బస్సులు ఆపాలంటూ విద్యార్థుల నిరసన | buses would have to stop: Students protest | Sakshi
Sakshi News home page

బస్సులు ఆపాలంటూ విద్యార్థుల నిరసన

Published Tue, Dec 15 2015 3:32 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

పాసులు ఉన్నా ఆర్టీసీ బస్సులో ఎక్కించుకోవడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు.

 పాసులు ఉన్నా ఆర్టీసీ బస్సులో ఎక్కించుకోవడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. మంగళవారం మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల - చెప్యాల క్రాస్ రోడ్డుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్ పాసులు ఉండటంతో పికెట్ డిపోకి చెందిన బస్సులు ఆపకుండానే వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌ల కోసం నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. పాసులున్న విద్యార్థులకు ప్రవేశం లేదని బస్సులకు పోస్టర్లు అతికిస్తున్నారని మండిపడ్డారు.

దీంతో కళాశాలకు వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వారి వద్దకు చేరుకుని పికెట్ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాసులున్న విద్యార్థులను బస్సుల్లో ఎక్కించుకుంటామని డీఎం అంగీకరించటంతో విద్యార్థులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement