పార్టీ పెద్దలను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు | BJP MPs met with party elders in Delhi on Sunday | Sakshi
Sakshi News home page

పార్టీ పెద్దలను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు

Published Mon, May 27 2019 3:23 AM | Last Updated on Mon, May 27 2019 3:23 AM

BJP MPs met with party elders in Delhi on Sunday - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆదివారం ఢిల్లీలో పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావులు బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్, ప్రకాశ్‌ జవదేకర్, రాం మాధవ్, మురళీధర్‌రావు, షహనవాజ్‌ హుస్సేన్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నూనె బాల్‌రాజు ఎంపీల వెంట ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement