నాగ్పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ ఆ రెండింటిలో గెలిచి మంచి ఊపు మీద ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి వెనుకబడింది.
అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుండగా, వెస్టిండీస్ మాత్రం తమ జైత్రయాత్రను కొనసాగించి నేరుగా సెమీస్లోకి చేరాలని యోచిస్తోంది.