semi finals
-
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్రౌండ్ షో గుజరాత్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్రన్రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్రన్రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్ఫీల్డ్, తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
T20 WC 2024: ఇంగ్లండ్పై ఘన విజయం.. ఫైనల్కు టీమిండియా
India vs England 2nd Semi final Live Updates: ఫైనల్కు టీమిండియాటీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ ఆరో వికెట్ డౌన్..68 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్.. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 68/649 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లండ్49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.అదరగొట్టిన రోహిత్, సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?ఇంగ్లండ్తో సెకెండ్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారతత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లలో రెండు వికెట్లు..వరుస క్రమంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ బౌలింగ్లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంతరం శివమ్ దూబే(0) పెవిలియన్కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.సూర్యకుమార్ ఔట్...124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్..టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(39) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 77/2మ్యాచ్ తిరిగి మళ్లీ ఆరంభమైంది. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(41), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.వర్షం అంతరాయం..గయానా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(26), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..సెకెండ్ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీఅభిమానులకు గుడ్ న్యూస్అభిమానులకు గుడ్ న్యూస్. గయానాలో ఎండ కాస్తోంది. కవర్స్ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్ను పరిశీలిస్తారు.టీ20 వరల్డ్కప్-2024లో రెండో సెమీఫైనల్కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీస్లో భాగంగా గయానా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.ప్రస్తుతం వర్షం అగినప్పటకి.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాకపోవడంతో టాస్ ఆలస్యం కానుంది. -
బాధగా ఉంది.. కానీ ఇది ఆరంభం మాత్రమే! ఎవరనైనా ఓడిస్తాము: రషీద్
టీ20 వరల్డ్కప్-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్ధి జట్లను భయపెట్టిన అఫ్గాన్ జట్టు.. నాకౌట్ దశను దాటలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన అఫ్గానిస్తాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 57 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఇక ఈ ఓటమిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు."ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్రయత్నించాము. కానీ ఇక్కడి పిచ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్కు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే మా ఓటమికి ఇదే నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మనం సిద్ధంగా ఉండాలి.సౌతాఫ్రికా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్లో ఓడిపోయినప్పటకి ఈ టోర్నీలో మేము గొప్ప విజయాలు సాధించాము. ముజీబ్ ఆరంభంలోనే మా జట్టుకు దూరమైనప్పటికి మా సీమర్లు అతడి లోటును తెలియజేయలేదు. మా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జట్టునైనా ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని"పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రషీద్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్తో సెమీఫైనల్కు ముందు భారత క్రికెట్ అభిమానులను విరాట్ ఫామ్ కలవరపెడుతుంది. సెమీస్లో అయినా విరాట్ బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్ ఎలాగైనా ఫామ్లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్కప్లో విరాట్ చేసిన స్కోర్లు..ఐర్లాండ్పై 1(5)పాక్పై 4 (3)యూఎస్ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్పై 24 (24)బంగ్లాదేశ్పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్కు జతగా విరాట్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ప్రమోషన్ లభించాక విరాట్ ఐపీఎల్ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్ పేలవ ఫామ్న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 2024లో భీకర ఫామ్లో ఉండిన విరాట్ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కీలకమైన సెమీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి సెమీస్ ట్రినిడాడ్ వేదికగా రేపు (జూన్ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. -
తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భావోద్వేగాలు, సంబరాలు
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్కు చేరింది. THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.THE CELEBRATIONS FROM JONATHAN TROTT AND DWAYNE BRAVO. 💥 pic.twitter.com/KXp81jGL9J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. The joy on the face and happy tears on Afghanistan's fans. 🥹❤️ pic.twitter.com/3LOWLanIPP— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024AFGHANISTAN CELEBRATION IN TEAM BUS. 🔥- The Greatest day ever. [Bravo IG] pic.twitter.com/x3jHvdD0OZ— Johns. (@CricCrazyJohns) June 25, 2024Water brigade used on Afghanistan people to clear the road, but nobody moved. 😂🔥 pic.twitter.com/zFCnGmlTM7— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.THE CELEBRATIONS IN PAKTIA PROVINCE. 🥶🇦🇫 pic.twitter.com/5wf2wucJjv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. Celebration time pic.twitter.com/0bub4dXREP— Byomkesh (@byomkesbakshy) June 25, 2024 -
T20 World Cup 2024: సెమీస్ బెర్త్లు ఖరారు.. టీమిండియా ప్రత్యర్ధి ఎవరంటే..?
టీ20 వరల్డ్కప్ 2024లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది. తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.స్కోర్ వివరాలు..ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23) 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు) -
World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. మరో నాలుగు మ్యాచ్లే ఆడాల్సి ఉన్నప్పటికీ 6 జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్ని జట్లతో పోలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రేపటి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏ జట్టు ఏమరపాటుగా ఉన్నా సెమీస్ బెర్త్ గల్లంతవడం ఖాయం.గ్రూప్-1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సెమీస్ రేసులో ముందుంది. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్ల్లో మెరుగైన విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. సూపర్-8లో రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించినా టీమిండియాకు సైతం టెక్నికల్గా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు.ఒకవేళ భారత్.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఆసీస్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి.. ఆతర్వాత బంగ్లాదేశ్తో జరుగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ.. జరదని మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి రేపు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో గెలవాలనే టీమిండియా అనుకోవాలి.మరోవైపు ఇవాళ (జూన్ 23) ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్-1లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సెమీస్ రేసులో లేని ఆఫ్ఘనిస్తాన్.. ఆసీస్పై గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భవిష్యత్తు భారత్-ఆసీస్ మ్యాచ్పై ఆధారపడి ఉంది.ఇదిలా ఉంటే, గ్రూప్-2 సెమీస్ రేసు గ్రూప్-1 కంటే కఠినంగా ఉంది. గ్రూప్-1లో అయినా మొదటి సెమీస్ బెర్త్పై (భారత్) ఓ క్లారిటీ ఉంది. గ్రూప్-2లో అయితే అదీ లేదు. ఇప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో టాపర్గా ఉన్నా ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ అంత ఈజీగా దక్కేలా లేదు. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సౌతాఫ్రికా, విండీస్లతో పోలిస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్కు కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో చిన్న జట్టైన యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారి ప్రపంచకప్ సెమీస్ బెర్త్లు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా మారాయి. -
T20 WC 2024: బంగ్లాదేశ్పై ఘన విజయం.. సెమీస్కు టీమిండియా?
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
టైటిల్కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం ఏడు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్ను ఇచ్చారు. వరల్డ్కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
హార్ధిక్కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్లు పెడుతున్నారు. హార్ధిక్కు థ్యాంక్స్ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. హార్ధిక్ ఫిట్గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్ తమతమ స్థానాలపై కర్ఛీఫ్లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్ జట్టులో ఉంటే మూడో పేసర్గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ ఉంటే, జట్టు మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్ లేదా బ్యాటర్ వైపే చూస్తుంది. వరల్డ్కప్ ముందు వరకు చాలా మ్యాచ్ల్లో ఇదే జరిగింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్మ్యాన్ టాస్ కాయిన్ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్మార్క్ ఇన్నింగ్స్తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం. చదవండి: -
CWC 2023: టీమిండియాను ఫైనల్కు చేర్చిన రాహుల్, జడేజా.. అదేంటీ..!
క్రికెట్లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్లు పట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్లో టీమిండియా కివీస్ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. -
న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. India in the World Cup Semi Finals: 2011 - India batted first, won the game. 2015 - India batted second, lost the game. 2019 - India batted second, lost the game. 2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc — Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023 కాగా, వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్కు చేరి ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయింది. ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
కలవరపెడుతున్న కోహ్లి ట్రాక్ రికార్డు.. పొంచి ఉన్న ప్రమాదం
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) తొలి సెమీఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొమ్మిది వరుస విజయాలు సాధించి భీకర ఫామ్లో ఉన్నప్పటికీ.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనవాళ్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ.. కివీస్ను వారిదైన రోజున ఓడించడం అంత తేలక కాదు. మెజార్టీ శాతం సానుకూలతల నడుమ టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్కప్ సెమీఫైనల్స్లో కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు. ప్రస్తుత టోర్నీలో అత్యుత్తమ ఫామ్లో ఉండి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతూ దాదాపు ప్రతి మ్యాచ్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లి వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్ అనగానే చతికిలబడతాడు. ఇప్పటివరకు కోహ్లి ఆడిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఇదే జరిగింది. మూడు సెమీఫైనల్స్లో కలిపి కోహ్లి చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 2011 ఎడిషన్లో పాక్తో జరిగిన సెమీస్లో 9 పరుగులు చేసిన కోహ్లి.. 2015లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు.. అనంతరం 2019 ఎడిషన్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్లో కోహ్లి ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే ఔట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్లో కోహ్లికి ట్రెంట్ బౌల్ట్ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కోహ్లికి బౌల్ట్ బౌలింగ్లో ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. దీనికి తోడు సెమీఫైనల్ ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఏమేరకు రాణించగలడో అని భారత అభిమానులు కలవరపడుతున్నారు. ఈ అంశం యావత్ భారత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. -
CWC 2023 IND VS NZ Semi Final: ఏకైక మొనగాడు విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్కప్లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం. ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్లు (ప్రస్తుత వరల్డ్కప్తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్పై) నెగ్గి ఫైనల్స్కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్గా నిలిచింది. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్డాగ్స్గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్తో సెమీస్లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా..?
వన్డే వరల్డ్కప్ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్కప్లో ఇదివరకే (లీగ్ దశలో) న్యూజిలాండ్ను ఓసారి ఖంగుతినిపించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ సైతం ప్రస్తుత వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్కు స్వర్గధామం.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్పై మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో భారత్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్లో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ అత్యంత కీలకం.. ఈ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటుంది. భారత్దే పైచేయి.. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్పై భారత్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. వరల్డ్కప్లో కివీస్దే ఆధిక్యత.. వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. సెమీస్లో వరుసగా రెండోసారి.. భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్కప్ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్ల బలాలు, బలహీనతలు.. ప్రస్తుత వరల్డ్కప్లో ఫామ్ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్ టచ్లో ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్గా చూస్తే, ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై గెలిచి సెమీస్కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్కు చేరిన కివీస్ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్ రవీంద్ర, అడపాదడపా డారిల్ మిచెల్ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం వరకు న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ కాన్వే వైఫల్యాలు కివీస్ను కలవరపెడుతున్నాయి. -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023: పాక్ సెమీస్కు చేరి భారత్తో తలపడాలంటే ఇలా జరగాలి..
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్లు మరోసారి (సెమీస్లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్, తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. పాక్ సెమీస్కు చేరి, భారత్తో తలపడాలంటే ఈ ఈక్వేషన్తో పాటు మరో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే.. న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్ 10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. నాలుగో ప్లేస్లో ఉన్న పాక్ సెమీస్లో తలపడతాయి. అయితే ఇలా జరగడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఒకవేళ పాక్.. ఇంగ్లండ్పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుని భారత్తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్పై విజయం సాధించి, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ఎలిమినేషన్కు గురి కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నడుస్తుంది. -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలుత పసికూన నెదర్లాండ్స్తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్కప్లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోతే పాక్కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లపై గెలుపొందితే.. పాకిస్తాన్తో పాటు రన్రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc) -
పీవీ సింధు ఓటమి.. సెమీస్కు చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్కు చేరుకున్నాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్ను మాత్రం సులువుగానే నెగ్గింది. చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
సెమీస్కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో మహిళల టెన్నిస్ నెంబర్వన్ ఇగా స్వియాటెక్ సెమీస్కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
మహిళల టీ20 వరల్డ్కప్.. సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడబోతున్నారంటే..?
8వ మహిళల టీ20 వరల్డ్కప్ చివరి దశకు చేరింది. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ ఆస్ట్రేలియా.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్లో గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్.. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్టౌన్లో జరుగనున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్కప్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క ఓటమిని మూటగట్టుకుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత విండీస్, ఐర్లాండ్ జట్లను ఓడించారు. మిగతా జట్ల విషయానికొస్తే.. సెమీస్లో భారత్ ప్రత్యర్ధి ఆసీస్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికా) విజయం సాధించగా.. గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్ కూడా 4కు నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అజేయ జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. సఫారీ టీమ్.. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, 2 అపజయాలు మూటగట్టుకుంది. మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8వ ఎడిషన్ కొనసాగుతుంది. 2009లో జరిగిన తొలి ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా నిలువగా.. 2010, 2012, 2014 ఎడిషన్లలో ఆసీస్ విజేతగా నిలిచి హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. మధ్యలో 2016లో వెస్టిండీస్ జగజ్జేతగా నిలువగా.. ఆ తర్వాత 2018, 2020 ఎడిషన్లలో ఆసీస్ వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్కప్లో విజయం సాధిస్తే ఆసీస్ డబుల్ హ్యాట్రిక్ నమోదు చేస్తుంది. 2020 ఎడిషన్లో భారత్.. ఫైనల్కు చేరి ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్కు చేరింది. మధ్యప్రదేశ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సెమీస్లో బెంగాల్.. మధ్యప్రదేశ్ను ఢీకొంటుంటే, రెండో సెమీస్లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది. -
2024 సెమీఫైనల్స్: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్కు కీలకం కానున్నాయి. ► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. ► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. ► మధ్యప్రదేశ్: 2023 నవంబర్-డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్నాథ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ► ఛత్తీస్గఢ్-రాజస్థాన్: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
సూర్యకుమార్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్కప్లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
Guinness World Records: టీ20 వరల్డ్కప్-2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దారుణంగా అవమానించింది. ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి అంశంలో అత్యుత్తమ, అతి దారుణమైన విశేషాలను తమ రికార్డుల్లో నమోదు చేసే ఈ సంస్థ.. నవంబర్ 10న ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అతి దారుణంగా వర్ణిస్తూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య ఛేదన అంటూ ట్వీట్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ఆ సంస్థను ఓ ఆటాడుకుంటున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చారని భారత క్రికెటర్లను వెనకేసుకొస్తున్నారు. Easiest run chase in history? 👀#INDvsENG — Guinness World Records (@GWR) November 10, 2022 ఇంత కంటే దారుణ పరాజయాలు క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయని రివర్స్ కౌంటరిస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. యూకే సంస్థ కాబట్టి, గొప్పలకు పోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్లో పాక్పై ఎలా గెలవాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ సలహాలిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్లో టీమిండియా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, అదృష్టం కలిసి రాక సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-12 దశలో ఒక్క దక్షిణాఫ్రికాతో మినహా అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు చేరిన భారత్.. సెమీస్లో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఛేదనలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్ (50), హార్ధిక్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (80), హేల్స్ (86) అజేయమైన అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..! -
నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడా..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిందిస్తున్నారు. సోషల్మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు. అసలు వరల్డ్కప్లో, ముఖ్యంగా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం. బౌలింగ్లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్ బ్యాటింగ్లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్ ఓపెనర్ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడగల శ్రేయస్ అయ్యర్ను కాదని దీపక్ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్ లాంటి నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను గుర్తించలేకపోవడం, ఫినిషర్ అంటూ దినేశ్ కార్తీక్ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్ కాని అశ్విన్ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్కు న్యాయం చేయలేని అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది. వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్కప్కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్ టాలెంట్ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు. ఆస్ట్రేలియా పిచ్లకు సూటయ్యే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి. అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్ను, సీనియర్ ఆటగాళ్లను, కోచ్ను టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది. చదవండి: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..? -
IND VS ENG: అనుకున్నదే అయ్యింది.. ఆ ఇద్దరు ఔట్
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ముందు అనుకున్న విధంగానే ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కీలకమైన మ్యాచ్కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహాయించి.. శ్రీలంకపై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ యధాతథంగా కొనసాగించింది. ఇంగ్లండ్ విజయావకాశాలను ప్రభావితం చేయగల మలాన్, వుడ్ జట్టులో లేకపోవడంతో ఇంగ్లండ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. జింబాబ్వేపై బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. దీంతో రిషబ్ పంత్కు మరో అవకాశం దక్కినట్లైంది. జట్ల వివరాలు.. టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ -
రోహిత్ మెరవాలి, కోహ్లి చెలరేగాలి, సూర్య దంచికొట్టాలి..!
టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఇవాళ (నవంబర్ 10) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గటంలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొంది, ఫైనల్లో పాక్ను కూడా మట్టికరిపించి, టైటిల్ సొంతం చేసుకోవాలని వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కీలకమైన ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తమ సహజమైన ఆట ఆడి ఇంగ్లండ్ ఆట కట్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ధైర్యంగా ఆడండి మీవెనక 130 కోట్ల మంది భారతీయులున్నారంటూ భరోసానిస్తున్నారు. చాలా మంది అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లు చెలరేగాలని దేవుళ్లకు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కాస్తా మెరుగ్గానే ఉందని, బౌలర్లు ఈ మ్యాచ్లో సత్తా చాటేలా వారికి శక్తిని ప్రసాదించాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. అలాగే, రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంతకాలంగా ఫామ్లో లేని హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో మెరవాలని, కోహ్లి ఎప్పటిలాగే చెలరేగాలని, సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ బౌలర్లను దండికొట్టాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో దినేశ్ కార్తీక్, పంత్లలో ఎవరు ఆడినా ఫామ్లోకి రావాలని, ముఖ్యంగా స్పిన్నర్లు తమ పాత్రలను న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. భారతీయ అభిమానుల ఆకాంక్షలు, కోరికలు, ప్రార్ధనలతో సోషల్మీడియా హోరెత్తుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నవంబర్ 13న పాక్తో టైటిల్ పోరులో తలడపనుంది. -
టీమిండియాపై ఇంగ్లండ్దే విజయం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు. -
IND VS ENG: సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు. ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్తో టైటిల్ పోరులో తలపడనుంది. -
సూర్యకుమార్ నన్ను చంపేశాడు.. మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్పై ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా రేపు (నవంబర్ 10) భారత్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్లో సూర్యకుమార్ ఊచకోతను గుర్తు చేసుకుంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్లో జరిగిన ఓ మ్యాచ్లో తన తొలి టీ20 సెంచరీ బాదిన సూర్య.. ఆ మ్యాచ్లో తనను చంపేశాడని, నాటి భయానక ఇన్నింగ్స్ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో శివాలెత్తిన సూర్యకుమార్.. తనను మరే బ్యాటర్ భయపెట్టని విధంగా భయపెట్టాడని అన్నాడు. అదృష్టవశాత్తు అతను అలసిపోయి తన బౌలింగ్లోనే ఔట్ కావడంతో ఊపరిపీల్చుకున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ ఆడిన షాట్లు అత్యద్భుతమని, క్రికెట్లో తాను చూసిన షాట్లలో అవే అత్యుత్తమమని, ఇప్పటికీ అవి తన కళ్లముందే మెదులుతున్నాయని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే తనకు సూర్యకుమార్ అంటే ఏంటో అర్ధమైందని, ఇప్పుడు అతనింకా రాటుదేలాడని, ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడని కొనియాడాడు. ఒక్కసారి అతను క్రీజ్లో కుదురుకున్నాక బౌలింగ్ చేయడం ఎంతటి బౌలర్కైనా చాలా కష్టమని, క్రికెట్ చరిత్రలో ఇలా బౌలర్లను భయపెట్టే బ్యాటర్లలో సూర్యకుమార్ ముందు వరుసలో ఉంటాడని ఆకాశానికెత్తాడు. ఏబీడీ తర్వాత మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అన్న పేరుకు సూర్యకుమార్ వంద శాతం అర్హుడని, రేపు తమతో జరుబోయే సెమీస్ మ్యాచ్లో అతను శాంతంగా ఆడాలని ఆశిస్తున్నానని అన్నాడు. సెమీస్లో టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ.. అండర్ డాగ్స్గా బరిలోకి దిగే తమను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. చదవండి: '360 డిగ్రీస్' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్ -
ఇంగ్లండ్తో సమరం.. అన్నింటా టీమిండియాదే పైచేయి.. రికార్డులే సాక్ష్యం
ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 10) జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియానే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ అభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం అంచనా వేస్తుంది. వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఒక కారణమైతే.. గత రికార్డులు మరో కారణం. బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్లు వరుస హాఫ్సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తమ పాత్రలను న్యాయం చేస్తూ టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్కు, అనూకూలంగా ఉన్న గత రికార్డులు తోడవ్వడంతో టీమిండియాదే విజయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ ముఖా ముఖి పోరులో ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో ఇంగ్లండ్కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది. ఈ రికార్డులే కాక, అడిలైడ్లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే వేదికపై బంగ్లాదేశ్పై విజయం, ఈ ప్రపంచకప్లో ఇంగ్లండ్కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మరోపక్క టీమిండియాను కూడా మూడు సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్ శర్మ ఫామ్, దినేశ్ కార్తీకా లేక రిషబ్ పంతా అని ఎటూ తేల్చుకోలేకపోవడం, స్పిన్నర్ల వైఫల్యం.. ఈ మూడు అంశాలు టీమిండియాకు అందోళన కలిగిస్తున్నాయి. రేపటి మ్యాచ్లో భారత్.. ఈ మూడింటిని అధిగమించగలిగితే టీమిండియాను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. చదవండి: అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..! -
అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..!
అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు (నవంబర్ 10) జరుగబోయే టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్లో తలమునకలై ఉన్నాయి. రేపటి సంగ్రామంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగనుందని క్రికెట్ అభిమనాలు అంచనా వేస్తున్నారు. ఇక, మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ విషయానికొస్తే.. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికపై టీమిండియా తురుపుముక్క కింగ్ కోహ్లికి భీభత్సమైన రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్ అంటేనే కింగ్ను పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్, ప్రస్తుత వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్కప్లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. చదవండి: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి -
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్లో గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?
టీ20 వరల్డ్కప్-2022 తొలి సెమీఫైనల్లో రేపు (నవంబర్ 9) న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ సమరంలో ఇరు జట్లు కత్తులు దూసుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ సెమీస్కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. రెండో సెమీస్లో భారత్.. ఇంగ్లండ్ను ఢీకొట్టనుండటంతో పాక్-కివీస్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలన్న ఆతృత భారతీయ అభిమానుల్లో పెరిగింది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాక్ గెలిచి, ఇంగ్లండ్పై టీమిండియా గెలిస్తే.. ఫైనల్లో దాయదాల రసవత్తర సమరాన్ని వీక్షించవచ్చన్నదే టీమిండియా ఫ్యాన్స్ ఆకాంక్ష. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్లో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టీమిండియా ఫ్యాన్స్ అయితే పాక్ తప్పక గెలిచి, ఫైనల్లో తమతో తలపడాలని ఆశపడుతున్నారు. బలాబలాలు, రికార్డులతో సంబంధం లేకుండా పాకే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు కివీస్-పాక్ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్కప్లో ఇరు జట్లు 6 సందర్భాల్లో ఎదురెదురు పడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించాయి. గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే నెగ్గింది. మరోవైపు వన్డే, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ల్లో పాక్కు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమన్నదే లేదు. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది. 1992 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం, 1999 వరల్డ్కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం, 2007 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లెక్కన టీ20ల్లో న్యూజిలాండ్పై పాక్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. చదవండి: కెప్టెన్గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా -
రోహిత్ సహా కెప్టెన్లంతా తుస్సుమనిపించారు.. అతనైతే మరీ దారుణం..!
టీ20 వరల్డ్కప్-2022 తుది అంకానికి చేరింది. మరో మూడు మ్యాచ్లు జరిగితే టోర్నీ సమాప్తమవుతుంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా రేపు (నవంబర్ 9) తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుండగా.. అడిలైడ్ వేదికగా ఎల్లుండి (నవంబర్ 10) భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్లు నవంబర్ 13న టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఇదిలా ఉంటే, సూపర్-12 దశలో సెమీస్కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఆయా జట్లను తీవ్రంగా కలవరపెడుతుంది. జట్టును ముందుండి నడిపించే సారధులే వరుస వైఫల్యాల బాట పడుతుండటాన్ని సంబంధిత జట్ల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్లే విఫలమవుతుంటే, తమ జట్లు ఏరకంగా టైటిల్ సాధిస్తాయని వారు వాపోతున్నారు. కెప్టెన్ అనే వాడు ఒక మ్యాచ్లో కాకపోతే మరో మ్యాచ్లోనైనా రాణించి జట్లకు మార్గదర్శకంగా ఉంటే టైటిల్ సాధించవచ్చని భావిస్తున్నారు. వరల్డ్కప్-2022లో సెమీస్కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల గణాంకాలకు పరిశీలిస్తే.. నలుగురిలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాస్తో కూస్తో బెటర్ అనిపిస్తుంది. కేన్ మామ.. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 61గా ఉంది. విలియమ్సన్ తర్వత గుడ్డిలో మెల్లలా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రదర్శన కాస్త మేలనిపిస్తుంది. బట్లర్ 4 ఇన్నింగ్స్ల్లో 73 అత్యధిక స్కోర్తో 119 పరుగులు సాధించాడు. మన హిట్మ్యాన్ విషయానికొస్తే.. రోహిత్ ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 53 అత్యధిక స్కోర్తో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. నలుగురు కెప్టెన్లలో అత్యంత దారుణమైన ప్రదర్శన అంటే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్దేనని చెప్పాలి. బాబర్ 5 ఇన్నింగ్స్ల్లో 25 అత్యధిక స్కోర్తో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. సెమీస్కు చేరిన నాలుగు జట్లలో న్యూజిలాండ్, టీమిండియా మినహాయిస్తే, మిగిలిన రెండు జట్లలో ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఒకరో ఇద్దరో రాణించడంతో ఇంగ్లండ్.. అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్కు చేరాయి. కివీస్, టీమిండియాల్లో మాత్రం బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి వారివారి జట్లను సెమీస్కు చేర్చారు. చదవండి: టీమిండియాతో సెమీస్కు ముందు ఇంగ్లండ్కు మరో బిగ్ షాక్..! -
టీమిండియాతో సెమీస్కు ముందు ఇంగ్లండ్కు మరో బిగ్ షాక్..!
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న టీమిండియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా స్టార్ పేసర్ మార్క్ వుడ్ జనరల్ స్టిఫ్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం కారణంగా వుడ్ ప్రాక్టీస్కు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వుడ్ సమస్య అంత పెద్దదేమీ కాకపోయినప్పటికీ.. ఇండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది ఇంగ్లీష్ టీమ్ను కలవరపెడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్లో సూపర్ ఫామ్లో వుడ్.. టీమిండియాతో మ్యాచ్ సమయానికి ఫిట్గా లేకపోతే, ఆ ప్రభావం కచ్చితంగా జట్టు విజయావకాశాలపై పడుతుందని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ కంగారు పడుతుంది. ఒకవేళ వుడ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే.. అతనికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తైమాల్ మిల్స్కు తుది జట్టులో అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా, వరల్డ్కప్-2022లో వుడ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి మాంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి అతికష్టం మీద సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్కు నిన్న (నవంబర్ 7) కూడా ఓ భారీ షాక్ తగిలింది. కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన సెమీస్ డిసైడర్ మ్యాచ్లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు మలాన్ స్థానాన్ని ఫిలిప్ సాల్ట్తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్లను టీమిండియా బౌలర్లు అడ్డుకోగలరా..?
టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా సెమీస్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఎన్నడూ లేని నెర్వస్నెస్ మొదలైంది. గతంలో మెగా టోర్నీల ఫైనల్ మ్యాచ్ల్లోనే నింపాదిగా వ్యవహరించిన భారతీయ అభిమానులు.. ఈ సారి సెమీస్ మ్యాచ్కే తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇందుకు.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి తొమ్మిదేళ్లవుతుందన్న కారణమొకటైతే, రెండోది ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు భీకర ప్రదర్శన. వాస్తవంగా చెప్పాలంటే.. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతున్నామన్న కారణం కంటే, అరివీర భయంకరమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ టీమిండియా అభిమానులను అధికంగా భయపెడుతుంది. తమదైన రోజున అడ్డూ అదుపూ లేకుండా శివాలెత్తిపోయే ఇంగ్లీష్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు నిలువరించగలరా అన్న సందేహం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేయగలరా అని ఫ్యాన్స్ సందేహా పడుతున్నారు. మేటి బౌలింగ్ను సైతం తునాతునకలు చేసే ఈ బ్యాటింగ్ యోధుల ధాటికి అంతంతమాత్రంగా ఉన్న ఉన్న భారత బౌలింగ్ తట్టుకోగలదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా లాంటి బౌలర్ ఉంటే, టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని అనుకుంటున్నారు. షమీ, అర్షదీప్, భువీ, అశ్విన్, హార్ధిక్లతో కూడిన భారత బౌలింగ్ లైనప్ బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. మెరుపు ఇన్నింగ్స్లతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లకు కళ్లెం వేయగలదా లేదా అని లోలోపల మధన పడిపోతున్నారు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఇంగ్లండ్ బ్యాటర్ల పప్పులేమీ ఉడకవని తమకు తామే సర్ధి చెప్పుకుంటున్నారు. ఒకవేళ స్పిన్నర్లు తేలిపోయినా పేసర్లు అర్షదీప్, షమీ, భువీ, హార్ధిక్ మంచి ఫామ్లోనే ఉన్నారని, వీరి ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు తట్టుకోలేరని ధైర్యం చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుత ప్రపంచకప్లోఇంగ్లండ్ బ్యాటర్ల ఫామ్ టీమిండియా అభిమానులు భయపడేంత ఏమీ లేదన్నది కాదనలేని నిజం. ఒకటి, అరా ఇన్నింగ్స్ల్లో బట్లర్, హేల్స్ రాణించారే తప్పిస్తే.. అరివీర భయంకరులుగా చెప్పుకునే బ్యాటర్లంతా దాదాపు ప్రతి మ్యాచ్లో తస్సుమినిపించారు. ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్.. ఏదో అదృష్టం కలిసి వచ్చి, బౌలర్ల పుణ్యమా అని అతికష్టం మీద సెమీస్కు అర్హత సాధించింది. ఇంగ్లీష్ జట్టు ఈ ఫామ్ను చూసి టీమిండియా అభిమానులు కంగారు పడనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
T20 WC 2022: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. టీమిండియానే విజేత!
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్లకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్-పాకిస్తాన్, ఆ మరుసటి రోజు (నవంబర్ 10) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు సెమీఫైనల్ మ్యాచ్లతో పాటు మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్కు కూడా రిజ్వర్ డే ఉంది. ఒకవేళ సెమీస్, ఫైనల్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్) మాత్రం గ్రూప్లో టేబుల్ టాపర్గా ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్లో న్యూజిలాండ్, రెండో సెమీస్లో భారత్ ఫైనల్కు చేరతాయి. అదే ఫైనల్ విషయానికొస్తే.. టైటిల్ డిసైడర్ మ్యాచ్ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
సెమీస్కు ముందు టీమిండియాను వేధిస్తున్న ఆ నలుగురి సమస్య..!
నవంబర్ 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు నలుగురు ప్లేయర్ల ఫామ్ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. ఆ నలుగురిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత వరల్డ్కప్లో రోహిత్తో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్లకు వరుసగా అవకాశలు ఇచ్చినా, సామర్ధ్యం మేరకు రాణించలేక ఘోర వైఫల్యాలు చెందడం మేనేజ్మెంట్తో పాటు అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. రోహిత్ను మినహాయించి సెమీస్లో పై ముగ్గురిని తప్పించాలన్నా టీమిండియాకు ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది. ప్రపంచకప్-2022లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 89 పరుగులు (4, 53, 15, 2, 15) మాత్రమే చేసి పేలవ ఫామ్లో ఉండగా, దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్లోనూ వికెట్కీపింగ్లోనూ దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఫినిషర్ కోటాలో జట్టుకు ఎంపికైన డీకే.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోగా, బ్యాటింగ్ ఓనమాలు కూడా మరిచి వరుస వైఫల్యాల బాటపట్టాడు. వరల్డ్కప్లో అతనాడిన 4 మ్యాచ్ల్లో కేవలం 14 పరుగులు (1, 6, 7), 4 క్యాచ్లు మాత్రమే అందుకుని అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో సెమీస్లో డీకేకు తిప్పించి పంత్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ల విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. ఆల్రౌండర్ కోటాలో 4 మ్యాచ్లు ఆడే అవకాశం దక్కించుకున్న అక్షర్.. అవకాశం వచ్చినా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ (3 వికెట్లు) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో పాటు ధారళంగా పరుగులు సమర్పించుకోవడం మరింత కలవరానికి గురి చేస్తుంది. స్పిన్నర్ విషయంలో టీమిండియాకు చహల్ రూపంలో మరో చాయిస్ ఉన్నా మేనేజ్మెంట్ దాన్ని ఉపయోగించుకునేందుకు సాహసించలేకపోయింది. వీరిద్దరి వైఫల్యాలపై నజర్ వేసిన యాజమాన్యం.. స్పిన్కు అనుకూలించే అడిలైడ్ పిచ్పై (సెమీస్చ వేదిక) ఏ మేరకు మార్పులు చేస్తుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం.. స్పిన్ పిచ్ అంటున్నారు కాబట్టి అశ్విన్ను కొనసాగించి, అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇంగ్లండ్తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు. వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
ఆ అంపైర్ లేడు.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే..!
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్ 7) విడుదల చేసింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా మరయిస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్బొరో, మైఖేల్ గాఫ్లు థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించబడ్డారు. ఈ మ్యాచ్కు రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నాడు. ఇక, నవంబర్ 10న అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. కుమార ధర్మసేన, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా.. క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. We are saved 🙏 pic.twitter.com/pi4LewhFiv — Dere (@Der1x_) November 7, 2022 ఇదిలా ఉంటే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు అచ్చిరాని అంపైర్గా ముద్రపడ్డ రిచర్డ్ కెటిల్బొరో ఇంగ్లండ్తో మ్యాచ్కు ఐసీసీ ప్రకటించిన అఫీషియల్స్ జాబితాలో లేకపోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రతికిపోయాం రా బాబు.. ఇక, టీమిండియా ఫైనల్కు చేరడం ఖాయమంటూ సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కెటిల్బొరో అంపైర్గా లేడు కాబట్టి.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే, ఇంగ్లండ్పై గెలుపు మనదే, ఫైనల్కు ఎవరు వచ్చినా టీమిండియా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి పరోక్ష కారణమైన కెటిల్బొరో లేడు కాబట్టి రోహిత్ సేన విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. కాగా, 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్ కెటిల్బొరో అంపైర్గా వ్యవహరించిన (భారత్ ఆడిన మ్యాచ్లు) ప్రతి నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. కెటిల్బొరో ఫీల్డ్ అంపైర్గా లేదా థర్డ్ అంపైర్గా వ్యవహరించిన.. 2014 టీ20 వరల్డ్కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్కప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ల్లో టీమిండియా దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో కెటిల్బొరోపై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. -
అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్!
టి20 ప్రపంచకప్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్ అనూహ్యంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై సంచలన విజయాలు సాధించి సెమీస్లో అడుగుపెట్టగా.. కచ్చితంగా సెమీస్కు వెళుతుందనుకున్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తయ్యి లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా, పాకిస్తాన్లు సెమీఫైనల్కు వెళ్లడంపై ఇరుదేశాల అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్లు తలపడితే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మాములుగానే ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటేనే ఫుల్ జోష్ ఉంటుంది. అలాంటిది ఈ రెండు జట్లు ఒక మెగాటోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయంటే ఎంత హైవోల్టేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 తొలి ఎడిషన్ టి20 ప్రపంచకప్లో ఫైనల్లో పాకిస్తాన్పై విజయం సాధించిన టీమిండియా చాంపియన్గా అవతరించింది. అయితే సెమీస్లో టీమిండియా ఇంగ్లండ్తో, పాకిస్తాన్ న్యూజిలాండ్తో అమితుమీ తేల్చుకోనున్నాయి. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ను దెబ్బతీయడం టీమిండియాకు సవాల్ అయితే.. భీకరమైన ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ను ఓడించాలంటే పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే న్యూజిలాండ్కు నాకౌట్ ఫోబియా ఉండడం పాక్కు కలిసిరానుంది. అప్పటివరకు దుమ్మురేపే న్యూజిలాండ్ నాకౌట్ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది. ఇప్పటికే 2015, 2019, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా ఫైనల్స్లోనే ఓడి రన్నరప్గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకు బలంగా తయారవుతూ వస్తుంది. ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ దాకా బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించాలంటే టీమిండియా తన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఏమో అన్ని కలిసొస్తే టీమిండియా, పాక్లు ఫైనల్లో తలపడితే చూడాలని సగటు అభిమాని బలంగానే కోరుకుంటున్నాడు. చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్కు శాపం -
రాణించిన నెదర్లాండ్స్ బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 6) అత్యంత కీలకమైన మ్యాచ్లు జరుగనున్నాయి. తొలుత సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, ఆతర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్, భారత్-జింబాబ్వే జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్ రేసులో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లకు ఈ మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. అడిలైడ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్మన్ (41 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం ఇదే వేదికపై 9:30 గంటలకు పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెమీస్ బెర్త్పై అరకొర ఆశలున్న పాకిస్తాన్ ఈ మ్యాచ్లో తప్పనసరిగా గెలవాల్సి ఉంది. ఇక, భారత్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే, గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్తుంది. -
T20 WC 2022: గండాలు దాటి.. నేరుగా టీమిండియా!
అప్డేట్: సూపర్-12లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఓడించడంతో టీమిండియా నేరుగా సెమీస్కు చేరుకుంది. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి పాకిస్తాన్ కూడా భారత్తో పాటు గ్రూప్-2 నుంచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఇక మిగిలింది గ్రూప్-2 బెర్త్లు. ఈ గ్రూప్ నుంచే ముందుగా సెమీస్ బెర్త్లు ఖరారవుతాయనుకుంటే, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనూహ్య విజయాలు సాధించి సెమీస్ రేసును రసవత్తరంగా మార్చాయి. రేపు (నవంబర్ 6) జరుగబోయే మ్యాచ్లతో ఈ గ్రూప్ సెమీస్ బెర్తులపై క్లారిటీ రానుంది. ప్రస్తుత సమీకరణలు, ఆయా జట్ల ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే.. రేపు జరుగబోయే మ్యాచ్ల్లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ను, భారత్.. జింబాబ్వేను, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై విజయాలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్ల్లో సౌతాఫ్రికా, టీమిండియా విజయాలు సాధిస్తే, ఆఖరి మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రూప్-2 నుంచి అగ్రస్థానంలో భారత్, రెండో స్థానంతో సౌతాఫ్రికా సెమీస్కు చేరతాయి. పాకిస్తాన్ ఇంటిబాట పడుతుంది. రేపటి మ్యాచ్ల్లో నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లతో ఏదో ఒకటి సంచలన విజయం సాధిస్తే తప్పా.. పై సమీకరణల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాగా, ఫైనల్ ఫోర్ జట్లపై ఓ అంచనాకు రావడంతో సెమీస్లో ఏయే జట్లు తలపడబోతున్నాయన్న అంశంపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా సెమీస్ చేరితే ఏ జట్టుతో తలపడాల్సి వస్తుందో అన్న టెన్షన్ ఫ్యాన్స్లో ఇప్పటినుంచే మొదలైంది. గ్రూప్-1 బెర్తులు ఎలాగూ ఖరారయ్యాయి కాబట్టి భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్లలో ఏదో ఒక జట్టుతో తలపడాల్సి ఉంటుంది. రేపటి మ్యాచ్లో టీమిండియా.. జింబాబ్వేపై గెలిస్తే ఇంగ్లండ్తో, ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే న్యూజిలాండ్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
జింబాబ్వేతో కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే క్రమంలో రేపు (నవంబర్ 6) జింబాబ్వేతో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. మ్యాచ్కు వేదిక అయిన మెల్బోర్న్లో వర్షం పడే సూచనలు లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్లో పేర్కొంది. ఇదే వేదికపై గతవారం మూడు మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొని ఉండింది. అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) మెల్బోర్న్లో వాతావరణం క్లియర్గా ఉంటుందని, టెంపరేచర్ 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలుస్తే.. ఈ గ్రూప్లో అగ్రస్థానంతో సెమీస్కు వెళ్తుంది. మరోపక్క టీమిండియాతో పాటు సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లు సైతం రేపే తమ ఆఖరి సూపర్-12 మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. రేపు ఉదయం 5:30 గంటలకు నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీస్కు అర్హత సాథిస్తుంది. ఉదయం 9:30 గంటలకు జరుగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా దాయాది జట్టు సెమీస్ అవకాశాలు భారత్, దక్షిణాఫ్రికాల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. -
మరో రసవత్తర సమరం.. సెమీస్కు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకు శృంగభంగం
టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్ 5) జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే సెమీస్కు చేరాలని భావించిన ఆసీస్.. ఇంగ్లండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
T20 WC 2022: అదే జరిగింది.. భారత్, పాక్ సెమీస్కు..!
అప్డేట్: ఐసీసీ ప్రపంచకప్-2022 సూపర్-12లో ఆఖరి రోజైన ఆదివారం (నవంబరు 6) నెదర్లాండ్స్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో టీమిండియా నేరుగా సెమీస్కు అర్హత సాధించగా.. నామమాత్రపు మ్యాచ్లో జింబాబ్వేపై ఘన విజయం నమోదు చేసింది. మరోవైపు పాకిస్తాన్.. బంగ్లాదేశ్ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ICC Mens T20 World Cup 2022 : టీ20 వరల్డ్కప్-2022 కీలక దశకు చేరింది. గ్రూప్-1 నుంచి తొలి సెమీస్ బెర్త్ (న్యూజిలాండ్) ఇదివరకే ఖరారు కాగా, శనివారం రెండో స్థానంపై క్లారిటీ వచ్చింది. శ్రీలంకతో కీలక మ్యాచ్లో గెలుపొందిన ఇంగ్లండ్ సెమీస్లో అడుగుపెట్టింది. లంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన బట్లర్ బృందం.. గ్రూప్-1 నుంచి రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-2 విషయానికొస్తే.. తొలుత ఈ గ్రూప్ నుంచి సెమీస్ బెర్త్లు ఈజీగా ఫైనల్ అవుతాయని అంతా ఊహించారు. అయితే చిన్న జట్లైన జింబాబ్వే, బంగ్లాదేశ్ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురుకావడంతో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో ఇప్పటివరకు (నవంబర్ 5) అన్ని జట్లు చెరో 4 మ్యాచ్లు ఆడగా.. నెదర్లాండ్స్ అధికారికంగా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. పోతే.. సెమీస్ రేసులో మిగిలింది మూడు జట్లు. భారత్ (6 పాయింట్లు, +0.730), సౌతాఫ్రికా (5 పాయింట్లు, +1.441), పాకిస్తాన్ (4 పాయింట్లు, +1.117). ప్రస్తుత సమీకరణలు, అంచనాల ప్రకారమయితే భారత్, సౌతాఫ్రికా సునాయాసంగా సెమీస్కు అర్హత సాధిస్తాయి. భారత్, దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్ల్లో ఎదుర్కొనబోయే జట్లు (జింబాబ్వే, నెదర్లాండ్స్) చిన్నవి కాబట్టి, పై సమీకరణలు వర్కౌట్ అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగి.. సెమీస్ రేసులో ఉన్న మరో జట్టు పాక్.. తమ ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే, పరిస్థితులు తలకిందులై ఏవైనా సంచలనాలు నమోదైందయ్యాయంటే మాత్రం అన్నీ ఒక్కసారిగా తారుమారవుతాయి. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడినా, భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. ఇవి జరిగి పాక్.. బంగ్లాపై భారీ విజయం సాధిస్తే.. గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరే తొలి జట్టుగా పాకిస్తాన్, రెండో జట్టుగా భారత్ నిలుస్తాయి. ఒకవేళ సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్పై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచి, టీమిండియా.. జింబాబ్వే చేతిలో ఓడిందా సౌతాఫ్రికా, పాక్లు సెమీస్కు వెళ్తాయి. ఇన్ని సమీకరణల నడుమ గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుందోనన్నది ఆసక్తికరంగా మరింది. -
పాక్కు మరోసారి టీమిండియానే దిక్కు
టి20 ప్రపంచకప్లో భాగంగా గ్రూప్-2 సమీకరణాలు ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. గురువారం సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ ఒక్కసారిగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్కు సెమీస్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్కు వెళ్లాలన్న టీమిండియా, సౌతాఫ్రికాలపై ఆధారపడాల్సిందే. జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి.. సౌతాఫ్రికా నెదర్లాండ్స్తో చేతిలో ఓడితేనే పాక్కు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ వర్షంతో ఆగిపోయినా అప్పుడు కూడా ఇంటికి వెళ్లేది పాకిస్తాన్ జట్టే. కాబట్టి ఎటు చూసుకున్నా పాకిస్తాన్కు టీమిండియానే పెద్దదిక్కులా కనిపిస్తుంది. ఇక జింబాబ్వే, టీమిండియా మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువగా భారత్కే ఉన్నాయి. అయితే ఈ ప్రపంచకప్లో జింబాబ్వే పాకిస్తాన్కు షాక్ ఇవ్వడంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ను టీమిండియా సీరియస్గా తీసుకొని ఆడితే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చదవండి: అరుదైన ఫీట్ సాధించిన షాహిన్ అఫ్రిది -
జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు
ఇవాళ సౌతాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపుతో గ్రూప్-2 సెమీస్ బెర్త్లు సంక్లిష్టంగా మారాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికాలు ఏ బాదరబందీ లేకుండా సెమీస్కు చేరతాయనుకుంటే పాక్ గెలుపుతో సమీకరణలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చిన్న జట్టైన నెదార్లాండ్స్తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సౌతాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. టీమిండియానే ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్పై గెలిస్తే తొలి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోనుండగా.. మరో బెర్తు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటుఇటు జరిగి భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. పాక్.. తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచినా.. మెరుగైన రన్రేట్ ఆధారంగా పాకిస్తానే సెమీస్కు వెళ్తుంది. కాబట్టి.. భారత్ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వేపై గెలిస్తేనే పాక్తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. భారత్.. జింబాబ్వేపై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడిందంటే భారత్, పాక్లు సెమీస్కు చేరకుంటాయి. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదు. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల పాయింట్ల వివరాలు.. భారత్.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లు (రన్రేట్=0.730) సౌతాఫ్రికా.. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు (రన్రేట్=1.402) పాకిస్తాన్..4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు (రన్రేట్=1.085) -
సౌతాఫ్రికాపై ఘన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సజీవం..!
టీ20 వరల్డ్కప్-2022లో దాయాది పాకిస్తాన్కు ఇంకా నూకలు ఉన్నాయి. ఇవాళ (నవంబర్ 3) జరిగిన కీలక పోరులో బాబర్ సేన.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పాక్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచి, సెమీస్ రేసులో నిలిచింది. పాక్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి రన్రేట్ ప్రకారం చూస్తే పాక్ (1.085).. భారత్ (0.730) కంటే మెరుగైన స్థితిలో ఉంది. పాక్కు సెమీస్ అవకాశాలు ఎలా అంటే.. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు), సౌతాఫ్రికా (4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు, 1.402), పాకిస్తాన్ జట్లు చివరిగా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్.. జింబాబ్వేతో, పాకిస్తాన్.. బంగ్లాదేశ్తో, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లో సౌతాఫ్రికా చిన్న జట్టైన నెదర్లాండ్స్పై గెలిస్తే గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. మరో బెర్తు కోసం పోటీలో.. పాక్ తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలపొంది, భారత్.. తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడితే, మెరుగైన రన్రేట్ ఆధారంగా పాకిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. అయితే టీమిండియానే గడగడలాడించిన బంగ్లాపై పాక్ భారీ విజయం.. పసికూన జింబాబ్వే.. టీమిండియాపై గెలవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించడంతో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 142 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. అప్పటికే సౌతాఫ్రికా 9 ఓవర్లు ఆడేసి 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసి ఉండటంతో మిగిలిన 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. -
T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు
ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. అయితే టీ20 వరల్డ్కప్-2022లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యావత్ పాకిస్తాన్.. భారత జట్టు గెలుపును ఆకాంక్షించడం విశేషం. గ్రూప్ దశలో భారత్ తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాలని పాక్ మనసార కోరుకుంటుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలవాలని పాక్ అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఎందుకంటే.. టీమిండియా సూపర్-12 గ్రూప్-2లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలుపొంది 4 పాయింట్లతో గ్రూప్ టాపర్గా ఉండగా.. ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా (2 మ్యాచ్ల్లో 3 పాయింట్లు), జింబాబ్వే (2 మ్యాచ్ల్లో 3 పాయింట్లు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్ల్లో 2 పాయింట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉండగా, నెదర్లాండ్స్ (2 మ్యాచ్ల్లో 2 పరాజయాలు) చివరి స్థానంలో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే ఆ జట్టు ఆడబోయే తదుపరి 3 మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) గెలుపొందడమే కాకుండా.. భారత్ తదుపరి ఆడబోయే 3 మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే) కూడా గెలవాల్సి ఉంటుంది. ఈ సమీకరణలతో పాటు సౌతాఫ్రికా, జింబాబ్వే ఆడబోయే 3 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితే భారత్ 10 పాయింట్లతో, పాకిస్తాన్ 6 పాయింట్లతో గ్రూప్-2 నుంచి సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఈ సమీకరణల నేపథ్యంలో గ్రూప్-2లో జరిగే ఏ మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించకూడదని, అలాగే భారత్.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లను చిత్తుగా ఓడించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్.. తమ తొలి మ్యాచ్లో పాక్ను, రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్పై విజయం సాధించగా, పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తైన విషయం తెలిసిందే. -
‘పాక్ పని అయిపోయింది! వచ్చే వారం టీమిండియా కూడా!’ అంత లేదులే
ICC Mens T20 World Cup 2022 - Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘మీ జట్టు విషయంలో మాత్రమే నీ అంచనాలు నిజమవుతాయిలే!’’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లో విరాట్ కోహ్లి దంచికొట్టిన విషయం తెలిసిందే. 82 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్ తర్వాత షోయబ్ అక్తర్ స్పందిస్తూ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తూనే.. ఇక టీ20లకు అతడు గుడ్ బై చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో కింగ్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. టీమిండియాను ఉద్దేశించి ఇక ఇప్పుడు అక్తర్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు అతడు టార్గెట్ అయ్యేలా చేశాయి. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అక్తర్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై కూడా స్పందించాడు. వచ్చే వారం వాళ్లు కూడా అవుట్! ఈ మేరకు ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మొదటి వారంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుందని నేను ముందే చెప్పాను. ఇక వచ్చే వారం ఇండియా వంతు! వాళ్లు కూడా టోర్నీ నుంచి అవుట్ అవుతారు. వాళ్లు సెమీస్ ఆడతారేమో గానీ.. తీస్ మార్ ఖాన్ మాత్రం కాలేరు’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్-2 టాపర్గా ఉన్న రోహిత్ సేన సెమీస్ చేరడం లాంఛనమే అని చెప్పొచ్చు. అంతేకాదు కోహ్లి, సూర్య సూపర్ ఫామ్లో ఉండటం సహా భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నీకంత సీన్ లేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు Ind Vs Ned: నాటి వరల్డ్కప్లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shoaib Akhtar predicts that India will also return home after the semis since they are also not that good (or as he says 'Tees Maar Khan'). pic.twitter.com/zj5BFnjXYI — Kanav Bali🏏 (@Concussion__Sub) October 28, 2022 -
టీమిండియా సెమీస్కు చేరడం నల్లేరుపై నడకే..!
నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (అక్టోబర్ 23) పాక్తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్కప్-2022లో ఘనంగా బోణీ కొట్టింది. మెగా టోర్నీలో భాగంగా గ్రూప్-2లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు (నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వే) ఆడాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీలో సాధించిన ఒక్క విజయంతోనే టీమిండియా సెమీస్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదెలా అంటే.. గ్రూప్-2లో భారత్తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరగ్గా.. పాక్పై భారత్, నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్, జింబాబ్వే-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ గ్రూప్లో పటిష్టమైన జట్లు, సెమీస్కు చేరే అవకాశాలు ఉన్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా అని క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్పగలుగుతారు. అయితే, సెమీస్ రేసులో నిలువగలిగిన పాకిస్తాన్ (భారత్ చేతిలో ఓటమి), సౌతాఫ్రికాలకు (జింబాబ్వేతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడం) తొలి మ్యాచ్లోనే చుక్కెదురు కావడంతో భారత్ దర్జాగా సెమీస్కు దూసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్కు చేరడం నల్లేరుపై నడకే అని వారు భావిస్తున్నారు. ఈ గ్రూప్లో ఎలాగూ నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు ఉండటంతో, భారత్కు వాటిపై విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా మిగతా మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచినా దర్జాగా సెమీస్కు వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు ఎలా ఉన్నా, చిన్న జట్లే కదా అని ఏమరపాటుగా ఉంటే మాత్రం క్వాలిఫయర్స్లో వెస్టిండీస్కు పట్టిన గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. కాగా, రెండు గ్రూప్ల (గ్రూప్-1, గ్రూప్-2) నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఫ్యాన్స్కు కనువిందు.. రోహిత్ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..! -
Julius Baer Generation Cup: సెమీఫైనల్లో అర్జున్ ఇరిగేశి
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్లో ఓటమిపాలయ్యాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్ను ఓడి రెండు గేమ్లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్పై కార్ల్సన్, నీమన్పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్లో కార్ల్సన్తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు. -
మరో హోరాహోరీ పోరు.. ఫైనల్స్కు దూసుకొచ్చిన అల్కారాజ్
Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన క్లార్టర్స్లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం. Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen 📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp — Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022 కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం. -
తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్కు చేరిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్
మహిళల సింగిల్స్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు చేరింది. ఈ గేమ్ తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్.. రెండో గేమ్లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెట్లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్లో స్వియాటెక్.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా).. ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో తొలి సెమీస్లో తలపడనున్నాడు. మరో సెమీస్ సమరంలో నంబర్ 3 ర్యాంకర్ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ -
సెమీ ఫైనల్లో తెలంగాణ ముద్దుబిడ్డ అగసార నందిని
కొలంబియాలోని కాలిలో జరుగుతున్న అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అగసార నందిని సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. 100 మీ. హర్డిల్స్ పరుగును ఆమె 13.58 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నందిని కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. గతంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 13.70 సెకన్లుగా ఉంది. హీట్స్లో మూడో స్థానంలో నిలవడంతో నందిని సెమీస్కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప 36వ స్థానంలో నిలిచి నిష్క్రమించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో కూడా నందిని సెమీస్ చేరగలిగింది. సెమీస్లో 14.16 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఆమె ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. -
సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు.. బాక్సింగ్లో అరడజను పతకాలు ఖరారు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. స్క్వాష్లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్లో మంజు బాల ఫైనల్కు అర్హత సాధించగా.. స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్లో స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్కు చేరారు. చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్ -
French Open 2022: వారెవ్వా.. రోహన్ బోపన్న తొలిసారి..
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న(భారత్)- మిడిల్కూప్(నెదర్లాండ్స్) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్ ట్రై బ్రేక్లో లాయిడ్ గ్లాస్పూల్(బ్రిటన్)- హెలియోవారా(ఫిన్లాండ్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనల్ చేరాడు. The first men’s doubles semi-final is set! 🇸🇻🇳🇱Arevalo/Rojer 🆚 Bopanna/Middelkoop 🇮🇳🇳🇱#RolandGarros pic.twitter.com/66zNDLzmgZ — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
సందడిగా ‘సాక్షి’ స్పెల్బీ సెమీ ఫైనల్స్
మూసాపేట/హైదరాబాద్: ‘సాక్షి’ స్పెల్బీ సెమీఫైనల్స్ పోటీలు ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని మెరిడియన్ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్బీ పోటీలకు హాజరయ్యారు. నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్లో పోటీ పడ్డారు. మెయిన్ స్పాన్సర్స్గా డ్యూక్ వప్పీ అసోసియేషన్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. –వకుళ, మీర్పేట్ విద్యార్థిని తల్లి కొత్త పదాలు తెలుసుకున్నా ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను. స్పెల్ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్ వరకు రావటం ఆనందంగా ఉంది. – సహస్ర మారెడ్డి, మీర్పేట్ చాలా విషయాలు తెలిశాయి ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి. –హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని పోటీతత్వం పెరుగుతుంది ‘సాక్షి’ స్పెల్బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. – అరుణ, విద్యార్థిని తల్లి -
సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రోమ్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెక్సా గ్వరాచి (చిలీ)– ఆంద్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–హర్డెస్కా జంట నాలుగు ఏస్లు సంధించింది. -
పీవీ సింధుకు నిరాశ.. టోర్నీ నుంచి అవుట్!
Korea Open 2022: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్ సియోంగ్ చేతిలో సింధు సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. పామా స్టేడియం వేదికగా శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సియోంగ్ ఆది నుంచి దూకుడైన ఆటతో ముందుకు సాగింది. తొలి గేమ్లో అయితే సింధుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఇక వరుస గేమ్లలో ఆధిపత్యం కనబరిచిన సియోంగ్ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. 20 ఏళ్ల సియోంగ్ ఫైనల్కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్లాండ్)ను ఓడించిన సంగతి తెలిసిందే. బుసానన్పై 17వ సారి విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. కానీ.. సెమీ ఫైనల్లో మాత్రం విజయయాత్రను కొనసాగించలేకపోయింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది. An Seyoung goes to the Korea Open 2022 finals by defeating Pusarla V. Sindhu!!!!! What a game!🔥🔥😭#KoreaOpen2022 pic.twitter.com/fwluApklwQ — willie (@willeyhhfixeu) April 9, 2022 -
అదరగొట్టిన గుర్జీత్ కౌర్... సెమీఫైనల్లో భారత్
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భాగంగా సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఆరు పాయింట్లతో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ మూడు గోల్స్ చేయగా... జ్యోతి, మోనిక రెండు గోల్స్ చొప్పున సాధించారు. వందన, మరియానా కుజుర్ ఒక్కో గోల్ చేశారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. మళ్లీ అగ్రస్థానానికి హైదరాబాద్ ఎఫ్సీ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఐదో విజయంతో మళ్లీ టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుతో గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. హైదరాబాద్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నైజీరియా మాజీ ప్లేయర్ ఒగ్బెచె మూడు గోల్స్ (21వ, 44వ, 74వ ని.లో) చేయగా... అనికేత్ (45వ ని.లో) ఒక గోల్ సాధించాడు. 12 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఖాతాలో 20 పాయింట్లున్నాయి. -
ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఈవ్జెనియా కొసెత్స్కయా రిటైర్డ్హర్ట్ కావడంతో సింధుకు బై లభించి ఫైనల్కు చేరుకుంది. కాగా తొలి సెట్ను సింధు సొంతం చేసుకుంది. అంతకముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన ఆరవ సీడ్ సుపనిద కతేథింగ్పై 11-21,21-12,21-17 తేడాతో ఓడించిన సింధు సెమీస్కు చేరింది. ఇక ఫైనల్లో పీవీ సింధు.. మరో భారత క్రీడాకారిణి మాలవిక భన్సోద్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణోయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్తో జరిగిన మ్యాచ్లో 21-19,21-16 తేడాతో ప్రణోయ్ ఓటమి పాలయ్యాడు. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ ఇషాన్ భట్నాగర్–సాయి ప్రతీక్ (భారత్) జంటను ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం రష్యాకు చెందిన అనస్తాసియా అక్చురినా-ఓల్గా మొరోజోవా ద్వయంపై 24-22 21-10 తేడాతో గెలిచి సెమీస్లో అడుగపెట్టారు. -
Asian Champions Trophy Hockey: తిరుగులేని భారత్.. జపాన్పై ఘన విజయం
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఇవాళ జపాన్తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. 6-0 గోల్స్తో చెలరేగిపోయింది. తద్వారా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచి సెమీస్కు దూసుకెళ్లింది. హర్మన్ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10, 53వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దిల్ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు. రౌండ్ రాబిన్ స్టేజ్లో భారత్(10 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది. చదవండి: BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్.. -
తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. సెమీ ఫైనల్లో హైదరాబాద్
Syed Mushtaq Ali Trophy-Hyderabad Enter Into Semi-Finals: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో గుజరాత్ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా...కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (16 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. రిపాల్ పటేల్ (24 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. టి. రవితేజ (3/27), సీవీ మిలింద్ (2/28) కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కర్నాటక సూపర్ ఓవర్తో... కర్నాటకతో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ విజయలక్ష్యం 161 పరుగులు...చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 2 సిక్స్లు, ఫోర్ సహా తొలి ఐదు బంతుల్లో బెంగాల్ 19 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్ను మనీశ్ పాండే డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. దాంతో స్కోరు సమమైన మ్యాచ్ ‘సూపర్ ఓవర్’కు వెళ్లింది. బెంగాల్ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా...కర్నాటక 2 బంతుల్లో ఆట ముగించింది. అంతకు ముందు కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (29 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం రితిక్ ఛటర్జీ (51) అర్ధసెంచరీ సహాయంతో బెంగాల్ కూడా 160 పరుగులు చేయగలిగింది. తమిళనాడు, విదర్భ కూడా... కేరళపై 5 వికెట్లతో గెలిచిన తమిళనాడు సెమీస్ చేరింది. ముందుగా కేరళ 4 వికెట్లకు 181 పరుగులు చేయగా, తమిళనాడు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. మరో క్వార్టర్స్లో విదర్భ 9 వికెట్లతో రాజస్తాన్ను చిత్తు చేసింది. రాజస్తాన్ 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితం కాగా...విదర్భ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శనివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్...విదర్భతో కర్నాటక తలపడతాయి. -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్పై విజయం సాధించింది. తొలి సెమీస్లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
దయచేసి అర్థం చేసుకోండి.. టీమిండియాను తిట్టొద్దు
Gautam Gambhir urges fans to not go harsh on Team India: టీ20 ప్రపంచ కప్ 2021లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా ప్రయాణం ముగిసింది. నవంబర్7న జరిగిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ సెమిస్ ఆశలు అవిరియ్యాయి. 2012 తర్వాత ఐసీసీ ఈవెంట్లో భారత్ నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు కోహ్లి సేనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. ఆటగాళ్లు చాలా కాలం పాటు బయో బబుల్లో ఉన్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులను గంభీర్ అభ్యర్థించాడు. "టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత పేలవ ప్రదర్శన చూసి నేను కూడా భాదపడ్డాను. అయితే ఆటగాళ్లు చాలా కాలం నుంచి బయో బబుల్లో ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి. మనకు వినోదం పంచడానికి వాళ్లు బయో బబుల్ జీవితాన్ని గడుపుతున్నారు. దీంట్లో వాళ్లు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఈ మెగా టోర్న్మెంట్లో మీరు బాగా ప్రయత్నించారు బాయ్స్" అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్లో సూపర్ 12లో డ్రా అయిన రెండు గ్రూపుల మధ్య జట్లలో తేడాలున్నాయని అతడు తెలిపాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రౌండ్-రాబిన్ కాకుండా 2019 ప్రపంచ కప్ వంటి లీగ్ ఫార్మాట్ను నిర్వహించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. చదవండి: Virat Kohli- Rohit Sharma: ‘ఆఖరి మ్యాచ్లో కోహ్లి... రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి’