అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్ | First phase of Mission kakatiya will completed on 2014 June month, says Minister Harish rao | Sakshi
Sakshi News home page

అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్

Published Sat, Dec 20 2014 2:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్ - Sakshi

అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్

హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి దశ వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చెరువుల పునరుద్దరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్బంగా హరీష్రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణలో పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని చెప్పారు.

మిషన్ కాకతీయలో రెవిన్యూ సిబ్బంది భాగస్వామ్యం కావాలి, చెరువులు కబ్జా కాకుండా చూడాలని తెలిపారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇరిగేషన్ అధికారులు వ్యవహారంపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పద్దతి మార్చుకోవాలంటూ అధికారులను హెచ్చిరంచారు.   కుత్బుల్లాపూర్లో కబ్జాకు గురైన చెరువుల్లో నిర్మాణాలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఈటెల, మహేందర్రెడ్డిలు హాజరయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement