పరిశీలిస్తున్నా.. | put surveillance on law and order in state | Sakshi

పరిశీలిస్తున్నా..

Nov 11 2014 1:29 AM | Updated on Mar 19 2019 6:59 PM

పరిశీలిస్తున్నా.. - Sakshi

పరిశీలిస్తున్నా..

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తనకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని,

రాష్ర్టంలో శాంతిభద్రతలపై   నిఘా ఉంచాలి
అవసరమైతే సీఎంతో చర్చిస్తా : గవర్నర్


బెంగళూరు :రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తనకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని గవర్నర్ వాజూభాయ్ రుడాభాయ్ వాలా వెల్లడించారు. మంగళూరులో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితులపై తాను కూడా నిఘా ఉంచినట్లు చెప్పారు. అవసరమైతే ఈ అం శంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సైతం చర్చిస్తామన్నారు.

ఇక రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయమై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement