చెన్నైలోని బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 61కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతు తుది దశకు చేరుకున్నాయి. చెన్నై మొగలివాక్కంలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం శనివారం కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఆ భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న అత్యధికులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే.