హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలంటూ కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలను సంప్రదించకపోవడం సరికాదని హితవు పలికారు. అఖిలపక్షం, అసెంబ్లీల్లో చర్చించాకే సచివాలయం, చెస్ట్ ఆస్పత్రిని తరలించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డికి మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్ ఏర్పాటుచేయాలన్నారు. సచివాలయం తరలింపుపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. సచివాలయం తరలించవద్దని ప్రజలనుంచి ఈ-పిటిషన్లు సేకరించి గవర్నర్ కు సమర్పిస్తామన్నారు. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి సంతకాల సేకరణ చేపడతామన్నారు.