కరుణ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Mohan Reddy Shares Heartfelt Condolences For Karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published Tue, Aug 7 2018 7:38 PM | Last Updated on Wed, Aug 8 2018 9:33 AM

YS Jagan Mohan Reddy Shares Heartfelt Condolences For Karunanidhi - Sakshi

కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు.

అధి​కారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కరుణానిధిని తమిళ ప్రజలు ఎన్నటికీ తమ హృదయాల్లో దాచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement