ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | 3 injured in road accident at rangareddy district | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Published Thu, Dec 10 2015 1:15 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - Sakshi

ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి-మహేశ్వరం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.  గురువారం తెల్లవారు జామున ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్  ఢీ కొట్టింది. పొగ మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం కనిపించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. మిగతా ఇద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement