రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స అండ్ టెక్నాలజీ కళాశాలలో సెప్టెంబర్ 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పురుషుల, మహిళల, యూత్ బాలికలు, బాలురు, జూనియర్ బాలబాలికలు, క్యాడెట్ విభాగాల్లో జరిగే ఈటోర్నీని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ప్రారంభిస్తారు.