చిరుత సంచారం... భయం భయం | cheetah wandering in village | Sakshi
Sakshi News home page

చిరుత సంచారం... భయం భయం

Published Mon, Apr 20 2015 3:05 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గేటు సమీపంలో గత మూడు రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం.

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గేటు సమీపంలో గత మూడు రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డికి చెందిన పొలం వద్ద సోమవారం ఉదయం చిరుతపులిని చూసిన కొందరు స్థానికులు జంగారెడ్డికి సమాచారం అందించారు.

చిరుతపులి గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏనుగు జంగారెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా  చిరుతపులి సంచారంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement