ఆధార్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం | For example, the government | Sakshi
Sakshi News home page

ఆధార్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం

Published Tue, Jan 28 2014 3:10 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

సబ్సిడీపై వంట గ్యాస్‌ను పొందడానికి ‘ఆధార్’ విధిగా ఉండాలనే నిబంధనపై రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయజాలదని పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చేతులెత్తేశారు.

సాక్షి, బెంగళూరు : సబ్సిడీపై వంట గ్యాస్‌ను పొందడానికి ‘ఆధార్’ విధిగా ఉండాలనే నిబంధనపై రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయజాలదని పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు చేతులెత్తేశారు. ఆధార్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని, వంట గ్యాస్ సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెబుతూ, ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు.

శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచంద్రే గౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సబ్సిడీపై వంట గ్యాస్ పొందే విషయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే కోర్టులను ఆశ్రయించ వచ్చని సూచించారు. కర్ణాటకలోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement