నాయర్‌పై ప్రశంసల జల్లు | praised by on Nair | Sakshi
Sakshi News home page

నాయర్‌పై ప్రశంసల జల్లు

Dec 20 2016 12:32 AM | Updated on Sep 4 2017 11:07 PM

నాయర్‌పై ప్రశంసల జల్లు

నాయర్‌పై ప్రశంసల జల్లు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో త్రిశతకం సాధించిన కరుణ్‌ నాయర్‌పై ప్రధాని మోదీతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు.

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో త్రిశతకం సాధించిన కరుణ్‌ నాయర్‌పై ప్రధాని మోదీతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు.

‘చారిత్రక ట్రిపుల్‌ సెంచరీ సాధించినందుకు కరుణ్‌ నాయర్‌కు అభినందనలు. నీ ఘనతపై మేమంతా గర్వంగా ఫీలవుతున్నాం’.     – ప్రధాని మోదీ

‘కరుణ్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించిన క్షణాలు భారత క్రికెట్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. దేశానికి మరింత పేరు తేవాలి’.
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు)

‘నాయర్‌ సాధించిన ఫీట్‌పై స్పందించేందుకు మాటలు రావడం లేదు. అతడి బ్యాటింగ్‌ తీరు అద్భుతం’.    – కపిల్‌ దేవ్‌

‘కరుణ్, కేఎల్‌ రాహుల్‌ ఆట అసాధారణం. వీరిని చూస్తే గతంలో కర్ణాటక నుంచే వచ్చిన విశ్వనాథ్, ద్రవిడ్‌ బ్యాటింగ్‌ గుర్తుకువస్తోంది’.     – గావస్కర్‌

‘300 క్లబ్‌లోకి స్వాగతం. 12 ఏళ్ల ఎనిమిది నెలల నుంచి ఇందులో నేనొక్కడినే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్నాను. మరోసారి ఈ ఫీట్‌ సాధిస్తావనుకుంటున్నాను’.    – సెహ్వాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement