జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్నఆందోళనలు
Published Fri, Aug 26 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
హైదరాబాద్: తమ తమ మండలాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ పలు చోట్ల నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలంటూ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో మంత్రి కేటీఆర్ వైఖరికి నిరసనగా ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. జనగామ జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెల్సిందే. జనగామ జిల్లా కోసం భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఇంకా పలుచోట్ల ఒక జిల్లాలో కలిపిన మండలాలను మరో జిల్లాలో కలపాలని, రాష్ట్రంలో చాలా చోట్ల తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి.
Advertisement
Advertisement