-
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్లో విండీస్ కెప్టెన్గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్. -
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
టీ20 వరల్డ్కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్కప్లో అమెరికా తమ తొలి మ్యాచ్లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది. -
గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్
సరదాగా సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం దొర్లించేసింది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్బర్గ్ నేషనల్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq — Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024 అసలు ఏమైందంటే... ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం పిలానెస్బర్గ్ నేషనల్ పార్క్లో 22 సీటర్ ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు. ఇంతలో డ్రైవర్ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది. దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్ ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా ప్రవర్తించిందని పార్క్ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్ సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు. -
మూడు మ్యాచ్లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్లో బీజీగా ఉండటంతో బీపీఎల్ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్లు ఆడితే డేవిడ్ మిల్లర్కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
వరల్డ్కప్ ఫైనల్లో బోల్తా పడ్డ భారత్.. నాలుగో సారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్మిలన్ బౌలింగ్లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్మ్యాన్ బౌలింగ్లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ డౌన్ 91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్మిలన్ బౌలింగ్లో డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో భారత్ వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్లో ఉన్నారు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ 40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్మెన్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్లో ర్యాన్ హిక్స్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో రాఫ్ మెక్మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్మిలన్ (0) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్లో మురుగన్ అభిషేక్కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1 12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. తుది జట్లు: ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్స్టాస్, హ్యూ వీబ్జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్మాన్, కల్లమ్ విడ్లర్ భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్గా మిల్లర్ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా బుధవారం జో బర్గ్ సూపర్ కింగ్స్తో జరిగిన ఎలిమేనిటర్ మ్యాచ్లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్లో పార్ల్ రాయల్స్ కెప్టెన్గా మిల్లర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 10019 పరుగులు చేశాడు. కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, ఫాప్ డుప్లెసిస్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్ 12 స్ధానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జో బర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే? క్రిస్ గేల్ (14562) షోయబ్ మాలిక్ (13077) కీరన్ పొలార్డ్ (12577), అలెక్స్ హేల్స్ (12002), విరాట్ కోహ్లి (11994), డేవిడ్ వార్నర్ (11860), ఆరోన్ ఫించ్ (11458), రోహిత్ శర్మ (11156), జోస్ బట్లర్ 11146), కోలిన్ మున్రో (10602) జేమ్స్ విన్స్ (10019) డేవిడ్ మిల్లర్(10019) -
వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డు..
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా.. భారత్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. కోల్కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 243 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే తమ ఇన్నింగ్స్ను ముగించింది. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే డికాక్ను ఔట్ చేసి సఫారీలను చావుదెబ్బ కొట్టాడు. ప్రోటీస్ బ్యాటర్లలో జానెసన్(13) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు.. ఈ మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఇదే అతిపెద్ద పరాజయం. ఇంతకుముందు 2002లో పాకిస్తాన్తో జరిగిన ఓ వన్డేలో 182 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్తో మరోసారి ఆప్రతిష్టతను ప్రోటీస్ మూటకట్టుకుంది. చదవండి: మాకు ఎటువంటి స్సెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ -
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 358 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. డస్సెన్ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 133 పరుగులు చేయగా.. డికాక్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 114 పరుగులు సాధించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. నీషమ్, బౌల్ట్ ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్వెల్కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం -
కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా?
వన్డే ప్రపంచకప్ 2023లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా. తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆసీస్ జట్టు.. పసికూన కంటే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ అంటే వార్ వన్ సైడే అని భావించేవారు. కానీ ఇప్పడు పరిస్థితి మరోలా ఉంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్లోనే ఓటమి పాలైన కంగారులు.. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్లోనూ ఘోర పరభావం మూటకట్టుకుంది. సఫారీల దెబ్బకు ఆసీస్ జట్టు విలావిల్లాడింది. ఏకంగా 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 311 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్కప్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఎందుకు ఈ స్ధాయికి దిగజారింది? కంగారులు ఎక్కడ తప్పుచేస్తున్నారు? తర్వాత మ్యాచ్ల్లో కమ్మిన్స్ సేన తిరిగి పుంజుకుంటుందా వంటి విషయాలను ఓసారి చర్చిద్దాం. ఓపెనర్లు విఫలం.. ఆస్ట్రేలియాకు బౌలింగ్ ఎంత బలమో.. బ్యాటింగ్ కూడా అంతే బలం. 300 పరుగుల టార్గెట్ కూడా ఆసీస్ బ్యాటింగ్ జోరు ముందు చిన్నబోయేది. అటువంటి ఆస్ట్రేలియా ఈ వరల్డ్కప్లో 200 పరుగుల మార్క్ను అందుకోవడానికి కూడా నానా కష్టాలు పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్లు విఫలం. ఈ మెగా టోర్నీకి ఆసీస్ రెగ్యూలర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. హెడ్ లేని లోటు ఆసీస్ జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. హెడ్ గైర్హాజరీలో ఆసీస్ ఇన్నింగ్స్ను మిచెల్ మార్ష్.. డేవిడ్ వార్నర్తో కలిసి ఆరంభిస్తున్నాడు. ఓపెనర్గా వస్తున్న మార్ష్ కనీసం ఒకట్రెండు ఓవర్లు కూడా క్రీజులో ఉండలేకపోతున్నాడు. భారత్తో మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగిన మార్ష్.. ప్రోటీస్పై కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కాస్త పర్వాలేదనపిస్తున్నాడు. టీమిండియాపై 41 పరుగులతో రాణించిన వార్నర్.. దక్షిణాఫ్రికాపై మాత్రం 13 పరుగులకే తమ ఇన్నింగ్స్ను ముగించాడు. అయితే ఇది వార్నర్ నుంచి ఆశించిన ప్రదర్శన కాదు. తర్వాతి మ్యాచ్లో ఆసీస్ తిరిగి గాడిలో పడాలంటే ఓపెనింగ్ జోడిని మార్చాలిందే. మరో వికెట్ కీపర్ లేడా? ప్రస్తుత ఆస్ట్రేలియాతో జట్టులో సమర్థవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్ లేడు. ఒకప్పుడు ఆడమ్ గిల్క్రిస్ట్, ఇయాన్ హీలీ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఆసీస్.. ఇప్పుడు ఆ స్ధాయి కీపర్లను తయారుచేయలేకపోతుంది. వికెట్ కీపర్ అంటే.. వికెట్ల వెనుక మెరుగ్గా రాణిస్తే చాలు అన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి ఉంది. ప్రస్తతం ఆసీస్ జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్గా అలెక్స్ కారీ కొనసాగుతున్నాడు. వికెట్లు వెనుక పర్వాలేదనపిస్తున్న కారీ.. బ్యాటింగ్ పరంగా తీవ్ర నిరాశపరిస్తున్నాడు. జట్టుకు కీలకమైన మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తున్న అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమవుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో ఖాతా తెరవకుండానే కారీ పెవిలియన్కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు క్యారీ ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జోష్ ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. జోష్ ఇంగ్లీష్ కూడా అదే తీరును కనబరిచాడు. 5 పరుగులకే తన ఇన్నింగ్స్ను జోష్ ముగించాడు. కచ్చితంగా వీరిద్దరి ప్రత్యామ్నాయం వెతకాల్సిన సమయం క్రికెట్ ఆస్ట్రేలియాకు అసన్నమైంది. ఫినిషింగ్ లేదు.. ఆస్ట్రేలియా అంటే విధ్వంసకర ఆటకు మారుపేరు. అటువంటిది ప్రస్తుత మెగా టోర్నీలో ఆసీస్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. సిక్స్లు మాట పక్కన పెడితే ఫోర్లు కూడా కొట్టడానికి కష్టపడుతున్నారు. టాపర్డర్లో వార్నర్.. మిడిలార్డర్లో స్మిత్, లాబుషేన్ కొన్ని మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఆసీస్కు ఫినిషింగ్ మాత్రం దొరకడంలేదు. వరల్డ్ క్రికెట్లో విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచిన గ్లెన్ మ్యాక్స్వెల్, గ్రీన్, స్టోయినిష్ తుస్సుమనిపిస్తున్నారు. తొలి మ్యాచ్లో గ్రీన్, మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సఫారీలతో మ్యాచ్కు గ్రీన్ స్ధానంలో స్టోయినిష్కు అవకాశం ఇచ్చారు. స్టోయినిష్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మ్యాక్స్వెల్ది కూడా అదే పరిస్ధితి. బౌలింగ్లో పర్వాలదేనపిస్తున్న మ్యాక్సీ.. బ్యాటింగ్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ హిట్టర్లు తిరిగి గాడిలో పడకపోతే ఈ మెగా టోర్నీలో ఆసీస్ ఇంటిముఖం పట్టకతప్పదు. జంపా ఫెయిల్.. ఆసీస్ బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనపిస్తుంది. భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో 3 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి కష్టాలోక్కి నెట్టారు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు తమ రిథమ్ను కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది. హాజిల్వుడ్, స్టార్క్, కమ్మిన్స్ వంటి తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తున్నారు. కానీ కంగారుల ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రం తీవ్ర నిరాశపరిస్తున్నాడు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న జంపా.. పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. చెత్త ఫీల్డింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో చాలా చురుగ్గా ఉంటారు. ఎన్నో అద్బుత క్యాచ్లను అందుకోవడం మనం చూశాం. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఫీల్డింగ్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. 4 ఈజీ క్యాచ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రాప్ చేశారు. అంతేకాకుండా మిస్ ఫీల్డ్లు కూడా చాలా చేశారు. శ్రీలంకతో.. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్లో ఆక్టోబర్ 16న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి మూడు విభాగాల్లో తిరిగిపుంజుకోవాలి. అయితే శ్రీలంక బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతోంది.కాబట్టి శ్రీలంకనుంచి కూడా ఆసీస్కు గట్టిపోటి ఎదునుకానుంది. చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు -
నేనేమి నిద్రపోలేదు.. అందుకు కారణం కెమెరా యాంగిల్: దక్షిణఫ్రికా కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్లో కెప్టెన్స్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీట్కు 10 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. అయితే ఈ మీట్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా నిద్రపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరలవుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై బావుమా స్పందించాడు. కెప్టెన్సీ మీట్లో తానేమి నిద్రపోలేదని బావుమా తెలిపాడు. ఆ ఫోటో తప్పుదోవ పట్టడానికి కారణం కెమెరా యాంగిల్ అని బావుమా సృష్టం చేశాడు. బవుమా కెప్టెన్స్ కాన్ఫరెన్స్లో కళ్లుమూసుకుని ఉన్న ఫోటోను ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ఎక్స్(ట్విటర్) షేర్ చేసింది. అందుకు ప్రతిస్పందనగా బావుమా.. నేను నిద్రపోలేదు. కెమెరా యాంగిల్ కారణంగానే అలా కన్పిస్తోందని" ట్విట్ చేశాడు. ఇక ఈ మెగా టోర్నీకి మరి కొన్ని గంట్లలో తెరలేవనుంది. తొలి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్కు విడాకులు మంజూరు.. Temba Bavuma has just fallen asleep in the World Cup captain's conference pic.twitter.com/GqQXZ3MenG — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 4, 2023 -
'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్కప్ సెమీఫైనల్కు చేరే జట్లు ఇవే'
వన్డే వరల్డ్కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. "రాబోయే ఏడు వారాలు క్రికెట్ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ దశ సెమీఫైనల్కు చేరుకుంటాయని అంచనా. మాజీ విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను కచ్చితమైన టైటిల్ ఫేవరెట్స్గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం భారత్కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకుంది. బెన్ స్టోక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్లోనూ కెప్టెన్ జోస్ బట్లర్కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్కు పేరుంది. కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టులో సూపర్స్టార్ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచకప్కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్ -
బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ఈసారైనా సెమీస్ గండం గట్టెక్కేనా?
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు. నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు. కళ్లు చెదిరే ఫీల్డింగ్. ప్రతీసారి వరల్డ్కప్ టైటిల్ ఫేవరేట్. కానీ ఒక్కసారి కూడా ఆ జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్కు చేరినా వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడ లేకపోయింది. ఈ ఉపోద్ఘామంతా ఏ జట్టు కోసం ఇప్పటికే మీకు అర్ధమైంది ఉంటుంది. అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఇదంతా వరల్డ్కప్లోలో బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కోసమే. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పడుతుంటుంది. గత 27 ఏళ్లగా వరల్డ్కప్ కోసం ప్రోటీస్ పోరాడుతోంది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ లక్ష్యంగా భారత గడ్డపై సఫారీలు అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసిరాని 5 మ్యాచ్లను ఓసారి చూద్దాం. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్.. 1992 ప్రపంచకప్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు సంయుక్తంగా అతిథ్యం ఇచ్చాయి. దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే మొట్ట మొదటి వరల్డ్కప్. ప్రోటీస్ జట్టు తొలి ప్రపంచకప్లోనే సెమీఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో కెప్లర్ వెసెల్స్ సారధ్యంలోని దక్షిణాఫ్రికా తలపడింది. వర్షం కారణంగా మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రోటీస్ కూడా లక్ష్య ఛేదనలో అదరగొట్టింది. ఆఖరి 13 బంతుల్లో విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న బ్రియాన్ మెక్మిలన్ (21), డేవ్ రిచర్డ్సన్(13) మంచి జోష్లో ఉన్నారు. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. దీంతో ప్రోటీస్ ఫైనల్కు చేరడం ఖాయమని అంతా భావించారు. ఈ దశలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 1 బంతికి 22 పరుగులుగా విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో కేవలం 4 పరుగులు మాత్రమే సాధించిన సౌతాఫ్రికా.. 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో అదృష్టం కలిసి రాకపోవడం ఇక్కడ నుంచే మొదలైంది. దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ వరల్డ్క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రోటీస్కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. అనంతరం వీరిద్దరూ పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్కు త్రో చేశాడు. గిల్క్రిస్ట్ను స్టంప్స్ను పడగొట్టాడు. మ్యాచ్ టై అయింది దీంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా శిబరం మొత్తం షాక్లో ఉండిపోయింది. అయితే రన్రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక సొంత గడ్డపై జరిగిన 2003 ప్రపంచకప్లో శ్రీలంకతో ప్రోటీస్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. 45 ఓవర్ల తర్వాత ప్రొటీస్ లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి చివరి బంతి ఆడిన మార్క్ బౌచర్ పరుగు చేయలేదు. బౌచర్ ఒక్క పరుగు కూడా తీసి ఉంటే దక్షిణాఫ్రికా విజయం సాధించి ఉండేది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ భారత్ వేదికగా జరిగిన 2011 వరల్డ్కప్ లీగ్ స్టేజిలో గ్రేమ్ స్మిత్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశ ముగిసే సమయానికి గ్రూప్ బి లో ప్రోటీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆరు గ్రూప్ దశ మ్యాచ్లలో ఐదు విజయాలు సాధించింది. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు సౌతాఫ్రికా సిద్దమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్కు ప్రోటీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ కేవలం 221 పరుగులు మాత్రమే చేయగల్గింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో పటిష్టస్ధితిలో నిలిచింది. క్రీజులో కల్లిస్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఈ సమయంలో కివీస్ పేసర్ టిమ్ సౌథీ.. కల్లిస్, ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన జెపీ డుమినీ వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. అదే ఓవర్లో రనౌట్ రూపంలో డుప్లెసిస్ వికెట్ను కూడా ప్రోటీస్ కోల్పోయింది. దీంతో ప్రోటీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత కివీస్ స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి 8 వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవదిలోనే దక్షిణాఫ్రికా కోల్పోయింది. ప్రోటీస్ వర్సెస్ కివీస్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టోర్నీ ఆసాంతం అదరగొట్టి సెమీఫైనల్కు చేరింది. కానీ సెమీస్ గండాన్ని ప్రోటీస్ గట్టెక్కలేకపోయింది. ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్ను 298 పరుగులగా నిర్ధేశించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు బ్రాండెన్ మెక్కల్లమ్ , గుప్టిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం గ్రాంట్ ఇలియట్ కోరీ ఆండర్సన్ మధ్య కీలక భాగస్వామ్యంతో కివీస్ను విజయతీరాలకు చేర్చారు. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే 32 ఓవర్లో గ్రాంట్ ఇలియట్ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. ఇందుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -
అయ్యో దక్షిణాఫ్రికా.. ఊహించిందే జరిగింది! ఇక కష్టమే మరి
వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్కు దూరమయ్యారు. వరల్డ్కప్కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్లతో దక్షిణాఫ్రికా క్రికెట్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్, సిసిందా ఇద్దరూ వరల్డ్కప్కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్ ఎల్లప్పడూ ఉంటుంది. వీరి స్ధానంలో ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్లలో ప్రోటీస్కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్కాన్ఫరెన్స్లో రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్కప్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: ODI World Cup: పిచ్ క్యూరేటర్లకు ఐసీసీ కీలక ఆదేశాలు.. -
దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?
దక్షిణాఫ్రికా రాజకీయనేత జూలియస్ మలేమా ఒక భారీ ర్యాలీకి సారధ్యం వహిస్తూ, జాతి హింసాత్మక నినాదాలతో రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ నాయకుడు మలేమా దక్షిణాఫ్రికాలోని డచ్ సెటిలర్లు లేదా బోయర్స్, శ్వేతజాతీయులను సూచిస్తూ "కిల్ ది బోయర్, ది ఫార్మర్" అనే జాతి విధ్వంసక వ్యతిరేక పోరాట గీతాన్ని ఆలపించారు. వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ అక్కడి ప్రముఖ రాజకీయ శక్తులలో ఒకటిగా అవతరించింది. నిజానికి మలేమా.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో యువనేత. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి నేత నెల్సన్ మండేలా నేతృత్వంలో శక్తమంతంగా ఎదిగింది. దక్షిణాఫ్రికా శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చినందుకు మలేమా ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ (డీఏ) నేత జాన్ స్టీన్హుయిసెన్ తాజాగా మలేమా వ్యాఖ్యలను ఖండిస్తూ, అతను అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని నిర్ణయించుకున్న వ్యక్తి అని అభివర్ణించారు. మలేమా.. రక్తపిపాసి అని, నిరంకుశుడు అని, సామూహిక హత్యకు పిలుపునిచ్చాడని ఆయన ఆరోపించారు. మలేమా తీరుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో డీఎ ఫిర్యాదు చేస్తుందని కూడా ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా.. కాగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) నూతన పార్టీ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పార్టీ జనాదరణ పొందుతున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతజాతి ఓటర్లకు మద్దతుగా నిలిచే ఉదారవాద డీఏ పార్టీ దాదాపు 16 శాతం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికన్లలో నల్లజాతీయులకు భూ యాజమాన్యహక్కులను కల్పించేందుకు పాటుపడుతూ, భూ సంస్కరణల కోసం వాదించే ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) దాదాపు 13 శాతం ఓటర్లకు ఆకట్టుకుంటోందని తెలిపింది. South Africa’s black party sings “kill the Boer (Whites), kill the White farmer”. pic.twitter.com/JdPg9Okgnj — Truthseeker (@Xx17965797N) July 30, 2023 జూలియస్ మలేమా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన జాతివిద్వేష పూరిత పాటలను పాడారంటూ పౌర హక్కుల సంఘం ఆఫ్రిఫోరమ్ అతనిని కోర్టుకు లాగింది. మలేమా జాతి విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ, వివక్షను వ్యతిరేకించారని బీబీసీ ఆమధ్య ఈఎఫ్ఎఫ్ పదేళ్ల వార్షికోత్సవ కథనంలో పేర్కొంది. 2019లో ఇదే విధమైన ర్యాలీలో.. సమానత్వాన్ని స్థాపించడానికి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలేమా ప్రకటించారు. ‘శ్వేతజాతీయులారా, మాకు కావలసింది డిన్నర్ టేబుల్పై మీతో సమానంగా కలసి భోజనం చేయడమే’ అని సోవెటోలోని ఓర్లాండో స్టేడియంలో వేలాది మంది అనుచరుల మధ్య ఆయన పేర్కొన్నారు. ‘మేము మీతో పాటు టేబుల్ వద్ద కూర్చోవడం మీకు ఇష్టం లేకపోతే, టేబుల్ను నాశనం చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని మలేమా పేర్కొన్నారు. తమ పార్టీ దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు సమానత్వం అందించాలని కోరుకుంటున్నదని, శ్వేత జాతీయులకు వ్యతిరేకం కాదని మలేమా తెలిపారు. 2019లో మలేమా మాట్లాడుతూ తాము ముందుగా భూమి సమస్యకు పరిష్కారం కోరుతున్నాం. పరిహారం అవసరంలేని విధంగా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. తద్వారా నల్లజాతీయులకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నామన్నారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలోన్ మస్క్.. మలేమా వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన జాతి నిర్మూలనకు పురిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. మలేమా వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఎందుకు స్పందించడం లేదని మస్క్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్డే ఉండదు! -
పెళ్లి చేసుకున్న సన్రైజర్స్ కెప్టెన్.. అమ్మాయి ఎవరంటే?
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్ను మార్క్రమ్ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం సెంచూరియన్లోని ఓ పంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి వారి స్నేహితులు, బంధువులు హజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను నికోల్ ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసింది. కాగా వీరిద్దరూ గత 10 ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో గత ఏడాది వీరిద్దిరి నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా నికోల్ సొంతంగా ఆన్లైన్లో ఓ జ్యూవెలరీ స్టోర్ను నడుపుతోంది. ఇక మార్క్రమ్ ఐపీఎల్లో తొలిసారిగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరించిన మార్క్రమ్.. జట్టును విజయం పథంలో నడింపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారధ్యంలోని ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కానీ సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ను ఛాంపియన్గా నిలిపాడు. చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్
మధ్యప్రదేశ్లోని ష్యోపూర్లోని కూనో నేషనల్ పార్క్కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్ బీట్ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది. కూనో నేషనల్ పార్కులో సౌత్ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. ‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం.. తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్ చేస్తున్న టీమ్ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆగని పోరాటాలు.. కూనో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్’ చిరుతలు కవలలు. అవి భారత్కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు.. -
తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..
సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్ గుండెను ట్రాన్స్ప్లాంట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది. 1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్టౌన్లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది. ¿SABÍAS QUÉ?EL PRIMER TRANSPLANTE DE CORAZÓNEn el año de 1971 se dió un paso gigante en la historia de la medicina, pues se realizó con éxito el primer trasplante de corazón.La operación fue llevada por el Doctor Christiaan Barnard en la Ciudad del Cabo, capital de #Sudáfrica. pic.twitter.com/5T24TACYmF— Énfasis Comunica (@EnfasisComunica) June 17, 2023 ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్ నార్మన్ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్ గుండెను అమర్చారు. డెనిస్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రామ్నాయక్ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్ పి వేణుగోపాల్ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు! -
గోల్డ్ సిటీలో చీకటి సామ్రాజ్యం.. జనజీవనం సాగుతుందిలా..
ఆ నగరంలో ఎటుచూసినా బంగారమే. ప్రపంచంలోనే గోల్డ్సిటీగాపేరొందిన ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలు ‘అంధకారం’, హింస, క్రిమినల్ సిండికేట్ల వివాదాల మధ్య నలిగిపోతూ కనిపిస్తాయి. ఈ బంగారు గనుల మెరుపుల వెనుక ఇక్కడివారి జీవితంలోని మరో కోణం ఎలా ఉంటుంది? ఇక్కడి సాధారణ ప్రజల జీవితం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో బంగారం మెరుపు ముందు మరేదీ సాటిరాదు. అలాగే బంగారాన్ని మించినది మరేదీ లేదని చెబుతుంటారు. బంగారం మాయ ప్రపంచాన్నంతటికీ ఒకే విధంగా కమ్మేసింది. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ నగరం.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు గనులు కలిగిన ప్రాంతం. ఇక్కడ బంగారం తవ్వకాలు 5 వేల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకూ అంటే మహారాజుల కాలం నుంచి ప్రస్తుత యుగం వరకూ ఇక్కడ బంగారం తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇక్కడి బంగారు వన్నె ఏమాత్రం తగ్గనేలేదు. భవిష్యత్లోనూ ఇది కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున 22 మంది పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ.. అమెరికా, చైనా, భారత్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దపెద్ద బంగారు గనులున్నాయి. కానీ ‘గోల్డ్ సిటీ ఆఫ్ వరల్డ్’ అని ఏప్రాంతాన్ని అంటారో తెలుసా? అదే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్. ఇక్కడే అత్యంత భారీగా బంగారు నిల్వలు కలిగిన విట్వాటర్శాండ్ మైన్స్ ఉన్నాయి. ఈ విట్వాటర్ శాండ్ గనులు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ సువిశాల బంగారు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో 40 శాతం మేరకు ఉంటుంది. అందుకే జోహెన్స్ బర్గ్ పేరు బంగారంలా వెలిగిపోతుంటుంది. ఎంత బంగారం ఉందంటే... విట్వాటర్శాండ్కు చెందిన గోల్డ్ మైన్స్ భూమిలోపల మూడు వేల మీటర్ల లోతున ఉన్నాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం ఉందనే అంచానాలున్నాయి. ఇక్కడ గడచిన 61 ఏళ్లుగా బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 1961 నుంచి ఇక్కడి గనుల్లో మొదలైన తవ్వకాలు రాబోయే 70 ఏళ్ల వరకూ అంటే 2092 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 2017లో ఇక్కడ 281,300 ఔన్స్లు, 2018లో 157,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ యురేనియం గునులు కూడా భారీగానే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకోదగిన ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవి కూల్ప్ గోల్డ్మైన్, డ్రిఫోంటైన్ గోల్డ్ మైన్, సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇంపాలా మైన్, షిపాంగ్ మైన్. సామాన్యుల జీవితం ఇలా.. ఇక్కడి బంగారం మెరుపుల మధ్య సామాన్యుల జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది. జోహెన్స్ బర్గ్లోని గౌంటెడ్ ప్రాంతం దక్షిణాఫ్రికాలో అతి చిన్న భూభాగం. అంటే కేవలం 1.5 శాతం భూభాగం. అయితే ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తున్నారు. దేశంలోని 26 శాతం జనాభా అంటే ఒక కోటీ 60 లక్షల మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. గౌంటెడ్ ప్రాంతం.. వాల్ నదీ తీరంలో ఉంటుంది. పలు పర్వాతాలతో పాటు ఇక్కడి విభిన్న వాతారణం ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే ఇక్కడి బంగారుల గనుల తవ్వకాలకు సంబంధించిన ఉపాధి పనులు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ప్రజలను ఇక్కడ ఉండేలా చేస్తున్నాయి. సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉన్న జోహెన్స్ బర్గ్ పట్టణ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. తరచుగా ఇక్కడ మంచు కురుస్తుంటుంది. గోల్డ్సిటీగా మారడం వెనుక.. జోహెన్స్ బర్గ్ గోల్డ్సిటీగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 19వ శతాబ్ధపు చివరినాళ్ల నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. నదీ తీరంలో ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జోహెన్స్ బర్గ్ జనాభా 50 లక్షలు దాటింది. బంగారు గనుల్లో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఫలితంగా ఇక్కడి సంస్కృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై ఆఫ్రికా వంటలు మొదలుకొని ఆసియాతోపాటు అన్ని రకాల యూరోపియన్ ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో 60 లక్షల చెట్లను నాటి ఫారెస్ట్సిటీగా రూపమిచ్చింది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక చెట్లతో కూడా సిటీగానూ అబివర్ణిస్తుంటారు. ఇక్కడి గోల్డ్మైన్స్పై మొదట యూరప్ వ్యాపారవేత్తల హవా ఉండేది. తరువాతి కాలంలో అరబ్బుల ప్రభావం వేగంగా వ్యాప్తి చెందింది. క్రిమినల్ సిండికేట్లకు నిలయంగా.. ఇక్కడి అడవులు, పర్వతశ్రేణులలో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి అనైతికంగా కూలీలను తీసుకువస్తుంటారు. చీకటితో కూడిన సొరంగాలలో బంగారం పొందవచ్చంటూ ఆశ చూపించి ఇక్కడ జరిగే పనుల్లో కూలీలను నియమిస్తారు. కిలోమీటర్ల పొడవున క్రిమినల్ సిండికేట్ అక్రమ తవ్వకాలు సాగిస్తుంటుంది. ఈ నేధ్యంలో అప్పుడప్పుడూ హింసాయుత ఘటనలు, తూటాల కాల్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో 6 వేలకు పైగా బంగారు గనులు ఉన్నట్లు అంచనా. ఈ గనుల్లో తవ్వకాలు పూర్తయ్యాక వాటిని అలానే వదిలేస్తుంటారు. ఇక్కడి గనులను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ సిండికేట్స్ మధ్య వివాదాలు జరుగుతుంటాయి. ఇంతటి భయావహ పరిస్థితుల మధ్య ఇక్కడ 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరంతా గోల్డ్మైన్స్ పనులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నందున హౌసింగ్ సెక్టార్లో షార్టేజీ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగిత కూడా 29 శాతం మేరకు పెరిగింది. సౌత్ ఆఫ్రికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెలువరించి న ఒక రిపోర్టు ప్రకారం 2015 నాటికి ఇక్కడ 30 వేలకు మించిన ఆక్రమణదారుల ఇక్కడ తమ కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో అత్యధికులు జోహెన్స్ బర్గ్ పట్టణ సమీప ప్రాంతాల్లోని గోల్డ్మైన్స్లో యాక్టివ్గా ఉన్నారు. వీరిలో 75 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరంతా ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్నారు. భారత్లో బంగారు గనుల విషయానికొస్తే.. బంగారు గనులనేవి కేవలం పర్వతప్రాంతాలు, పీఠభూములలోనే కాదు.. సముద్రపు లోతుల్లోని ప్రాంతాల్లోనూ వ్యాప్తిచెంది, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్లో కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎంతో పేరొందిన ప్రాంతం. దేశంలో అత్యధక స్థాయిలో బంగారు ఉత్పాదన కర్నాటకలో జరుగుతుంది. ఇక్కడ కోలార్, హుట్టీ, ఉటీ పేర్లతో బంగారు గనులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైలు కర్నాటకలో సుమారు 17 టన్నుల బంగారం నిల్వలు కలిగిన గనులు ఉన్నాయని భావిస్తున్నారు. అంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్లలోనూ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే భారత్లోనూ బంగారు నిక్షేపాలు గుర్తించదగని రీతిలోనే ఉన్నాయని చెబుతుంటారు. చాలాదేశాల్లో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు చర్యలను అక్కడి ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! నాలుగేళ్ల తర్వాత బౌలర్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్లో ప్రోటీస్తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్లో విండీస్ తరపున ఆడాడు. వెస్టిండీస్ వన్డే జట్టు షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వెస్టిండీస్ టీ20జట్టు రోవ్మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్ చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
నమీబియా నుంచి మరో 12 చీతాలు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: భారత్లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం చెప్పారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం గురువారం బయల్దేరింది. భారత్కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు నిజర్వ్.. -
బోణీ కొట్టిన శ్రీలంక.. దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ
మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక బోణీ కొట్టింది. కేప్టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగల్గింది. సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరచగా.. రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు. అర్ధ సెంచరీతో చెలరేగిన ఆటపట్టు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు గుణరత్నే 35 పరుగులతో రాణించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. చదవండి: T20 WC: పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్ల ఫలితాలు తేలితేనే
Icc World Cup 2023 Qualifying Race: భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడతాయి. ఇక సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాయి. ఇక మిగిలిన ఒక్కగానొక్క చివరి స్థానం కోసం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. అయితే ఈ ఏడాది మే1 నాటికి పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఏ జట్టు ఉంటుందో ఆ జట్టుకు నేరుగా ప్రపంచకప్లో ఆడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూడు జట్లలో ఏ జట్టుకు ఐసీసీ టోర్నీలో డైరెక్ట్గా అడుగుపెట్టే ఛాన్స్ ఉందో.. అందుకు గల సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం. వెస్టిండీస్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టు 88 పాయింట్లతో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. అయితే కరీబియన్ జట్టు ఆడాల్సిన సూపర్ లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. కాబట్టి విండీస్ ప్రత్యక్షంగా ప్రపంచకప్కు చేరడం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే విండీస్ తర్వాతి స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు రెండు మ్యాచ్లు, శ్రీలంకకు మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఏదో ఒకటి సులువగానే విండీస్ను అధిగమిస్తుంది. దక్షిణాఫ్రికా.. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 79 పాయింట్లతో 9 వస్థానంలో ఉంది. గతేడాది ఆఖరి వరకు 11వ స్థానంలో ఉన్న ప్రోటీస్ జట్టు ఇంగ్లండ్పై మూడు వన్డేల సిరీస్లో రెండు వరుస విజయాలు సాధించడంతో 9వ స్థానానికి చేరుకుంది. ఇంకా సూపర్ లీగ్లో ప్రోటీస్ జట్టుకు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్స్తో ప్రోటీస్ రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేస్తే 8వ స్థానానికి చేరుకుంటుంది. అయితే శ్రీలంక నుంచి మాత్రం దక్షిణాఫ్రికాకు ముప్పు పొంచి ఉంది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్లో భాగంగా శ్రీలంక.. కివీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపనడుంది. ఈ సిరీస్లో లంక కనీసం రెండు మ్యాచ్లలోనైనా ఓటమిపాలైతేనే ప్రోటీస్ తన ఎనిమిదవ స్థానాన్ని నిలబెట్టకుంటుంది. శ్రీలంక ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం 77 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది. అదే విధంగా దక్షిణాఫ్రికా నెదార్లాండ్స్ చేతిలో రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి.. కివీస్పై లంక కనీసం ఒక్క మ్యాచ్లోనైనా విజయం సాధించిన చాలు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంటుంది.! అయితే, డచ్ జట్టు వంటి పసికూనతో ప్రొటీస్ పోరు.. పటిష్టమైన కివీస్తో అది కూడా న్యూజిలాండ్ గడ్డపై పోటీ నేపథ్యంలో లంక కంటే సౌతాఫ్రికానే ఓ అడుగు ముందుంటుందని చెప్పడంలో సందేహం లేదు. చదవండి: ENG vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు -
దక్షిణాఫ్రికా కెప్టెన్కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని?
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్కు సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఫిట్నెస్ టెస్టులో విఫలమవకావడంతో వాన్ నీకెర్క్ను మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆమె స్థానంలో ఆల్రౌండర్ సునే లూస్ను తమ జట్టు కెప్టెన్గా దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వాన్ నీకెర్క్ కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె వన్డే ప్రపంచకప్కు కూడా దూరమైంది. అనంతరం ఆమె జట్టుకు దూరంగా ఉంటుంది. క్రికెట్ సౌతాఫ్రికా న్యూ రూల్స్ ఇవే.. క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ ప్రకారం.. మహిళా జట్టుకు ఎంపిక కావాలంటే క్రికెటర్లు కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అయితే వాన్ నీకెర్క్ మాత్రం మరో 30 సెకన్లు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలక్టర్లు ఆమెను పక్కనపెట్టారు. టీ20ల్లో అద్భుత రికార్డు.. టీ20ల్లో వాన్ నీకెర్క్కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో వాన్ నీకెర్క్ 1877 పరుగులతో పాటు 65 వికెట్లు కూడా పడగొట్టింది. అంతేకాకుండా టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ కూడా వాన్ నీకెర్కే కావడం విశేషం. గతేడాది కేప్తో స్వలింగ వివాహం వాన్ నీకెర్క్ గతేడాది తన సహచర క్రికెటర్ మరిజాన్నే కేప్ని స్వలింగ వివాహం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన జట్టులో కేప్కు మాత్రం చోటు దక్కింది. టీ20ల్లో సౌతాఫ్రికా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్గా కేప్ ఉంది. ఇక ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరగనున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా జట్టు: అన్నరీ డెర్క్సెన్, సునే లూస్ (కెప్టెన్), మారిజాన్ కాప్, లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, మసాబాటా క్లాస్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, నాన్కులులేకో మ్లాబా చదవండి: Shubman Gill: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్కు సచిన్ రావాల్సిందే! Your heroines for the ICC Women's #T20WorldCup 🇿🇦 #MyHero #AlwaysRising #BePartofIt pic.twitter.com/MUVZNtVQ1k — Proteas Women (@ProteasWomenCSA) January 31, 2023 -
‘సూపర్ సిక్స్’ దశకు భారత్ అర్హత
బెనోని (దక్షిణాఫ్రికా): తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో భారత్ 85 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్గా నిలిచి సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టీమిండియాకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి, గొంగడి త్రిష (51 బంతుల్లో 59; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా ఘోష్ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు) కూడా రాణించింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. భారత బౌలర్లు మన్నత్ కశ్యప్ (4/12), అర్చన దేవి (3/14), సోనమ్ యాదవ్ (2/1) స్కాట్లాండ్ను దెబ్బ తీశారు. చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు -
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆస్ట్రేలియా! మరి టీమిండియా సంగతి?
సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా దాదాపు ఖారారు చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో తమ ఆగ్ర స్థానాన్ని మరింత సుస్ధిరం చేసుకుంది. అదే విధంగా రెండో స్థానం కోసం పోటీ పడుతున్న సౌతాఫ్రికా ఇప్పుడు 48.72 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో శ్రీలంక 55.33 శాతంతో ఉంది. ఇక బంగ్లాదేశ్పై సిరీస్ విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఐదో స్థానంలో 46.97 శాతంతో ఇంగ్లండ్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరాలంటే.. ఆసీస్ చేతిలో 0-2 తేడాతో సౌతాఫ్రికా ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరడం మరింత సులభం అయింది. కానీ మూడో స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. అయితే స్వదేశంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1తో భారత్ఓడిస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా రోహిత్ సేన (61.92 పాయింట్ల శాతం)తో ఫైనల్కు చేరుకుంటుంది. అదే విధంగా శ్రీలంక ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భాగంగా రెండు మ్యాచ్ మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్ను లంక క్లీన్ స్వీప్ చేస్తే శ్రీలంక ఖాతాలో 61.11 పీసీటీ చేరుతుంది. అంటే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత్ ఓడిపోయినా, 2-2 డ్రా ముగించినా లంక ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు నాలుగో స్థానానికి పడిపోయిన సౌతాఫ్రికా ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో 2-0 తేడాతో ప్రోటీస్ గెలుపొందితే.. 55.55 పీసీటీని సాధించగలుగుతుంది. కానీ భారత్ చివరి నాలుగు టెస్టుల్లో రెండు గెలిచినా దక్షిణాఫ్రికా ఫైనల్ ఆశలు గల్లంతు అయినట్లే. చదవండి: సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’.. ట్వీట్ లైక్ చేయడంతో మరింత దుమారం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
నన్ను అలాంటి డ్రస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
దూసుకొస్తున్న రెమాల్ తుపాను
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్ల..!
జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
ఎన్నికల్లో పోటీ వారి మధ్యే: ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
Prayaga Martin: పిశాచి మూవీలో దెయ్యంగా భయపెట్టిన బ్యూటీ.. ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
తప్పక చదవండి
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- IPL 2024: రైజర్స్ VS రైడర్స్
Advertisement