బషీరాబాద్(రంగారెడ్డి): పిడుగుపాటుకు ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని నవల్గి గ్రామంలో వ్యవసాయ పొలంలో కూలీలు పనిచేస్తుండగా పిడుగుపడింది. దీంతో మంజుల(20), మహాదేవి(48), చెన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.