఉన్న పట్నా ఆటగాళ్ల దూకుడుకు జైపూర్ బెంబేలెత్తింది. వీరి ఖాతా తెరవడానికి ముందే పట్నా 10 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగం 5-27తో వెనుకబడిన జైపూర్ చివర్లో కాస్త పుంజుకుంది. స్కోరు 9-42గా ఉన్న దశలో రాజేశ్ నర్వాల్ (10 పాయింట్లు) రాణించడంతో చివరకు ఓమాదిరి స్కోరైనా అందుకోగలిగింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. -
పట్నా పైరేట్స్ జోరు
పట్నా: రైడింగ్లో అదరగొట్టిన పట్నా పైరేట్స్ జట్టు.... ప్రొ కబడ్డీ లీగ్లో మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 36-32తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 8 విజయాలతో 43 పాయింట్లు సాధించిన పైరేట్స్... టాప్లో కొనసాగుతోంది. బుల్స్ జట్టు రెండు విజయాలతో 13 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పైరేట్స్ క్యాచింగ్లోనూ తమ జోరు చూపెట్టింది. పట్నా ఆటగాళ్లు రోహిత్ కుమార్ (13), దీపక్ నర్వాల్ (9) సూపర్ రైడింగ్తో ప్రత్యర్థి జట్టును వణికించారు. -
బెంగాల్కు తొలి ఓటమి
* పట్నా పైరేట్స్ విజయం * ప్రొ కబడ్డీ లీగ్ కోల్కతా: వరుసగా నాలుగు విజయాలతో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్కు ప్రొ కబడ్డీ లీగ్లో తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 36-31 తేడాతో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ప్రథమార్ధం వరకు పట్నాకు బెంగాల్ గట్టిపోటీనే ఇచ్చి పాయింట్ల పరంగా 15-15తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత పట్నా ఆటగాళ్ల ఆధిపత్యం ముందు బెంగాల్ నిలవలేకపోయింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 10 రైడ్ పాయింట్లు, సందీప్ నర్వాల్ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగాల్ నుంచి నితిన్ తోమర్ 9, జంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు. -
పట్నా పైరేట్స్కు మరో విజయం
ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో ఈసారి సొంతగడ్డపై ఆడుతున్న జట్లకు అంతగా కలిసి రావడంలేదు. విశాఖపట్నంలో తెలుగు టైటాన్స్ జట్టుకు రెండు విజయాలు, రెండు ఓటములు ఎదురవ్వగా... బెంగళూరు వేదికగా బుధవారం మొదలైన పోటీల్లో ఆతిథ్య బెంగళూరు బుల్స్కు తొలి మ్యాచ్లో నిరాశ ఎదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 33-24 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు జట్టులో అమిత్ రాఠి ఒక్కడే పోరాటపటిమ కనబరిచి పది పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా ఫలితం లేకపోయింది. మరోవైపు పట్నా జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. రోహిత్ కుమార్ రెయిడింగ్లో విజృంభించి ఎనిమిది పాయింట్లు సంపాదించగా... సందీప్ నర్వాల్ ఐదు, మన్ప్రీత్ సింగ్ నాలుగు, సురేశ్ మూడు పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్ లో పుణేరి పల్టన్ 38-20 పాయింట్లతో ఢిల్లీ దబంగ్ జట్టును ఓడించింది. పుణేరి తరఫున దీపక్ హుడా 9 పాయింట్లు, మన్జీత్ చిల్లర్ 8 పాయింట్లు, సుర్జీత్ ఆరు పాయింట్లు సాధిం చగా... ఢిల్లీ తరఫున కాశీలింగ్ ఐదు, రోహిత్ మూడు పాయింట్లు సాధించారు. ఈ లీగ్లో ఢిల్లీకిది వరుసగా మూడో పరాజయం కావడం గమనార్హం. గురువారం జరిగే మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. -
ప్రొ కబడ్డీ లీగ్: ఫైనల్లో యు ముంబా
ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా యు ముంబా ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో సెమీస్ లో పట్నా పైరేట్స్పై 35-18 తేడాతో యు ముంబా విజయం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి 22-6తో పట్నాపై యు ముంబా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలోనూ అదే జోరును కొనసాగించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్లో బెంగళూరు బుల్స్ తో అమితుమీ తేల్చుకోనుంది. తొలి సెమీస్ లో తెలుగు టైటాన్స్ పై 39-38 తేడాతో బెంగళూరు బుల్స్ గెలిచిన విషయం విదితమే. లీగ్ మ్యాచ్ ల్లో అగ్రస్థానాన నిలిచిన యు ముంబా ఫైనల్ కూ దూసుకెళ్లింది. -
ప్రొ కబడ్డీ సెమీస్లో పట్నా పైరేట్స్
పుణే : ప్రొ కబడ్డీ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఈసారి లీగ్ దశతోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 26-24తో జైపూర్పై నెగ్గి సెమీస్కు చేరింది. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఇరు జట్లు బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో పట్నా వ్యూహాత్మకంగా ఆడి గెలిచింది. యు ముంబా, టైటాన్స్, బుల్స్ ఇప్పటికే సెమీస్కు చేరాయి. ఈ సీజన్లోని ఆఖరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు 31-30తో పుణేపై గెలిచింది. సెమీస్లో ఎవరితో ఎవరు ఆగస్టు 21 (శుక్రవారం) యు ముంబా x పట్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ x బెంగళూరు బుల్స్