semi finals
-
CT 2025: సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది. తద్వారా సెమీస్లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్లో ఆసీస్ భారత్ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్కు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్లో ఫలితంతో రెండో సెమీస్లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్లో ఆసీస్ను ఓడించి టీమిండియా ఫైనల్కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్కు చేరింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్రౌండ్ షో గుజరాత్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్రన్రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్రన్రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్ఫీల్డ్, తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
T20 WC 2024: ఇంగ్లండ్పై ఘన విజయం.. ఫైనల్కు టీమిండియా
India vs England 2nd Semi final Live Updates: ఫైనల్కు టీమిండియాటీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ ఆరో వికెట్ డౌన్..68 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్.. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 68/649 పరుగులకే 5 వికెట్లు.. కష్టాల్లో ఇంగ్లండ్49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్గా సామ్ కుర్రాన్ వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీగా కుర్రాన్ పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో జానీ బెయిర్ స్టో(0) క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జోస్ బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.అదరగొట్టిన రోహిత్, సూర్య.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?ఇంగ్లండ్తో సెకెండ్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారతత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(47), హార్దిక్ పాండ్యా(23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లలో రెండు వికెట్లు..వరుస క్రమంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్ బౌలింగ్లో తొలుత హార్దిక్ పాండ్యా(23) ఔట్ కాగా.. అనంతరం శివమ్ దూబే(0) పెవిలియన్కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.సూర్యకుమార్ ఔట్...124 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్..టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..13 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రోహిత్ శర్మ(56), సూర్యకుమార్ యాదవ్(39) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 77/2మ్యాచ్ తిరిగి మళ్లీ ఆరంభమైంది. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(41), సూర్యకుమార్ యాదవ్(21) పరుగులతో ఉన్నారు.వర్షం అంతరాయం..గయానా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న సెకెండ్ సెమీఫైనల్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), రోహిత్ శర్మ(37) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ డౌన్40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(26), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. టాప్లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..సెకెండ్ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు ప్రారంభం కానుంది.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీఅభిమానులకు గుడ్ న్యూస్అభిమానులకు గుడ్ న్యూస్. గయానాలో ఎండ కాస్తోంది. కవర్స్ను పూర్తిగి తొలిగించారు. భారత ప్లేయర్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అంపైర్లు 8.30 గంటలకు మైదానం, పిచ్ను పరిశీలిస్తారు.టీ20 వరల్డ్కప్-2024లో రెండో సెమీఫైనల్కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీస్లో భాగంగా గయానా వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు.ప్రస్తుతం వర్షం అగినప్పటకి.. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పిచ్ సిద్దం కాకపోవడంతో టాస్ ఆలస్యం కానుంది. -
బాధగా ఉంది.. కానీ ఇది ఆరంభం మాత్రమే! ఎవరనైనా ఓడిస్తాము: రషీద్
టీ20 వరల్డ్కప్-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్ధి జట్లను భయపెట్టిన అఫ్గాన్ జట్టు.. నాకౌట్ దశను దాటలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్లో దారుణంగా విఫలమైన అఫ్గానిస్తాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 57 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఇక ఈ ఓటమిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు."ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్రయత్నించాము. కానీ ఇక్కడి పిచ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్కు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే మా ఓటమికి ఇదే నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మనం సిద్ధంగా ఉండాలి.సౌతాఫ్రికా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్లో ఓడిపోయినప్పటకి ఈ టోర్నీలో మేము గొప్ప విజయాలు సాధించాము. ముజీబ్ ఆరంభంలోనే మా జట్టుకు దూరమైనప్పటికి మా సీమర్లు అతడి లోటును తెలియజేయలేదు. మా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జట్టునైనా ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని"పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రషీద్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్తో సెమీఫైనల్కు ముందు భారత క్రికెట్ అభిమానులను విరాట్ ఫామ్ కలవరపెడుతుంది. సెమీస్లో అయినా విరాట్ బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్ ఎలాగైనా ఫామ్లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్కప్లో విరాట్ చేసిన స్కోర్లు..ఐర్లాండ్పై 1(5)పాక్పై 4 (3)యూఎస్ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్పై 24 (24)బంగ్లాదేశ్పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో రోహిత్కు జతగా విరాట్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ప్రమోషన్ లభించాక విరాట్ ఐపీఎల్ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్ పేలవ ఫామ్న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ 2024లో భీకర ఫామ్లో ఉండిన విరాట్ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కీలకమైన సెమీస్లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి సెమీస్ ట్రినిడాడ్ వేదికగా రేపు (జూన్ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. -
తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భావోద్వేగాలు, సంబరాలు
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్కు చేరింది. THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.THE CELEBRATIONS FROM JONATHAN TROTT AND DWAYNE BRAVO. 💥 pic.twitter.com/KXp81jGL9J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. The joy on the face and happy tears on Afghanistan's fans. 🥹❤️ pic.twitter.com/3LOWLanIPP— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024AFGHANISTAN CELEBRATION IN TEAM BUS. 🔥- The Greatest day ever. [Bravo IG] pic.twitter.com/x3jHvdD0OZ— Johns. (@CricCrazyJohns) June 25, 2024Water brigade used on Afghanistan people to clear the road, but nobody moved. 😂🔥 pic.twitter.com/zFCnGmlTM7— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.THE CELEBRATIONS IN PAKTIA PROVINCE. 🥶🇦🇫 pic.twitter.com/5wf2wucJjv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. Celebration time pic.twitter.com/0bub4dXREP— Byomkesh (@byomkesbakshy) June 25, 2024 -
T20 World Cup 2024: సెమీస్ బెర్త్లు ఖరారు.. టీమిండియా ప్రత్యర్ధి ఎవరంటే..?
టీ20 వరల్డ్కప్ 2024లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. తొలి సెమీఫైనల్కు ట్రినిడాడ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ గయానా వేదికగా జరుగనుంది. తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీఫైనల్ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఫైనల్ మ్యాచ్కు బార్బడోస్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం 29వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 పోరుతో గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఖరారైంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఖంగుతినిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్కు అర్హత సాధించింది. వరుణుడి అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో గ్రూప్-1లో ఉన్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.స్కోర్ వివరాలు..ఆఫ్ఘనిస్తాన్ 115/5 (గుర్బాజ్ 43, రిషద్ హొసేన్ 3/26)బంగ్లాదేశ్ 105 ఆటౌట్ (17.5 ఓవర్లలో) (లిటన్ దాస్ 54 నాటౌట్; నవీన్ ఉల్ హక్ 4/26, రషీద ఖాన్ 4/23) 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం (డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లా విజయ లక్ష్యం 19 ఓవర్లలో 114 పరుగులు) -
World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు ఏ జట్టుకు సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. మరో నాలుగు మ్యాచ్లే ఆడాల్సి ఉన్నప్పటికీ 6 జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అన్ని జట్లతో పోలిస్తే టీమిండియాకు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రేపటి వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఏ జట్టు ఏమరపాటుగా ఉన్నా సెమీస్ బెర్త్ గల్లంతవడం ఖాయం.గ్రూప్-1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సెమీస్ రేసులో ముందుంది. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్ల్లో మెరుగైన విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. సూపర్-8లో రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించినా టీమిండియాకు సైతం టెక్నికల్గా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు.ఒకవేళ భారత్.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఆసీస్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడి.. ఆతర్వాత బంగ్లాదేశ్తో జరుగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 93 పరుగుల తేడాతో గెలిస్తే టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమే అయినప్పటికీ.. జరదని మాత్రం చెప్పలేని పరిస్థితి. కాబట్టి రేపు ఆసీస్తో జరుగబోయే మ్యాచ్లో గెలవాలనే టీమిండియా అనుకోవాలి.మరోవైపు ఇవాళ (జూన్ 23) ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో గ్రూప్-1లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సెమీస్ రేసులో లేని ఆఫ్ఘనిస్తాన్.. ఆసీస్పై గెలుపుతో ఒక్కసారిగా సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు భవిష్యత్తు భారత్-ఆసీస్ మ్యాచ్పై ఆధారపడి ఉంది.ఇదిలా ఉంటే, గ్రూప్-2 సెమీస్ రేసు గ్రూప్-1 కంటే కఠినంగా ఉంది. గ్రూప్-1లో అయినా మొదటి సెమీస్ బెర్త్పై (భారత్) ఓ క్లారిటీ ఉంది. గ్రూప్-2లో అయితే అదీ లేదు. ఇప్పటివరకు అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో టాపర్గా ఉన్నా ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ అంత ఈజీగా దక్కేలా లేదు. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సౌతాఫ్రికా, విండీస్లతో పోలిస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్కు కాస్త మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో చిన్న జట్టైన యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సారి ప్రపంచకప్ సెమీస్ బెర్త్లు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా మారాయి. -
T20 WC 2024: బంగ్లాదేశ్పై ఘన విజయం.. సెమీస్కు టీమిండియా?
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(37), పంత్(36), శివమ్ దూబే(34) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
టైటిల్కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ద్వయం ఏడు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్ను ఇచ్చారు. వరల్డ్కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
హార్ధిక్కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్లు పెడుతున్నారు. హార్ధిక్కు థ్యాంక్స్ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. హార్ధిక్ ఫిట్గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్ తమతమ స్థానాలపై కర్ఛీఫ్లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్ జట్టులో ఉంటే మూడో పేసర్గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ ఉంటే, జట్టు మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్ లేదా బ్యాటర్ వైపే చూస్తుంది. వరల్డ్కప్ ముందు వరకు చాలా మ్యాచ్ల్లో ఇదే జరిగింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్మ్యాన్ టాస్ కాయిన్ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్మార్క్ ఇన్నింగ్స్తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం. చదవండి: -
CWC 2023: టీమిండియాను ఫైనల్కు చేర్చిన రాహుల్, జడేజా.. అదేంటీ..!
క్రికెట్లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్లు పట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్లో టీమిండియా కివీస్ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. -
న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. India in the World Cup Semi Finals: 2011 - India batted first, won the game. 2015 - India batted second, lost the game. 2019 - India batted second, lost the game. 2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc — Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023 కాగా, వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్కు చేరి ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయింది. ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
కలవరపెడుతున్న కోహ్లి ట్రాక్ రికార్డు.. పొంచి ఉన్న ప్రమాదం
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) తొలి సెమీఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొమ్మిది వరుస విజయాలు సాధించి భీకర ఫామ్లో ఉన్నప్పటికీ.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనవాళ్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ.. కివీస్ను వారిదైన రోజున ఓడించడం అంత తేలక కాదు. మెజార్టీ శాతం సానుకూలతల నడుమ టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్కప్ సెమీఫైనల్స్లో కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు. ప్రస్తుత టోర్నీలో అత్యుత్తమ ఫామ్లో ఉండి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతూ దాదాపు ప్రతి మ్యాచ్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లి వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్ అనగానే చతికిలబడతాడు. ఇప్పటివరకు కోహ్లి ఆడిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఇదే జరిగింది. మూడు సెమీఫైనల్స్లో కలిపి కోహ్లి చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 2011 ఎడిషన్లో పాక్తో జరిగిన సెమీస్లో 9 పరుగులు చేసిన కోహ్లి.. 2015లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు.. అనంతరం 2019 ఎడిషన్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్లో కోహ్లి ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే ఔట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్లో కోహ్లికి ట్రెంట్ బౌల్ట్ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కోహ్లికి బౌల్ట్ బౌలింగ్లో ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. దీనికి తోడు సెమీఫైనల్ ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఏమేరకు రాణించగలడో అని భారత అభిమానులు కలవరపడుతున్నారు. ఈ అంశం యావత్ భారత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. -
CWC 2023 IND VS NZ Semi Final: ఏకైక మొనగాడు విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్కప్లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం. ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్లు (ప్రస్తుత వరల్డ్కప్తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్పై) నెగ్గి ఫైనల్స్కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్గా నిలిచింది. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్డాగ్స్గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్తో సెమీస్లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా..?
వన్డే వరల్డ్కప్ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్కప్లో ఇదివరకే (లీగ్ దశలో) న్యూజిలాండ్ను ఓసారి ఖంగుతినిపించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ సైతం ప్రస్తుత వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్కు స్వర్గధామం.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్పై మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో భారత్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్లో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ అత్యంత కీలకం.. ఈ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటుంది. భారత్దే పైచేయి.. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్పై భారత్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. వరల్డ్కప్లో కివీస్దే ఆధిక్యత.. వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. సెమీస్లో వరుసగా రెండోసారి.. భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్కప్ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్ల బలాలు, బలహీనతలు.. ప్రస్తుత వరల్డ్కప్లో ఫామ్ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్ టచ్లో ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్గా చూస్తే, ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై గెలిచి సెమీస్కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్కు చేరిన కివీస్ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్ రవీంద్ర, అడపాదడపా డారిల్ మిచెల్ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం వరకు న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ కాన్వే వైఫల్యాలు కివీస్ను కలవరపెడుతున్నాయి. -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023: పాక్ సెమీస్కు చేరి భారత్తో తలపడాలంటే ఇలా జరగాలి..
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్లు మరోసారి (సెమీస్లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్, తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. పాక్ సెమీస్కు చేరి, భారత్తో తలపడాలంటే ఈ ఈక్వేషన్తో పాటు మరో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే.. న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్ 10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. నాలుగో ప్లేస్లో ఉన్న పాక్ సెమీస్లో తలపడతాయి. అయితే ఇలా జరగడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఒకవేళ పాక్.. ఇంగ్లండ్పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుని భారత్తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్పై విజయం సాధించి, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ఎలిమినేషన్కు గురి కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నడుస్తుంది. -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలుత పసికూన నెదర్లాండ్స్తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్కప్లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోతే పాక్కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లపై గెలుపొందితే.. పాకిస్తాన్తో పాటు రన్రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc) -
పీవీ సింధు ఓటమి.. సెమీస్కు చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్కు చేరుకున్నాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్ను మాత్రం సులువుగానే నెగ్గింది. చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
సెమీస్కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో మహిళల టెన్నిస్ నెంబర్వన్ ఇగా స్వియాటెక్ సెమీస్కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
మహిళల టీ20 వరల్డ్కప్.. సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడబోతున్నారంటే..?
8వ మహిళల టీ20 వరల్డ్కప్ చివరి దశకు చేరింది. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ ఆస్ట్రేలియా.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్లో గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్.. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్టౌన్లో జరుగనున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్కప్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క ఓటమిని మూటగట్టుకుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత విండీస్, ఐర్లాండ్ జట్లను ఓడించారు. మిగతా జట్ల విషయానికొస్తే.. సెమీస్లో భారత్ ప్రత్యర్ధి ఆసీస్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికా) విజయం సాధించగా.. గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్ కూడా 4కు నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అజేయ జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. సఫారీ టీమ్.. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, 2 అపజయాలు మూటగట్టుకుంది. మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8వ ఎడిషన్ కొనసాగుతుంది. 2009లో జరిగిన తొలి ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా నిలువగా.. 2010, 2012, 2014 ఎడిషన్లలో ఆసీస్ విజేతగా నిలిచి హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. మధ్యలో 2016లో వెస్టిండీస్ జగజ్జేతగా నిలువగా.. ఆ తర్వాత 2018, 2020 ఎడిషన్లలో ఆసీస్ వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్కప్లో విజయం సాధిస్తే ఆసీస్ డబుల్ హ్యాట్రిక్ నమోదు చేస్తుంది. 2020 ఎడిషన్లో భారత్.. ఫైనల్కు చేరి ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్కు చేరింది. మధ్యప్రదేశ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సెమీస్లో బెంగాల్.. మధ్యప్రదేశ్ను ఢీకొంటుంటే, రెండో సెమీస్లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది. -
2024 సెమీఫైనల్స్: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్కు కీలకం కానున్నాయి. ► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. ► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. ► మధ్యప్రదేశ్: 2023 నవంబర్-డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్నాథ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ► ఛత్తీస్గఢ్-రాజస్థాన్: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
సూర్యకుమార్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్కప్లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
Guinness World Records: టీ20 వరల్డ్కప్-2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దారుణంగా అవమానించింది. ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి అంశంలో అత్యుత్తమ, అతి దారుణమైన విశేషాలను తమ రికార్డుల్లో నమోదు చేసే ఈ సంస్థ.. నవంబర్ 10న ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అతి దారుణంగా వర్ణిస్తూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య ఛేదన అంటూ ట్వీట్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ఆ సంస్థను ఓ ఆటాడుకుంటున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చారని భారత క్రికెటర్లను వెనకేసుకొస్తున్నారు. Easiest run chase in history? 👀#INDvsENG — Guinness World Records (@GWR) November 10, 2022 ఇంత కంటే దారుణ పరాజయాలు క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయని రివర్స్ కౌంటరిస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. యూకే సంస్థ కాబట్టి, గొప్పలకు పోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్లో పాక్పై ఎలా గెలవాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ సలహాలిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్లో టీమిండియా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, అదృష్టం కలిసి రాక సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-12 దశలో ఒక్క దక్షిణాఫ్రికాతో మినహా అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు చేరిన భారత్.. సెమీస్లో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఛేదనలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్ (50), హార్ధిక్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (80), హేల్స్ (86) అజేయమైన అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..! -
నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడా..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిందిస్తున్నారు. సోషల్మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు. అసలు వరల్డ్కప్లో, ముఖ్యంగా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం. బౌలింగ్లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్ బ్యాటింగ్లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్ ఓపెనర్ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడగల శ్రేయస్ అయ్యర్ను కాదని దీపక్ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్ లాంటి నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను గుర్తించలేకపోవడం, ఫినిషర్ అంటూ దినేశ్ కార్తీక్ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్ కాని అశ్విన్ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్కు న్యాయం చేయలేని అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది. వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్కప్కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్ టాలెంట్ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు. ఆస్ట్రేలియా పిచ్లకు సూటయ్యే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి. అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్ను, సీనియర్ ఆటగాళ్లను, కోచ్ను టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది. చదవండి: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..? -
IND VS ENG: అనుకున్నదే అయ్యింది.. ఆ ఇద్దరు ఔట్
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ముందు అనుకున్న విధంగానే ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కీలకమైన మ్యాచ్కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహాయించి.. శ్రీలంకపై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ యధాతథంగా కొనసాగించింది. ఇంగ్లండ్ విజయావకాశాలను ప్రభావితం చేయగల మలాన్, వుడ్ జట్టులో లేకపోవడంతో ఇంగ్లండ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. జింబాబ్వేపై బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. దీంతో రిషబ్ పంత్కు మరో అవకాశం దక్కినట్లైంది. జట్ల వివరాలు.. టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ -
రోహిత్ మెరవాలి, కోహ్లి చెలరేగాలి, సూర్య దంచికొట్టాలి..!
టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఇవాళ (నవంబర్ 10) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గటంలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొంది, ఫైనల్లో పాక్ను కూడా మట్టికరిపించి, టైటిల్ సొంతం చేసుకోవాలని వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కీలకమైన ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తమ సహజమైన ఆట ఆడి ఇంగ్లండ్ ఆట కట్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ధైర్యంగా ఆడండి మీవెనక 130 కోట్ల మంది భారతీయులున్నారంటూ భరోసానిస్తున్నారు. చాలా మంది అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లు చెలరేగాలని దేవుళ్లకు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కాస్తా మెరుగ్గానే ఉందని, బౌలర్లు ఈ మ్యాచ్లో సత్తా చాటేలా వారికి శక్తిని ప్రసాదించాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. అలాగే, రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంతకాలంగా ఫామ్లో లేని హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో మెరవాలని, కోహ్లి ఎప్పటిలాగే చెలరేగాలని, సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ బౌలర్లను దండికొట్టాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో దినేశ్ కార్తీక్, పంత్లలో ఎవరు ఆడినా ఫామ్లోకి రావాలని, ముఖ్యంగా స్పిన్నర్లు తమ పాత్రలను న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. భారతీయ అభిమానుల ఆకాంక్షలు, కోరికలు, ప్రార్ధనలతో సోషల్మీడియా హోరెత్తుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నవంబర్ 13న పాక్తో టైటిల్ పోరులో తలడపనుంది. -
టీమిండియాపై ఇంగ్లండ్దే విజయం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు. -
IND VS ENG: సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు. ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్తో టైటిల్ పోరులో తలపడనుంది. -
సూర్యకుమార్ నన్ను చంపేశాడు.. మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్పై ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా రేపు (నవంబర్ 10) భారత్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాతో జరిగిన ఓ మ్యాచ్లో సూర్యకుమార్ ఊచకోతను గుర్తు చేసుకుంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్లో జరిగిన ఓ మ్యాచ్లో తన తొలి టీ20 సెంచరీ బాదిన సూర్య.. ఆ మ్యాచ్లో తనను చంపేశాడని, నాటి భయానక ఇన్నింగ్స్ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో శివాలెత్తిన సూర్యకుమార్.. తనను మరే బ్యాటర్ భయపెట్టని విధంగా భయపెట్టాడని అన్నాడు. అదృష్టవశాత్తు అతను అలసిపోయి తన బౌలింగ్లోనే ఔట్ కావడంతో ఊపరిపీల్చుకున్నానని తెలిపాడు. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ ఆడిన షాట్లు అత్యద్భుతమని, క్రికెట్లో తాను చూసిన షాట్లలో అవే అత్యుత్తమమని, ఇప్పటికీ అవి తన కళ్లముందే మెదులుతున్నాయని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే తనకు సూర్యకుమార్ అంటే ఏంటో అర్ధమైందని, ఇప్పుడు అతనింకా రాటుదేలాడని, ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడని కొనియాడాడు. ఒక్కసారి అతను క్రీజ్లో కుదురుకున్నాక బౌలింగ్ చేయడం ఎంతటి బౌలర్కైనా చాలా కష్టమని, క్రికెట్ చరిత్రలో ఇలా బౌలర్లను భయపెట్టే బ్యాటర్లలో సూర్యకుమార్ ముందు వరుసలో ఉంటాడని ఆకాశానికెత్తాడు. ఏబీడీ తర్వాత మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అన్న పేరుకు సూర్యకుమార్ వంద శాతం అర్హుడని, రేపు తమతో జరుబోయే సెమీస్ మ్యాచ్లో అతను శాంతంగా ఆడాలని ఆశిస్తున్నానని అన్నాడు. సెమీస్లో టీమిండియానే ఫేవరెట్ అయినప్పటికీ.. అండర్ డాగ్స్గా బరిలోకి దిగే తమను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. చదవండి: '360 డిగ్రీస్' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్ -
ఇంగ్లండ్తో సమరం.. అన్నింటా టీమిండియాదే పైచేయి.. రికార్డులే సాక్ష్యం
ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 10) జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియానే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ అభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం అంచనా వేస్తుంది. వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఒక కారణమైతే.. గత రికార్డులు మరో కారణం. బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్లు వరుస హాఫ్సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తమ పాత్రలను న్యాయం చేస్తూ టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్కు, అనూకూలంగా ఉన్న గత రికార్డులు తోడవ్వడంతో టీమిండియాదే విజయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ ముఖా ముఖి పోరులో ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో ఇంగ్లండ్కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది. ఈ రికార్డులే కాక, అడిలైడ్లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే వేదికపై బంగ్లాదేశ్పై విజయం, ఈ ప్రపంచకప్లో ఇంగ్లండ్కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మరోపక్క టీమిండియాను కూడా మూడు సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్ శర్మ ఫామ్, దినేశ్ కార్తీకా లేక రిషబ్ పంతా అని ఎటూ తేల్చుకోలేకపోవడం, స్పిన్నర్ల వైఫల్యం.. ఈ మూడు అంశాలు టీమిండియాకు అందోళన కలిగిస్తున్నాయి. రేపటి మ్యాచ్లో భారత్.. ఈ మూడింటిని అధిగమించగలిగితే టీమిండియాను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. చదవండి: అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..! -
అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..!
అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు (నవంబర్ 10) జరుగబోయే టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్లో తలమునకలై ఉన్నాయి. రేపటి సంగ్రామంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగనుందని క్రికెట్ అభిమనాలు అంచనా వేస్తున్నారు. ఇక, మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ విషయానికొస్తే.. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికపై టీమిండియా తురుపుముక్క కింగ్ కోహ్లికి భీభత్సమైన రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్ అంటేనే కింగ్ను పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్, ప్రస్తుత వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్కప్లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. చదవండి: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి -
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్లో గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..?
టీ20 వరల్డ్కప్-2022 తొలి సెమీఫైనల్లో రేపు (నవంబర్ 9) న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ సమరంలో ఇరు జట్లు కత్తులు దూసుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ సెమీస్కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. రెండో సెమీస్లో భారత్.. ఇంగ్లండ్ను ఢీకొట్టనుండటంతో పాక్-కివీస్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలన్న ఆతృత భారతీయ అభిమానుల్లో పెరిగింది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాక్ గెలిచి, ఇంగ్లండ్పై టీమిండియా గెలిస్తే.. ఫైనల్లో దాయదాల రసవత్తర సమరాన్ని వీక్షించవచ్చన్నదే టీమిండియా ఫ్యాన్స్ ఆకాంక్ష. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్లో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టీమిండియా ఫ్యాన్స్ అయితే పాక్ తప్పక గెలిచి, ఫైనల్లో తమతో తలపడాలని ఆశపడుతున్నారు. బలాబలాలు, రికార్డులతో సంబంధం లేకుండా పాకే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు కివీస్-పాక్ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్కప్లో ఇరు జట్లు 6 సందర్భాల్లో ఎదురెదురు పడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించాయి. గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే నెగ్గింది. మరోవైపు వన్డే, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ల్లో పాక్కు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమన్నదే లేదు. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది. 1992 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం, 1999 వరల్డ్కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం, 2007 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లెక్కన టీ20ల్లో న్యూజిలాండ్పై పాక్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. చదవండి: కెప్టెన్గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా -
రోహిత్ సహా కెప్టెన్లంతా తుస్సుమనిపించారు.. అతనైతే మరీ దారుణం..!
టీ20 వరల్డ్కప్-2022 తుది అంకానికి చేరింది. మరో మూడు మ్యాచ్లు జరిగితే టోర్నీ సమాప్తమవుతుంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా రేపు (నవంబర్ 9) తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుండగా.. అడిలైడ్ వేదికగా ఎల్లుండి (నవంబర్ 10) భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్లు నవంబర్ 13న టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఇదిలా ఉంటే, సూపర్-12 దశలో సెమీస్కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఆయా జట్లను తీవ్రంగా కలవరపెడుతుంది. జట్టును ముందుండి నడిపించే సారధులే వరుస వైఫల్యాల బాట పడుతుండటాన్ని సంబంధిత జట్ల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్లే విఫలమవుతుంటే, తమ జట్లు ఏరకంగా టైటిల్ సాధిస్తాయని వారు వాపోతున్నారు. కెప్టెన్ అనే వాడు ఒక మ్యాచ్లో కాకపోతే మరో మ్యాచ్లోనైనా రాణించి జట్లకు మార్గదర్శకంగా ఉంటే టైటిల్ సాధించవచ్చని భావిస్తున్నారు. వరల్డ్కప్-2022లో సెమీస్కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల గణాంకాలకు పరిశీలిస్తే.. నలుగురిలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాస్తో కూస్తో బెటర్ అనిపిస్తుంది. కేన్ మామ.. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 61గా ఉంది. విలియమ్సన్ తర్వత గుడ్డిలో మెల్లలా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రదర్శన కాస్త మేలనిపిస్తుంది. బట్లర్ 4 ఇన్నింగ్స్ల్లో 73 అత్యధిక స్కోర్తో 119 పరుగులు సాధించాడు. మన హిట్మ్యాన్ విషయానికొస్తే.. రోహిత్ ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 53 అత్యధిక స్కోర్తో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. నలుగురు కెప్టెన్లలో అత్యంత దారుణమైన ప్రదర్శన అంటే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్దేనని చెప్పాలి. బాబర్ 5 ఇన్నింగ్స్ల్లో 25 అత్యధిక స్కోర్తో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. సెమీస్కు చేరిన నాలుగు జట్లలో న్యూజిలాండ్, టీమిండియా మినహాయిస్తే, మిగిలిన రెండు జట్లలో ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఒకరో ఇద్దరో రాణించడంతో ఇంగ్లండ్.. అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్కు చేరాయి. కివీస్, టీమిండియాల్లో మాత్రం బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి వారివారి జట్లను సెమీస్కు చేర్చారు. చదవండి: టీమిండియాతో సెమీస్కు ముందు ఇంగ్లండ్కు మరో బిగ్ షాక్..! -
టీమిండియాతో సెమీస్కు ముందు ఇంగ్లండ్కు మరో బిగ్ షాక్..!
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న టీమిండియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా స్టార్ పేసర్ మార్క్ వుడ్ జనరల్ స్టిఫ్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం కారణంగా వుడ్ ప్రాక్టీస్కు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వుడ్ సమస్య అంత పెద్దదేమీ కాకపోయినప్పటికీ.. ఇండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది ఇంగ్లీష్ టీమ్ను కలవరపెడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్లో సూపర్ ఫామ్లో వుడ్.. టీమిండియాతో మ్యాచ్ సమయానికి ఫిట్గా లేకపోతే, ఆ ప్రభావం కచ్చితంగా జట్టు విజయావకాశాలపై పడుతుందని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ కంగారు పడుతుంది. ఒకవేళ వుడ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే.. అతనికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తైమాల్ మిల్స్కు తుది జట్టులో అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా, వరల్డ్కప్-2022లో వుడ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి మాంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి అతికష్టం మీద సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్కు నిన్న (నవంబర్ 7) కూడా ఓ భారీ షాక్ తగిలింది. కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన సెమీస్ డిసైడర్ మ్యాచ్లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు మలాన్ స్థానాన్ని ఫిలిప్ సాల్ట్తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్లను టీమిండియా బౌలర్లు అడ్డుకోగలరా..?
టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా సెమీస్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఎన్నడూ లేని నెర్వస్నెస్ మొదలైంది. గతంలో మెగా టోర్నీల ఫైనల్ మ్యాచ్ల్లోనే నింపాదిగా వ్యవహరించిన భారతీయ అభిమానులు.. ఈ సారి సెమీస్ మ్యాచ్కే తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇందుకు.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి తొమ్మిదేళ్లవుతుందన్న కారణమొకటైతే, రెండోది ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు భీకర ప్రదర్శన. వాస్తవంగా చెప్పాలంటే.. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతున్నామన్న కారణం కంటే, అరివీర భయంకరమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ టీమిండియా అభిమానులను అధికంగా భయపెడుతుంది. తమదైన రోజున అడ్డూ అదుపూ లేకుండా శివాలెత్తిపోయే ఇంగ్లీష్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు నిలువరించగలరా అన్న సందేహం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేయగలరా అని ఫ్యాన్స్ సందేహా పడుతున్నారు. మేటి బౌలింగ్ను సైతం తునాతునకలు చేసే ఈ బ్యాటింగ్ యోధుల ధాటికి అంతంతమాత్రంగా ఉన్న ఉన్న భారత బౌలింగ్ తట్టుకోగలదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా లాంటి బౌలర్ ఉంటే, టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని అనుకుంటున్నారు. షమీ, అర్షదీప్, భువీ, అశ్విన్, హార్ధిక్లతో కూడిన భారత బౌలింగ్ లైనప్ బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. మెరుపు ఇన్నింగ్స్లతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లకు కళ్లెం వేయగలదా లేదా అని లోలోపల మధన పడిపోతున్నారు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఇంగ్లండ్ బ్యాటర్ల పప్పులేమీ ఉడకవని తమకు తామే సర్ధి చెప్పుకుంటున్నారు. ఒకవేళ స్పిన్నర్లు తేలిపోయినా పేసర్లు అర్షదీప్, షమీ, భువీ, హార్ధిక్ మంచి ఫామ్లోనే ఉన్నారని, వీరి ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు తట్టుకోలేరని ధైర్యం చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుత ప్రపంచకప్లోఇంగ్లండ్ బ్యాటర్ల ఫామ్ టీమిండియా అభిమానులు భయపడేంత ఏమీ లేదన్నది కాదనలేని నిజం. ఒకటి, అరా ఇన్నింగ్స్ల్లో బట్లర్, హేల్స్ రాణించారే తప్పిస్తే.. అరివీర భయంకరులుగా చెప్పుకునే బ్యాటర్లంతా దాదాపు ప్రతి మ్యాచ్లో తస్సుమినిపించారు. ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్.. ఏదో అదృష్టం కలిసి వచ్చి, బౌలర్ల పుణ్యమా అని అతికష్టం మీద సెమీస్కు అర్హత సాధించింది. ఇంగ్లీష్ జట్టు ఈ ఫామ్ను చూసి టీమిండియా అభిమానులు కంగారు పడనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
T20 WC 2022: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. టీమిండియానే విజేత!
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్లకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్-పాకిస్తాన్, ఆ మరుసటి రోజు (నవంబర్ 10) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు సెమీఫైనల్ మ్యాచ్లతో పాటు మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్కు కూడా రిజ్వర్ డే ఉంది. ఒకవేళ సెమీస్, ఫైనల్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్) మాత్రం గ్రూప్లో టేబుల్ టాపర్గా ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్లో న్యూజిలాండ్, రెండో సెమీస్లో భారత్ ఫైనల్కు చేరతాయి. అదే ఫైనల్ విషయానికొస్తే.. టైటిల్ డిసైడర్ మ్యాచ్ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
సెమీస్కు ముందు టీమిండియాను వేధిస్తున్న ఆ నలుగురి సమస్య..!
నవంబర్ 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరానికి ముందు నలుగురు ప్లేయర్ల ఫామ్ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. ఆ నలుగురిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత వరల్డ్కప్లో రోహిత్తో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్లకు వరుసగా అవకాశలు ఇచ్చినా, సామర్ధ్యం మేరకు రాణించలేక ఘోర వైఫల్యాలు చెందడం మేనేజ్మెంట్తో పాటు అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. రోహిత్ను మినహాయించి సెమీస్లో పై ముగ్గురిని తప్పించాలన్నా టీమిండియాకు ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది. ప్రపంచకప్-2022లో రోహిత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 89 పరుగులు (4, 53, 15, 2, 15) మాత్రమే చేసి పేలవ ఫామ్లో ఉండగా, దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్లోనూ వికెట్కీపింగ్లోనూ దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఫినిషర్ కోటాలో జట్టుకు ఎంపికైన డీకే.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోగా, బ్యాటింగ్ ఓనమాలు కూడా మరిచి వరుస వైఫల్యాల బాటపట్టాడు. వరల్డ్కప్లో అతనాడిన 4 మ్యాచ్ల్లో కేవలం 14 పరుగులు (1, 6, 7), 4 క్యాచ్లు మాత్రమే అందుకుని అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో సెమీస్లో డీకేకు తిప్పించి పంత్కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ల విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. ఆల్రౌండర్ కోటాలో 4 మ్యాచ్లు ఆడే అవకాశం దక్కించుకున్న అక్షర్.. అవకాశం వచ్చినా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ (3 వికెట్లు) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో పాటు ధారళంగా పరుగులు సమర్పించుకోవడం మరింత కలవరానికి గురి చేస్తుంది. స్పిన్నర్ విషయంలో టీమిండియాకు చహల్ రూపంలో మరో చాయిస్ ఉన్నా మేనేజ్మెంట్ దాన్ని ఉపయోగించుకునేందుకు సాహసించలేకపోయింది. వీరిద్దరి వైఫల్యాలపై నజర్ వేసిన యాజమాన్యం.. స్పిన్కు అనుకూలించే అడిలైడ్ పిచ్పై (సెమీస్చ వేదిక) ఏ మేరకు మార్పులు చేస్తుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం.. స్పిన్ పిచ్ అంటున్నారు కాబట్టి అశ్విన్ను కొనసాగించి, అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇంగ్లండ్తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు. వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
ఆ అంపైర్ లేడు.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే..!
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్ 7) విడుదల చేసింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా మరయిస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్బొరో, మైఖేల్ గాఫ్లు థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించబడ్డారు. ఈ మ్యాచ్కు రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నాడు. ఇక, నవంబర్ 10న అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. కుమార ధర్మసేన, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా.. క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. We are saved 🙏 pic.twitter.com/pi4LewhFiv — Dere (@Der1x_) November 7, 2022 ఇదిలా ఉంటే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు అచ్చిరాని అంపైర్గా ముద్రపడ్డ రిచర్డ్ కెటిల్బొరో ఇంగ్లండ్తో మ్యాచ్కు ఐసీసీ ప్రకటించిన అఫీషియల్స్ జాబితాలో లేకపోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రతికిపోయాం రా బాబు.. ఇక, టీమిండియా ఫైనల్కు చేరడం ఖాయమంటూ సోషల్మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కెటిల్బొరో అంపైర్గా లేడు కాబట్టి.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే, ఇంగ్లండ్పై గెలుపు మనదే, ఫైనల్కు ఎవరు వచ్చినా టీమిండియా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి పరోక్ష కారణమైన కెటిల్బొరో లేడు కాబట్టి రోహిత్ సేన విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. కాగా, 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్ కెటిల్బొరో అంపైర్గా వ్యవహరించిన (భారత్ ఆడిన మ్యాచ్లు) ప్రతి నాకౌట్ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. కెటిల్బొరో ఫీల్డ్ అంపైర్గా లేదా థర్డ్ అంపైర్గా వ్యవహరించిన.. 2014 టీ20 వరల్డ్కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్కప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ల్లో టీమిండియా దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో కెటిల్బొరోపై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. -
అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్!
టి20 ప్రపంచకప్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్ అనూహ్యంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై సంచలన విజయాలు సాధించి సెమీస్లో అడుగుపెట్టగా.. కచ్చితంగా సెమీస్కు వెళుతుందనుకున్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తయ్యి లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా, పాకిస్తాన్లు సెమీఫైనల్కు వెళ్లడంపై ఇరుదేశాల అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్లు తలపడితే చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మాములుగానే ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటేనే ఫుల్ జోష్ ఉంటుంది. అలాంటిది ఈ రెండు జట్లు ఒక మెగాటోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయంటే ఎంత హైవోల్టేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2007 తొలి ఎడిషన్ టి20 ప్రపంచకప్లో ఫైనల్లో పాకిస్తాన్పై విజయం సాధించిన టీమిండియా చాంపియన్గా అవతరించింది. అయితే సెమీస్లో టీమిండియా ఇంగ్లండ్తో, పాకిస్తాన్ న్యూజిలాండ్తో అమితుమీ తేల్చుకోనున్నాయి. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ను దెబ్బతీయడం టీమిండియాకు సవాల్ అయితే.. భీకరమైన ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ను ఓడించాలంటే పాకిస్తాన్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే న్యూజిలాండ్కు నాకౌట్ ఫోబియా ఉండడం పాక్కు కలిసిరానుంది. అప్పటివరకు దుమ్మురేపే న్యూజిలాండ్ నాకౌట్ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది. ఇప్పటికే 2015, 2019, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా ఫైనల్స్లోనే ఓడి రన్నరప్గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రోజురోజుకు బలంగా తయారవుతూ వస్తుంది. ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ దాకా బ్యాటింగ్ ఆడగల సత్తా ఉన్న ఇంగ్లండ్ను నిలువరించాలంటే టీమిండియా తన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఏమో అన్ని కలిసొస్తే టీమిండియా, పాక్లు ఫైనల్లో తలపడితే చూడాలని సగటు అభిమాని బలంగానే కోరుకుంటున్నాడు. చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్కు శాపం -
రాణించిన నెదర్లాండ్స్ బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2లో ఇవాళ (నవంబర్ 6) అత్యంత కీలకమైన మ్యాచ్లు జరుగనున్నాయి. తొలుత సౌతాఫ్రికా-నెదర్లాండ్స్, ఆతర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్, భారత్-జింబాబ్వే జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్ రేసులో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లకు ఈ మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. అడిలైడ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టెఫాన్ మైబుర్గ్ (37), మ్యాక్స్ ఓడౌడ్ (29), టామ్ కూపర్ (35), కొలిన్ ఆకెర్మన్ (41 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్ నోర్జే, ఎయిడెన్ మార్క్రమ్లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం ఇదే వేదికపై 9:30 గంటలకు పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెమీస్ బెర్త్పై అరకొర ఆశలున్న పాకిస్తాన్ ఈ మ్యాచ్లో తప్పనసరిగా గెలవాల్సి ఉంది. ఇక, భారత్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే, గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్తుంది. -
T20 WC 2022: గండాలు దాటి.. నేరుగా టీమిండియా!
అప్డేట్: సూపర్-12లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఓడించడంతో టీమిండియా నేరుగా సెమీస్కు చేరుకుంది. మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి పాకిస్తాన్ కూడా భారత్తో పాటు గ్రూప్-2 నుంచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. ఇక మిగిలింది గ్రూప్-2 బెర్త్లు. ఈ గ్రూప్ నుంచే ముందుగా సెమీస్ బెర్త్లు ఖరారవుతాయనుకుంటే, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనూహ్య విజయాలు సాధించి సెమీస్ రేసును రసవత్తరంగా మార్చాయి. రేపు (నవంబర్ 6) జరుగబోయే మ్యాచ్లతో ఈ గ్రూప్ సెమీస్ బెర్తులపై క్లారిటీ రానుంది. ప్రస్తుత సమీకరణలు, ఆయా జట్ల ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే.. రేపు జరుగబోయే మ్యాచ్ల్లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ను, భారత్.. జింబాబ్వేను, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై విజయాలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్ల్లో సౌతాఫ్రికా, టీమిండియా విజయాలు సాధిస్తే, ఆఖరి మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రూప్-2 నుంచి అగ్రస్థానంలో భారత్, రెండో స్థానంతో సౌతాఫ్రికా సెమీస్కు చేరతాయి. పాకిస్తాన్ ఇంటిబాట పడుతుంది. రేపటి మ్యాచ్ల్లో నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లతో ఏదో ఒకటి సంచలన విజయం సాధిస్తే తప్పా.. పై సమీకరణల్లో ఎలాంటి మార్పు ఉండదు. కాగా, ఫైనల్ ఫోర్ జట్లపై ఓ అంచనాకు రావడంతో సెమీస్లో ఏయే జట్లు తలపడబోతున్నాయన్న అంశంపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా సెమీస్ చేరితే ఏ జట్టుతో తలపడాల్సి వస్తుందో అన్న టెన్షన్ ఫ్యాన్స్లో ఇప్పటినుంచే మొదలైంది. గ్రూప్-1 బెర్తులు ఎలాగూ ఖరారయ్యాయి కాబట్టి భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్లలో ఏదో ఒక జట్టుతో తలపడాల్సి ఉంటుంది. రేపటి మ్యాచ్లో టీమిండియా.. జింబాబ్వేపై గెలిస్తే ఇంగ్లండ్తో, ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే న్యూజిలాండ్ను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
జింబాబ్వేతో కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే క్రమంలో రేపు (నవంబర్ 6) జింబాబ్వేతో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. మ్యాచ్కు వేదిక అయిన మెల్బోర్న్లో వర్షం పడే సూచనలు లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్లో పేర్కొంది. ఇదే వేదికపై గతవారం మూడు మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొని ఉండింది. అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) మెల్బోర్న్లో వాతావరణం క్లియర్గా ఉంటుందని, టెంపరేచర్ 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలుస్తే.. ఈ గ్రూప్లో అగ్రస్థానంతో సెమీస్కు వెళ్తుంది. మరోపక్క టీమిండియాతో పాటు సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లు సైతం రేపే తమ ఆఖరి సూపర్-12 మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. రేపు ఉదయం 5:30 గంటలకు నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీస్కు అర్హత సాథిస్తుంది. ఉదయం 9:30 గంటలకు జరుగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా దాయాది జట్టు సెమీస్ అవకాశాలు భారత్, దక్షిణాఫ్రికాల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. -
మరో రసవత్తర సమరం.. సెమీస్కు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకు శృంగభంగం
టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్ 5) జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే సెమీస్కు చేరాలని భావించిన ఆసీస్.. ఇంగ్లండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆసీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
T20 WC 2022: అదే జరిగింది.. భారత్, పాక్ సెమీస్కు..!
అప్డేట్: ఐసీసీ ప్రపంచకప్-2022 సూపర్-12లో ఆఖరి రోజైన ఆదివారం (నవంబరు 6) నెదర్లాండ్స్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో టీమిండియా నేరుగా సెమీస్కు అర్హత సాధించగా.. నామమాత్రపు మ్యాచ్లో జింబాబ్వేపై ఘన విజయం నమోదు చేసింది. మరోవైపు పాకిస్తాన్.. బంగ్లాదేశ్ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ICC Mens T20 World Cup 2022 : టీ20 వరల్డ్కప్-2022 కీలక దశకు చేరింది. గ్రూప్-1 నుంచి తొలి సెమీస్ బెర్త్ (న్యూజిలాండ్) ఇదివరకే ఖరారు కాగా, శనివారం రెండో స్థానంపై క్లారిటీ వచ్చింది. శ్రీలంకతో కీలక మ్యాచ్లో గెలుపొందిన ఇంగ్లండ్ సెమీస్లో అడుగుపెట్టింది. లంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన బట్లర్ బృందం.. గ్రూప్-1 నుంచి రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-2 విషయానికొస్తే.. తొలుత ఈ గ్రూప్ నుంచి సెమీస్ బెర్త్లు ఈజీగా ఫైనల్ అవుతాయని అంతా ఊహించారు. అయితే చిన్న జట్లైన జింబాబ్వే, బంగ్లాదేశ్ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురుకావడంతో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో ఇప్పటివరకు (నవంబర్ 5) అన్ని జట్లు చెరో 4 మ్యాచ్లు ఆడగా.. నెదర్లాండ్స్ అధికారికంగా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు అనధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. పోతే.. సెమీస్ రేసులో మిగిలింది మూడు జట్లు. భారత్ (6 పాయింట్లు, +0.730), సౌతాఫ్రికా (5 పాయింట్లు, +1.441), పాకిస్తాన్ (4 పాయింట్లు, +1.117). ప్రస్తుత సమీకరణలు, అంచనాల ప్రకారమయితే భారత్, సౌతాఫ్రికా సునాయాసంగా సెమీస్కు అర్హత సాధిస్తాయి. భారత్, దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్ల్లో ఎదుర్కొనబోయే జట్లు (జింబాబ్వే, నెదర్లాండ్స్) చిన్నవి కాబట్టి, పై సమీకరణలు వర్కౌట్ అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగి.. సెమీస్ రేసులో ఉన్న మరో జట్టు పాక్.. తమ ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే, పరిస్థితులు తలకిందులై ఏవైనా సంచలనాలు నమోదైందయ్యాయంటే మాత్రం అన్నీ ఒక్కసారిగా తారుమారవుతాయి. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడినా, భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. ఇవి జరిగి పాక్.. బంగ్లాపై భారీ విజయం సాధిస్తే.. గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరే తొలి జట్టుగా పాకిస్తాన్, రెండో జట్టుగా భారత్ నిలుస్తాయి. ఒకవేళ సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్పై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచి, టీమిండియా.. జింబాబ్వే చేతిలో ఓడిందా సౌతాఫ్రికా, పాక్లు సెమీస్కు వెళ్తాయి. ఇన్ని సమీకరణల నడుమ గ్రూప్-2 నుంచి ఏ జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుందోనన్నది ఆసక్తికరంగా మరింది. -
పాక్కు మరోసారి టీమిండియానే దిక్కు
టి20 ప్రపంచకప్లో భాగంగా గ్రూప్-2 సమీకరణాలు ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. గురువారం సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ ఒక్కసారిగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఇప్పటికీ పాకిస్తాన్కు సెమీస్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్కు వెళ్లాలన్న టీమిండియా, సౌతాఫ్రికాలపై ఆధారపడాల్సిందే. జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయి.. సౌతాఫ్రికా నెదర్లాండ్స్తో చేతిలో ఓడితేనే పాక్కు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ వర్షంతో ఆగిపోయినా అప్పుడు కూడా ఇంటికి వెళ్లేది పాకిస్తాన్ జట్టే. కాబట్టి ఎటు చూసుకున్నా పాకిస్తాన్కు టీమిండియానే పెద్దదిక్కులా కనిపిస్తుంది. ఇక జింబాబ్వే, టీమిండియా మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువగా భారత్కే ఉన్నాయి. అయితే ఈ ప్రపంచకప్లో జింబాబ్వే పాకిస్తాన్కు షాక్ ఇవ్వడంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ను టీమిండియా సీరియస్గా తీసుకొని ఆడితే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చదవండి: అరుదైన ఫీట్ సాధించిన షాహిన్ అఫ్రిది -
జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు
ఇవాళ సౌతాఫ్రికాపై పాకిస్తాన్ గెలుపుతో గ్రూప్-2 సెమీస్ బెర్త్లు సంక్లిష్టంగా మారాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికాలు ఏ బాదరబందీ లేకుండా సెమీస్కు చేరతాయనుకుంటే పాక్ గెలుపుతో సమీకరణలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చిన్న జట్టైన నెదార్లాండ్స్తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సౌతాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. టీమిండియానే ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్పై గెలిస్తే తొలి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోనుండగా.. మరో బెర్తు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటుఇటు జరిగి భారత్.. జింబాబ్వే చేతిలో ఓడినా.. పాక్.. తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచినా.. మెరుగైన రన్రేట్ ఆధారంగా పాకిస్తానే సెమీస్కు వెళ్తుంది. కాబట్టి.. భారత్ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వేపై గెలిస్తేనే పాక్తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. భారత్.. జింబాబ్వేపై గెలిచి, పాకిస్తాన్.. బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో ఓడిందంటే భారత్, పాక్లు సెమీస్కు చేరకుంటాయి. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదు. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల పాయింట్ల వివరాలు.. భారత్.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లు (రన్రేట్=0.730) సౌతాఫ్రికా.. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు (రన్రేట్=1.402) పాకిస్తాన్..4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు (రన్రేట్=1.085) -
సౌతాఫ్రికాపై ఘన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సజీవం..!
టీ20 వరల్డ్కప్-2022లో దాయాది పాకిస్తాన్కు ఇంకా నూకలు ఉన్నాయి. ఇవాళ (నవంబర్ 3) జరిగిన కీలక పోరులో బాబర్ సేన.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పాక్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచి, సెమీస్ రేసులో నిలిచింది. పాక్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి రన్రేట్ ప్రకారం చూస్తే పాక్ (1.085).. భారత్ (0.730) కంటే మెరుగైన స్థితిలో ఉంది. పాక్కు సెమీస్ అవకాశాలు ఎలా అంటే.. గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు), సౌతాఫ్రికా (4 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు, 1.402), పాకిస్తాన్ జట్లు చివరిగా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్.. జింబాబ్వేతో, పాకిస్తాన్.. బంగ్లాదేశ్తో, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లో సౌతాఫ్రికా చిన్న జట్టైన నెదర్లాండ్స్పై గెలిస్తే గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. మరో బెర్తు కోసం పోటీలో.. పాక్ తమ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారీ తేడాతో గెలపొంది, భారత్.. తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడితే, మెరుగైన రన్రేట్ ఆధారంగా పాకిస్తాన్ సెమీస్కు చేరుకుంటుంది. అయితే టీమిండియానే గడగడలాడించిన బంగ్లాపై పాక్ భారీ విజయం.. పసికూన జింబాబ్వే.. టీమిండియాపై గెలవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించడంతో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 142 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. అప్పటికే సౌతాఫ్రికా 9 ఓవర్లు ఆడేసి 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసి ఉండటంతో మిగిలిన 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. -
T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు
ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. అయితే టీ20 వరల్డ్కప్-2022లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యావత్ పాకిస్తాన్.. భారత జట్టు గెలుపును ఆకాంక్షించడం విశేషం. గ్రూప్ దశలో భారత్ తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాలని పాక్ మనసార కోరుకుంటుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలవాలని పాక్ అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఎందుకంటే.. టీమిండియా సూపర్-12 గ్రూప్-2లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలుపొంది 4 పాయింట్లతో గ్రూప్ టాపర్గా ఉండగా.. ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా (2 మ్యాచ్ల్లో 3 పాయింట్లు), జింబాబ్వే (2 మ్యాచ్ల్లో 3 పాయింట్లు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్ల్లో 2 పాయింట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉండగా, నెదర్లాండ్స్ (2 మ్యాచ్ల్లో 2 పరాజయాలు) చివరి స్థానంలో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే ఆ జట్టు ఆడబోయే తదుపరి 3 మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) గెలుపొందడమే కాకుండా.. భారత్ తదుపరి ఆడబోయే 3 మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే) కూడా గెలవాల్సి ఉంటుంది. ఈ సమీకరణలతో పాటు సౌతాఫ్రికా, జింబాబ్వే ఆడబోయే 3 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితే భారత్ 10 పాయింట్లతో, పాకిస్తాన్ 6 పాయింట్లతో గ్రూప్-2 నుంచి సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఈ సమీకరణల నేపథ్యంలో గ్రూప్-2లో జరిగే ఏ మ్యాచ్కు కూడా వరుణుడు ఆటంకం కలిగించకూడదని, అలాగే భారత్.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లను చిత్తుగా ఓడించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్.. తమ తొలి మ్యాచ్లో పాక్ను, రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్పై విజయం సాధించగా, పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో, రెండో మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తైన విషయం తెలిసిందే. -
‘పాక్ పని అయిపోయింది! వచ్చే వారం టీమిండియా కూడా!’ అంత లేదులే
ICC Mens T20 World Cup 2022 - Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘మీ జట్టు విషయంలో మాత్రమే నీ అంచనాలు నిజమవుతాయిలే!’’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లో విరాట్ కోహ్లి దంచికొట్టిన విషయం తెలిసిందే. 82 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్ తర్వాత షోయబ్ అక్తర్ స్పందిస్తూ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తూనే.. ఇక టీ20లకు అతడు గుడ్ బై చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో కింగ్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. టీమిండియాను ఉద్దేశించి ఇక ఇప్పుడు అక్తర్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు అతడు టార్గెట్ అయ్యేలా చేశాయి. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అక్తర్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై కూడా స్పందించాడు. వచ్చే వారం వాళ్లు కూడా అవుట్! ఈ మేరకు ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మొదటి వారంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుందని నేను ముందే చెప్పాను. ఇక వచ్చే వారం ఇండియా వంతు! వాళ్లు కూడా టోర్నీ నుంచి అవుట్ అవుతారు. వాళ్లు సెమీస్ ఆడతారేమో గానీ.. తీస్ మార్ ఖాన్ మాత్రం కాలేరు’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్-2 టాపర్గా ఉన్న రోహిత్ సేన సెమీస్ చేరడం లాంఛనమే అని చెప్పొచ్చు. అంతేకాదు కోహ్లి, సూర్య సూపర్ ఫామ్లో ఉండటం సహా భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నీకంత సీన్ లేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు Ind Vs Ned: నాటి వరల్డ్కప్లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shoaib Akhtar predicts that India will also return home after the semis since they are also not that good (or as he says 'Tees Maar Khan'). pic.twitter.com/zj5BFnjXYI — Kanav Bali🏏 (@Concussion__Sub) October 28, 2022 -
టీమిండియా సెమీస్కు చేరడం నల్లేరుపై నడకే..!
నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (అక్టోబర్ 23) పాక్తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్కప్-2022లో ఘనంగా బోణీ కొట్టింది. మెగా టోర్నీలో భాగంగా గ్రూప్-2లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు (నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వే) ఆడాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీలో సాధించిన ఒక్క విజయంతోనే టీమిండియా సెమీస్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదెలా అంటే.. గ్రూప్-2లో భారత్తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరగ్గా.. పాక్పై భారత్, నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్, జింబాబ్వే-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ గ్రూప్లో పటిష్టమైన జట్లు, సెమీస్కు చేరే అవకాశాలు ఉన్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా అని క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్పగలుగుతారు. అయితే, సెమీస్ రేసులో నిలువగలిగిన పాకిస్తాన్ (భారత్ చేతిలో ఓటమి), సౌతాఫ్రికాలకు (జింబాబ్వేతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడం) తొలి మ్యాచ్లోనే చుక్కెదురు కావడంతో భారత్ దర్జాగా సెమీస్కు దూసుకెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్కు చేరడం నల్లేరుపై నడకే అని వారు భావిస్తున్నారు. ఈ గ్రూప్లో ఎలాగూ నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు ఉండటంతో, భారత్కు వాటిపై విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా మిగతా మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచినా దర్జాగా సెమీస్కు వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు ఎలా ఉన్నా, చిన్న జట్లే కదా అని ఏమరపాటుగా ఉంటే మాత్రం క్వాలిఫయర్స్లో వెస్టిండీస్కు పట్టిన గతి తప్పదని హెచ్చరిస్తున్నారు. కాగా, రెండు గ్రూప్ల (గ్రూప్-1, గ్రూప్-2) నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. చదవండి: కోహ్లి ఫ్యాన్స్కు కనువిందు.. రోహిత్ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..! -
Julius Baer Generation Cup: సెమీఫైనల్లో అర్జున్ ఇరిగేశి
జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేశి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో టైబ్రేకర్ ద్వారా క్రిస్టోఫర్ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. నాలుగు ర్యాపిడ్ గేమ్ల తర్వాత అర్జున్, క్రిస్టోఫర్ 2–2తో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్ టైబ్రేక్ నిర్వహించగా... తొలి గేమ్లో అర్జున్ గెలిచాడు. రెండో గేమ్ను డ్రా చేసుకున్న అతను సెమీస్ చేరాడు. అయితే మరో భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద క్వార్టర్స్లో ఓటమిపాలయ్యాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో 1–3తో ప్రజ్ఞానంద ఓడాడు. తొలి గేమ్ను ఓడి రెండు గేమ్లు డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన నాలుగో గేమ్లో కూడా పరాజయంపాలయ్యాడు. వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లీమ్ క్వాంగ్ లీ (వియత్నాం) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆరోనియన్పై కార్ల్సన్, నీమన్పై క్వాంగ్ లీ గెలుపొందారు. సెమీస్లో కార్ల్సన్తో కీమర్, క్వాంగ్ లీతో అర్జున్ తలపడతారు. -
మరో హోరాహోరీ పోరు.. ఫైనల్స్కు దూసుకొచ్చిన అల్కారాజ్
Carlos Alcaraz: స్పెయిన్ యువ కెరటం, మూడో సీడ్ కార్లోస్ అల్కారాజ్ యూఎస్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్స్కు దూసుకొచ్చాడు. ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన సెమీస్లో అల్కారాజ్.. అమెరికా ఆశాకిరణం, 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోపై 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3 తేడాతో విజయం సాధించి, ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు క్యాస్పర్ రూడ్తో ఢీకి రెడీ అయ్యాడు. అల్కారాజ్.. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో కూడా ఇదే తరహాలో పోరాడి గెలుపొందిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన క్లార్టర్స్లో 19 ఏళ్ల అల్కారాజ్.. 11వ సీడ్, ఇటలీ ఆటగాడు సిన్నర్పై 6-7, (7/9), 6-7 (0/7), 7-5, 6-3 తేడాతో గెలుపొందాడు. 315 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో అల్కారాజ్, సిన్నర్లు ఇద్దరు కొదమ సింహాల్లా పోరాడారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఈ మ్యాచ్ రెండో సుదీర్ఘ సమరంగా రికార్డుల్లోకెక్కడం విశేషం. Never give up! 💪🏻 See you on Sunday, NYC! 🗽😍 @usopen 📸 Getty Images pic.twitter.com/u5ftKBn0Pp — Carlos Alcaraz (@carlosalcaraz) September 10, 2022 కాగా, ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అల్కారాజ్ అదిరిపోయే రీతిలో విజృంభిస్తున్నాడు. క్వార్టర్స్, సెమీస్లో సుదీర్ఘ పోరాటాలు చేసి ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరాడు. అల్కారాజ్..రఫెల్ నదాల్ తర్వాత (2019 నుంచి) యూఎస్ ఓపెన్ ఫైనల్కు చేరిన రెండో స్పెయిన్ ఆటగాడు కావడం మరో విశేషం. -
తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్కు చేరిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్
మహిళల సింగిల్స్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు చేరింది. ఈ గేమ్ తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్.. రెండో గేమ్లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెట్లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్లో స్వియాటెక్.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా).. ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో తొలి సెమీస్లో తలపడనున్నాడు. మరో సెమీస్ సమరంలో నంబర్ 3 ర్యాంకర్ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ -
సెమీ ఫైనల్లో తెలంగాణ ముద్దుబిడ్డ అగసార నందిని
కొలంబియాలోని కాలిలో జరుగుతున్న అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అగసార నందిని సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. 100 మీ. హర్డిల్స్ పరుగును ఆమె 13.58 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నందిని కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. గతంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 13.70 సెకన్లుగా ఉంది. హీట్స్లో మూడో స్థానంలో నిలవడంతో నందిని సెమీస్కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప 36వ స్థానంలో నిలిచి నిష్క్రమించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో కూడా నందిని సెమీస్ చేరగలిగింది. సెమీస్లో 14.16 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఆమె ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. -
సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు.. బాక్సింగ్లో అరడజను పతకాలు ఖరారు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో గెలుపొందింది. స్క్వాష్లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్లో మంజు బాల ఫైనల్కు అర్హత సాధించగా.. స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్లో స్టార్ షట్లర్లు సింధు, శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్కు చేరారు. చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్ -
French Open 2022: వారెవ్వా.. రోహన్ బోపన్న తొలిసారి..
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న(భారత్)- మిడిల్కూప్(నెదర్లాండ్స్) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్ ట్రై బ్రేక్లో లాయిడ్ గ్లాస్పూల్(బ్రిటన్)- హెలియోవారా(ఫిన్లాండ్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనల్ చేరాడు. The first men’s doubles semi-final is set! 🇸🇻🇳🇱Arevalo/Rojer 🆚 Bopanna/Middelkoop 🇮🇳🇳🇱#RolandGarros pic.twitter.com/66zNDLzmgZ — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
సందడిగా ‘సాక్షి’ స్పెల్బీ సెమీ ఫైనల్స్
మూసాపేట/హైదరాబాద్: ‘సాక్షి’ స్పెల్బీ సెమీఫైనల్స్ పోటీలు ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని మెరిడియన్ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్బీ పోటీలకు హాజరయ్యారు. నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్లో పోటీ పడ్డారు. మెయిన్ స్పాన్సర్స్గా డ్యూక్ వప్పీ అసోసియేషన్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. –వకుళ, మీర్పేట్ విద్యార్థిని తల్లి కొత్త పదాలు తెలుసుకున్నా ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను. స్పెల్ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్ వరకు రావటం ఆనందంగా ఉంది. – సహస్ర మారెడ్డి, మీర్పేట్ చాలా విషయాలు తెలిశాయి ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి. –హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని పోటీతత్వం పెరుగుతుంది ‘సాక్షి’ స్పెల్బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. – అరుణ, విద్యార్థిని తల్లి -
సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రోమ్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెక్సా గ్వరాచి (చిలీ)– ఆంద్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–హర్డెస్కా జంట నాలుగు ఏస్లు సంధించింది. -
పీవీ సింధుకు నిరాశ.. టోర్నీ నుంచి అవుట్!
Korea Open 2022: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్ సియోంగ్ చేతిలో సింధు సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. పామా స్టేడియం వేదికగా శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సియోంగ్ ఆది నుంచి దూకుడైన ఆటతో ముందుకు సాగింది. తొలి గేమ్లో అయితే సింధుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఇక వరుస గేమ్లలో ఆధిపత్యం కనబరిచిన సియోంగ్ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. 20 ఏళ్ల సియోంగ్ ఫైనల్కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్లాండ్)ను ఓడించిన సంగతి తెలిసిందే. బుసానన్పై 17వ సారి విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. కానీ.. సెమీ ఫైనల్లో మాత్రం విజయయాత్రను కొనసాగించలేకపోయింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది. An Seyoung goes to the Korea Open 2022 finals by defeating Pusarla V. Sindhu!!!!! What a game!🔥🔥😭#KoreaOpen2022 pic.twitter.com/fwluApklwQ — willie (@willeyhhfixeu) April 9, 2022 -
అదరగొట్టిన గుర్జీత్ కౌర్... సెమీఫైనల్లో భారత్
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భాగంగా సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఆరు పాయింట్లతో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ మూడు గోల్స్ చేయగా... జ్యోతి, మోనిక రెండు గోల్స్ చొప్పున సాధించారు. వందన, మరియానా కుజుర్ ఒక్కో గోల్ చేశారు. బుధవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. మళ్లీ అగ్రస్థానానికి హైదరాబాద్ ఎఫ్సీ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఐదో విజయంతో మళ్లీ టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుతో గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. హైదరాబాద్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నైజీరియా మాజీ ప్లేయర్ ఒగ్బెచె మూడు గోల్స్ (21వ, 44వ, 74వ ని.లో) చేయగా... అనికేత్ (45వ ని.లో) ఒక గోల్ సాధించాడు. 12 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఖాతాలో 20 పాయింట్లున్నాయి. -
ఫైనల్కు దూసుకెళ్లిన పీవీ సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్లో ఈవ్జెనియా కొసెత్స్కయా రిటైర్డ్హర్ట్ కావడంతో సింధుకు బై లభించి ఫైనల్కు చేరుకుంది. కాగా తొలి సెట్ను సింధు సొంతం చేసుకుంది. అంతకముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన ఆరవ సీడ్ సుపనిద కతేథింగ్పై 11-21,21-12,21-17 తేడాతో ఓడించిన సింధు సెమీస్కు చేరింది. ఇక ఫైనల్లో పీవీ సింధు.. మరో భారత క్రీడాకారిణి మాలవిక భన్సోద్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణోయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్తో జరిగిన మ్యాచ్లో 21-19,21-16 తేడాతో ప్రణోయ్ ఓటమి పాలయ్యాడు. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ ఇషాన్ భట్నాగర్–సాయి ప్రతీక్ (భారత్) జంటను ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం రష్యాకు చెందిన అనస్తాసియా అక్చురినా-ఓల్గా మొరోజోవా ద్వయంపై 24-22 21-10 తేడాతో గెలిచి సెమీస్లో అడుగపెట్టారు. -
Asian Champions Trophy Hockey: తిరుగులేని భారత్.. జపాన్పై ఘన విజయం
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఇవాళ జపాన్తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. 6-0 గోల్స్తో చెలరేగిపోయింది. తద్వారా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచి సెమీస్కు దూసుకెళ్లింది. హర్మన్ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10, 53వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దిల్ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు. రౌండ్ రాబిన్ స్టేజ్లో భారత్(10 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది. చదవండి: BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్.. -
తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. సెమీ ఫైనల్లో హైదరాబాద్
Syed Mushtaq Ali Trophy-Hyderabad Enter Into Semi-Finals: దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో గుజరాత్ను ఓడించింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా...కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (16 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. రిపాల్ పటేల్ (24 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. టి. రవితేజ (3/27), సీవీ మిలింద్ (2/28) కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కర్నాటక సూపర్ ఓవర్తో... కర్నాటకతో క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ విజయలక్ష్యం 161 పరుగులు...చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, 2 సిక్స్లు, ఫోర్ సహా తొలి ఐదు బంతుల్లో బెంగాల్ 19 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించిన ఆకాశ్ దీప్ను మనీశ్ పాండే డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. దాంతో స్కోరు సమమైన మ్యాచ్ ‘సూపర్ ఓవర్’కు వెళ్లింది. బెంగాల్ 5 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోగా...కర్నాటక 2 బంతుల్లో ఆట ముగించింది. అంతకు ముందు కర్నాటక 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (29 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం రితిక్ ఛటర్జీ (51) అర్ధసెంచరీ సహాయంతో బెంగాల్ కూడా 160 పరుగులు చేయగలిగింది. తమిళనాడు, విదర్భ కూడా... కేరళపై 5 వికెట్లతో గెలిచిన తమిళనాడు సెమీస్ చేరింది. ముందుగా కేరళ 4 వికెట్లకు 181 పరుగులు చేయగా, తమిళనాడు 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. మరో క్వార్టర్స్లో విదర్భ 9 వికెట్లతో రాజస్తాన్ను చిత్తు చేసింది. రాజస్తాన్ 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితం కాగా...విదర్భ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శనివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో తమిళనాడుతో హైదరాబాద్...విదర్భతో కర్నాటక తలపడతాయి. -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్పై విజయం సాధించింది. తొలి సెమీస్లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
దయచేసి అర్థం చేసుకోండి.. టీమిండియాను తిట్టొద్దు
Gautam Gambhir urges fans to not go harsh on Team India: టీ20 ప్రపంచ కప్ 2021లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా ప్రయాణం ముగిసింది. నవంబర్7న జరిగిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ సెమిస్ ఆశలు అవిరియ్యాయి. 2012 తర్వాత ఐసీసీ ఈవెంట్లో భారత్ నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు కోహ్లి సేనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. ఆటగాళ్లు చాలా కాలం పాటు బయో బబుల్లో ఉన్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులను గంభీర్ అభ్యర్థించాడు. "టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత పేలవ ప్రదర్శన చూసి నేను కూడా భాదపడ్డాను. అయితే ఆటగాళ్లు చాలా కాలం నుంచి బయో బబుల్లో ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి. మనకు వినోదం పంచడానికి వాళ్లు బయో బబుల్ జీవితాన్ని గడుపుతున్నారు. దీంట్లో వాళ్లు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఈ మెగా టోర్న్మెంట్లో మీరు బాగా ప్రయత్నించారు బాయ్స్" అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్లో సూపర్ 12లో డ్రా అయిన రెండు గ్రూపుల మధ్య జట్లలో తేడాలున్నాయని అతడు తెలిపాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రౌండ్-రాబిన్ కాకుండా 2019 ప్రపంచ కప్ వంటి లీగ్ ఫార్మాట్ను నిర్వహించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. చదవండి: Virat Kohli- Rohit Sharma: ‘ఆఖరి మ్యాచ్లో కోహ్లి... రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి’ -
సెమీస్ బెర్తులు ఖరారు.. ఆసీస్తో పాక్, ఇంగ్లండ్తో న్యూజిలాండ్ 'ఢీ'
England Take On Kiwis, Pakistan Take On Australia In Semi Finals Of T20 WC 2021: టీ20 ప్రపంచకప్-2021లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఇదివరకే సెమీస్కు చేరుకోగా.. ఇవాళ(నవంబర్ 7) అఫ్గానిస్థాన్పై గెలుపుతో న్యూజిలాండ్ గ్రూప్-2 నుంచి తమ సెమీస్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది. ఈ గ్రూప్ నుంచి పాక్ ఇదివరకే సెమీస్ చేరుకుంది. సెమీస్లో గ్రూప్-1 టాపర్ అయిన ఇంగ్లండ్.. న్యూజిలాండ్(గ్రూప్-2లో సెకెండ్ ప్లేస్)తో తలపడనుండగా, గ్రూప్-2 టాపర్ పాక్.. ఆస్ట్రేలియా(గ్రూప్-1 సెకెండ్ ప్లేస్)ను ఢీ కొట్టనుంది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ అబుదాబి వేదికగా నవంబర్ 10న జరగనుండగా.. పాకిస్థాన్- ఆస్ట్రేలియా మ్యాచ్ నవంబర్ 11న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్లు నవంబర్ 8న జరిగే భారత్- నమీబియా మ్యాచ్తో సంబంధం లేకుండా జరగనున్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అరుదైన రికార్డు -
టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ ఔట్.. సెమీస్కు న్యూజిలాండ్
New Zealand qualified To Semis, Team India And Afghanistan Out Of Tourney: టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్లు నిష్క్రమించాయి. ఇవాళ(నవంబర్ 7న) కివీస్తో జరిగిన కీలక మ్యాచ్లో అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూడడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా న్యూజిలాండ్ సెమీస్కు దర్జాగా దూసుకెళ్లింది. ఈ విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరే రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలతో పాకిస్థాన్ సెమీస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/17), టిమ్ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్(1/24) అప్గాన్ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం అఫ్గాన్లు నిర్ధేశించిన 125 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు), డెవాన్ కాన్వే(32 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) కివీస్ను విజయతీరాలకు చేర్చారు. 3 వికెట్లతో సత్తా చాటిన ట్రెంట్ బౌల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న భార్యపై కేసు పెట్టిన భర్త -
అఫ్గాన్ అద్భుతం చేసేనా? టీమిండియా పరిస్థితి ఏంటో!
టి20 ప్రపంచకప్లో భారత జట్టు సూపర్–12 దశలో నిష్క్రమిస్తుందా లేక సెమీస్ రేసులో ఉంటుందా అనేది నేడు తేలిపోనుంది. అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి మధ్యాహ్నం జరిగే గ్రూప్–2 లీగ్ మ్యాచ్ ఈ రెండు జట్లతోపాటు భారత్కూ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే న్యూజిలాండ్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్కు చేరుకుంటుంది. భారత్, అఫ్గానిస్తాన్ కథ ముగుస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్ జట్టు విజయం సాధిస్తే మాత్రం న్యూజిలాండ్ ప్రస్థానం ముగుస్తుంది. భారత్ సెమీస్ రేసులో నిలుస్తుంది. న్యూజిలాండ్ను అఫ్గానిస్తాన్ ఓడించినప్పటికీ ఆ జట్టుకు సెమీస్ బెర్త్ అనేది భారత్, నమీబియా మధ్య సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్స్టోరీ) రన్రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (1.481), న్యూజిలాండ్ (1.277) జట్లకంటే భారత్ (1.619) మెరుగ్గా ఉంది. ఒకవేళ న్యూజిలాండ్పై అఫ్గానిస్తాన్ అద్భుతం చేసి గెలిస్తే... నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే తమకు సెమీస్ బెర్త్ ఖరారవుతుందనే విషయం భారత్కు కచ్చి తంగా తెలుస్తుంది కాబట్టి టీమిండియా ఓడితేనే అఫ్గానిస్తాన్కు సెమీస్ బెర్త్ లభిస్తుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అఫ్గానిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ముందు అఫ్గానిస్తాన్ ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి. అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ ముఖాముఖిగా తొలిసారి తలపడనున్నాయి. (చదవండి: T20 WC 2021: బ్రావోతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్) -
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్కు.. దక్షిణాఫ్రికా కొంపముంచిన బంగ్లా ఇన్నింగ్స్!
దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 190 పరుగులు... 87 పరుగులు చేస్తే సెమీస్కు ఇంగ్లండ్... 10.4వ ఓవర్లో ఆ పరుగు వచ్చేసింది... 106 పరుగులు చేస్తే గ్రూప్లో అగ్రస్థానం... 12.1వ ఓవర్లో అదీ జరిగిపోయింది... 132 పరుగులు చేస్తే ఆసీస్కు సెమీస్ అవకాశం... 15.2వ ఓవర్లో ఆ స్కోరు రావడంతో కంగారూ టీమ్లో ఆనందం...చివరి మ్యాచ్లో గెలిచినా దురదృష్టం వెంటాడటంతో సఫారీ జట్టు మరోసారి ఐసీసీ టోర్నీ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్–1 టాపర్గా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా రన్రేట్ ఆధారంగా ఇంగ్లండ్కు అగ్రస్థానం దక్కగా... అదే తరహాలో మెరుగైన రన్రేట్తో రెండో స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా కూడా సెమీస్కు అర్హత పొందింది. ఈ మూడు టీమ్లు 4 విజయాలు, 8 పాయింట్లతో సమానంగా నిలవగా... పోటీలో దక్షిణాఫ్రికా వెనకబడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 13.3 ఓవర్లు తీసుకోవడం చివరకు దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీసింది. తాజా ఫలితంతో సెమీస్లో పాకిస్తాన్తో ఆస్ట్రేలియా పోరు ఖాయమైపోయింది. (చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్) షార్జా: టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్కు చివరి లీగ్ మ్యాచ్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ డర్ డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు) అద్భుతంగా ఆడగా... మార్క్రమ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కూడా దూకుడైన అర్ధ సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ (27 బంతుల్లో 34; 4 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు సాధించింది. మొయిన్ అలీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు), డేవిడ్ మలాన్ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్లు), బట్లర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్ (15 బంతుల్లో 20 రిటైర్డ్హర్ట్; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జోడించారు. కగిసో రబడ (3/48) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (వోక్స్, మోర్గాన్, జోర్డాన్) తీసి ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్గా రబడ గుర్తింపు పొందాడు. (చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్) వార్నర్ వీరవిహారం అబుదాబి: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్కు తోడు మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాకు చివరి లీగ్ మ్యాచ్లో విజయం దక్కింది. ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా... ఎవిన్ లూయిస్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్మైర్ (28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోష్ హాజల్వుడ్ (4/39) విండీస్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన విండీస్ చివరకు ఒకే ఒక విజయంతో టోర్నీని ముగిచింది. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్కు డ్వేన్ బ్రావో గుడ్బై చెప్పగా... క్రిస్ గేల్ కూడా తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. (చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్స్టోరీ) స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) కమిన్స్ 15; లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29; పూరన్ (సి) మార్ష్ (బి) హాజల్వుడ్ 4; ఛేజ్ (బి) హాజల్వుడ్ 0; హెట్మైర్ (సి) వేడ్ (బి) హాజల్వుడ్ 27; పొలార్డ్ (సి) మ్యాక్స్వెల్ (బి) స్టార్క్ 44; బ్రావో (సి) వార్నర్ (బి) హాజల్వుడ్ 10; రసెల్ (నాటౌట్) 18; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–35, 3–35, 4–70, 5–91, 6–126, 7–143. బౌలింగ్: స్టార్క్ 4–0–33–1, హాజల్వుడ్ 4–0–39–4, కమిన్స్ 4–0–37–1, మ్యాక్స్వెల్ 1–0–6–0, మార్ష్ 3–0–16–0, జంపా 4–0–20–1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 89; ఫించ్ (బి) హొసీన్ 9; మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53; మ్యాక్స్వెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–33, 2–157. బౌలింగ్: హొసీన్ 4–0–29–1, రోస్టన్ ఛేజ్ 1.2–0–17–0, జేసన్ హోల్డర్ 2–0–26–0, డ్వేన్ బ్రావో 4–0–36–0, వాల్ష్ 2–0–18–0, ఆండ్రీ రసెల్ 2–0–25–0, గేల్ 1–0–7–1. -
T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్కు.. లేదంటే..
T20 World Cup 2021 Chances Of India Will Be In Semi Finals Explained: ‘‘పాకిస్తాన్ విజయంలో భారత అభిమానుల ప్రార్థనలు కూడా ఉన్నాయి... పాక్ న్యూజిలాండ్ను ఓడించడం వాళ్లకు సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే.. మనం ఈరోజు కివీస్ చేతిలో ఓడి ఉంటే కోహ్లి సేన ఇబ్బందుల్లో పడేది. ఒక రకంగా మనం వాళ్లను సేవ్ చేసినట్లే.. ఫైనల్లో టీమిండియా కోసం ఎదురుచూద్దాం’’- అక్టోబరు 26న పాకిస్తాన్ న్యూజిలాండ్ను ఓడించిన తర్వాత ఆ దేశ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. నిజమే అతడు అన్న మాటల్లో వాస్తవం ఉంది. ఒకవేళ పాక్ గనుక కివీస్పై విజయం సాధించకపోయి ఉంటే కోహ్లి సేన కష్టాల్లో పడేది. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో ముందుకు సాగాలంటే.. భారత్తో పాటు పాకిస్తాన్ కూడా విలియమ్సన్ బృందంపై తప్పక గెలుపొంది తీరాలి. బాబర్ ఆజం టీమ్ వాళ్ల పని పూర్తి చేసింది. ఇక అక్టోబరు 31 నాటి మ్యాచ్లో టీమిండియా కివీస్ను చిత్తు చేస్తేనే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదెలాగో ఓ సారి పరిశీలిద్దాం. సూపర్-12.. గ్రూపు-2 టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ సూపర్-12లో రెండు గ్రూపు-1, గ్రూప్-2లు ఉన్నాయి. క్వాలిఫైయర్స్లో భాగంగా గ్రూపు-ఏ, గ్రూపు-బి టాపర్లుగా నిలిచిన నాలుగు జట్లలో.. గ్రూపు-1లో రెండు, గ్రూపు-2లో రెండు చేరాయి. ఆ రెండు పసికూనలు గ్రూపు-2 విషయానికొస్తే.. సూపర్-12కు నేరుగా అర్హత సాధించిన.. 4 జట్లలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ ఉన్నాయి. లీగ్ దశలో భాగంగా.. తొలిసారిగా టోర్నీకి అర్హత సాధించిన నమీబియాతో పాటు స్కాట్లాండ్ సంచలన విజయాలు నమోదు చేసి ఈ గ్రూప్లో చేరాయి. పాకిస్తాన్ సంగతి ఇది ఇక పాయింట్ల పరంగా చూసుకుంటే... పాకిస్తాన్ ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్పై వరుస విజయాలతో 4 పాయింట్లు సాధించింది. తద్వారా ప్రస్తుతం గ్రూపు-2 టాపర్గా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమకు తదుపరి మ్యాచ్లలో ఎదురయ్యే పసికూనలు అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ను ఓడిస్తే.. మరో ఆరు పాయింట్లు.. అంటే మొత్తంగా 10 పాయింట్లు వస్తాయి. దీంతో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే. బాబర్ ఆజం బృందం ఫామ్ చూస్తుంటే సెమీ ఫైనల్ చేరడం అంతకష్టం కాదని స్పష్టమవుతోంది. అఫ్గనిస్తాన్ సంచలన విజయంతో మరోవైపు.. స్కాట్లాండ్పై 130 పరుగుల తేడాతో విజయం సాధించి అప్గనిస్తాన్(2 పాయింట్లు) సైతం బోణీ కొట్టింది. రన్రేటు పరంగా పాకిస్తాన్ కంటే కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. టీమిండియా ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియాకు ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. గెలిస్తేనే ముందుకు సాగే పరిస్థితి. గ్రూపు-2లో మిగిలిన మూడు చిన్న జట్లతో పాటు బలమైన న్యూజిలాండ్ను కోహ్లి సేన తప్పక ఓడించాలి. అలా అయితేనే భారత్కు 8 పాయింట్లు వస్తాయి. ఇదిలా ఉంటే... న్యూజిలాండ్ది కూడా ఇదే పరిస్థితి. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి... మిగిలిన నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాటి పోరు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఒకవేళ పాకిస్తాన్ గనుక కివీస్ను ఓడించి ఉండకపోతే... మన పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. కాగా గ్రూపు-1, గ్రూపు-2లో టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్కు చేరతాయన్న సంగతి తెలిసిందే. చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ బౌట్లో ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్)పై గెలిచింది. -
TOKYO OLYMPICS: ‘లవ్లీ’ పంచ్
లవ్లీనా బొర్గొహైన్... ఈ పేరు భారత క్రీడాభిమాని ఇక ఎప్పటికీ మరచిపోలేడు. టోక్యో ఒలింపిక్స్లో ‘పంచ్ పవర్’ తగ్గుతూ ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ నేనున్నానంటూ లవ్లీనా తన పదును చూపించింది. అద్భుతమైన ఆటతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది. టోక్యో: 2020 ఒలింపిక్స్లో మరో మహిళ భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (69 కేజీల విభాగం)లో లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ నీన్–చిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత బాక్సర్... చివరి మూడు నిమిషాల్లో సమర్థవంతమైన డిఫెన్స్తో ప్రత్యర్థిని నిరోధించి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో చెన్ చిన్ చేతిలో ఓడిన లవ్లీనా ఈసారి ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్లో ముగ్గురు జడ్జీలు భారత బాక్సర్కు 10 పాయింట్లు ఇవ్వగా, రెండో రౌండ్లో ఆమె జోరుకు ఐదుగురూ 10 పాయింట్ల చొప్పున అందజేయడం విశేషం. మూడో రౌండ్లోనూ నలుగురు జడ్జీలు లవ్లీనాకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన ఈ అస్సాం బాక్సర్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకుంటూ ఒలింపిక్ పతకంతో మెరిసింది. ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో ఆమె ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే ఒలింపిక్ చరిత్రలో భారత బాక్సింగ్ ఘనత కూడా కాంస్యాన్ని (మేరీకోమ్, విజేందర్) దాటి మరింత మెరుగైన స్థితికి చేరుతుంది. తాను గెలిచినట్లు రిఫరీ ప్రకటించగానే ఆనందం పట్టలేక 23 ఏళ్ల లవ్లీనా స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరిచేసింది! సిమ్రన్జిత్కు నిరాశ... 60 కేజీల విభాగంలో తలపడిన మరో భారత బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ ఓటమితో ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. థాయ్లాండ్కు చెందిన సుదపొర్న్ సిసొండీ 5–0తో సిమ్రన్ను చిత్తు చేసింది. థాయ్లాండ్ బాక్సర్ ఆరంభం నుంచి చివరి వరకు సిమ్రన్పై ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఆమె ‘లెఫ్ట్ హుక్’లకు సిమ్రన్ వద్ద జవాబు లేకపోయింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రతీసారి సుదపొర్న్కు పర్ఫెక్ట్ ‘10’ పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇద్దరికీ కాంస్యం ఎందుకు? ఒలింపిక్స్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోరు జరుగుతుంది. సెమీస్లో ఓడిన ఇద్దరు కంచు పతకం కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండా పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్లో ఓడిన బాక్సర్పై ప్రత్యర్థి పంచ్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు. వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే కాంస్యం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి మూడో స్థానం మ్యాచ్ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని చెప్పవచ్చు! ఆమె చేతిలో నేను గతంలో నాలుగుసార్లు ఓడాను. ఇప్పుడు మాత్రం బెదరకుండా దూకుడుగా పంచ్లు విసరాలని నిర్ణయించుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి వంద శాతం నా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాను. సరిగ్గా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించిది. ఆమె గురించి బాగా తెలుసు కాబట్టి కొత్తగా ప్రణాళిక, వ్యూహం అవసరమే రాలేదు. సెమీస్ పోరుకు తగినంత సమయం ఉంది కాబట్టి వీడియో ద్వారా ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తా. గతంలో రింగ్లో దిగేటప్పుడు కొంత భయం వేసేది. ఇప్పుడు అది దూరం కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కానీ... బాక్సింగ్లాంటి క్రీడలో ప్రశాంతంగా ఉండలేం. అనుకోకుండానే ఆవేశాన్ని ప్రదర్శిస్తాం. తాజా ఘనత గురించి ఇప్పుడే వివరంగా మాట్లాడలేను. ఇంకా ఆట మిగిలి ఉంది కదా. –లవ్లీనా బొర్గొహైన్ -
ఎదురులేని ఇంగ్లండ్
రోమ్: యూరో కప్ టోర్నీలో ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్ (4వ, 50 ని.లో) చేయగా... మగురె (46వ ని.లో), హెండర్సన్ (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం లండన్లో జరిగే సెమీఫైనల్లో డెన్మార్క్తో ఇంగ్లండ్ ఆడుతుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరో కప్ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ చివరిసారి ఈ టోర్నీలో 1996లో సెమీఫైనల్ చేరింది. 1966 ప్రపంచకప్ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4–2తో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఓ పెద్ద టోర్నీ నాకౌట్ మ్యాచ్లో నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. -
French Open: ‘కింగ్’కు చెక్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్... 105 విజయాలు... కేవలం 2 మ్యాచ్లలో ఓటమి... ఆ గడ్డపై అతడిని ఓడించడం సంగతి దేవుడెరుగు... అలాంటి ఆలోచన రావడం కూడా ఒక సాహసమే. కానీ ఎర్రమట్టిపై ఎదురులేని రారాజు ఎట్టకేలకు ‘జోకర్’ జోరుకు తలవంచాడు. అద్భుతమైన ఆట, పక్కా ప్రణాళికతో చెలరేగిన నొవాక్ జొకోవిచ్ ... ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్పై రొలాండ్ గారోస్లో రెండోసారి విజయం సాధించి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్లో 14వ ట్రోఫీతో పాటు అత్యధిక గ్రాండ్స్లామ్ (21)ల విజయాన్ని అందుకోవాలని భావించిన నాదల్ ప్రయాణం సెమీస్లో ఆగిపోగా... 19వ గ్రాండ్స్లామ్ వేటకు వరల్డ్ నంబర్వన్ సన్నద్ధమయ్యాడు. తుది ఫలితం ఎలా ఉన్నా టెన్నిస్ చరిత్రలో అద్భుత మ్యాచ్లలో ఒకటిగా ఈ పోరు నిలిచిపోయింది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్లో అత్యంత అరుదుగా కనిపించే ఘట్టం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి ఎవరైనా ఎర్ర మట్టి కోర్టులో విరుచుకుపడే రాఫెల్ నాదల్కు టోర్నీ సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన పోరులో జొకోవిచ్ (సెర్బియా) 3–6, 6–3, 7–6 (7/4), 6–2తో మూడో సీడ్ నాదల్ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ను రెండుసార్లు ఓడించిన (2015 క్వార్టర్ ఫైన ల్లో) ఏకైక ఆటగాడిగా జొకోవిచ్ నిలవగా... ‘స్పెయిన్ బుల్’కు మరో ఓటమి సోడెర్లింగ్ (స్వీడన్–2009 ప్రిక్వార్టర్స్) చేతిలో ఎదురైంది. హోరాహోరీ... తొలి సెట్ను నాదల్... రెండో సెట్ను జొకోవిచ్ నెగ్గగా... మూడో సెట్లో ఇద్దరూ ఒక్కో పాయింట్, గేమ్ కోసం తీవ్రంగా శ్రమించారు. టెన్నిస్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని గొప్ప ఆటను ఇద్దరూ చూపించారు. సర్వీస్లు నిలబెట్టుకుంటూ వెళ్లిన అనంతరం బ్రేక్ సాధిం చిన జొకోవిచ్ ఒక దశలో 5–3తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే నాదల్ తగ్గలేదు. పోరాటపటిమ ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్లు గెలిచి 6–5తో ముందంజ వేశాడు. దురదృష్టవశాత్తూ ఇక్కడ నాదల్ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. సెట్ పాయింట్ కోసం సర్వ్ చేసిన అతను డబుల్ ఫాల్ట్ చేశాడు. టైబ్రేక్లో జొకోవిచ్కు ఇబ్బంది ఎదురు కాలేదు. 93 నిమిషాల్లో జొకోవిచ్ మూడో సెట్ గెలుచుకున్నాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే బ్రేక్ సాధించిన నాదల్ 2–0తో ఆధిక్యంలో నిలిచినా... ఆ తర్వాత జొకోవిచ్ చెలరేగిపోయాడు. వరుసగా ఆరు గేమ్లు నెగ్గి నాదల్ 14వ టైటిల్ ఆశలను సెమీస్లోనే ముగించాడు. పారిస్ ఆగిపోయింది... నాదల్, జొకోవిచ్ మ్యాచ్ కోసం ప్రభుత్వ అధికారులు కూడా కరోనా నిబంధనల నుంచి సడలిం పునిచ్చారు. పారిస్లో రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ ఉండటంతో 10:30కే అభిమానులు స్టేడి యం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఉన్నా యి. అయితే ఆ సమయంలో మ్యాచ్ ఉత్కంఠభరిత స్థితిలో ఉంది. ప్రేక్షకులు కాస్త నిరాశగా కనిపిస్తున్న దశలో మ్యాచ్ ముగిసే వరకు ఉండవచ్చంటూ అధికారులు ప్రకటించడం విశేషం. నేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–2తో సిట్సి పాస్పై ఆధిక్యంలో ఉన్నాడు. గత ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లో ఐదు సెట్ల పోరాటంలో సిట్సిపాస్పై జొకోవిచ్ గెలిచాడు. మూడో సెట్లో నేను సెట్ పాయింట్ కోల్పోవడం మ్యాచ్లో కీలక మలుపు. డబుల్ ఫాల్ట్ చేయడంతో పాటు టైబ్రేక్లో సులువైన వాలీలు ఆడలేకపోయాను. అయితే ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇలాంటి తప్పలు సహజం. కానీ మ్యాచ్లు గెలవాలంటే ఇలాంటి తప్పులే చేయరాదు. నేను నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చి పోరాడాను. కానీ ఈ రోజు నాది కాదు. –రాఫెల్ నాదల్ నాదల్కు ప్రత్యర్థిగా మైదానంలోకి దిగుతున్నప్పుడే అతడిని ఇక్కడ ఓడించాలంటే ఎవరెస్ట్ ఎక్కినంత శ్రమించాలనే విషయం నాకు తెలుసు. రొలాండ్ గారోస్లో ఇది నా అత్యుత్తమ మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కెరీర్లో బెస్ట్–3లో ఇదొకటి. గత 15 ఏళ్లుగా ఈ కోర్టును శాసిస్తున్న వ్యక్తిని ఓడించడం ఎప్పటికీ ప్రత్యేకం. నేను శారీరకంగా, మానసికంగా చాలా అద్భుతంగా ఉండటంతో పాటు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగా. గత ఏడాది ఫైనల్కంటే మెరుగ్గా ఆడాలంటే ఏం చేయాలనేదానిపై స్పష్టమైన వ్యూహాలతో ఉన్నా. అందుకే తొలి సెట్ ఓడినా ఆందోళన చెందలేదు. –జొకోవిచ్ -
French Open: వీరోచిత పోరాటంతో...
ఆరుసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన రష్యా సీనియర్ ప్లేయర్ పావ్లుచెంకోవా... గ్రాండ్స్లామ్ టోర్నీలలో ఏనాడూ రెండో రౌండ్ దాటి ఎరుగని స్లొవేనియా అమ్మాయి తామర జిదాన్సెక్... అసమాన ఆటతీరును ప్రదర్శంచి తమ కలను నిజం చేసుకున్నారు. తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్లో జిదాన్సెక్ 2 గంటల 26 నిమిషాల్లో పౌలా బదోసపై... పావ్లుచెంకోవా 2 గంటల 33 నిమిషాల్లో ఇలెనా రిబాకినాపై పైచేయి సాధించి గురువారం జరిగే సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. పారిస్: ఒకవైపు అపార అనుభవజ్ఞురాలు... మరోవైపు అంతగా అనుభవంలేని అమ్మాయి... ఒకేరోజు తమ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. తుదికంటా పోరాడితే అనుకున్న ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు. ఆ ఇద్దరే అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా), తామర జిదాన్సెక్ (స్లొవేనియా). ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం ఈ ఇద్దరూ కళ్లు చెదిరే ఆటతో అందరి మనసులు గెల్చుకున్నారు. 31వ సీడ్, పావ్లుచెంకోవా 6–7 (2/7), 6–2, 9–7తో 21వ సీడ్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్)పై... అన్సీడెడ్ జిదాన్సెక్ 7–5, 4–6, 8–6తో 33వ సీడ్ పౌలా బదోస (స్పెయిన్)పై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నారు. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి గ్రాండ్స్లామ్ సెమీఫైనల్ కావడం విశేషం. పావ్లుచెంకోవా గతంలో ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడి ఏడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించింది. నేడు జరిగే మరో రెండు క్వార్టర్ ఫైనల్స్లో అమెరికా టీనేజర్ కోకో గాఫ్తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్); డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో మరియా సాకరి (గ్రీస్) తలపడతారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–3, 6–4తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... బదోసతో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ జిదాన్సెక్ కీలకదశలో అద్భుతంగా ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. తొలి సెట్లో ఒకదశలో 0–3తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని సెట్ను నెగ్గిన జిదాన్సెక్ రెండో సెట్లో 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఆమె అనూహ్యంగా తడబడి బదోసాకు వరుసగా నాలుగు గేమ్లు కోల్పోయి సెట్ను సమర్పించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 6–6 వద్ద తన సర్వీస్లో 15–40తో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకున్న జిదాన్సెక్ వరుసగా రెండు కళ్లు చెదిరే ఫోర్హ్యాండ్ షాట్లతో 40–40తో ‘డ్యూస్’ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 7–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం బదోస సర్వీస్ను కూడా బ్రేక్ చేసి జిదాన్సెక్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు నెగ్గిన జిదాన్సెక్ ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. అనుభవం కలిసొచ్చింది... రిబాకినాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పావ్లుచెంకోవా నెమ్మదిగా మ్యాచ్పై పట్టు సంపాదించింది. తొలి సెట్లో 1–4తో వెనుకబడినా... ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్లో రిబాకినా పైచేయి సాధించింది. రెండో సెట్లో పావ్లుచెంకోవా ఆరో గేమ్లో, ఎనిమిదో గేమ్లో రిబాకినా సర్వీస్ను బ్రేక్ చేసి 6–2తో సెట్ను దక్కించుకుంది. కెరీర్లో ఆడిన ఏడు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో మూడో రౌండ్ దాటి ఎరుగని రిబాకినా... 51 గ్రాండ్స్లామ్ టోర్నీ లు ఆడిన అనుభవమున్న పావ్లుచెంకోవా ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు అనుభవజ్ఞురాలైన పావ్లుచెంకోవా తన ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని దక్కించుకుంది. జ్వెరెవ్ తొలిసారి సెమీస్లో... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1తో ఫోకినా (స్పెయిన్)పై నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. -
Rafael Nadal: ప్రతీకారం తీర్చుకున్న నాదల్!
రోమ్: వారం రోజుల క్రితం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జ్వెరెవ్పై గెలిచి 12వసారి సెమీఫైనల్ చేరుకున్నాడు. సెమీఫైనల్లో రీలీ ఒపెల్కా (అమెరికా)తో నాదల్ ఆడతాడు. టర్కీ గ్రాండ్ప్రి రద్దు ఇస్తాంబుల్: టర్కీలో కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడం... అంతర్జాతీయంగా ప్రయాణ ఆంక్షలు కూడా ఉండటంతో... ఇస్తాంబుల్లో జూన్ 13న జరగాల్సిన టర్కీ గ్రాండ్ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసు రద్దయింది. టర్కీ గ్రాండ్ప్రి రద్దు కావడంతో ఎఫ్1 క్యాలెండర్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 27న జరగాల్సిన ఫ్రాన్స్ గ్రాండ్ప్రి రేసు జూన్ 20న జరుగుతుంది. ఆస్ట్రియాలో వరుసగా రెండు రేసులు (జూన్ 27న తొలి రేసు, జూలై 4న రెండో రేసు) నిర్వహిస్తారు. చదవండి: Covid-19: చెస్ స్టార్స్ విరాళం రూ. 37 లక్షలు -
సింధు... అక్కడే ఆగిపోయింది!
బర్మింగ్హామ్: ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఓ సువర్ణావకాశాన్ని వదిలేసింది. చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా స్టార్ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే కరోలినా మారిన్ (స్పెయిన్) కూడా గైర్హాజరయిన నేపథ్యంలో... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో టైటిల్ గెలిచేందుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులను సింధు సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనవసరంగా ఒత్తిడిలోకి వెళ్లి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్ట్ టూర్ సూపర్–1000 టోర్నీ నుంచి సింధు సెమీఫైనల్లో నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 17–21, 9–21తో పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో భారత స్టార్ నిరాశపరిచింది. రెండో గేమ్లోనైతే సింధు కనీస ప్రతిఘటన కూడా చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. తొమ్మిదోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఆడిన సింధు సెమీఫైనల్లో వెనుదిరగడం ఇది రెండోసారి. 2018లోనూ ఆమె సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. -
సెరెనా మరో ‘సారీ’
సొంతగడ్డపై ఆల్టైమ్ అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ రికార్డును సమం చేయాలని ఆశించిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆశలు ఆవిరయ్యాయి. వ్యక్తిగత జీవితంలోని సమస్యల నుంచి బయటపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ‘బెలారస్ మమ్మీ’ విక్టోరియా అజరెంకా ఏడేళ్ల విరామం తర్వాత మరో ‘గ్రాండ్’ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. గతంలో గ్రాండ్స్లామ్ టోర్నీలలో సెరెనాతో ఆడిన 10 సార్లూ ఓటమి వైపు నిలిచిన అజరెంకా 11వ సారి మాత్రం స్ఫూర్తిదాయక ఆటతో విజయతీరాలకు చేరింది. తద్వారా కెరీర్లో ఐదోసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు మాజీ చాంపియన్ నయోమి ఒసాకా తన జోరు కొనసాగిస్తూ అజరెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్లో ఎవరు గెలిచినా వారి ఖాతాలో మూడో గ్రాండ్స్లామ్ టైటిల్ చేరుతుంది. న్యూయార్క్: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఇంకా ఉందని బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నంబర్వన్ విక్టోరియా అజరెంకా నిరూపించింది. ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆమె టైటిల్ పోరుకు అర్హత పొందింది. అమెరికా దిగ్గజ క్రీడాకారిణి, 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్తో గంటా 55 నిమిషాలపాటు జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్సీడెడ్ అజరెంకా 1–6, 6–3, 6–3తో విజయం సాధించింది. అజరెంకా చివరిసారి 2013లో ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్ రన్నరప్)లో ఫైనల్ చేరింది. 38 ఏళ్ల సెరెనాతో కెరీర్లో 23వసారి తలపడిన 31 ఏళ్ల అజరెంకా తొలి సెట్లో నిరాశ పరిచింది. కేవలం ఒక గేమ్ను గెల్చుకొని 34 నిమిషాల్లో సెట్ను చేజార్చుకుంది.. దాంతో గ్రాండ్స్లామ్ టోర్నీ మ్యాచ్ల్లో సెరెనా చేతిలో ఆమెకు వరుసగా 11వ సారీ ఓటమి తప్పదేమోనని అనిపించింది. కానీ అజరెంకా రెండో సెట్లో గాడిలో పడింది. ఐదో గేమ్లో, తొమ్మిదో గేమ్లో సెరెనా సర్వీస్లను బ్రేక్ చేసిన ఆమె 35 నిమిషాల్లో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్లో సెరెనా 0–1తో వెనుకబడి తన సర్వీస్లో 30–40తో వెనుకంజలో ఉన్నపుడు బ్యాక్హ్యాండ్ షాట్ ఆడే క్రమంలో సెరెనా ఎడమకాలు మడత పడింది. దాంతో ఆమె చికిత్స కోసం మూడు నిమిషాలు విరామం తీసుకుంది. ట్రైనర్ కాలి మడమకు పట్టీ కట్టాక బరిలోకి దిగిన సెరెనా తన సర్వీస్ను కోల్పోయింది. సెరెనా సర్వీస్ను బ్రేక్ చేసిన అజరెంకా మూడో గేమ్లో తన సర్వీస్ నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనా స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా అజరెంకా తడబడకుండా చివరకు 6–3తో సెట్ను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో అజరెంకా రెండు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. మరోవైపు సెరెనా ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. ఎదురులేని ఒసాకా... 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీతో 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 7–6 (7/1), 3–6, 6–3తో నెగ్గింది. ఇద్దరూ పవర్ఫుల్ ఆట కనబర్చడంతో మ్యాచ్ మొత్తంలో ఇద్దరూ ఒక్కోసారి మాత్రమే తమ సర్వీస్లను కోల్పోయారు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో ఒసాకా పైచేయి సాధించింది. రెండో సెట్లో బ్రేడీ ఎనిమిదో గేమ్లో ఒసాకా సర్వీస్ను బ్రేక్ చేసి తొమ్మిదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని సెట్ను 6–3తో దక్కించుకుంది. మూడో సెట్లో ఒసాకాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. ఒసాకా 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు బ్రేడీ తన సర్వీస్లో లైన్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షంచకపోవడం ఒసాకాకు కలిసొచ్చి బ్రేక్ పాయింట్ దక్కింది. ఒసాకా కొట్టిన షాట్ నెట్కు తగిలి అవతలివైపు వెళ్లగా బ్రేడీ రిటర్న్ షాట్ ఆడింది. అయితే ఆమె కొట్టిన షాట్ బయటకు వెళ్లిందని లైన్ అంపైర్ ప్రకటించింది. అయితే టీవీ రీప్లేలో బ్రేడీ షాట్ లైన్ అంచును తాకిందని కనిపించింది. కానీ బ్రేడీ టీవీ రీప్లే అడగకపోవడంతో గేమ్ ఒసాకా వశమైంది. ఆ తర్వాత ఒసాకా తన సర్వీస్లను నిలబెట్టుకొని బ్రేడీ ఓటమిని ఖాయం చేసింది. పావిచ్–సోరెస్ జంటకు డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్ విభాగంలో అన్సీడెడ్ ద్వయం మ్యాట్ పావిచ్ (క్రొయేషియా)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పావిచ్–సోరెస్ జంట 7–5, 6–3తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పావిచ్–సోరెస్ జంటకు 4,00,000 డాలర్లు ప్రైజ్మనీగా (రూ. 2 కోట్ల 93 లక్షలు) లభించాయి. -
సెమీస్లో వైశాలి ఓటమి
చెన్నై: మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ చాంపియన్షిప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి పోరాటం ముగిసింది. ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ అనా ఉషెనినాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 19 ఏళ్ల వైశాలి 4.5–5.5తో ఓడిపోయింది. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను బోల్తా కొట్టించిన వైశాలి క్వార్టర్ ఫైనల్లో మున్జుల్ టర్ముంఖ్ (మంగోలియా)పై విజయం సాధించింది. వైశాలి మరో రెండు స్పీడ్ చెస్ గ్రాండ్ప్రి టోర్నీల్లో ఆడనుంది. -
చివరి బెర్త్ ఆసీస్దే
మెల్బోర్న్: సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో వరుసగా ఏడోసారి టి20 ప్రపంచ కప్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెగ్ ల్యానింగ్ (21; 4 ఫోర్లు), గార్డ్నెర్ (20; 2 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (21; 2 ఫోర్లు) సహాయపడగా... చివర్లో రాచెల్ హైనస్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. అనంతరం ఛేదనలో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వారెమ్ (3/17), మేఘాన్ షూట్ (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, సిక్స్), సుజీ బేట్స్ (14; 2 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్లు)లను వారెమ్ పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను ఆసీస్ వైపుకు తిప్పింది. మార్టిన్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, సిక్స్) కివీస్ విజయం కోసం తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సి ఉండగా... కివీస్ 15 పరుగులను మాత్రమే రాబట్టగలిగింది. ఇదే గ్రూప్లో నామమాత్రంగా జరిగిన మరో మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా (39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. శశికళ సిరివర్దనే 4 వికెట్లతో రాణించింది. శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసి విజయంతో టోర్నీని ముగించింది. -
సెమీస్లో అడుగుపెట్టిన ఆసీస్
మెల్బోర్న్: మహిళల టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్తో జరిగిన హోరాహోరి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పోరాటం వృథా అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బ్యాటింగ్లో ఓపెనర్ బీఎల్ మూనీ 50 బంతుల్లో 60 పరుగులు సాధించగా, బౌలింగ్లో వేర్హామ్, షుట్లు మూడేసి వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లడ్ జట్లు సెమీస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) -
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్పై... ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్పై గెలుపొందాయి. గ్రూప్ ‘బి’లో తమ నాలుగు లీగ్ మ్యాచ్లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్లో టాప్ ర్యాంక్లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్గా నిలుస్తుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ (36 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మారిజన్ కాప్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్ (39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్స్టోన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బతీసింది. నేటి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. -
సెంచరీతో బెంగాల్ను ఆదుకున్న అనుస్తుప్
కోల్కతా: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అనుస్తుప్ (120 బ్యాటింగ్; 18 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో బెంగాల్ను ఆదుకోవడంతో... కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. బెంగాల్ ఒక దశలో 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనుస్తుప్... అహ్మద్ (35; 7 ఫోర్లు)తో ఏడో వికెట్కు 72 పరుగులు, అకాశ్ దీప్ (44; 3 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి ఎనిమిదో వికెట్కు 103 పరుగులు జోడించాడు. గుజరాత్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. -
సెమీస్ రేసులో కివీస్...
గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్లో న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. తొలుత న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో లే కాస్పెరెక్, హేలీ జేన్సన్ మూడేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా... రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్ల్లో పాకిస్తాన్తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్తో వెస్టిండీస్ తలపడతాయి. -
హ్యాట్రిక్తో సెమీస్
భారత మహిళలకు ‘హ్యాట్రిక్’ విజయమైతే దక్కింది. అందరికంటే ముందే సెమీస్కు వెళ్లింది. కానీ ఆట ఆఖరి పోరాటమే అందరినీ మునికాళ్లపై నిలబెట్టింది. క్రికెటర్ల వెన్నుల్లో వణుకుపుట్టించింది. ఆఖరి బంతి పడక ముందు ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయి. పడ్డాక భారత్ గెలిచింది... కానీ కివీస్ పోరాటం అదిరింది. ఈ మెగా ఈవెంట్కే హైలైట్ అయిన మ్యాచ్తో అందరికీ క్రికెట్ మజా దక్కింది. మెల్బోర్న్: ఔరా... మన అమ్మాయిల జట్టు సైరా! న్యూజిలాండ్తో ఆడి గెలిచింది. పోరాడి సెమీస్ చేరింది. ఉన్నపళంగా ఉత్కంఠ పెంచిన ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 3 పరుగుల తేడాతో కివీస్పై నెగ్గింది. ఈ టి20 ప్రపంచకప్కే కిక్కెక్కించే ఈ మ్యాచ్లో కివీస్ చివరి బంతిదాకా గెలుపోటముల త్రాసులో నిలిచింది. చివరకు శిఖా యార్కర్కు ఓడింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఓపెనింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మళ్లీ దంచేసింది. 14 ఓవర్ల దాకా ఇన్నింగ్స్ను ఆమెనే నడిపించింది. జ్వరం నుంచి కోలుకున్న స్మృతి మంధాన (11) విఫలం కాగా, తానియా (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) మిగతా వారి కంటే మెరుగ్గా ఆడింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) విఫలయాత్ర కొనసాగింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించి భారత ఇన్నింగ్స్ను చక్కగా కట్టడి చేసింది. మార్చి మార్చి ప్రయోగించిన బౌలర్లతో ఇబ్బంది పడిన జెమీమా రోడ్రిగ్స్ (10), దీప్తి శర్మ (8), వేద (6) పరుగులు చేయలేకపోయారు. రోజ్మేరి మెయిర్, అమెలియా కెర్ చెరో 2 వికెట్లు తీశారు. తహుహు, సోఫీ ఒక్కో వికెట్ పడేశారు. తర్వాత కివీస్ ముందరి కాళ్లకు ముందే బంధం వేశారు భారత బౌలర్లు. ఓపెనర్లు ప్రియెస్ట్ (12), సోఫీ (14), వన్డౌన్లో సుజీ బేట్స్ (6) అవుట్ కావడంతో 34 పరుగులకే ‘టాప్’ లేచింది. ఈ దశలో మ్యాడీ గ్రీన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కేటీ మార్టిన్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) న్యూజిలాండ్ను ఓ దారికి తెచ్చారు. చివర్లో అమెలియా కెర్ (19 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) శివమెత్తడంతో సాఫీగా సాగుతున్న మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. భారత బౌలర్లు దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్, రాధ తలా ఒక వికెట్ తీశారు. షఫాలీ వర్మ 34 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్స్లు టెన్షన్... టెన్షన్... 18వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 100/2. గెలిచేందుకు ఇంకా 12 బంతుల్లో 34 చేయాలి. ఈ సమీకరణం భారత అమ్మాయిల జట్టుకే అనుకూలం. ఇక సెమీస్ బాటలో హ్యాట్రిక్ విజయమే అనుకుంటే... అమెలియా కెర్ బౌండరీలతో జూలు విదిల్చింది. పూనమ్ వేసిన 19 ఓవర్లో 18 పరుగులు పిండేసింది. ఆఖరి ఓవరే మిగిలింది. 16 పరుగులు కావాల్సివుంది. మారిన సమీకరణం మన అమ్మాయిల్ని ఒత్తిడిలోకి నెట్టింది. శిఖాపాండే ఆఖరి ఓవర్లో తొలి బంతి బౌండరీకెళ్లింది. 12 చేస్తే గెలుపే. 3 సింగిల్స్ తర్వాత 2 బంతుల్లో 9 చేయాలి. ఇక్కడ మరో ఫోర్. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. ఫోర్ వస్తే మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళుతుంది. ఉత్కంఠ అమాంతం పెరిగింది. ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. శిఖా యార్కర్ కెర్ మతిపోగొట్టింది. అంతే ఓ పరుగొచ్చాక ఇంకో సింగిల్ తీసేలోపే జెన్సన్ రనౌటైంది. ఆఖరిదాకా చెమటలు కక్కిన భారత మహిళలు 3 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకున్నారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) జెన్సన్ (బి) కెర్ 46; మంధాన (బి) తహుహు 11; తానియా (సి) కెర్ (బి) మెయిర్ 23; జెమీమా (సి) కెర్ (బి) మెయిర్ 10; హర్మన్ప్రీత్ (సి) అండ్ (బి) కాస్పెరెక్ 1; దీప్తి (సి) జెన్సన్ (బి) డివైన్ 8; వేద ఎల్బీడబ్ల్యూ (బి) కెర్ 6; శిఖా నాటౌట్ 10; రాధ రనౌట్ 14; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–17, 2–68, 3–80, 4–93, 5–95, 6–104, 7–111, 8–133. బౌలింగ్: తహుహు 2–0–14–1, మెయిర్ 3–0–27–2, డివైన్ 2–0–12–1, పీటర్సన్ 2–0–19–0, జెన్సన్ 3–0–20–0, కెర్ 4–0–21–2, కాస్పెరెక్ 4–0–19–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: ప్రియెస్ట్ (సి) రాధ (బి) శిఖా 12; డివైన్ (సి) రాధ (బి) పూనమ్ 14; సుజీ బేట్స్ (బి) దీప్తి 6; మ్యాడీగ్రీన్ (సి) తానియా (బి) రాజేశ్వరి 24; మార్టిన్ (సి) రోడ్రిగ్స్ (బి) రాధ 25; కెర్ నాటౌట్ 34; జెన్సన్ రనౌట్ 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–13, 2–30, 3–34, 4–77, 5–90, 6–130. బౌలింగ్: దీప్తిశర్మ 4–0–27–1, శిఖాపాండే 4–0–21–1, రాజేశ్వరి 4–0–22–1, పూనమ్ 4–0–32–1, రాధ 4–0–25–1. -
పాక్ను పాతరేసిన యువ భారత్
అసలే చిరకాల ప్రత్యర్థి. పైగా ఈ టోర్నీలో భారత్తో పాటు సమఉజ్జీ ప్రదర్శన ఇచ్చింది. కానీ భారత్తో ఆడేటప్పుడు మాత్రం అత్తెసరు జట్టుగా మారిపోయింది. పాక్ బ్యాట్స్మెన్ను మన బౌలర్లు వెంటాడితే... బౌలర్లనేమో భారత ఓపెనర్లిద్దరే గెలిచేదాకా వేటాడారు. ఫలితం... పాకిస్తాన్ను కసిదీరా ఓడించారు. యువ భారత్ను సమష్టిగా అంతిమ సమరానికి చేర్చారు. పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): న్యూజిలాండ్లో భారత సీనియర్ జట్టు కివీస్పై అన్నీ గెలిచింది. దక్షిణాఫ్రికాలో యువ భారత జట్టు అందరినీ ఓడిస్తోంది. ఇక ఒక్క ఫైనల్ పోరు మాత్రమే బాకీ ఉంది. అద్వితీయ ఆటతో అదరగొట్టిన యువ భారత జట్టు అండర్–19 ప్రపంచకప్లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రొహైల్ నజీర్ (102 బంతుల్లో 62; 6 ఫోర్లు), ఓపెనర్ హైదర్ అలీ (77 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీయగా... కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్లకు రెండేసి వికెట్లు లభించాయి. తర్వాత భారత్ 35.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 176 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు. దివ్యాంశ్ సక్సేనా (99 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. వెంటాడిన బౌలర్లు... భారత బౌలర్లు పాక్ బ్యాట్స్మెన్ పాలిట కొదమ సింహాల్లా రెచ్చిపోయారు. దీంతో ముగ్గురు మినహా మిగతా వారు అంకెతోనే సరిపెట్టుకున్నారు. హురైరా (4), ఫహాద్ (0), ఖాసీమ్ (9), ఇర్ఫాన్ (3), అబ్బాస్ (2), తాహిర్ (2), ఆమిర్ అలీ (1) ఇలా ‘టాప్ నుంచి టెయిలెండర్ల’ దాకా అందరూ భారత బౌలింగ్ చెరలో చిక్కి శల్యమయ్యారు. ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ నజీర్ మూడో వికెట్కు 62 పరుగులు జోడించడమే పాక్ ఇన్నింగ్స్లో గొప్ప భాగస్వామ్యం. ఇద్దరు అర్ధసెంచరీలతో జట్టును ఆదుకోగా... హ్యారిస్ 21 పరుగులు చేశాడు. ఇక 31వ ఓవర్ నుంచి భారత బౌలింగ్ మరింత పదునెక్కింది. దీంతో 13 ఓవర్ల వ్యవధి లో పాక్ చివరి 7 వికెట్లను కోల్పోయింది. చితగ్గొట్టిన ఓపెనింగ్ జోడీ... యశస్వి, దివ్యాంశ్ ఆట మొదలు పెట్టాక పరుగులు, అవి రాలేదంటే డాట్ బాల్స్, కుదిరితే ఫోర్లు, బాదితే సిక్సర్లు ఇలా అన్నీ వచ్చిపోయాయి. కానీ ఒక్క వికెట్ రాలితే ఒట్టు. ఈ యువ మెగా టోర్నీలో భారత్కు దీటుగా ఉన్న పాక్ బౌలింగ్... భారత్ ఎదురు పడితే మాత్రం బెదిరిపోయింది. ఓపెనర్లు యశస్వి, దివ్యాంశ్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించేదాకా క్రీజు వదల్లేదు. అబేధ్యమైన తొలి వికెట్కు 176 పరుగులు జోడించి భారత్ను దర్జాగా ఫైనల్కు చేర్చారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఈనెల 9న జరిగే ఫైనల్లో భారత్ ఆడుతుంది. ►7 అండర్–19 ప్రపంచకప్లో భారత్ ఏడోసారి ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా, రెండుసార్లు (2006, 2016) రన్నరప్గా నిలి చింది. ►10 అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్ చేస్తూ భారత్ వరుసగా సాధించిన పదో విజయమిది. 2010 నుంచి భారత్ ఈ టోర్నీలో ఛేజింగ్ చేస్తూ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ►11 ఈ టోర్నీ చరిత్రలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం భారత్ కిది వరుసగా 11వసారి. ►1 ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టు నాకౌట్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇదే తొలిసారి. ►5 గత ఐదు అండర్–19 ప్రపంచకప్లలో సెమీఫైనల్ లేదా ఫైనల్స్లో ఐదు సెంచరీలు నమోదు కాగా... ఐదూ భారత ఆటగాళ్లే (2006 సెమీస్– పుజారా (129 నాటౌట్); 2012 ఫైనల్–ఉన్ముక్త్ చంద్ (111 నాటౌట్); 2018 సెమీస్–శుబ్మన్ గిల్ (102 నాటౌట్); 2018 ఫైనల్–మన్జ్యోత్ (101 నాటౌట్); 2020 సెమీస్–యశస్వి (105 నాటౌట్) చేశారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: హైదర్ అలీ (సి) రవి బిష్ణోయ్ (బి) యశస్వి 56; హురైరా (సి) సక్సేనా (బి) సుశాంత్ 4; ఫహాద్ (సి) అథర్వ (బి) రవి బిష్ణోయ్ 0; నజీర్ (సి) తిలక్ వర్మ (బి) సుశాంత్ 62; ఖాసీమ్ (రనౌట్) 9; హ్యారిస్ (సి) సక్సేనా (బి) అథర్వ 21; ఇర్ఫాన్ (బి) కార్తీక్ 3; అబ్బాస్ ఎల్బీడబ్ల్యూ (బి) రవి 2; తాహిర్ (సి) జురేల్ (బి) కార్తీక్ త్యాగి 2; ఆమిర్ అలీ (సి) సిద్ధేశ్ వీర్ (బి) సుశాంత్ 1; అమిర్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–9, 2–34, 3–96, 4–118, 5–146, 6–156, 7–163, 8–169, 9–172, 10–172. బౌలింగ్: కార్తీక్ త్యాగి 8–0– 32–2, సుశాంత్ 8.1–0– 28–3, రవి బిష్ణోయ్ 10–0– 46–2, ఆకాశ్ సింగ్ 7–0–25–0, అథర్వ 7–0–29–1, యశస్వి జైస్వాల్ 3–0–11–1. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 105, దివ్యాంశ్ (నాటౌట్) 59; ఎక్స్ట్రాలు 12; మొత్తం (35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 176. బౌలింగ్: తాహిర్ 6–1–17–0, ఖాసీమ్ 8–0–37–0, అమిర్ 5–1– 20–0, అబ్బాస్ 7–0–50–0, ఆమిర్ అలీ 5.2–0–38–0, ఫహాద్ 4–0–12–0. -
సెమీస్లో పుణే సెవెన్ ఏసెస్
సాక్షి, హైదరాబాద్: మరో అద్భుత ప్రదర్శనతో నాలుగో విజయం నమోదు చేసుకున్న పుణే సెవెన్ ఏసెస్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో పుణే 4–1తో అవధ్ వారియర్స్పై గెలుపొందింది. తద్వారా 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే... పాయింట్ల పట్టికలో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సెమీస్ లోకి అడుగుపెట్టాయి. మిగిలిన మరో బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. పురుషుల డబుల్స్లో కొ సుంగ్ హ్యూన్–షిన్ బేక్ (అవధ్ వారియర్స్) జోడీ 6–15, 15–9, 15–12తో చిరాగ్ శెట్టి–సెతియావన్ (పుణే) జంటపై గెలుపొంది అవధ్ వారియర్స్కు శుభారంభం ఇచ్చింది. అయితే అనంతరం జరిగిన మహిళల సింగిల్స్లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ప్లేయర్ బీవెన్ జాంగ్ 13–15, 12–15తో రితుపర్ణ (పుణే) చేతిలో ఓడటంతో... అవధ్ వారియర్స్కు ఒక పాయింట్ పెనాల్టీ పడింది. మిక్స్డ్ డబుల్స్లో క్రిస్టీనా పెడర్సన్–సొజొనోవ్ (అవధ్ వారియర్స్) జంట 6–15, 9–15తో క్రిస్–గాబ్రియెల్ (పుణే) ద్వయం చేతిలో ఓడింది. దాంతో పుణే 2–0తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన కీన్ యూ లోహ్ (పుణే) 15–12, 15–14తో శుభాంకర్ డే (అవధ్ వారియర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్లో కజుమస సకాయ్ (పుణే) 15–6, 10–15, 13–15తో అజయ్ జయరామ్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడాడు. నేటి మ్యాచ్ల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో చెన్నై సూపర్ స్టార్స్; బెంగళూరు రాప్టర్స్తో ముంబై రాకెట్స్ తలపడతాయి. -
నేడు భారత్-పాకిస్తాన్ సెమీఫైనల్
వాళ్లంతా టీనేజ్ దాటని కుర్రాళ్లే. కానీ ప్రత్యర్థితో సీరియస్గా వ్యవహరించడంలో సీనియర్లకంటే మిన్నగానే కనిపిస్తున్నారు. సరదా పలకరింపులు లేవు, హ్యాండ్షేక్లు అసలే కనిపించడం లేదు, అలా పక్క నుంచి ‘ఆ’ జట్టు ఆటగాడు వెళుతున్నాడంటే తమ సంభాషణ కూడా ఆపేస్తున్నారు. భోజనం క్యూలో అవతలి జట్టు ఆటగాడి వెనుక మరొకరు నిల్చోవాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా కాస్త మొహంపై చిరునవ్వు చూపించడం కష్టంగా మారిపోయింది. ఇరు జట్ల క్రికెటర్లంతా వీర గంభీరంగా కనిపిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే సరిహద్దుకు ఆవల, ఇవతల అన్నట్లుగా యువ ఆటగాళ్లు వ్యవహరించడం ఇరు జట్ల ప్రాక్టీస్లో స్పష్టంగా కనిపించింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం అంటే దశాబ్దాలుగా ఎంతటి ఆసక్తి, మ్యాచ్కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. వేదిక, స్థాయి ఏదైనా అది ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు మరోసారి దాయాదుల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. యువ ప్రపంచకప్ సెమీస్లో తలపడుతున్న వీరిలో ముందంజ వేసేది ఎవరనేది ఆసక్తికరం. పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరి కొన్ని గంటల్లో మెగా క్రికెట్ సమరం జరగనుంది. ఈసారి ఈ పోరులో కుర్రాళ్లు తలపడుతున్నారు. అండర్–19 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీ పోరుకు ‘సై’ అంటున్నాయి. భారత్ గతంలో నాలుగు సార్లు ప్రపంచ కప్ను సొంతం చేసుకుంటే... పాక్ రెండు సార్లు విజేతగా నిలిచింది. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి కాబట్టి విజేతను అంచనా వేయడం అంత సులువు కాదు. టోర్నీలో భారత్ అత్యధిక స్కోరు 297 కాగా పాక్ 294 పరుగులు చేసింది. బౌలింగ్లో భారత్ మొత్తం 40 వికెట్లు పడగొట్టగా, పాక్ 39 వికెట్లు తీసింది. ప్రియమ్ గార్గ్ యశస్వి మినహా... డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగితున్న భారత జట్టు ఇప్పటి వరకు కనిపించని బ్యాటింగ్ లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. లీగ్ దశలో మన టీమ్ 3 మ్యాచ్లూ గెలిచి అజేయంగా నిలిచింది. ఇందులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే 3 అర్ధసెంచరీలు సహా 207 పరుగులతో మెరిశాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న దివ్యాంశ్ సక్సేనా (89 పరుగులు) మధ్య ఉన్న తేడా చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. తక్కువ స్కోర్లు ఛేదించాల్సి రావడం వాస్తవమే అయినా ఒక వన్డే మ్యాచ్లో భారత్ స్థాయికి తగ్గ బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అది కనిపించింది. ఇతర ప్రధాన బ్యాట్స్మెన్ సిద్ధేశ్ వీర్, జురేన్, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే అతనికి ఈ మ్యాచ్ చిరకాలం గుర్తుండిపోతుంది. మన బౌలింగ్ మాత్రం చక్కగా రాణిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ 11 వికెట్లు పడగొట్టగా, పేసర్ కార్తీక్ త్యాగి 9 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆకాశ్ సింగ్, అథర్వ అంకోలేకర్ కూడా ఇప్పటికే తమ సత్తా చాటారు. పాక్ కూడా... రొహైల్ నజీర్ పాకిస్తాన్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్కంటే బౌలింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. టీమ్ తరఫున మొహమ్మద్ హారిస్ ఒక్కడే మొత్తం స్కోరు వంద పరుగులు దాటగా (110) ఒక మ్యాచ్ రద్దు కారణంగా ఎక్కువ మంది బ్యాట్స్మెన్కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఖాసిమ్ అక్రమ్, హైదర్ అలీ, కెప్టెన్ రొహైల్ నజీర్, ఇర్ఫాన్ ఖాన్, ఫహద్ మునీర్ ఇతర ప్రధాన బ్యాట్స్మెన్. గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో మాత్రం అబ్బాస్ అఫ్రిది (9 వికెట్లు), ఆమిర్ ఖాన్, తాహిర్ హుస్సేన్ (చెరో 7 వికెట్లు) ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శిస్తూ చెలరేగారు. ఈ ముగ్గురు పేస్ బౌలర్లు ఇప్పుడు భారత టాపార్డర్ను దెబ్బ తీయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టులో ప్రధానంగా కనిపిస్తున్న లోటు. -
సెమీస్లో నార్త్ ఈస్టర్న్, చెన్నై సూపర్ స్టార్స్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ స్టార్స్ 4–3తో అవధ్ వారియర్స్పై విజయం సాధించింది. దాంతో 19 పాయింట్లు సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమంగా ఉన్న సమయంలో... విజేతను నిర్ణయించే మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–జెస్సికా (చెన్నై) ద్వయం 15–11, 13–15, 15–14తో క్రిస్టీనా–కొ సుంగ్ హ్యూన్ (అవధ్) జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 5–0తో పుణే సెవెన్ ఏసెస్పై ఘనవిజయం సాధించింది. దాంతో 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవడంతో పాటు సెమీఫైనల్కు అర్హత సాధించింది. నేటి మ్యాచ్లో ముంబై రాకెట్స్తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి పాకిస్తాన్
బెనోని: అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రత్యర్థి ఖరారైంది. ఈ నెల 4న జరిగే తొలి సెమీస్లో టీమిండియాతో పాకిస్తాన్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ 49.1 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ జఖీల్ (40) టాప్ స్కోరర్గా నిలవగా ఆమిర్ ఖాన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 41.1 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేసిన మొహమ్మద్ హురైరా (76 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హురైరాను అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ ‘మన్కడింగ్’ ద్వారా రనౌట్ చేయడం ఈ మ్యాచ్లో వివాదం రేపింది. -
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
ఫుజౌ (చైనా): ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ... భారత యువ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు ఓటమి తప్పలేదు. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ద్వయం పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 20–22తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జంట కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది. సెమీస్లో నిష్క్రమించిన సాత్విక్–చిరాగ్ జంటకు 9,800 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 7 లక్షలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో భారత జోడీ ఆరంభంలోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇండోనేసియా ద్వయం నెమ్మదిగా తేరుకొని వరుస పాయింట్లు సాధించి విరామానికి 11–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత అదే ఊపులో తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో మాత్రం రెండు జోడీలు ప్రతి పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. కీలకదశలో అనుభవజ్ఞులైన కెవిన్–గిడియోన్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఓవరాల్గా కెవిన్–గిడియోన్ చేతిలో భారత జంటకిది వరుసగా ఎనిమిదో ఓటమికాగా... ఈ ఏడాది మూడోది. ఆగస్టులో థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్... గతవారం ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో రన్నరప్గా నిలిచింది. -
మళ్లీ సంచలనం
ఇన్నాళ్లూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లోనే గొప్ప ఫలితాలు కనిపించేవి. అయితే సింగిల్స్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గతవారం ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్గా నిలిచే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్స్ జోడీని ఓడించిన ఈ భారత జంట తాజాగా 2018 ప్రపంచ చాంపియన్స్ జంటను మట్టికరిపించి మరో సంచలనం సృష్టించింది. ఫుజౌ (చైనా): భారత సింగిల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన నిరాశను మరిపిస్తూ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–15తో 2018 ప్రపంచ చాంపియన్స్, మూడో ర్యాంక్ జోడీ లీ జున్ హుయ్–లియు యు చెన్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ సాధికారిక ఆటను ప్రదర్శించారు. రెండు గేముల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తొలి గేమ్లో 15–11తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జోడీకి ఆ తర్వాత గట్టిపోటీ ఎదురైంది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న చైనా జంట 18–18తో స్కోరును సమం చేసింది. అయితే సాత్విక్–చిరాగ్ ఈ కీలకదశలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి 20–18తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయినా... వెంటనే మరో పాయింట్ గెలిచి తొలి గేమ్ను దక్కించుకున్నారు. ఇక రెండో గేమ్లో సాత్విక్–చిరాగ్ జంటకు ఆరంభంలో ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 12–12 వద్ద భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ద్వయం కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–7తో వెనుకంజలో ఉంది. -
సింధు ఔట్.. సెమీస్లో ప్రణీత్
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఒక్కడి చేతుల్లోనే మిగిలుంది. తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ అలవోక విజయంతో సెమీఫైనల్ చేరగా... స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆట క్వార్టర్స్లోనే ముగిసింది. టోక్యో: ఈ సీజన్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ టైటిల్ వేటకు దూరమైంది. జపాన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్ కూడా ఆమెకు అందని ద్రాక్షగా ముగిసింది. ఈ టోర్నీ మహిళల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరో వైపు ఈ టోర్నీలో అసాధారణ ఆటతీరుతో ముందడుగు వేస్తున్న సాయి ప్రణీత్ టైటిల్కు రెండడుగుల దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్లో ఈ అన్సీడెడ్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. అలవోక విజయంతో... పురుషుల సింగిల్స్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ వరుస గేముల్లో అలవోక విజయం సాధించాడు. అతను 21–12, 21–15తో ఇండోనేసియాకు చెందిన టామి సుగియార్తోను ఇంటిదారి పట్టించాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించాడు. తొలి గేమ్లో సుగియార్తోనే ఖాతా తెరిచినా... జోరు మాత్రం ప్రణీత్దే! ఇండోనేసియా ఆటగాడు ఒక పాయింట్ చేయగానే... సాయిప్రణీత్ వరుసగా 5 పాయింట్లు సాధించాడు. అక్కడి నుంచి మొదలైన జోరుకు ఏ దశలోనూ సుగియార్తో ఎదురు నిలువలేకపోయాడు. ప్రత్యర్థి 10 పాయింట్లు సాధించేలోపే 19 పాయింట్లతో తెలుగు షట్లర్ గెలుపు తీరం చేరాడు. రెండో గేమ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఆరంభం నుంచే సాయిప్రణీత్ కోర్టులో చురుగ్గా కదంతొక్కడంతో పాయింట్ల చకచకా వచ్చేశాయి. రెండు సార్లు 5–4, 12–10 స్కోరు వద్ద ప్రణీత్కు చేరువైనప్పటికీ... సుగియార్తోను ఓడించేందుకు భారత ఆటగాడికి ఎంతోసేపు పట్టలేదు. సింధు మరోసారి... మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ ఐదో సీడ్ సింధు 18–21, 15–21తో నాలుగో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సింధు... రెండో గేమ్లో ఆ ఆటతీరు కొనసాగించలేకపోయింది. చివరకు 50 నిమిషాల్లో ప్రత్యర్థి ధాటికి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్లో సింధు ఒకే ఒక్క టోర్నీ (ఇండోనేసియా ఓపెన్)లో ఫైనల్ చేరింది. అంతిమ పోరులో యామగుచి... సింధును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు వచ్చింది. కానీ తెలుగుతేజం కసితీరా ఆడలేకపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి ద్వయం 19–21, 18–21తో రెండో సీడ్ తకెషి కముర– కెయిగొ సొనొద (జపాన్) జంట చేతిలో ఓడింది. -
సెరెనా.. శ్రమించి సెమీస్కు
లండన్: సెరెనా అడుగులు మార్గరెట్ కోర్ట్ రికార్డు దిశగా పడుతున్నాయి. వింబుల్డన్ ఓపెన్లో 12సారి సెమీస్ చేరిన ఈ నల్లకలువ 24వ గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేసింది. ముందుగా 37 ఏళ్ల వెటరన్ స్టార్ ఇక సెమీస్ విజయమే లక్ష్యంగా తన రాకెట్ను రఫ్ఫాడించనుంది. సెరెనాతోతో పాటు ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. కాస్త రిస్కీ అయింది! మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సెరెనా గెలిచేందుకు తుదికంటా పోరాడాల్సి వచ్చింది. సహచర అమెరికా క్రీడాకారిణి అలీసన్ రిస్కీని ఓడించేందుకు సెరెనా మూడు సెట్లదాకా శ్రమించింది. 2 గంటల ఒక నిమిషం పాటు జరిగిన ఈ పోరులో చివరకు సెరెనా 6–4, 4–6, 6–3తో అన్సీడెడ్ రిస్కీపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వింబుల్డన్ కోర్టులపై అమెరికా నల్లకలువకు ఇది 97వ విజయం కావడం విశేషం. మిగతా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ హలెప్ 7–6 (7/4), 6–1తో షువాయ్ జంగ్ (చైనా)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ స్వితోలినా 7–5, 6–4తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. క్వార్టర్స్ దాటిన స్ట్రికోవా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవా ఎట్టకేలకు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అంచెను దాటింది. 17 ఏళ్లుగా వింబుల్డన్ బరిలో దిగుతున్న ఆమె ఒకే ఒక్కసారి క్వార్టర్స్ (2014) చేరింది. ఇపుడు క్వార్టర్స్లో స్ట్రికోవా 7–6 (7/5), 6–1తో జొహానా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్స్లో స్ట్రికోవాతో సెరెనా; స్వితోలినాతో హలెప్ ఆడతారు. డబుల్స్లో తొలి 12–12 టై బ్రేక్ మారథాన్ మ్యాచ్లకు మంగళం పలకాలని భావించిన ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఈ ఏడాది 12–12 స్కోరు వద్ద టైబ్రేక్కు కటాఫ్ మార్క్ ఇచ్చింది. ఈ కటాఫ్ స్కోరు తొలిసారిగా పురుషుల డబుల్స్ మ్యాచ్లో నమోదైంది. హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా), రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటల మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి హెన్రీ–పీర్స్ జోడీ 7–6 (7/2), 6–4, 3–6, 13–12 (7/2)తో నెగ్గింది. గతేడాది అండర్సన్, ఇస్నెర్ల మధ్య పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్లో ఆఖరి సెట్ 26–24 స్కోరుదాకా అప్రతిహాతంగా సాగింది. దీంతో ఈ ఏడాది నుంచి 12–12 వద్ద టైబ్రేక్ను అనివార్యం చేశారు. సెరెనా... 10 వేల డాలర్ల జరిమానా కట్టు! ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన సెరెనా విలియమ్స్పై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ జరి మానా విధించింది. టోర్నీకి ముందు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఆమె టెన్నిస్ కోర్టును రాకెట్తో నష్టపరిచినట్లు తేలింది. దీంతో 10 వేల డాలర్లు (రూ.6.85 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ 37 ఏళ్ల అమెరికన్ స్టార్ను ఆదేశించింది. నేటి షెడ్యూల్ (పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్) జొకోవిచ్ X డేవిడ్ గాఫిన్ ఫెడరర్ X నిషికోరి గిడో పెల్లా X బాటిస్టా అగుట్ నాదల్ X స్యామ్ క్వెరీ సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం స్వితోలినా, స్ట్రికోవా, హలెప్ -
కాయ్ రాజా కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్కు ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్రాయుళ్లల్లోనూ జోష్ పెంచింది. ఈ క్రేజ్కు క్యాష్ చేసుకోవడానికి బుకీలు కొత్త ‘అవతారాల్లో’ రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి చెక్ చెప్పడానికి నిఘా ముమ్మరం చేశారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, కదలికలనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన అనేక మంది బుకీలు ఇటీవల తమ పంథా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు వీరంతా నగరంలోనే ఉండి నేరుగా పందేలు కాసేవాళ్లతో (పంటర్లు) సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇలా చేయడంతో పోలీసులు దాడి చేసినప్పుడు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో కొందరు కీలక బుకీలు ఇటీవల కాలంలో తమ పంథా మార్చారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో వాళ్లు మకాం వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్తో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బెట్టింగ్స్ను పర్యవేక్షిస్తున్నారు. వీరివద్ద పందేలు కాసే పంటర్లు సుపరిచితులే. దీంతో ఫోన్ల ద్వారా పందేలను అంగీకరిస్తున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు మాత్రమే నగరంలో ఉంటూ ప్రధాన బుకీలకు సహకరిస్తుంటారు. పోలీసులకు వీళ్లు చిక్కుతున్నా అనేక సందర్భాల్లో సూత్రధారులు పట్టుబడట్లేదు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ముందస్తు పందాల కంటే ఇటీవల కాలంలో లైవ్ బెట్టింగ్లు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్లో ఫలానా జట్టు గెలుస్తుందని, ఇన్ని పరుగులు చేస్తుందని, ఓడిపోయే జట్టు ఇన్ని పరుగులకే కట్టడి అవుతుందని.. ఈ పంథాలో జరిగేవి ముందస్తు పందేల కిందికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రేషియో ఆధారంగా బంతి బంతికీ జరిగే పందేలను లైవ్ బెట్టింగ్లుగా పరిగణిస్తుంటారు. యాప్స్ ఆధారంగా బెట్టింగ్ దందా నిర్వహించే బుకీలు ఈ తరహాకే ఎక్కువ ప్రాధాన్యమస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నగరంలో బెట్టింగ్ నిర్వహణకు, ఏజెంట్ల కదలికలను ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. -
ప్రపంచకప్ ‘సెమీస్’ చేరేదెవరు?
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతన్న క్రికెట్ విశ్వసమరం రసవత్తరంగా మారుతోంది. టోర్నీ ఆరంభంలో వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరుతుండటంతో సెమీస్ నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే ప్రపంచకప్లో పాల్గొన్న పది జట్లలో మూడు జట్లు(దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్) అధికారికంగా సెమీస్ రేసు నిష్క్రమించాయి. ఇప్పటికే శ్రీలంక అనధికారికంగా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. మిగిలిన ఆరు జట్లలో 14 పాయింట్లతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్, టీమిండియా జట్లు సెమీస్ చేరడం కష్టమేమీ కానప్పటికీ తదుపరి ఆడే మ్యాచ్లు వాటికి కీలకంగా మారనున్నాయి. కాగా నాలుగో స్థానం కోసమే తీవ్రమైన పోటీ నెలకొంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ గెలుపోటములుతో సతమతమవుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పలు సంచలనాల విజయాలు నమోదు చేసి సెమీస్కు చేరాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ప్రపంచకప్ మరింత ఉత్కంఠగా మారింది. దీంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ గెలిచి నిలిచేనా.. ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు అభిమానులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. టోర్నీని ఘనంగా ఆరంభించి, భారీ విజయాలు నమోదు చేయడంతో ఈ సారి ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఏదో చేయబోతుందని అందరూ భావించారు. కానీ సగం మ్యాచ్లు పూర్తయ్యే సరికి సీన్ రివర్సయింది. ఆసీస్ చేతిలో కంగుతిని, పాక్, లంక చేతిలో ఘోరంగా పరాజయం పాలయింది. దీంతో ఏకంగా సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఇంగ్లండ్ ఏడు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి బలమైన టీమిండియా, కివీస్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో ఏ ఒక్కటి ఓడినా ఇంగ్లండ్ సెమీస్ ఆశలకు గండిపడుతుంది. (చదవండి: శ్రీలంకకు షాక్) పాక్ రిపీట్ చేస్తుందా.. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ తాజా ప్రపంచకప్ను ఓటమితో ప్రారంభించి హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్ రేసులో నిలిచింది. వెస్టిండీస్తో ఓటమి అనంతరం ఇంగ్లండ్ ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. అనంతరం ఆసీస్, టీమిండియాపై ఓడిపోయి విమర్శల పాలైంది. నెలకు కొట్టిన బంతిలా పుంజుకొని దక్షిణాఫ్రికాను ఇంటికి పంపించి, కివీస్పై స్పూర్తి దాయక విజయం అందుకొని, అఫ్గానిస్తాన్ను చిత్తుచేసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన పాక్ నాలుగు మ్యాచ్లు గెలిచి, మూడింట ఓటమిచెంది, ఒక్క మ్యాచ్ రద్దయింది. దీంతో 9 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే తదుపరి బంగ్లాదేశ్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి.. అంతేకాకుండా ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఓడిపోవాలి లేదంటే కనీసం ఒక్క మ్యాచైనా చిత్తుగా ఓడిపోవాలి. (చదవండి: పాక్ ఫ్యాన్స్ మద్దతు మనకే) బంగ్లాదేశ్కూ అవకాశాలు.. సంచలనాల బంగ్లాదేశ్ తాజా ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలు పొందిన ఆ జట్టుకు ఒక్క మ్యాచ్ రద్దయింది. దీంతో ఏడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్ల్లో తమ కంటే బలమైన టీమిండియా, పాకిస్తాన్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచి.. మరో వైపు ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఓడిపోతే బంగ్లా సెమీస్ వెళ్లే అవకాశం ఉంది. తమదైన రోజు ఎంతటి బలమైన జట్టునైనా ఓడించే బంగ్లా తన తదుపరి మ్యాచ్ల్లో ఎలా ఆడుతుందో చూడాలి. -
సెమీస్లో దివిజ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. జర్మనీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 6–3, 10–8తో కెవిన్ క్రావిట్జ్–ఆండ్రియా మీస్ (జర్మనీ) జంటపై గెలుపొందింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను కోల్పోయిన దివిజ్ జంట రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తమ సర్వీస్లను కాపాడుకొని సెట్ను సొంతం చేసుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో ఫిలిప్ ఓస్వాల్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జంటతో దివిజ్–మార్సెలో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో ఓస్వాల్డ్–పావిక్ 6–4, 6–4తో మూడో సీడ్ కెన్ స్కప్స్కీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్)లపై గెలిచారు. -
అధికారంపై ధిక్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్లో సత్తా చాటింది. 2019 లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది. మరోసారి అదే పంథా.. గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఎట్టకేలకు ఛత్తీస్గఢ్లో మార్పు.. గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. రైతులే నిర్ణయించారా..! సెమీఫైనల్స్లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
వివరణ కోరనున్న సీఓఏ
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో మిథాలీ రాజ్ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. భారత జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు ప్రపంచ కప్ సమయంలో మిథాలీ ఫిట్నెస్ ఎలా ఉందనే అంశంపై కూడా సీఓఏ వివరాలు కోరింది. దీనిపై జట్టు మేనేజర్ తృప్తి సోమవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు మిథాలీరాజ్ను తప్పించే క్రమంలో మ్యాచ్కు ముందు జరిగిన సమావేశం గురించి మీడియాలో రావడంపై కూడా సీఓఏ అసహనం వ్యక్తం చేసింది. నన్నూ తీసేశారు: గంగూలీ మంచి ఫామ్లో ఉన్న సమయంలో కూడా తుది జట్టు నుంచి కెప్టెన్లను తప్పించడం కొత్తేమీ కాదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గతంలో తనకూ ఈ అనుభవం ఎదురైంది కాబట్టి మిథాలీ వ్యవహారం ఆశ్చర్యపరచలేదని అతను అన్నాడు. ‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను కూడా ఇలా ఇంటికి పంపించారు. అయినా మిథాలీని తప్పించడం కంటే భారత్ ఓడటమే నన్ను ఎక్కువగా బాధించింది’ అని గంగూలీ వ్యాఖానించాడు. -
సెమీ ఫైనల్స్
-
బజరంగ్ కొత్త చరిత్ర
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రపంచ చాంపియన్షిప్లోనూ మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఈ హరియాణా రెజ్లర్ స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2013 ప్రపంచ చాంపియన్షిప్లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న బజరంగ్ ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా బరిలోకి దిగాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించి ఒక్కో ప్రత్యర్థిని ఓడిస్తూ అంతిమ సమరానికి అర్హత పొందాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 4–3తో అలెజాండ్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 5–3తో తుల్గా తుముర్ (మంగోలియా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–0 తో సెయుంగ్చుల్ లీ (దక్షిణ కొరియా)పై, తొలి రౌండ్లో 9–4తో రోమన్ అశారిన్ (హంగేరి)పై నెగ్గాడు. ఆదివారమే జరిగిన ఇతర విభాగాల్లో భారత రెజ్లర్లు నిరాశ పరిచారు. సందీప్ తోమర్ (57 కేజీలు), దీపక్ (92 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సచిన్ రాఠి (79 కేజీలు) తొలి రౌండ్లో ఓడిపోయారు. నేడు జరిగే ఫైనల్లో టకుటో ఒటోగురో (జపాన్)తో బజరంగ్ తలపడతాడు. ఒకవేళ బజరంగ్ గెలిస్తే భారత్ తరఫున ప్రపంచ చాంపియన్ అయిన రెండో రెజ్లర్గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే విశ్వవిజేతగా నిలిచాడు. గతంలో భారత్ తరఫున అమిత్ (55 కేజీలు; 2013లో), బిషంబర్ (57 కేజీలు; 1967లో) రజతాలు... రమేశ్ (74 కేజీలు; 2009లో), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు; 2015లో), సందీప్ (66 కేజీలు, 2013లో) కాంస్య పతకాలు సాధించారు. -
సెమీఫైనల్లో హైదరాబాద్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్... 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర స్కోరు 36.3 ఓవర్లు ముగిసేసరికి 198/2... అప్పటికే హనుమ విహారి (99 బంతుల్లో 95; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రికీ భుయ్ (71 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు 112 పరుగులు జోడించి జోరు మీదుండటంతో ఆంధ్ర గెలుపు దిశగా సాగుతోంది. ఈ స్థితిలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (3/50) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో భుయ్, విహారిలను ఔట్ చేసి ఆంధ్ర ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 14 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా, ఆంధ్ర నిష్క్రమించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బావనక సందీప్ (97 బంతుల్లో 96; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, తన్మయ్ అగర్వాల్ (31; 2 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (28; ఫోర్, సిక్స్), సుమంత్ (27; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (7 బంతుల్లో 15; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి, పృథ్వీరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హనుమ విహారి శతకం కోల్పోగా, అశ్విన్ హెబర్ (38) రాణించాడు. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో ముంబైతో హైదరాబాద్, గురువారం జరిగే రెండో సెమీస్లో ఢిల్లీతో జార్ఖండ్ ఆడతాయి. -
సెమీస్లో సౌరభ్, మిథున్
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో భారత షట్లర్లు సౌరభ్ వర్మ , మిథున్ మంజునాథ్ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సౌరభ్ వర్మ 21–14, 21–16తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) పై గెలుపొందాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయం సొంతం చేసుకొని సెమీస్ చేరాడు. మరో క్వార్టర్ ఫైనల్లో మిథున్ 21–18, 21–12తో సతీశ్థరన్ రామచంద్రన్ (మలేసియా)పై నెగ్గి సెమీస్కు అర్హత సాధించాడు. శనివారం జరుగనున్న సెమీఫైనల్లో మిథున్తో సౌరభ్ వర్మ తలపడనున్నాడు. మరో మ్యాచ్లో ఐదో సీడ్ శుభాంకర్ డే 20–22, 15–21తో రెండో సీడ్ వ్లాదిమిర్ మాల్కోవ్ (రష్యా) చేతిలో ఓడి క్వార్టర్స్లోనే నిష్క్రమిం చాడు. మహిళల సింగిల్స్లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి 9–21, 11–21తో యెన్ మై హో (మలేసియా) చేతిలో; రితూపర్ణ దాస్ 17–21, 13–21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్లో రెండో సీడ్ రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ సెమీస్ చేరింది. క్వార్టర్స్లో రోహన్–కుహూ ద్వయం 21–13, 21–9తో అండ్రేజ్ లొగినోవ్–లిలియా అబిబులయేవా (రష్యా) జంటపై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. మరో భారత జోడీ సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ 15–21, 8–21తో చెన్ టాంగ్ జై–యెన్ వై పీక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వెనుదిరిగింది. -
భారత్కు ఎనిమిదో స్థానం
జొహన్నెస్బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్ను భారత జట్టు ఓటమితో ముగించింది. 7–8 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. దాంతో పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 15వ నిమిషంలో గుర్జీత్ కౌర్ గోల్తో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఐర్లాండ్ జట్టుకు 47వ నిమిషంలో క్యాథ్రీన్ ములాన్, 48వ నిమిషంలో లిజీ కాల్విన్ ఒక్కో గోల్ చేసి గెలిపించారు. -
నేడు సెమీఫైనల్స్
- ప్రారంభమైన ఫుట్బాల్ నాకౌట్ పోటీలు - రాణించిన కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఆత్మకూరు, పరిగి సౌత్ జట్లు అనంతపురం సప్తగిరిసర్కిల్ : గ్రామీణస్థాయి ఫుట్బాల్ నాకౌట్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్–19 బాలికలకు అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ, అనంతపురం ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్తంగా అనంత ఫుట్బాల్ లీగ్ క్రీడా పోటీలు ప్రారంభించింది. లీగ్ మ్యాచ్లు జిల్లాలోని ఆర్డీటీ అకాడమీ కేంద్రాల్లో గతేడాది సెప్టెంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనబరచిన జట్లను నాకౌట్ స్థాయిలో జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వాటిలో గెలిచిన ఆత్మకూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, పరిగి సౌత్ జట్లు సెమీస్కు చేరాయి. స్కోరు వివరాలు హిందూపురం జట్టుఽపై బెళుగుప్ప జట్టు 3–0 తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా లేపాక్షి జట్టుపై కళ్యాణదుర్గం జట్టు 1–0తో గెలిచింది. అలాగే పరిగిపై ఆత్మకూరు 12–0తో ఘన విజయం నమోదు చేసింది. ఆత్మకూరు జట్టులో లక్ష్మీ–4, సంధ్య–3, హేమ–3, ఆయిషా–1, భార్గవి–1 గోల్స్ సాధించారు. గుత్తిపై పరిగి సౌత్ జట్టు 3–0 తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగే సెమీస్లో కళ్యాణదుర్గం, బెళుగుప్ప జట్లు సెమీస్–1, ఆత్మకూరు, పరిగి సౌత్ జట్లు సెమీస్–2లో తలపడనున్నాయి. అనంతరం విజయం సాధించిన జట్లు ఫైనల్కు వెళ్తాయి. ఉన్నతస్థాయికి చేరాలి క్రీడాకారులు అందిన అవకాశాలను వినియోగించుకుని ఉన్నతస్థాయికి చేరాలని ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రారంభమైన గ్రామీణస్థాయి ఫుట్బాల్ లీగ్ పోటీలకు వారు హాజరయ్యారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ఆర్డీటీ సంస్థ ఎనలేని కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఫుట్బాల్ లీగ్ కో-ఆర్డినేటర్ విజయ్భాస్కర్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి భాస్కర్రెడ్డి, కోచ్లు రియాజ్, ఆనంద్రెడ్డి, దాదా ఖలందర్, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, రెఫరీలు హరి, సురేష్, ఈశ్వర్, గంగాధర్, హేమవర్ధన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్
-
ఉత్సాహంగా ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ సెమీ ఫైనల్స్
పోటీలో చురుగ్గా పాల్గొన్న 400 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్లో ఫైనల్స్ హైదరాబాద్: ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ సెమీ ఫైనల్స్ ఆదివారం హైదరాబాద్లోని (బంజరాహిల్స్) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్వార్టర్ ఫైనల్స్లో క్వాలిఫై అయిన సుమారు 400 మందికిపైగా విద్యార్థులు సెమీ ఫైనల్స్లో పాల్గొని తమ మెదడుకు పదును పెట్టారు. సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘బీ మాస్టర్’ విక్రమ్ అడిగిన ప్రతి ఆంగ్ల పదానికీ విద్యార్థులు చురుకుగా స్పెల్లింగ్ రాశారు. పోటీలను స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కల్యాణి చౌదరి పర్యవేక్షించారు. సెమీ ఫైనల్స్లో క్వాలిఫై వారికి డిసెంబర్లో ఫైనల్స్ జరుగుతాయి. కాగా, అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ‘సాక్షి’ ఇండియా స్పెల్ బీ పోటీలు తమ స్కూల్లో జరగడం ఆనందంగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపాల్ టి.వీణామూర్తి, ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి చౌదరి తెలిపారు. తమ స్కూల్ సిబ్బంది, విద్యార్థులకు ఈ పోటీ కొత్త అనుభూతిని కలిగించిందన్నారు. విద్యార్థులు కమ్యునికేషన్ స్కిల్స్ను పెంపుందించుకోవడానికి ‘సాక్షి’ ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్పెల్ బీ విధానాన్ని తమ స్కూల్లో నిరంతరం అమలు చేస్తామని చెప్పారు. -
ఉత్కంఠగా ‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్
ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు హాజరు ∙ నాలుగు విభాగాల్లో సాగిన లైవ్ టీవీ ప్రశ్నావళి కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ‘సాక్షి’ ఎరీనా వ¯ŒSస్కూల్ ఫెస్ట్ స్పెల్బీ ఇండియా సెమిఫైనల్స్ ఉభయగోదావరి జిల్లాల పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆదివారం జరిగింది. స్థానిక శ్రీ గౌతమీ స్కూలులో నాలుగు విభాగాలుగా జరిగిన ఈ సెమీఫైనల్స్ రెండు జిల్లాలనుంచి 22 స్కూ ల్స్కు చెందిన 157 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సాక్షి స్పెల్బీ 2016 రెండో రౌండ్లో విజేతలైన వారు సెమీఫైనల్స్కు హాజరయ్యారు. దీనిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ’సాక్షి’ టీవీలో లైవ్లో చెప్పిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాశారు. కేటగిరి–1లో 22 మంది, కేటగిరి–2లో 35 మంది, కేట గిరి–3లో 34 మంది, కేటగిరి–4లో 56 మంది విద్యార్థులు రాశారు. టీవీ లైవ్లో బీ మాస్టర్ చెపుతున్న పదాలు...విద్యార్థులు దానికి పేపర్పై రాస్తున్న స్పెల్లింగ్ల క్రమంలో ఆ ప్రాంతమంతా పూర్తి నిశ్శబ్దతతో కూడిన ఉత్కంఠత కనిపించింది. దీనిని శ్రీగౌతమీ స్కూలు కరస్పాండెంట్ సుంకర రవి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ శాస్త్రి, సాక్షి బ్రాంచ్ మేనేజర్ వీవీ.శివుడు, సీనియర్ యాడ్ ఆఫీసర్ కె.ఉమాశంకర్ పర్యవేక్షించారు. చాలా విలువైంది స్పెల్లింగ్ కాదు...ఇది పదాల కలయికను చెబుతూ మాలో మంచి ఉత్సాహాన్నిస్తుంది. టీవీలో లైవ్ ద్వారా చెబుతుంటే ఆ పదాలను సరైన క్రమంలో రాయడం వల్ల మంచి నాలెడ్జ్ ఏర్పడుతుంది. ఇది చాలా ఉపయోగం. – కొఠారి దివ్యజైన్, ఏడో తరగతి, ట్రిప్స్ స్కూలు. ఇటువంటి పరీక్షల్లో తప్పక పాల్గొనాలి ‘సాక్షి’ నిర్వహించిన ఇటువంటి బుర్రకు పదునుపెట్టే పరీక్ష మాకు ఎంతో ఉపయోగం. తెలియని ఎన్నో పదాల అక్షరదోషాలు తెలుస్తాయి. ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది. – వి.వంద్, ఆరో తరగతి, ట్రిప్స్ స్కూలు మంచి జ్ఞానం సొంతం చేసుకోవచ్చు స్పెల్బీ అంటే అన్ని స్కూల్స్ చాలా ఆసక్తిచూపుతున్నాయి. దానివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తరగతుల్లో మంచి మార్కులు, విద్యలో ముందంజులో ఉండేందుకు తోడ్పడుతుంది. – ప్రవీణ బదిరెడ్డి, హెచ్ఆర్, ఆదిత్య స్కూలు మంచి పోటీ విధానం మనలో అక్షర నైపుణ్యాన్ని పెంచే మంచి పోటీ . దీనివల్ల ముందు తరగతుల్లో మంచి ఫలితాలు సాధిస్తాము. ఇటువంటి పోటీల్లో అందరూ పాల్గొంటే పోటీ విధానంతో మంచి నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు. – నల్లమిల్లి లక్ష్మి లేఖ్యారెడ్డి, ఆదిత్య స్కూలు పిల్లలకు ఎంతో ఉపయోగం ఈ పోటీ పరీక్షతో పిల్లల్లో మంచి ఆలోచనా విధానం పెరుగుతుంది. దీనివల్ల వారికి చదువులో ఎన్నో అక్షరపదాలు తేలికగా తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థులను ప్రోత్స హించే ఈ విధానం చాలా బాగుంది. ఇంకా ఇటువంటి పోటీ విధానాలు మరిన్ని తీసుకురావాలి. – బత్సు హరిత, విద్యార్థి తల్లి, కాకినాడ -
క్షణక్షణం.. ఉత్కంఠ
సెమీస్కు చేరిన బ్యాడ్మింటన్ పోటీలు తెనాలి: స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ –2016 పోటీ లు గురువారం రాత్రికి క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలుర క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. విజేతలు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. షేక్ ఇమ్రాన్ (అనంతపురం) 21–18, 22–20 స్కోరుతో క్రీడాకారుడు సాయిచరణ్ (గుంటూరు)పై విజయం సాధించాడు. ఆర్ సంజీవరావు (పశ్చిమగోదావరి) 21–13, 21–14 స్కోరుతో ఎం. సాయినాథ్రెడ్డి (కర్నూలు)పై గెలుపొందాడు. చరణ్నాయక్ (గుంటూరు) 21–15, 21–14తో కార్తికేయ(గుంటూరు)పై, షేక్ అర్షద్ (కర్నూలు) 21–16, 18–21, 21–9 సీహెచ్ రుషి (నెల్లూరు)పై విజయం సాధించారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. కోయ సాయిచరణ్–కె.చరణ్ నాయక్(గుంటూరు) 21–15, 21–7 స్కోరుతో బీ కార్తీక్, కే మినిద్జాషువా(విశాఖపట్నం)పై. కేఎన్వీఎస్ సూర్య (పశ్చిమ గోదావరి)–షేక్ ఇమ్రాన్ (అనంతపురం) ద్వయం 21–17, 21–11 స్కోరుతో ఏ వంశీ కష్ణరాజ్, బీ గిరీష్నాయుడు (తూర్పు గోదావరి) జిల్లా జట్లపై గెలుపొందాయి. అండర్–13 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. వంశీకృష్ణ (పశ్చిమ గోదావరి) 21–5, 21–7 షేక్ నుమెయిర్ (ప్రకాశం)పై, సాయికిరణ్ (విశాఖ) 21–17, 22–20 బాబా రాహుల్ (కర్నూలు)పై విజయం సాధించాడు. ఎన్.శివారెడ్డి (కర్నూల్) 21–18, 19–21,21–18 స్కోరుతో హిమదీప్ (ప్రకాశం)పై, విజయ్ (అనంతపురం) 21–9, 21–7 స్కోరుతో మోహిత్రెడ్డి (పశ్చిమ గోదావరి)పై గెలిచారు. అండర్13 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. అండర్–13 డబుల్స్ విభాగంలో విజయ్– రాహుల్ (అనంతపురం) 21–14, 21–14 స్కోరుతో తేజ్ప్రణవ్– విష్ణువర్ధన్ (నెల్లూరు)పై గెలుపొందారు. ఏవీఎస్ హిమదీప్– ఎ.మొహిత్రెడ్డి (పశ్చిమగోదావరి) 21–17, 21–17 స్కోరుతో మహీర్ ఆలీఖాన్– ఎన్.శివారెడ్డి (కర్నూలు) విజయం సాధించారు. హర్షన్– వీఎస్ఎస్ సందేశ్ (కృష్ణా) 21–13, 21–14 స్కోరుతో కేఎల్ అభిరామ్– వై.బెన్ని రోహిత్ (విశాఖ)పై గెలిచారు. ఏ నిధి భట్ (కర్నూలు), షేక్ నుమెయిర్ (ప్రకాశం) ద్వయం 21–10, 21–17 స్కోరుతో సాయిమణికంఠ– మొహిత్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించారు. -
సెమీస్లో తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ సెమీఫైనల్స్కు చేరింది. కెప్టెన్ రాహుల్ చౌదరీ తన స్టార్ ప్రదర్శనను కొనసాగించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్పై 35-23 తేడాతో టైటాన్స్ నెగ్గింది. ఇప్పటికే జైపూర్తో పాటు పట్నా సెమీస్కు చేరాయి. రాహుల్ 11 రైడింగ్ పాయింట్లతో జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. నీలేష్ 5 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 41-20తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. -
మ్యాచ్ గురించి ట్విట్టర్ ఏమంటోంది?
భారత్- వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం తర్వాత ట్విట్టర్ కొంత నెమ్మదించింది. టీమిండియా విజయం సాధించినప్పుడల్లా అభినందనలతో ముంచెత్తే సెలబ్రిటీలు అయితే ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు, లేదా పాపం.. మనవాళ్లు ప్రయత్నించినా అదృష్టం వాళ్లవైపు ఉందని, వెస్టిండీస్ వాళ్లు కూడా చాలా బాగా ఆడారని చెప్పారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అసలు ఈ మ్యాచ్ గురించిన ప్రస్తావనే తేలేదు. కోల్కతా ఫ్లై ఓవర్ దుర్ఘటన గురించి, రక్తదానం చేయాల్సిన అవసరం గురించి మాత్రమే చెప్పారు. ఇక వెస్టిండీస్ మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు, ఇతర దేశాల క్రీడాకారులు మాత్రం ఆ టీమ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. సిమ్మన్స్ నేరుగా విమానంలో దిగి వచ్చి తమ జట్టుకు విజయాన్ని అందించాడని, అతడు నిజమైన చాంపియన్ అని వెస్టిండీస్ టీమ్ సభ్యుడు డ్వేన్ బ్రేవో అన్నాడు. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తాడని ఆశించినా, బుమ్రా అద్భుతమైన బౌలింగుతో కేవలం 5 పరుగులకే వెనుదిరిగిన క్రిస్గేల్ కూడా దీనిపై స్పందించాడు. తమ జట్టులో చాంపియన్ ఒక్కరే కాదని, చాలామంది ఉన్నారని చెప్పాడు. విండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గ్రేట్ గ్రేట్ గ్రేట్.. అంటూ, వెస్టిండీస్ ఫైనల్స్లో ఇంగ్లండ్తో ఆడుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాంఖడే స్టేడియం నిశ్శబ్దంగా మారిపోయిందని, వెస్టిండీస్ వాసిని అయినందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్లెన్ మెక్గ్రాత్ దీనిపై స్పందిస్తూ.. ఆట చాలా బాగుందని, వెస్టిండీస్ జట్టు సభ్యులు తమ సంబరాల నుంచి బయటకు రావడానికి కనీసం రెండు రోజులు పడుతుందని అన్నాడు. టీమిండియాలో ఒకప్పటి భీకరమైన లెగ్స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారతజట్టు ప్రదర్శన పట్ల కొంత నిరాశ చెందారు. వెస్టిండీస్ బాగానే ఆడిందంటూ, భారత జట్టు మాత్రం ఫీల్డులో అంత బాగోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొత్తం మ్యాచ్ని ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి, మన అదృష్టం బాగోలేదని చెప్పాడు. ఇది చాలా మంచి మ్యాచ్ అని, మనవాళ్లు బాగా పోరాడారని అన్నాడు. ఫైనల్స్లో పోరాడుతున్న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు రెండింటికీ అభినందనలు చెప్పాడు. సిద్దార్థ మాల్యా స్పందిస్తూ.. మనవాళ్లు చాలా బాగా ఆడారని, ముఖ్యంగా టోర్నీ మొత్తం విరాట్ కోహ్లీ అదరగొట్టాడని ప్రశంసించాడు. ఇక బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ భండార్కర్ తనదైన శైలిలో ఈ మ్యాచ్ గురించి చెప్పాడు. సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు, క్రికెట్ మ్యాచ్ ఫలితం రెండింటినీ ఎవరూ ఊహించలేరని, మనవాళ్లు ఓడినందుకు చాలా బాధగా ఉంది గానీ, వెస్టిండీస్ బాగా ఆడిందని అన్నాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా కూడా ఈ మ్యాచ్ తీరుపై స్పందించింది. మాట్లాడటానికి మాటలు ఏమీ మిగల్లేదని, వెస్టిండీస్ వాళ్లు బాగా ఆడారని చెప్పింది. మనవాళ్ల అదృష్టం బాగోలేదని వాపోయింది. Congrats to @54simmo who came off a plane to bat his team to victory. True #Champion pic.twitter.com/ktXV0pFHJ9 — Dwayne DJ Bravo (@DJBravo47) 31 March 2016 We have a lot of #Champions not a 1 #Champion https://t.co/M5cC5mWWMF — Chris Gayle (@henrygayle) 31 March 2016 What a game!! I've never seen anything like it. @westindies will need next 2 days to get over celebrations tonight #WT20 — Glenn McGrath (@glennmcgrath11) 31 March 2016 Well done WI. India, not good on the field today. #IndvsWI #AKLive #WT20 — Anil Kumble (@anilkumble1074) 31 March 2016 Great great great!!! Well done Windies!!! #silence #wankhede #WestindiesvsEngland #ICCWT20 #finals proud to be West Indian — Brian Lara (@BrianLara) 31 March 2016 Tough luck boys. It was a good match and well fought! Best wishes to West Indies and England for the finals. #IndvsWI #WT20 — sachin tendulkar (@sachin_rt) 31 March 2016 Well done @westindies!! And congrats #India on a superb tournament, especially @imVkohli who has been a warrior throughout. #IndvsWI #WT20 — Sid Mallya (@sidmallya) 31 March 2016 Box office collections of a film n result of a cricket match, both unpredictable. Sad we lost but well played West Indies. #IndvsWI — Madhur Bhandarkar (@imbhandarkar) 31 March 2016 In a loss of words now.. Well played #WestIndies Can't believe it !!! Well played #WestIndies I guess u guys out played us. Good show India ! Take a bow #viratkohli you #runmachine — Akhil Akkineni (@AkhilAkkineni8) 1 April 2016 -
భళా... భారత్
సెమీస్లో సర్దార్సేన క్వార్టర్స్లో మలేసియాపై గెలుపు హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ యాంట్వార్ప్ (బెల్జియం): ఓవైపు తీవ్రమైన ఎండ... మరోవైపు ప్రత్యర్థుల ఎదురుదాడులు... అయినా ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో చెలరేగిన భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో దుమ్మురేపింది. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 3-2 తేడాతో మలేసియాపై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (3వ ని.లో), జస్జీత్ సింగ్ (50వ, 56వ ని.లో) గోల్స్ చేయగా, రహీమ్ రజీ (15వ ని.లో), సబ్బా షహ్రీల్ (23వ ని.లో) మలేసియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్కు దిగాయి. తొలి క్వార్టర్లో బంతిపై ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడాయి. బ్యాక్లైన్ నుంచి ఆకాశ్దీప్ బంతిని డి-సర్కిల్లో అదుపు చేయగా పక్కనే ఉన్న సత్బీర్ నేర్పుగా గోల్పోస్ట్లోకి పంపడంతో భారత్కు తొలి గోల్ లభించింది. 4వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తర్వాత రమణ్దీప్, మన్ప్రీత్, సర్దార్లు అటాకింగ్ చేసినా మలేసియా సమర్థంగా అడ్డుకుంది. మరికొన్ని సెకన్లలో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా మలేసియా ప్లేయర్ రజీ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. రెండో క్వార్టర్లో భారత్ ఎదురుదాడులు కాస్త గాడి తప్పగా, మలేసియా అద్భుతంగా డిఫెన్స్ చేసింది. మిడ్ఫీల్డ్లో బంతిని బాగా కంట్రోల్ చేయడంతో 23వ నిమిషంలో నాలుగో పెనాల్టీ లభించింది. దీన్ని షహ్రీల్ గోల్గా మల్చడంతో మలేసియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నిమిషంలోనే భారత్ కౌంటర్ అటాక్కు దిగి పీసీని రాబట్టింది. అయితే దీన్ని రూపిందర్ పాల్ వృథా చేశాడు. 28వ నిమిషంలో వాల్మీకి రెండో పెనాల్టీని సాధించినా... రిఫరల్లో ఇది వీగిపోయింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు చేసిన దాడులు ఫలించకపోవడంతో భారత్పై ఒత్తిడి పెరిగింది. అయితే 48వ నిమిషంలో పెనాల్టీ రిఫరల్లో వీగిపోగా, తర్వాతి నిమిషంలో మరో పీసీ భారత్కు లభించింది. దీన్ని జస్జీత్ హై ఫ్లిక్తో సూపర్బ్గా నెట్లోకి పంపి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఏడు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీని జస్జీత్ మళ్లీ గోల్గా మలిచి భారత్ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట 30 సెకన్లలో ముగుస్తుందనగా మలేసియాకు పెనాల్టీ లభించినా గోల్కీపర్ శ్రీజేష్ బంతిని అద్భుతంగా నిలువరించడంతో విజయం భారత్ సొంతమైంది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో గురువారం ఇటలీతో భారత జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గితేనే భారత్కు రియో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి. -
సెమీస్లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ జంట 6-3, 6-4తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో-స్విస్ జంట ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయింది. సెమీస్లో ఏడో సీడ్ తిమీ బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా జంట తలపడుతుంది. -
పోరాడి ఓడిన హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్ సోచి (రష్యా): ఒత్తిడిలో తడబడిన భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లో ఓటమి పాలైంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 2.5-3.5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. క్లాసికల్ పద్ధతిలో జరిగిన నిర్ణీత రెండు గేమ్ల తర్వాత ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి మంగళవారం ర్యాపిడ్ పద్ధతిలో టైబ్రేక్ గేమ్లను నిర్వహించారు. తొలుత 25 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్లు జరిగాయి. ఇందులో తొలి గేమ్లో హారిక 38 ఎత్తుల్లో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకొని రెండో గేమ్లో హారిక 80 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 1-1తో సమమైంది. దాంతో ఈసారి 10 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్లను నిర్వహించారు. ఇందులో తెల్లపావులతో తొలి గేమ్ను ఆడిన హారిక 96 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఒకానొక దశలో హారికకు ఈ గేమ్లో స్పష్టమైన విజయావకాశాలు కనిపించాయి. కానీ మరియా ముజిచుక్ చక్కటి వ్యూహాలతో ‘డ్రా’ చేసుకోగలిగింది. ఇక రెండో గేమ్లో తెల్లపావులతో ఆడిన మరియా 56 ఎత్తుల్లో హారికపై నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2012 ప్రపంచ చాంపియన్షిప్లోనూ హారిక సెమీఫైనల్ దశలోనే నిష్ర్కమించింది. గురువారం మొదలయ్యే నాలుగు గేమ్ల ఫైనల్లో నటాలియా పోగోనినా (రష్యా)తో మరియా ముజిచుక్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పోగోనినా టైబ్రేక్లో 1.5-0.5తో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. మరియా, పోగోనినా మధ్య ఫైనల్లో గెలిచిన వారు ఈ ఏడాది చివర్లో హూ ఇఫాన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో తలపడతారు. -
బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శ్రీకాంత్ ఓటమి
దుబాయ్: ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శనివారం భారత్కు నిరాశ ఎదురైంది. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్తో పాటు శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్ 18-21, 9-21 స్కోరుతో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ సెమీస్లో వరల్డ్ నెంబర్ 4 సైనా 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో ఓడిపోయింది. -
వరల్డ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్స్లో సైనా ఓటమి
దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగించిన భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ సెమీఫైనల్స్లో ఓడిపోయింది. శనివారం జరిగిన సెమీఫైనల్స్లో 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో వరల్డ్ నెంబర్ 4 సైనా ఓడిపోయింది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ఏ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. -
డబ్ల్యూటీఏ సెమీస్కు సానియా జోడీ
సింగపూర్ : సానియా మీర్జా జోడీ సింగపూర్లో జరుగుతున్న డబ్ల్యూటీఏ (ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్) సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ ఫైనల్స్లో కోప్స్-జోన్స్ జంటపై సానియా, కారా బ్లాక్ జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో విజయం సాధించింది. డబ్ల్యూటీఏ సెమీస్కు చేరటం సానియాకు ఇదే తొలిసారి. కాగా ఇంతకుముందు ముగ్గురు వేర్వేరు భాగస్వాముల (ఎలెనా లిఖోవ్త్సెవా, రెన్నీ స్టబ్స్, లీజెల్ హ్యుబర్)తో కలసి పదిసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న కారా బ్లాక్ ఈసారి సానియాతో కలసి 11వ సారి బరిలోకి దిగింది. ఈ ఏడాది చివర్లో కారా బ్లాక్ టెన్నిస్ నుంచి రిటైర్డ్ కానుంది. -
సెమీ ఫైనల్లోకి సింధు
-
ఈ మహిళలు సూపర్...
-
దటీజ్ లీడర్!!
నాయకుడు అంటే ఎలా ఉండాలి? తనకు అవకాశం వచ్చినా కూడా.. వీలైతే దాన్ని పక్కవాళ్లకు అందించగలిగేలా ఉండాలి. తాను గెలవడంతో పాటు.. పక్కవాళ్లను కూడా గెలిపించడం, వాళ్లకు పేరు వచ్చేలా చేయడం ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. వీటిని నూటికి నూరుశాతం చేసి చూపిస్తున్న లీడర్.. టీమిండియా కెప్టెన్, రాంచీ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ. శుక్రవారం నాటి సెమీఫైనల్స్ మ్యాచ్ చివర్లో చూసినవాళ్లు ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. సాధారణంగా ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్లోనైనా ధోనీ బ్యాటింగ్కు దిగాడంటే దాదాపుగా విన్నింగ్ షాట్ అతడే కొట్టేవాడు. చిట్టచివర్లో ఎన్ని పరుగులు చేయాలన్నా కూడా సిక్సర్ కొట్టి మ్యాచ్ సొంతం చేసుకోవడం ధోనీకి అలవాటు. కానీ శుక్రవారం నాడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. అప్పటివరకు చెలరేగి ఆడి, టీమిండియాను విజయ తీరానికి చేర్చిన సహచరుడు విరాట్ కోహ్లీకి ఆ అవకాశాన్ని చేతులారా అందించాడు. దాన్ని స్టేడియంలో ఉన్న వేలాది మందితో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది భారతీయులు కళ్లారా చూసి ఆస్వాదించారు. జట్టు స్కోరు 167 పరుగుల వద్ద ఉండగా అప్పటికి ధాటిగా ఆడుతున్న సురేష్ రైనా ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో డుప్లెసిస్ క్యాచ్ పట్టడంతో రైనా వికెట్ పడింది. దాంతో కెప్టెన్ ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే, అప్పటికే మ్యాట్ క్రాస్ కావడంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎండ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా 172 పరుగులు చేసింది. టీమిండియా విజయలక్ష్యం 173. అప్పటికి ఒక్కటే పరుగు కావాలి. లెఫ్టామ్ పేస్ బౌలర్ హెండ్రిక్స్ స్లో, షార్ట్ బాల్ వేసి 19వ ఓవర్ ముగించాడు. మామూలుగా అయితే అలాంటి బాల్ను ధోనీ సులభంగా సిక్సర్ బాదేసేవాడు. కానీ అతడిలో ఉన్న లీడర్ అలా చెయ్యనివ్వలేదు. నవ్వుతూ ఆ బాల్ను డిఫెన్స్ ఆడాడు. అంతకుముందు ధోనీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు 'ఆప్ ఖతమ్ కరో' (మీరు పూర్తిచేసేయండి) అని కోహ్లీ చెప్పగా, 'తూనే అచ్ఛీ బ్యాటింగ్ కరీ హై, తో యే మేరా గిఫ్ట్ హై తేరే లియే' (నువ్వు మంచి బ్యాటింగ్ చేశావు. ఇది నీకు నా బహుమతి) అని ధోనీ బదులిచ్చాడు. దాంతో 20వ ఓవర్ బౌలింగ్ చేయడానికి డేల్ స్టెయిన్ రాగానే తొలి బంతినే కోహ్లీ బౌండరీకి పంపించాడు. అంతే.. భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎంత బాగా బ్యాటింగ్ చేసినా, విన్నింగ్ షాట్ కొట్టడమంటే ఎవరికైనా అదో థ్రిల్. సరిగ్గా ఆ థ్రిల్లింగ్ అనుభవాన్ని అప్పటివరకు బాగా ఆడిన సహచరుడికి అందించాలనుకున్నాడు ధోనీ. కోహ్లీ కూడా అందుకు చాలా సంతోషంగా ఫీలయ్యాడు. విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం ఇచ్చినందుకు కెప్టెన్కు కృతజ్ఞతలు తెలిపాడు. -
ఎన్నికల పోరు...ఫ్యాన్ జోరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్గా జరగనున్న మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ప్రాదేశికాలలో తమ జెండాలను ఎగురవేయాలని ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నెగ్గుకురాగలిగిన వారికే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇదే సూత్రాన్ని శిరసావహిస్తూ వైఎస్ఆర్ సీపీ పట్టుబిగిస్తోంది. ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూ, మరోవైపు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నలు చెరగులా... నలుగురు.. జిల్లా నలుచెరగులా నలుగురు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్కృష్ణ రంగారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం, అరకు పార్లమెంట్ సమన్వయకర్తలు బేబీనాయన, కొత్తపల్లి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. నాలుగు మున్సిపాల్టీలను, జిల్లా పరిషత్తో పాటు అత్యధిక మండల పరిషత్లు ఆ పార్టీకి దక్కేలా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ సీపీలోకి వలసల జోరు కాంగ్రెస్, టీడీపీల నుంచి వస్తున్న వేలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు. ఒక్క బుధవారమే గరుగుబిల్లి మండలంలోని కాంగ్రెస్, టీడీపీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరారు. అలాగే తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాల్లో కూడా చేరికలు జరిగాయి. సుజయ్కృష్ణ రంగారావు, బేబీనాయన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేరికలు జరగ్గా, నెల్లిమర్లలో పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్బాబు, గజపతినగరం నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గంలో బెల్లాన చంద్రశేఖర్, కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల చంద్రశేఖర్రాజు, సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర, పార్వతీపురంలో జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. బలమైన బొబ్బిలి.. వైఎస్ఆర్ సీపీకి బొబ్బిలి బలమైన కోటగా ఆవిర్భవించింది. ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్కృష్ణరంగారావు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బేబీనాయన పార్టీకి రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వేలాది మంది పార్టీలో చేరుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా కుదేలయింది. మూడు ప్రధాన పార్టీలూ 30 వార్డుల్లోనూ పోటీ చేస్తున్నా మిగతా పార్టీలకంటే ఫ్యాన్గాలి జోరుగా వీస్తోంది. సరైన నాయకత్వం లేకపోడంతో టీడీపీ క్యాడర్ జారుకుంటోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ గూడుపుఠాణీకి దిగడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ఆ పార్టీల గ్రాఫ్ దిగజారుతోంది. పార్వతీపురం.. పార్వతీపుంలో సుజయ్కృష్ణరంగరావు, బేబీనాయన, కొత్తపల్లి గీతతో పాటు స్థానిక సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ఇతర నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్ తదితరులు కృషి ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జయమణి కూడా వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి కలిసివచ్చింది. టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో గందరగోళం, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్పై వ్యతిరేకత వల్ల ఆ పార్టీ నష్టపోనుంది. పార్వతీపురం మున్సిపాలిటీలోని గల 30 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 27 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలిగింది. ప్రచారంలో కూడా కాంగ్రెస్ కనుమరుగుకాగా, టీడీపీ వెనుకంజలో ఉంది. సాలూరు.. సాలూరులో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర చేరిన తరువాత వైఎస్ఆర్ సీపీ బలపడింది. పార్టీలోకి వలసలజోరు పెరిగింది. పార్టీకి ప్రజాబలం ఎక్కువగా ఉంది. టీడీపీ కూడా పోటీపడుతోంది. అయితే వైఎస్ఆర్ సీసీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడింది. విజయన ‘గరం...గరం’ విజయనగరంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్కృష్ణరంగారావు విస్తృతంగా పర్యటిస్తుండడంతో పార్టీ బలం మరింత పెరిగింది. మరో వైపు టీడీపీ కూడా గట్టిపోటీ ఇస్తోంది. కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. -
టైటిల్ పోరుకు కర్ణాటక, రైల్వేస్
కోల్కతా: విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నీలో కర్ణాటక, రైల్వేస్ జట్లు టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో కర్ణాటక 21 పరుగుల తేడాతో జార్ఖండ్పై... రైల్వేస్ 5 వికెట్ల తేడాతో బెంగాల్పై విజయం సాధించాయి. రాబిన్ ఉతప్ప (135 బంతుల్లో 133; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 6 వికెట్లకు 323 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఇషాంక్ జగ్గీ (121 బంతుల్లో 141; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), సౌరభ్ తివారీ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించినా ప్రయోజనం లేకపోయింది. వినయ్ కుమార్ 4, మిథున్ 3 వికెట్లు తీశారు. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో సెమీస్లో మొదట బెంగాల్ 47.4 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. మనోజ్ తివారీ (61), గోస్వామి (38) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత రైల్వేస్ 38.2 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో రైల్వేస్ తలపడుతుంది. -
ఎట్టబ్బా..
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు ఏవైనా సరే ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. జిల్లా ప్రజలు మరీ ముఖ్యంగా పట్టణవాసులు వైఎస్సార్సీపీకి ‘ఫ్యాన్స్’గా ఉండటంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. సాధారణ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. కడప పార్లమెంటు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ ఎన్నికలతోబాటు సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికలు ఇలా ఏవైనా సరే జిల్లాలో ఏకపక్షంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. క్రమం తప్పకుండా ఆ పార్టీ మద్దతుదారులను గట్టెక్కిస్తూ వస్తున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు తెరపైకి రానున్న నేపథ్యంలో ఎలా గట్టెక్కాలో తెలియని స్థితిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలున్నారు. అంతలోనే తెరపైకి పురపాలక ఎన్నికలు వచ్చి కూర్చున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ పక్షాలకు సెమీ ఫైనల్స్లా నిలుస్తున్నాయి. ఆమేరకు అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తుంటే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయండంటూ బతిమలాడాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊసే ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. భారీ మెజార్టీ అందించిన ప్రజానీకం జిల్లాలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో గతంలో జరిగిన పలు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించడంతో తెలుగుదేశం పార్టీ పోటీకి జంకుతున్నట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు ఎన్నికల పరిధిలో ప్రొద్దుటూరు నియోజక వర్గంలో 74,771 ఓట్ల మెజార్టీ వైఎస్సార్సీపీకి దక్కింది. రాజుపాళెం, రూరల్ మండలాలను మినహాయిస్తే మున్సిపాలిటిలోనే దాదాపు 60వేల ఓట్ల ఆధిక్యత ఆ పార్టీ సొంతమైంది. అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో 67,785 ఓట్ల ఆధిక్యత వైఎస్సార్సీపీకి దక్కింది. అప్పటి కంటే ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మరింత ప్రతికూలంగా ఉన్నాయని పరిశీలకుల అంచనా. మైదుకూరు నియోజకవర్గంలో 70,147 ఓట్ల ఆధిక్యతను, జమ్మలమడుగులో 67,483 ఓట్లు, పులివెందులలో 1,08,177 ఓట్ల ఆధిక్యతను, రాయచోటిలో 56,891 ఓట్లు, బద్వేల్ నియోజకవర్గంలో 61,463 ఓట్ల ఆధిక్యత వైఎస్సార్సీపీ సొంతమైంది. ఆ ఎన్నికల్లో పట్టణ ప్రజలు ప్రధాన భూమిక పోషించారు. గ్రామాల కంటే పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శంగా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక ఎన్నికలు వైఎస్సార్సీపీకి నల్లేరు మీద నడక లాగానే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెరపైకి విభజన అంశం.... రాష్ట్ర విభజన అంశం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెరపైకి వస్తుండటంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమైతే అడ్డుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. దీంతో ఆపార్టీ కేడర్ పూర్తి నిస్పృహలో ఉండిపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అజెండాగా వైఎస్సార్సీపీ నిలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి రెండు ప్రాంతాల్లోనూ పార్టీని భ్రష్టు పట్టించారని పార్టీ శ్రేణులు మథనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పోటీ చేయాలంటే అభ్యర్థులు ముందుకు రాని దుస్థితి నెలకొందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
సెమీస్లో జేమ్స్
రాయదుర్గం, న్యూస్లైన్: సీనియర్స్ స్నూకర్స్ స్టేట్ ర్యాంకింగ్ పోటీల్లో షూటర్స్ డెన్కు చెందిన జేమ్స్ సుందర్రాజ్ సెమీఫైనల్కు చేరాడు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన క్వార్టర్స్ ఫైనల్ పోటీలో జేమ్స్ సుందర్రాజ్ 4-0 ఫ్రేమ్స్తో అహ్మద్ ముస్తఫాను ఓడించాడు. అంతకుముందు నిర్వహించిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జేమ్స్ సుందర్రాజ్ 3-1తో కైజర్ రవూఫ్ను, అహ్మద్ ముస్తఫా 3-1తో జి పాండును, పవన్కుమార్ 3-0తో వంశీకృష్ణను, ఐవి రాజు 3-1తో ప్రదీప్ను, శంకర్రావు 3-1తో హేమంత్సింగ్ ఠాకూర్ను, బాలకృష్ణ 3-2తో కె.శ్రీనివాస్ను, హిమాన్షు జైన్ 3-1తో శివశర్మ, విశాల్ అగర్వాల్ 3-2తో డి అరవిం ద్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. -
అంతా ‘హస్త’వ్యస్తం!
అవసాన దశకు చేరిన కాంగ్రెస్కు ఆఖరాట మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట మినహా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కుంభకోణాలు నిత్యకృత్యమై, ప్రత్యర్థులను వేధించడం అలవాటై ప్రజలకు సమర్ధ పాలన అందించడమనే ప్రాథమిక సూత్రాన్ని ఏనాడో మరిచిపోయిన కాంగ్రెస్ను ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ గంపగుత్తగా తిరస్కరించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు పుట్టగతులుండవని సర్వేలు ఒకటికి పదిసార్లు చెప్పాయి. రాజకీయ నిపుణులు ఎన్నెన్నోసార్లు విశ్లేషించి చెప్పారు. అయినా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేకపోయింది. ఫలితంగా ఆమూల ఈశాన్యంలో మినహా ప్రధాన రాష్ట్రాలన్నిటా దానికి శృంగభంగమైంది. మూడు దఫాలనుంచి పాలిస్తున్న ఢిల్లీలోనూ, క్రితంసారి అధికారంలోకొచ్చిన రాజస్థాన్లోనూ ఆ పార్టీని ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించగా... మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో గతకాలపు అవమానాలే మళ్లీ ఎదురయ్యాయి. పాలించాం గనుక బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదురైందని దబాయించే అవకాశంలేదు. అలాంటిదేమైనా ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోని బీజేపీ ప్రభుత్వాలకూ ఆ పరిస్థితి ఎదురుకావాలి. ఆ రెండుచోట్లా కమలనాథులు వరసగా రెండు పర్యాయాలనుంచి విజయకేతనం ఎగరేస్తున్నారు. మూడోసారి కూడా ఆ పార్టీనే జనం మెచ్చారంటే, మెచ్చి మరిన్ని సీట్లు అదనంగా ఇచ్చారంటే తన వైఫల్యం ఎక్కడుందో కాంగ్రెస్కు జ్ఞానోదయం కావాలి. మూలవిరాట్టులే గుదిబండలయ్యారని తెలుసుకోవాలి. ఫలితాలు వెలువడ్డ రాష్ట్రాలన్నిటా కాంగ్రెస్ను ఖండఖండాలు చేసుకుంటూ ఢిల్లీవైపు అడుగులేసిన బీజేపీకి... అక్కడ వెలువడిన ఫలితాలు తీరని షాక్నిచ్చాయి. పుట్టి నిండా ఏడాది కాకుండానే కొత్త కొత్త ఎత్తుగడలతో, విభిన్నమైన ప్రచారశైలితో జనం గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ధాటికి అక్కడి బీజేపీ తట్టుకోలేకపోయింది. చిరుగాలిగా మొదలైన ఆప్ చూస్తుండగానే పెను ప్రభంజనంలా మారడం, తన ఒళ్లో వాలవలసిన అధికారం కాస్తా మరిన్ని అడుగులకు అవతలెక్కడో పడటం... 2014లో దేశాన్ని ఏలాలనుకుంటున్న పార్టీకి పెనుఘాతమే. దేశ రాజధాని నగరంలో పోటీ ఉంటే గింటే తమ మధ్యే తప్ప అన్యులకు అక్కడ చోటులేదని లెక్కలేసుకున్న ప్రధాన పక్షాల రెండింటి అంచనాలనూ ఆప్ తలకిందులు చేసింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 36 స్థానాల అవసరంపడగా, బీజేపీ 31 దగ్గరే ఆగి పోయింది. మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ అయినా అయిదారు సీట్లు సాయంపట్టి ఉంటే బీజేపీ ‘బతుకు జీవుడా’ అనుకునేది. కానీ, ఢిల్లీ ఓటరు కరుణించలేదు. పదిహేనేళ్లనుంచి అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్కు ఎనిమిదంటే ఎనిమిదే స్థానాలు మిగిల్చి అంటకత్తెరేయగా, ఆప్కు 28 స్థానాలతో ఓటర్లు పట్టంగట్టారు. చూడదల్చుకున్నవారికి ఆప్ దూకుడు ఆదినుంచీ కనిపిస్తూనే ఉంది. పీఠంపై ఉన్నవారిని వేదికలనెక్కి తెగనాడేవారు అసలైన పరీక్షలో అట్టర్ఫ్లాప్ అవుతారని ప్రధాన పార్టీలే కాదు...కొందరు విశ్లేషకులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సర్వేల్లో ఆ పార్టీకి పది పదిహేను స్థానాలు మించి ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కాంగ్రెస్ అయితే, అధికారంలో ఉన్నాం కదా అని తనకలవాటైన మొరటుతనంతో వ్యవహరించింది. పార్టీకి ఎక్కడెక్కడినుంచి విరాళాలందుతున్నాయో ఏరోజుకా రోజు వెబ్సైట్లో పెట్టిన ఆప్ను అభినందించాల్సిందిపోయి వేధించుకు తినడానికి మార్గం దొరికిందని కాంగ్రెస్ పెద్దలు చంకలు గుద్దుకున్నారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే విభాగాలకు పనిచెప్పారు. ఫలితంగా ఆప్కు అభిమానులే కాదు... విరాళాలూ పెరిగాయి. గెలిచే పార్టీకే ఓటేయడం తప్పదనుకున్నవారు సైతం ఆఖరి క్షణంలో మనసు మార్చుకుని ఆప్ వైపు మొగ్గారు. ఒక కొత్త పార్టీని స్థాపించడం, స్వల్పకాలంలోనే దాన్ని విజయపథంలో నడిపించడం సాధారణ విషయం కాదు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ను అభినందించాల్సిందే. అభ్యర్థుల ఎంపికనుంచి అందరికీ భాగస్వామ్యం కల్పించడానికి ఆయన చేసిన ప్రయత్నం మెచ్చదగ్గదే. అంతకుమించి ఆ గడ్డపై సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆప్ కాలూనడానికి ప్రాథమికంగా దోహదపడింది. అటు తర్వాత జరిగిన నిర్భయ ఉదంతం సందర్భంగా వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం కూడా పాలకులపై ఏవగింపు కలిగించింది. ఆ రెండు ఉద్యమాల్లోనూ సమీకృతులై లాఠీ దెబ్బలను, వాటర్ కేనన్లనూ ఎదిరించి పోరాడిన వేలాదిమంది యువతీయువకులు ఆప్ తమదేనని త్రికరణ శుద్ధిగా నమ్మారు. పార్టీలో పదవుల్నిగానీ, దాన్నుంచి డబ్బుల్నిగానీ ఆశించకుండా వీరంతా రాత్రింబగళ్లు పనిచేశారు. ఆన్లైనా, వీధి వీధీనా అనే విచికిత్సకు పోలేదు. ఏది వీలైతే అదిచేశారు. ప్రత్యర్థుల మారీచ ఎత్తుగడల ఆనుపానులను ఎప్పటికప్పుడు పట్టారు. దొంగ ఓటర్ల ఆచూకీని, నిజమైన ఓటర్ల గల్లంతును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. అవతలి పార్టీలను గుక్కతిప్పుకోనీయలేదు. నియోజకవర్గాల వారీ మేనిఫెస్టోల్లో స్థానికుల ఆకాంక్షలకు చోటిచ్చారు. సామాన్యుల గుండె లోలోతుల్లోని అభిప్రాయాలకు గొంతుకయ్యారు. కాంగ్రెస్కు ఇక సమయం మించిపోయింది. అది మారేదీ లేదు... ప్రజలను దాన్ని నమ్మేదీ లేదు. కానీ, బీజేపీ ఈ జయజయధ్వానాల్లోనే జనం చేసిన హెచ్చరికను పోల్చుకోవాలి. బలమైన ప్రత్యామ్నాయం కాగలదని భావించినప్పుడు... కొత్తదైనా మూడో పక్షాన్ని సైతం ఎంచుకోవడానికి వారు వెనకాడరని గుర్తుంచుకోవాలి. తమకు కంచుకోటలనుకున్న రాష్ట్రాలు భద్రంగానే ఉన్నాయనుకున్నా ఇతరేతర ప్రాంతాల్లో కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యే ఆస్కారం లేకపోలేదని గ్రహించాలి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆకర్షణ ఒకటే సరిపోదని, సర్వామోద విధానాల రూపకల్పన అవసరమూ ఉన్నదని తెలుసుకోవాలి. -
'కాంగ్రెస్ను వదలనంటున్న రాహుల్ గ్రహం'
-
సెమిఫైనల్స్ ఫలితాలు విభజన అంశంపై ప్రభావం చూపుతాయా- చర్చ
-
సెమీ ఫైనల్స్ - బీజేపీ పొత్తుపై చర్చ
-
సెమీ ఫైనల్స్ - చత్తీస్గఢ్ ఫలితాలపై చర్చ
-
సెమీ ఫైనల్స్ - రాజస్తాన్ సీఎం ఎవరు..?
-
సెమీ ఫైనల్స్ - ఢిల్లీ,మధ్యప్రదేశ్పై చర్చ
-
సెమీ ఫైనల్స్పై హెడ్లైన్ షో
-
మంచి మ్యాజికల్ ఫిగర్ వస్తుంది
-
ఢిల్లీలో ఉల్లి లొల్లి....