
బోపన్న-బాబోస్ జోడి
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంగా రోహన్ బోపన్న(భారత్)- తైమియా బాబోస్(హంగేరి) జంట ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో బోపన్న ద్వయం 7-5, 5-7, 10-6 తేడాతో మార్సిలో డిమోలైనర్(బ్రెజిల్)- మార్టినెజ్ సాంచెజ్(స్పెయిన్) జంటపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.
తొలి సెట్ను గెలిచిన బోపన్న జంట.. రెండో సెట్ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో తిరిగి పుంజుకున్న బోపన్న ద్వయం ఆ సెట్ను గెలవడమే కాకుండా ఫైనల్కు చేరింది.టై బ్రేక్కు దారి తీసిన మూడో సెట్లో ఆధిక్యంలో నిలిచిన బోపన్న జంట ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. శనివారం జరిగే తుది పోరులో బోపన్న-బాబోస్ జోడి.. గాబ్రియేలా డాబ్రోస్కి-మేట్ పావిచ్ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment