
సెమీస్లో తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో...
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్పై 35-23 తేడాతో టైటాన్స్ నెగ్గింది. ఇప్పటికే జైపూర్తో పాటు పట్నా సెమీస్కు చేరాయి. రాహుల్ 11 రైడింగ్ పాయింట్లతో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ 5 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 41-20తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది.