ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఖానాపూర్లోని వెంకటసాయి వైన్స్తోపాటు తెర్లపాడ్, పెంబి గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో సోదాలు జరిపారు. మద్యంలో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారని తమకు ఫిర్యాదు అందాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు 560 లిక్కర్, 161 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆయా దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.