ఆ నీచులకు మరణశిక్ష విధించాలి | Anna Hazare seeks death penalty for accused in Kopardi rape case | Sakshi
Sakshi News home page

ఆ నీచులకు మరణశిక్ష విధించాలి

Published Tue, Jul 19 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఆ నీచులకు మరణశిక్ష విధించాలి

ఆ నీచులకు మరణశిక్ష విధించాలి

మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కొపార్డి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలని సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు.

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కొపార్డి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి, దోషులకు ఉరిశిక్ష వేయాలని హజారే ఓ ప్రకటనలో కోరారు.

గతవారం ముగ్గురు దుండగులు బాధితురాలిని సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మహారాష్ట్రను కుదిపేసింది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఫడ్నవిస్ ఈ ఘటనపై ప్రకటన చేస్తూ నిందితులను అరెస్ట్ చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చూస్తానని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement