ఎల్బీ నగర్ (హైదరాబాద్) : మరోసారి చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం బైరామల్గూడలో రోడ్డు పక్కన నడిచుకుంటూ వెళ్తున్న యాదమ్మ అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు తేరుకునేసరికి మాయమయ్యారు. దీనిపై యాదమ్మ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.