నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చింతపల్లె: నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లె మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని మల్లారెడ్డిపల్లెకి చెందిన కిట్టయ్య(40)కు వ్యవసాయంలోగత ఏడాది నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన కిట్టయ్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.