విద్యార్థులకు మార్గదర్శనం | Students guiding | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు మార్గదర్శనం

Published Thu, May 8 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

విద్యార్థులకు మార్గదర్శనం

విద్యార్థులకు మార్గదర్శనం

సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలుగు మంచ్ (ఎంటీఎం), ‘రత్నమాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలాజీ’ (ఎఆర్‌ఎంఐఈటీ) సంయుక్త ఆధ్వర్యంలో షాహాపూర్‌లో ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం ‘కెరీర్ గెడైన్స్’ సదస్సు నిర్వహిస్తున్నారు. ఏఆర్‌ఎంఐఈటీ కాలేజీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తొలిరోజు సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. మొదటిరోజు సదస్సులో వర్లిలోని ఎస్‌వీ క్లాసెస్ విద్యార్థులతోపాటు సైన్, దాదర్ తదితర ప్రాంతాల విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు భివండీ, ముంబైకి చెందిన 15 ఎన్‌జీఓ సంస్థల సభ్యులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎంటీఎం అధ్యక్షుడు జగన్‌బాబు, సుభాష్ మచ్చ, ఎఆర్‌ఎంఐఈటీ ైచె ర్మన్ ఏవీ గుప్తా, బోగ సహదేవ్, వడ్లకొండ రాము, బోగ సుదర్శన్, ప్రదీప్ సుంకా, వాసం రాజేంద్ర, గాజెంగి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement