kishan reddy
-
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
Adani Row: ‘అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అదానీ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నేడు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అభివృద్ది విషయంలో సానుకూల ధోరణితో పని చేయాలన్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారు. నాది బీజేపీ డీఎన్ఏ.. మీలాగా పది పార్టీలు మారిన డీఎన్ఏ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్, విపక్షాలను తిట్టే బదులు పాలనపై దృష్టి పెట్టాలి.విషాహారం తిని విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో అదానీ అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అదానీ అంశంలో అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మా దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగింపు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం. -
లోకేష్-అమిత్షా భేటీపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇటీవల అమిత్షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. అమిత్షాను పదేపదే అపాయింట్మెంట్ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డే తనను అమిత్షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్రెడ్డి. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం ..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా… https://t.co/3tNjBJSVOK — KTR (@KTRBRS) September 18, 2023 తెలంగాణపై ఎంత కోపమో.. అప్పర్ భద్ర, పోలవరం, కెన్బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేందని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. డిపాజిట్లు కోల్పోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని ఎద్దేవా చేశారు. మోదీ అలా అనలే: కిషన్ రెడ్డి ప్రధాని మోదీ ఎవర్నీ విమర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. సంతోష వాతావరణంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సామరస్యంగా చేయలేకపోయిందని మాత్రమే మోదీ అన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలను మాత్రమే మోదీ చెప్పారు.. విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే చేశారు.. కారం, నీళ్ళు చల్లారు.. తలుపులు మూశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 'ట్విట్టర్ లేకుంటే బ్రతకను, అమెరికాలో ట్విట్టర్ నేర్చుకున్నట్లు, ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినానికి, సమైక్యతకు తేడా కేసీఆర్ కు అర్థం కావడం లేదు.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ప్రధాని మోదీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు' అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్ -
రాష్ట్ర రక్షణకు మేధావులు బీజేపీలోకి రావాలి..
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేత్తో ఆసరా పెన్షన్ ఇచ్చి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టి కేసీఆర్ సర్కారు డబ్బులు లాగేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ చార్జీలు, ఆరీ్టసీ, భూముల రిజిస్ట్రేషన్, ఇంటిపన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై ప్రభు త్వం తీరని భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ సమక్షంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు కుమారుడు డా.చెన్నమనేని వికాస్రావు, ఆయన భార్య డా. దీప బీజేపీలో చేరారు. వారికి కిషన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా.. భూముల వేలం ద్వారా డబ్బు సమకూర్చుకుంటోన్న దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆహా్వనిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. ఏ బాధ్యతనిచ్చినా స్వీకరిస్తాం: డాక్టర్ వికాస్ బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి పెద్దల ప్రభావం తనపై ఉందని పారీ్టలో చేరిన డాక్టర్ వికాస్ తెలిపారు. తాను, తన భార్య డా.దీప ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీజేపీలో చేరామని, రాబోయే రోజుల్లో అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు తథ్యం : బండి సంజయ్ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డా.వికాస్, దీపల చేరికతో రాజన్న సిరిసిల్లలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: డా. కె. లక్ష్మణ్ దేశంలో మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు ఆకర్షితులై, ప్రజలకు మరింత సేవా చేయాలనే సంకల్పంతో డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ముఖ్యంగా యువత రాజకీయ రంగంలోకి రావాలని విలువలతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు వారితోనే సాధ్యమన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం: ఎంపీ అర్వింద్ వేములవాడ ప్రాంతంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న డాక్టర్ దీప, వికాస్ దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి చెప్పారు. -
కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీ య సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్లకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని. కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు. ఒక కార్యకర్తగా నా బాధ్య తను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్రెడ్డి సీనియర్ నాయకులు.. ఆయనతో కలిసి పని చేస్తాం’ అని ఈటల పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురేయాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే అంకురార్పణ చేశారన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచాం. తెలంగాణలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్ఎస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటాం. కిషన్రెడ్డితో కలిసి శభాష్ అనే విధంగా పని చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి -
కమల దళపతి కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అనుభవం, అణుకువ ప్రామాణికంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు. రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. నడ్డాతో సంజయ్ భేటీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్కు నడ్డా వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
కర్ణాటకలో మా పొరపాట్లు కొన్ని ఉన్నాయి అందుకే ఇలా జరిగింది
-
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
యోగ గొప్పతనం ఏంటో చెప్పిన విశ్వక్ సేన్ శ్రీలీల..
-
బీజేపీ ని ఆడిపోసుకోవడమే కేసిఆర్ పనిగా పెట్టుకున్నాడు
-
కన్ఫ్యూషన్ లో బీజేపీ
-
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్
-
హైదరాబాద్ అంటే హైటెక్సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్నగర్లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న తెలంగాణ అభివృద్ధి ఆగదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగింది
ఆమనగల్లు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో నియంతృత్వ, అవినీతి కుటుంబ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిని తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా బీజేపీ పాలన సాగిస్తుందని చెప్పారు. తమ ఆత్మగౌరవాన్ని కల్వకుంట్ల కుటుంబం వద్ద తాకట్టు పెట్టినట్లయిందని ప్రజలు వాపోతున్నారన్నారు. కీలకమైన 15 శాఖలు కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ వద్ద ఉన్నాయని, మిగతా మంత్రుల వద్ద మామూలు శాఖలు ఉన్నాయని, ఆ ముగ్గురు మినహా కేబినెట్లో మంత్రులంతా జీరోలే అని ఆయన విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం జాతీయ రహదారికి రూ.1720 కోట్లు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో తుక్కుగూడ నుంచి డిండి వరకు 85 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.1720 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 788 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.16571 కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.886 కోట్లు మంజూరైనట్లు కిషన్రెడ్డి వివరించారు. చదవండి: హరీశ్రావు.. దమ్ముంటే దుబ్బాకలో పోటీచెయ్ -
గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఆ బొగ్గుబ్లాక్ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్రెడ్డి
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించా రు. మరో 4 బొగ్గుబ్లాక్లను ప్రైవేట్కు అప్పగించవద్దని రాష్ట్రం దరఖాస్తు చేసుకుంటే వాటిని సింగరేణికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రను సోమవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియాలోని కేటీకే ఐదో గనిలో జరిగిన యాత్రలో కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23వేల కోట్లు చెల్లించడంలో రాప్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని కోల్ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలను రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, కిషన్రెడ్డి రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. గుట్ట అభివృద్ధికి అవసరమైన నిధులపై జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మీ దౌర్జన్యం ప్రజల తిరుగుబాటుతో పతనం ప్రజల తిరుగుబాటుతో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ దౌర్జన్యం పతనం కాక తప్పదని, నియంతృత్వ పోకడ, అహంకారం, కుటుంబపాలన త్వరలోనే పోతుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయలేదని, కనీస క్వార్టర్స్ సౌకర్యం కల్పించడం లేదని, యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. -
నగ మెరిసేనా!
సాక్షి, సిటీబ్యూరో: నిజాం నగలు మన ముంగిటకు రానున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రదర్శిస్తున్న ఆభరణాలను హైదరాబాద్కు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అనువైన స్థలం, రక్షణ కల్పిస్తే భాగ్యనగరానికి నగలు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిజాం నగల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు(ఆల్టైం) భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం 2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా నిజాం ఆస్తుల లెక్కను తేల్చారు. రూ.218 కోట్లకు కేంద్రం కొనుగోలు ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది, 1967లో ఉస్మాన్ అలీఖాన్ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 465 ముత్యాలు పొందుపర్చిన సత్లాడ.. 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్లు, చెవి పోగులు, ఆర్మ్ బ్యాండ్లు, కంకణాలు, గంటలు, బటన్లు, కఫ్ లింక్లు, చీలమండలు, వాచ్ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. 184.75 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వజ్రం జాకబ్ డైమండ్ విలువైన వస్తువులలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. ఆభరణాలను తిలకించే సమయంలోనూ కేవలం 50 మందినే అనుమతిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది. నిజాం నగలను హైదరాబాద్కు తెప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గతంలో ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. తాజాగా నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. నిజాం నగలను హైదరాబాద్కు తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన నేపథ్యంలో వీటి తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాటి ప్రదర్శనకు అనువైన స్థలం, భద్రత ఏర్పాట్లను కల్పిస్తే.. నగల తరలింపునకు చొరవ చూపుతామని కిషన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం తరపున ఏపీకి కిషన్ రెడ్డి హామీ
-
అలంపూర్ క్షేత్రానికి మహర్దశ: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు మహర్దశ రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆదివారం హైదరాబాద్లోని దిల్కుషా అథితి గృహంలో మంత్రి కిషన్రెడ్డికి జోగుళాంబ దేవి రక్షా కంకణం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. అలంపూర్ జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ మంజూరు చేసిందని చెప్పారు. అతి త్వరలోనే తాను కుటుంబ సమేతంగా జోగుళాంబ దేవిని దర్శించుకుంటానన్నారు. -
పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలు పాటించాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులు కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర పర్యాటక, సాం స్కృతిక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను జయించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని జాతీయ పురావస్తు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం కిషన్రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్ర అంతా పురావస్తు శాఖ కేంద్రంలో రికార్డు అయిందని, స్వాతంత్య్ర పోరాటఘట్టాలు, రాజ్యాంగానికి సంబంధించిన సంతకాల ప్రతులు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. నేషనల్ ఆరై్కవ్స్ ఆఫ్ ఇండియాలో 18 కోట్ల పేజీలు, 57 లక్షల ఫైళ్లు, 64 వేల అధ్యయనాలు, లక్షా ఇరవై వేల మ్యాపులు ఉన్నాయని తెలిపారు. మనదేశం స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశచరిత్రను డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త నిర్మాణాలు వచి్చనప్పటికీ, చారిత్రక సంపదను కాపాడుకొనేందుకు కృషి చేస్తామన్నారు. పురావస్తు శాఖ అడ్డంకులు తొలగించాలి: శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఢిల్లీలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తు శాఖ నిబంధనలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన స్వాత్మనందేంద్ర
-
నా హయాంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం : కిషన్ రెడ్డి
-
కేంద్రమంత్రి గా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పాదయాత్ర: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ అహంకార, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక, అవినీతిమయ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమని, తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవరోధాల్లేకుండా దోచుకోవడం, దాచుకోవడం సాగుతోందని మండిపడ్డారు. గతవారం వరకు టీఆర్ఎస్ కార్యాల యం నుంచే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం జరి గేదని, తాజాగా కాంగ్రెస్ బీ టీమ్గా టీడీపీ మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులను చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల సక్రమ వినియోగంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర ఇరురాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకుంటే కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్యనికి, నియంతృత్వానికి జరుగుతున్న పోరా టంలో బీజేపీకి అండగా నిలవాలని కోరారు. హుజూరాబాద్లో ఎగిరేది కాషాయ జెండానే సీఎం కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా హుజూరాబాద్లో ఎగిరేది కాషాయ జెండానేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి భయపెడుతున్నారని దుయ్యబట్టా రు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న తప్పిదాలను గుర్తించామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని, గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికను సీఎం కేసీఆర్ జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారని పేర్కొన్నా రు. హుజురాబాద్ గడ్డమీద ఎగరేది కాషాయ జెం డానే అన్నారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఆయన అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి, మురళీధర్రావు, కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు అందుతున్న వైద్య సేవలపై కిషన్రెడ్డి ఆరా
-
కోవిడ్ బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి
-
లక్ష్మణ్కు అమిత్షా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్కు హోంమంత్రి అమిత్షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది.. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నుంచి ఇద్దరికి పార్టీలో కీలక పదవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. -
గవర్నర్ వ్యాఖ్యలు వ్యక్తిగతం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనాపై మరింత మెరుగ్గా పని చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలంటూ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ వృత్తిపరంగా డాక్టర్ అని ఆమె చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వ్యక్తిగతంగా దేశ పౌరురాలిగా ఆమె సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కరోనాపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కరోనా టెస్టులు, చికిత్స విషయంలో గవర్నర్ చేసిన సూచనలు ప్రభుత్వం పాటించి ఉంటే బాగుండేదని తెలిపారు. -
మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు!
సాక్షి, భువనగిరి: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా తీర్థయాత్రలకు వెళ్లిన దాదాపు వెయ్యి మంది తెలుగువాళ్లు కాశీలో చిక్కుకుపోయారు. వీరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామానికి చెందిన బుచ్చయ్యతో పాటుగా 25 మంది ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డికి చెందిన 16 మంది, కరీంనగర్ జిల్లావాసి ఒకరు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా కాశీలో చిక్కుకుపోయిన వారందరూ 60 ఏళ్లు పైబడిన వారే. అయితే తాము బీపీ, షుగర్లతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంట తీసుకువెళ్లిన మందులు, డబ్బులు అయిపోయాయని చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. సీఎం కేసీఆర్, కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిలే తమని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. కాశీలో చిక్కుకున్న వారికి వెంటనే వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారిని సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేర్చాలని కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు పంపుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు -
బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు..
సాక్షి, చౌటుప్పల్: కేవలం ఎంఐఎం పార్టీపై మాత్రమే తమ పోరాటమని.. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఓవైసీ బ్రదర్స్ కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెజార్టీ మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని... లక్ష మంది ఓవైసీలు, కేసీఆర్ లు వచ్చినా బీజేపీ హవా అడ్డుకోలేరని కిషన్ రెడ్డి తెలిపారు. -
బీజేపీ గెలుపును ఆపలేరు
తుక్కుగూడ/ఆమనగల్లు: ఎంతమంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఆపలేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మతోన్మాద పార్టీ మజ్లిస్తో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదని, కుటుంబ పాలన, మద్యం తెలంగాణ అని మండిపడ్డారు. టీఆర్ఎస్లోకి వెళ్లి మంత్రి పదవి దక్కించుకున్న సబిత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్కు ఓట్లడిగే అర్హత లేదని ఆమనగల్లు రోడ్షోలో జి.కిషన్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, అధికారంతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయలేదని విమర్శించారు. సచివాలయం లేకుండా పాలన సాగిస్తున్నది సీఎం.. కేసీఆర్ ఒక్కరేనన్నారు. -
కన్నులపండువగా కోటి దీపోత్సవం
-
ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్కు చెడ్డపేరు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లి వారం దాటిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా సీఎం కేసీఆర్కు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఆదివారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీíసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: చాడ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యను కార్మికులు పడుతున్న మానసిక వేదనకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు. పోరాడి సాధించాలి: విజయశాంతి సాక్షి,హైదరాబాద్: ప్రాణత్యాగం చేసి సీఎం కేసీఆర్ మనసు మార్చే ప్రయత్నం కంటే పోరాడి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. పోరాటాల ద్వారానే కేసీఆర్ దొర నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలన్నారు. ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్కు బాగా తెలిసిన విద్యని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్యలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. శ్రీనివాస్రెడ్డిది ప్రభుత్వ హత్యే: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. శ్రీనివాస్రెడ్డి మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దని, కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీనివాస్రెడ్డి మరణం బాధాకరం: కొప్పుల సాక్షి, జగిత్యాల: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్రెడ్డి మరణం బాధాకరమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొందరు యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులు బలవుతున్నారన్నారు. -
రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది
సాక్షి, న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో చేసిన ప్రతిపాదననే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సీఎం చైర్మన్గా వ్యవహరించే వన్యప్రాణి బోర్డు–2016 డిసెంబర్లో వైస్ చైర్మన్ అయిన అప్పటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన సమావేశమై నల్లమల అడవుల్లో 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. నాడు యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిన టీఆర్ఎస్.. నేడు దానికి వ్యతిరేకం అని అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందన్నారు. యురేనియం తవ్వకాలపై అన్ని వర్గాల నుంచి కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంపై కిషన్రెడ్డి స్పందించారు. గురువారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధ్యయనం కోసమే.. నేషనల్ మినరల్ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖనిజ సంపద లభ్యత, వాటి నాణ్యత, ప్రయోజనాలపై అధ్యయనం జరిపేందుకు కేంద్రం యురేనియం అన్వేషణ జరుపుతోందని కిషన్రెడ్డి చెప్పారు. దీని లో భాగంగా నల్లమల అడవుల్లో యురేనియం ఏ స్థాయిలో ఉంది, దాని నాణ్యతెంత, భవిష్యత్తు తరాలకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయాలపై అధ్యయనం జరిపించేందుకు అన్వేషణ మాత్రమే జరుపుతోందన్నారు. అయితే ఎక్కడా కూడా తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని చెప్పారు. హైదరాబాద్లో ఎన్ఆర్సీ (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) చేపట్టడంపై కిషన్రెడ్డిని ప్రశ్నించగా.. జమ్మూ కశ్మీర్ తర్వాత హైదరాబాద్లోనే అధిక సంఖ్యలో రోహింగ్యాలున్నారని.. అక్కడ ఎన్ఆర్సీ చేపట్టడం అన్నది కేవలం ప్రతిపాదన మాత్రమేనని బదులిచ్చారు. -
విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. విమోచన దినోత్సవాన్ని నిర్వహించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్ఎస్ పార్టీ.. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించి భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలో, ఉద్యమ పోరాటాన్ని వివరిస్తూ తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలసి ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రారంభించారు. బైరాం పల్లి కాల్పుల ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని, ఆ ఉదంతం ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా సన్మానించారు. నాడొక మాట.. నేడొక మాట అధికారంలోకి కాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు మిన్నకుండిపోతున్నారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏంఐఎంకు తాకట్టుపెడుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ చరిత్రను మాత్రమే చెప్పుకొనేలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. విమోచన ఉద్యమ పోరాటాన్ని ప్రతిఒక్కరికీ తెలిసేలా కృషి చేస్తామని మనోజ్ తివారీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డి.అరవింద్, మోహన్రావు, సీనియర్ నేతలు శ్రీరాం వెదిరే, సత్యకుమార్, పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమంలో కిషన్రెడ్డిది కీలకపాత్ర
సాక్షి, నర్సాపూర్: తండ్రిని ఎదిరించి టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ ఉద్యమంలో ముందున్న చిలుముల కిషన్రెడ్డి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో దివంగత టీఆర్ఎస్ నాయకుడు, కేంద్ర కార్మికశాఖ కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్ చిలుముల కిషన్రెడ్డి ప్రథమ వర్ధంతిని భార్య సుహాసినిరెడ్డి, కొడుకు శేషసాయిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవెందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్గౌడ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు రఘునందన్రావ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి సమాధివద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనిలేని లోటు తీరనిదని ఆత్మకు శాంతి కలగాలన్నారు. అతని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కిషన్రెడ్డి మృతి నియోజకవర్గానికి టీఆర్ఎస్కి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తన గెలుపుకోసం తమ్ముడు కిషన్రెడ్డి ఎంతగానో కృషిచేశాడని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ కిషన్రెడ్డి తన క్లాస్మెట్ అని అందరితో కలివిడిగా ఉండి ప్రజాసేవకు పాటుపడ్డ వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, నాయకులు నరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గోపి, స్థానిక ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ కవిత అమర్సింగ్, ఏఎంసీ చైర్మన్ హంసీబాయ్, మండల సర్పంచ్లఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు లక్ష్మీరవీందర్రెడ్డి, కృష్ణగౌడ్, దుర్గాగౌడ్, శెట్టయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. స్వగృహంలో.. నర్సాపూర్: చిలుముల కిషన్రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మాజీ మంత్రులు హరీశ్రావు, సునీతారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్ర భాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుములమదన్రెడ్డి, పద్మ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, మురళీధర్యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్రెడ్డి భార్య సుహాసినిరెడ్డి, తనయుడు చిలిపిచెడ్ జెడ్పీటీసీ సభ్యుడు చిలుముల శేషసాయిరెడ్డిలను పరామర్శించారు. కాగా పలువురు స్థానిక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు -
‘అన్నలు చిన్నారులతో ఆ పనులు చేయిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులను తమ శిబిరాల్లో చేర్చుకుని వారికి సైనిక శిక్షణ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులతో వంట పనులు చేయించుకోవడం, భద్రతా దళాల కదలికలపై సమాచారం తెప్పించుకోవడం వంటి పనులు చేస్తున్నారని మంగళవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వకం సమాధానంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నక్సల్స్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని దాని ఆధారంగా ఈ సమస్యను ఎదుర్కొంటామని మంత్రి చెప్పారు. నక్సల్స్ను నిరోధించేందుకు ఆయా రాష్ట్రాలకు సీఏపీఎఫ్ బెటాలియన్స్ను మోహరించడం, హెలికాఫ్టర్లు ఇతర సాధనా సంపత్తిని హోం మంత్రిత్వ శాఖ సమకూరుస్తుందని తెలిపారు. -
బీజేపీలో చేరికపై టీడీపీ నేతల మంతనాలు
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో నాలుగు ఎంపీ సీట్ల గెలుపుతో తెలంగాణలో బీజేపీకి ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ నేతలు ఈ.పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరడంపై కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ప్రస్తుతం తెలుగుదేశం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడిగా మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూడా పార్టీ పుంజుకుంటుండటంతో టీటీడీపీ నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
పార్టీ పెద్దలను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆదివారం ఢిల్లీలో పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులు బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్, రాం మాధవ్, మురళీధర్రావు, షహనవాజ్ హుస్సేన్లను మర్యాదపూర్వకంగా కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నూనె బాల్రాజు ఎంపీల వెంట ఉన్నారు. -
‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు. కేటీఆర్కు మాటలు రావడంలేదు.. నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమావేశంలో లక్షణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. నియంత పాలన సాగదు: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు. టిఆర్ఎస్కి సెంటిమెంట్ అయిన కరీంనగర్లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు. -
వీడని ' సీటు' ముడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహేశ్వరం బీజేపీ టికెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పార్టీ అధినేత అమిత్షా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన జాబితాలో ఈ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసినా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మహేశ్వరం టికెట్ రేసులో బీజేపీ జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నేతలు అందె శ్రీరాములు, ఎ.శంకర్రెడ్డి పోటీపడుతున్నారు. ఈ ముగ్గురి పేర్లను పరిశీలించిన అధినాయకత్వం బొక్క నర్సింహారెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా మూడో జాబి తాలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే, అనూహ్యంగా ఆయన పేరు నాలుగో జాబితాలో కూడా లేకపోవడం తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నర్సింహారెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్లో పడడానికి సంఘ్ పరివార్ జోక్యమేనని ప్రచారం జరుగుతోంది. శ్రీరాములును అభ్యర్థిగా ప్రకటించాలని సంఘ్ పెద్దలు ఒత్తిడి తెస్తుండడంతో టికెట్ అంశం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో మహేశ్వరం ఒకటి కావడం.. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బలీయంగా ఉండడం.. ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి వస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు నామినేషన్ల దాఖలుకు ఒక రోజే గడువు మిగిలి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా సస్పెన్స్కు ముగింపు పలకాలని రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సీనియర్ నేత గంగాపురం కిషన్రెడ్డిని ఈ ఇరువురు ఆశావహులతో చర్చించి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ఆదేశించడంతో శనివారం రాత్రి ఇద్దరు నాయకులతో కిషన్రెడ్డి మాట్లాడినట్లు సమాచారం. కరణం రాజీనామాతో.. వికారాబాద్ బీజేపీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు రాజీనామాతో పరిగి అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. ఈ నియోజకవర్గానికి ఇతర పార్టీ నుంచి బలమైన వ్యక్తిని బరిలో దించాలని అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో పరిగి సీటును ప్రకటించకుండా పక్కనపెట్టింది. మూడు జాబితాలు విడుదల చేసినా తన పేరు లేకపోవడంతో ప్రహ్లాదరావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెట్టుకున్న సదరు నేత.. ఆ పార్టీ తుది జాబితా విడుదల చేస్తే తప్ప నిర్ణయం వెల్లడించే పరిస్థితి లేదు. దీంతో అనివార్యంగా కరణం వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. ఇదిలావుండగా, వికారాబాద్ టికెట్ను మాజీ పోలీస్ అధికారి సాయికృష్ణకు కేటాయించింది. -
బీజేపీలో చేరిన బొడిగే శోభ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువాతో శోభను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్కు మొదటి నుంచి అండగా ఉండి, తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను అరెస్ట్ చేస్తే కారంపొడి పట్టుకుని పోలీసులపై తిరుగుబాటు చేశానని వెల్లడించారు. అలాంటి తనకు నేడు టీఆర్ఎస్లో ఆదరణ కరువైందని వాపోయారు. టీఆర్ఎస్లో పూర్తిస్థాయి నాయకురాలిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తాను గత 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచిచూశానన్నారు. కవిత, కేటీఆర్, వినోద్, కేశవరావును కలిసిన ఫలితం దక్కలేదని.. ప్రగతి భవన్లో అడుగుబెట్ట లేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పు, సర్వే నివేదిక ప్రకారమే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 90 శాతం ప్రజల సపోర్టు తనకున్నా ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. దళిత బిడ్డనైన తనకు తీవ్ర అన్యాయం చేశారని, మాదిగలు టీఆర్ఎస్ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సడ్డకుడు(తోడల్లుడు) రవీందర్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కారణంగానే తనకు టీఆర్ఎస్ టికెట్ రాలేదన్నారు. తెలంగాణలో కవిత ఒక్కరే చాలా? నా లాంటి బిడ్డ వద్దా? అని ప్రశ్నించారు. చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, సెగ్మెంట్ అభివృద్ధి చేస్తానని బొడిగే శోభ పేర్కొన్నారు. -
కమలంలో జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కమలదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ముఖ్యనేతల వరుస పర్యటనలతో పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఒక్క రోజే కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా, బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్రెడ్డిలు సుడిగాలి పర్యటనలు చేసి ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో గెలుచే అవకాశమున్న స్థానాలను వదులుకోకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆయా స్థానాల్లో అవలంభించాల్సిన ప్రచారంపై సూచనలు ఇచ్చారు. అలాగే జిల్లా పార్టీ ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులు ఎక్కడిక్కడ వాలిపోయారు. జిల్లాలో పార్టీ ప్రచారశైలి, నిధుల ఖర్చు తదితర కీలకమైన అంశాలను స్వయంగా పార్టీ హైకమాండ్ పర్యవేక్షిస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సర్వేలతో నియోజకవర్గాలో అభ్యర్థి బలాలు, బలహీనతలపై నివేదికలు తయారు చేస్తూ ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు. పక్కా ప్రణాళిక మహబూబ్నగర్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు గాను బీజేపీ ప్రస్తుతం రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మక్తల్ నుంచి కొండయ్య, నారాయణపేట నుంచి రతంగ్పాండురెడ్డి అభ్యర్థిత్వాలను ఇటీవల ఖరారు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అతి ముఖ్యంగా పాలమూరు జిల్లాపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో కేంద్ర మంత్రుల పర్యటనలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న కేంద్రమంత్రి జే.పీ.నడ్డా మొట్ట మొదటి ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం మక్తల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై బీజేపీ గెలుపు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు. అలాగే బీజేపీ శాసనసభా పక్ష తాజామాజీ జి.కిషన్రెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడలో ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మండలం పరిధిలోని శక్తి కేంద్రాలతో పాటు ఓటరు జాబితాలోని ఒక్కో పేజీ(పన్నా)కి ఒక్కొక్కరు ఇన్చార్జిలుగా వ్యవరించాలని సూచిస్తూ వారి బాధ్యతలను గుర్తు చేశారురు. ఓటరు జాబితాలోని 15 మంది ఓటర్లకు ఒకరు పన్నా ఇన్చార్జిగా వ్యవహరించి వారిని పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా చూడాలని సూచించారు. బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత, దేశసమగ్రత వంటి వాటిని ఉద్బోదిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీఆర్ఎస్పై పెంచుతున్న డోస్ బీజేపీ ఓవైపు సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే మరో వైపు విపక్షాలపై విమర్శల దాడిని పెంచుతోంది. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శల జడివాడ కురిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలపై పడుతున్న భారం.. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ – ఎంఐఎం స్నేహాన్ని ప్రస్తావిస్తూ రజాకార్ల పాలన అంటూ ప్రజల్లో బావోద్వేగాలను పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని లెక్కలను వివరిస్తున్నారు. అలాగే పాలమూరుకు సంబంధించి వలదదసల అంశాన్ని ప్రస్తావిస్తూ... ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ దుయ్యబడుతోంది. ఇంకా తలాఫున కృష్ణమ్మ పారుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందంటూ విమర్శలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టీడీపీల వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఈసారి బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. -
కమలం వికసించేనా..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ నుంచే ‘ముంద స్తు’ ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఆ పార్టీ జాతీ య అధ్యక్షుడు అమిత్ షా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో తొలి సభ నిర్వహించారు. రెండో సభను ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఈనెల 10న క రీంనగర్లో అమిత్ షా సభను నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కదిలి వచ్చింది. బహిరంగ సభ కోసం రెండు, మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానమే ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. అమిత్ షా సభకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో బీజేపీ తాజా మాజీ శాసనసభ పక్షనేత జి.కిషన్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మంత్రి శ్రీనివాస్, జి ల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, అధికార ప్రతిని ధులు, రఘునందన్రావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలు, నాయకులతో కరీంనగర్ శ్వేత ఇంటర్నేషనల్లో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ సమావేశంలో అమిత్ షా సభ సక్సెస్ కోసం ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కదన కుతుహలంలో కమలనాథులు.. పోటీపోటీగా ఆశావహులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపనుండగా.. ఆశావహులు పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం జిల్లా కమిటీలకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 15 రోజుల నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పార్టీ సీనియర్లు, గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా.. నాలు గైదు మినహా ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశావహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, హుస్నాబాద్ టికెట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డికి ఖాయమనే చెప్తున్నారు. వేములవాడలో ప్రతాప రామకృష్ణ, ధర్మపురిలో కన్నం అంజయ్యకు అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా.. చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మానకొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కనుమల్ల గణపలి, గడ్డం నాగరాజులు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో ఆకుల విజయ, మేరుగు హన్మంత్గౌడ్, ఆడెపు రవి, జగిత్యాల నుంచి ముదుగంటి రవీందర్రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, కోరుట్ల నుంచి పూదరి అరుణ, బాజోజు భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్కు కిసాన్మోర్చా జాతీయ కార్యదర్శి పొల్సాని సుగుణాకర్రావు వినిపించినా, ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే.. ఇక్కడి నుంచి కటంగూరి అనిల్రెడ్డి, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, ఉప్పు రవి టికెట్ ఆశిస్తున్నారు. రామగుండంలో బల్మూరి వనిత, మంథనిలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇదిలా వుంటే పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవాలన్న ప్రణాళికతో కూడా బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొంత మంది నేతల జాబితాను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ మారే కొందరికీ కొత్తగా సీట్ల సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్లో భేటీలు.. 3,4,5 తేదీలలో కొలిక్కిరానున్న జాబితా.. ‘ముందస్తు’ ఎన్నికల సమరం కోసం కమలనాథులు కదన కుతూహలంతో ఉన్నారు. అమిత్ షా పర్యటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని బలమైన స్థానాల్లో కమలం వికసిస్తుందన్న ఆశాభా వం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్ణయం తర్వాత నుంచే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడు పెంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. తెలంగా ణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షా కనీసం 50 సభల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 12 లేదా 15న మహబూబ్నగర్ నుంచి ఈ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ప్రకటించా రు. భారీ బహిరంగ సభల ద్వారా పార్టీలో జోష్ పెంచేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణ ఖరారు చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూ దూకుడు పెంచారు. రెండు దఫాలుగా రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, పదాధికారులు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిపోరుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహులు టిక్కెట్ల కోసం ఎవరికీ వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 10న అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ నేతల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. కాగా.. అభ్యర్థుల ఖరారుపై మూడు రోజులపాటు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి ముఖ్యులతో రాష్ట్ర నాయకత్వం సమీక్షలు జరపనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను కేంద్ర పార్టీకి పంపనుండగా, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో పొత్తులపై ఎట్టకేలకు బీజేపీ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆదివారం ప్రకటించారు. మొదటి విడతగా 50 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టికెట్లు కేటాయింపులపై దృష్టి సారించమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సూచించారు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన పాలమూరులో బహిరంగ సభ నిర్వహించి.. అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారని వెల్లడించారు. సభ అనంతరం టికెట్ల కేటాయింపులు జరుగుతాయని ప్రకటించారు. కాంగ్రెస్తో పొత్తు అపవిత్రం.. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. తమతో కలిసి వచ్చే వ్యక్తులు, సంస్థలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే జరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పండితులు చెప్పినట్టు మూహుర్తం, జాతకం చూసి ఎన్నికలకు వెళ్లడం సరికాదని అన్నారు. గతంలో కాంగ్రెస్ను ఓడించడానికి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్తోనే పొత్తుకు సిద్దమైందని ఎద్దెవా చేశారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ బలహీనంగా ఉందని, ఆ స్థానంలో తాము దృష్టి సారిస్తామన్నారు. -
శోకసంద్రమైన కౌడిపల్లి
కౌడిపల్లి(నర్సాపూర్) : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల కిషన్రెడ్డి అంత్యక్రియలతో సోమవారం ఆ యన స్వగ్రామం కౌడిపల్లి శోకసంద్రంగా మారిం ది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. కిషన్రెడ్డి శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య సుహాసినిరెడ్డి అస్వస్థతగా ఉండటం, కోడలు, అల్లుడు అమెరికాలు ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ప్రజలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. మృతి చెందిన మూడు రోజులకు అంత్యక్రియలు జరగగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని గ్రామస్తులు ఎదురు చూశారు. నర్సాపూర్ నుంచి కౌడిపల్లి వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. కౌడిపల్లిలోని రెడ్డి శ్మశాన వాటికలో ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. అతని కొడుకు శేషసాయిరెడ్డి చితికి నిప్పంటించారు. ఈ కార్యక్రమానికి కిషన్రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మదన్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ రాజమణిమురళీధర్యాదవ్, ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్రెడ్డి, రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. కిషన్రెడ్డి మృతదేహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా అతని సోదరుడు ఎమ్మెల్యే మదన్రెడ్డి పార్థివదేహం పక్కన కూర్చొని కంటతడి పెట్టడం పలువురిని కలిచివేసింది. కిషన్రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి కాగా ఆయన నర్సాపూర్లో నివాసం ఉంటున్నారు. ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన పార్థివ దేహాన్ని నర్సాపూర్ తీసుకువచ్చారు. సోమవారం నర్సాపూర్ నుంచి ర్యాలీగా కౌడిపల్లికి అంతిమ యాత్ర సాగింది. దారి పొడవున పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అస్వస్థతతో అంబులెన్స్లో.. కిషన్రెడ్డికి లివర్ చెడిపోవడంతో అతనికి భార్య సుహాసినిరెడ్డి లివర్ డొనేట్ చేశారు. కాగా దీంతో అమె అస్వస్థతతో ఉండగా అంత్యక్రియలకు ఆమెను అంబులెన్స్లోనే తీసుకువచ్చారు. అంత్యక్రియలు జరుగుతుండగా అంబులెన్స్లో నుంచి ఆమె వీక్షించారు. కొడుకు, కోడలు కాళ్లుకడగటం, చితికి నిప్పు అంటించడం కార్యక్రమాలను చేశారు. అంత్యక్రియలలో ఎంపీపీలు పద్మనరసింహారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జెడ్పీటీసీ సారా యాదమ్మరామాగౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, నాయకులకు దుర్గారెడ్డి, శివాంజనేయులు, చం ద్రందుర్గాగౌడ్, పిశ్కె శెట్టయ్యా, పుండరీకం గౌడ్, కృష్ణగౌడ్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ స ర్పంచ్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గృహ నిర్బంధం