పలమనేరులో ఏనుగుల బీభత్సం
Published Wed, Sep 28 2016 10:46 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు పంట పొలాలను నాశనం చేసింది. వరి, రాగి, బీన్స్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని రామసముద్రం నుంచి ఏనుగు వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఏనుగుల దాడిపై గ్రామస్థులు అటవీ శాఖ అధికారలకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement