కన్నాట్‌ప్లేస్‌లో వైఫై ప్రారంభం | Delhi: Connaught Place to have public wi-fi from today | Sakshi
Sakshi News home page

కన్నాట్‌ప్లేస్‌లో వైఫై ప్రారంభం

Published Sun, Nov 16 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

Delhi: Connaught Place to have public wi-fi from today

న్యూఢిల్లీ: కన్నాట్‌ప్లేస్‌లో ఆదివారం పబ్లిక్ వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఈ సేవలను ప్రారంభించారు. టాటా టెలీసర్వీసెస్ భాగస్వామ్యంతో పరిపాలనా విభాగం ఈ సేవలను ప్రజలకు అందజేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) తెలియజేసింది. వినియోగదారులు మొదటి 20 నిమిషాలపాటు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని, ఆ తర్వాత నుంచి కొంత చార్జి పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రీచార్జీ కార్డులు వివిధ షాపుల్లో అందుబాటులో ఉంటాయని వారు వివరించారు.  వైఫై సదుపాయమున్న అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఈ వసతి అందుబాటులో ఉంటుందన్నారు. అంతేకాక ఇతర  ఏమైనా సమాచారం కావాలంటే వైఫై కాల్ సెంటర్ నం. +9111 60607070కు ఫోన్ చేసి సేవలను పొందవచ్చు. ఈ ప్రాంతంలో ఒకేసారి ఐదువేల మంది వినియోగదారులు వైఫై సేవలను వినియోగించుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement