శంషాబాద్ (రంగారెడ్డి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సోమవారం వేకువ జామున నిర్వహించిన తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ఫణే సెల్వ అనే ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడ్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.